Trends

హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు భారం.. కారణమిదే..

హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒక ప్రధాన జీవనాడి లాంటిది. రోజూ వేలాది మంది ప్రజలు ఈ రైల్‌ను వినియోగించుకుంటూ, ట్రాఫిక్‌, కాలుష్యం వంటి సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి వేడి మధ్య ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కూడిన మెట్రో ప్రయాణం ఒక వరంగా మారింది. అయితే, ఇదంతా తక్కువ ఖర్చుతో కుదిరిన రోజులే. ఇప్పుడు మాత్రం మెట్రో ఛార్జీలు పెరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా కాలం …

Read More »

IPL: సూపర్ ఓవర్స్ లో ఎవరు ఎక్కువ సార్లు గెలిచారంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఉత్కంఠ, థ్రిల్. మరి మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌ దాకా వెళ్లితే ఆ మజా రెండింతలవుతుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌ మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించడం కేవలం పాయింట్ల విషయంలో కాదు… ఓ ప్రత్యేక రికార్డు విషయంలోనూ నిలిచిపోయింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు …

Read More »

భారత్‌లో టెస్లా ట్రయల్ రన్.. ఫస్ట్ కార్ ఇదేనా?

ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన టెస్లా భారత్‌కు రావడానికి ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయి–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ టెస్లా కార్ భారీ క్యామోఫ్లాజ్‌తో ప్రయాణించడాన్ని కొందరు ట్రాఫిక్ ప్యాసింజర్లు గుర్తించగా, దాని వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇది కేవలం టెస్ట్ డ్రైవ్ కాదన్న భావన బలపడుతోంది. భారత్ మార్కెట్లో ప్రవేశానికి టెస్లా పక్కా ప్లాన్ చేస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కారు …

Read More »

టీమ్ ఇండియా కోచింగ్‌లో ఊహించని మార్పులు.. గంభీర్ దూకుడు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎదురైన నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో టీమ్ ఇండియాలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో 1-3తో ఘోర పరాజయం పాలైన తర్వాత, కోచింగ్ సిబ్బంది పనితీరుపై బీసీసీఐ లోపలే అసంతృప్తి వ్యక్తమవుతోందట. ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తినట్టు తెలుస్తోంది. దీంతో గంభీర్ శైలిలో మార్పులు మొదలయ్యాయనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం అభిషేక్ నాయర్ సేవలను కొనసాగించబోమని బోర్డు …

Read More »

ఇక్కడ 13 వేల కోట్ల స్కాం.. అక్కడ ఆమ్మాయికి దొరికేశాడు

భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మెహుల్ చోక్సీ కొట్టిన దెబ్బతో పాతాళంలోకి పడిపోయింది. పీఎన్బీకి ఆయన 13 వేల కోట్ల పైచిలుకు రుణాలను ఎగవేసి… ఎంచక్కా భారత వదిలి పారిపోయారు. పీఎన్బీని ముంచేసిన చోక్సీ.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని అంతా …

Read More »

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50 శాతం మంది పిల్లలు, 30 శాతం మంది పెద్దలు ఈ ఇంజెక్షన్ భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఒక వినూత్న పరిష్కారం వచ్చేసింది.. అదే సూది లేని ఇంజెక్షన్. బెంగళూరులో తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో ‘ఇంటెగ్రి మెడికల్’ సంస్థ …

Read More »

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT – డీప్ సీక్ – మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి అలవాటు పడుతోంది. ముఖ్యంగా చైనా ఏఐ పరిశోధకులు ప్రపంచానికి సాంకేతిక విజ్ఞానంలో ఒక సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చే మార్గం వేస్తున్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒత్తిడిలో కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు సంవత్సరాల్లో చైనాకు చెందిన పలువురు ప్రముఖ ఏఐ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే …

Read More »

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని షాక్ ఇచ్చింది. ముల్లాన్‌పూర్ వేదికగా KKR తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ విజయం ఒక్క మ్యాచ్ కాదు, ఒక రీబౌండ్, గత మ్యాచులో 245 పరుగుల …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీ.. నది తీరాన అత్యంత భారీగా..

ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది తీరంలో 1,600 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్పోర్ట్స్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఈ భూమిని గుర్తించగా, అమరావతికి సమీపంగా ఉండటం ఇది ప్రధాన ఆకర్షణగా మారింది. రాజధాని ప్రణాళికల్లోనే మొదట స్పోర్ట్స్ సిటీని నిర్మించాలనుకున్నా, అవసరమైన స్థలాభావం వల్ల ప్రత్యామ్నాయంగా మూలపాడు …

Read More »

ట్రంప్ టారిఫ్ లను తట్టుకున్న ఏకైక మార్కెట్ మనదే..

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా నిలిచింది. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు అనంతరం మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన నేపథ్యంలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ 50) 2.4 శాతం లాభంతో ట్రేడయ్యింది. ఇది ఏప్రిల్ 2న ట్రంప్ ఆదేశాల తర్వాత పడిపోయిన స్థాయిని మళ్లీ చేరుకోవడం విశేషం. ట్రంప్ చర్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా …

Read More »

అంతరిక్షంలో ప్రయాణం.. టికెట్ ధర ఎంతంటే?

ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి స్పేస్ టూర్‌లో పాల్గొన్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ నిర్వహించిన ఈ ప్రయాణం కేవలం 11 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. అయితే ఈ షార్ట్ స్పేస్ రైడ్ అనుభవించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేటీ పెర్రీతో పాటు ఈ అంతరిక్ష ప్రయాణంలో జెఫ్ బెజోస్ …

Read More »

దేశంలో తొలిసారిగా మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయనున్న రోబో

మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ పనిని చేయడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, విషవాయువుల బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా మ్యాన్‌హోల్‌లో  ప్రమాదాలు కూడా ఎక్కువే. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.  రాబోయే రోజుల్లో మ్యాన్‌హోల్ శుభ్రపరిచే పని …

Read More »