వైసీపీ ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు యథేచ్ఛగా లభిస్తున్నాయని గతేడాది ఒక నివేదిక వచ్చింది. నార్కాటిక్స్ కంట్రోల్ బ్యురో వెల్లడించిన నివేదిక ప్రకారం గంజాయి రవాణా, విక్రయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానాన్ని పొందింది. పల్లెల్లో కూడా గంజాయి దొరుకుతోందని, యువత మాదక ద్రవ్యాలకు బానిస అవుతోందని ఆరోపణలు వినిపించాయి. గుజరాత్ నుంచి వస్తున్న గంజాయి ఏపీలో విక్రయం కావడంతో పాటు తూర్పు తీరం గుండా విదేశాలకు ఎగుమతి అవుతోందని నిర్ధారించారు. …
Read More »దీని వెనుక పెద్ద ప్లానే వుంది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిల్లీలో పాగా వేశారు. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన దిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో ఈ రోజు చేరబోతున్నారు. ఈ మేరకు ఆయన జేపీ నడ్డాను ఈ రోజు కలిసి ఆయన సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలు నాతో కూడా టచ్లో ఉన్నారు: బాలయ్య
వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు మంత్రులు టీడీపీకి టచ్లో ఉన్నారని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నాయ కుడు, నటుడు బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొందరు తనతో కూడా టచ్లో ఉన్నారని చెప్పారు. వారంతా వచ్చి.. టీడీపీతో కలిసి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నారని బాలయ్య చెప్పారు. టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం …
Read More »మోదీ.. సెటైర్ కు రెడీ
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఆయన వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వస్తున్నారు. సాధారణంగా అయితే అది రొటీన్ పర్యటన అయినా.. తాజా పరిణామాలు మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. టెన్త్ పేపర్ లీక్ పేరుతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం, రెండు రోజుల్లోనే ఆయనకు బెయిల్ రావడం లాంటి పరిణామాల మధ్య మోదీ కామెంట్స్, ప్రధాని బాడీ లాంగ్వేజ్ ఎలా …
Read More »ఆ ఐఏఎస్కు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కార్!!
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. సర్కారు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసుకునే హక్కు.. ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. తాజాగా జరిగినవి మాత్రం సాధారణ బదిలీలు కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేసిన బదిలీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవలే ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ తేల్చి చెప్పారు. “మీకు నచ్చిన అధికారులే …
Read More »మోదీకి మొహం చూపించలేకపోతున్న కేసీఆర్.. ?
ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు. రాజకీయంగా రెండు పార్టీల మధ్య విభేదాలుండొచ్చు.. కానీ, ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవడానికి కూడా కేసీఆర్ వెళ్లకపోవడం చర్చకు దారితీస్తోంది. శనివారం మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఈసారీ కేసీఆర్ తీరు అలాగే ఉండబోతుందని తెలుస్తోంది. మోదీని కేసీఆర్ ఎందుకు ఫేస్ చేయడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. శనివారం మోదీ పర్యటన కోసం సీఎంకు రైల్వే …
Read More »చాప కింద నీరులా సిట్ ..అవినాష్ కు టెన్షన్
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ మందగించినట్లే కనిపించినా గుట్టుచప్పుడు కాకుండా వేగం పుంజుకుందని తెలుస్తోంది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చివేసి కొత్త సిట్ కు సీబీఐ డీఐజీ కే.ఆర్. చౌరసియాను చీఫ్ గా నియమించిన తర్వాత ఆయన చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఎక్కడా మీడియాకు లీకులు ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. ఏప్రిల్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఆరు నెలల్లో …
Read More »బండి సంజయ్కు ఊరట.. బెయిల్ మంజూరు!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కు భారీ ఊరట లభించింది. 10వ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్కు హనుమకొండ కోర్టు బుధవారం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా గురువారం అదే కోర్టులో బండి సంజయ్ తరఫున న్యాయవాదులు.. బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దీనికి …
Read More »41 సీట్లలో జనసేన అభ్యర్థుల లిస్ట్?
జనసేన 41 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ సీట్లలో గెలిచే చాన్స్ ఉందని సీఎం జగన్ చేయించిన సర్వేలోనే తేలిందని జనసేన నేతలు చెప్తున్నారు. అయితే… జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ మాట చెప్పగానే వైసీపీ నుంచి భయంకరమైన అటాక్ మొదలవుతోంది. ‘పట్టుమని 10 మంది అభ్యర్థుల పేర్లు చెప్పండి చూద్దాం.. అప్పుడు మీకు 41 సీట్లు వస్తాయని నమ్ముతాం’ అంటూ ఎగతాళి చేస్తున్నారు వైసీపీ …
Read More »వైసీపీకి కౌంటర్.. ‘జగనే మన దరిద్రం’ : చంద్రబాబు దిశానిర్దేశం
త్వరలోనే తాను ఉత్తరాంధ్రలో 25 రోజుల పాటు పర్యటిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అదేసమయంలో పార్టీ ఉత్తరాంధ్ర నాయకులకు.. కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వంపై పోరాడేందుకు టైం లేదంటే.. కుదరదని తేల్చి చెప్పారు. తాను చెబుతున్న విషయాలను నోట్ చేసుకుని వాటిపై యుద్ధం చేయాలని.. ప్రజలు ఎందుకు చేరువ కారో.. నాయకులు ఎందుకు ఎలివేట్ కారో నేను చూస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన …
Read More »వైసీపీ సర్కారుకు కాక.. ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధం!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు.. మరోసారి కన్నెర్ర చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం.. గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వంతో చర్చిస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు.. తీవ్రస్థాయిలో ఉద్యమానికి రెడీ అయ్యారు. ఇప్పటికే అనేక సార్లు ఉద్యమించి.. ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినా.. సర్కారు తమ సమస్యలను పరిష్కరించలేదని.. ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి.. జేఏసీగా ఏర్పడ్డారు. ఈ నెల 8వ తేదీ నుంచి 29 …
Read More »ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు భారీ షాక్ ?
కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 14 ప్రతిపక్షాలు ఉమ్మడిగా వేసిన ఒక పిటీషన్ను సుప్రింకోర్టు ఒకే దెబ్బతో కొట్టి అవతల పడేసింది. అసలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్య ఏమిటి ? ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకమయ్యాయి ? వాటి బాధేమిటి ? అని తెలుసుకోవాలని కూడా సుప్రింకోర్టు అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలతో ప్రతిపక్ష నేతలను కేంద్రప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని ప్రతిపక్షాలు చాలాకాలంగా గోలచేస్తున్నాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates