వివాహేతర సంబంధాలు ఎంతకైనా తెగించేలా చేస్తున్న రోజులు ఇవి!. భర్తలపై భార్యలు, భార్యలపై భర్తలు కసి తీర్చుకుంటున్నారు.(అందరూ కాదు.. 100కు 3 శాతం మంది అనిఇటీవల సర్వేలు చెప్పాయి) ఈ క్రమంలో భర్తలను హత్య చేయిస్తున్న భార్యల సంగతులు తెరమీదికి వస్తున్నాయి. తాజాగా గురువారం ఏపీలోని నంద్యాలలోనూ ఇలాంటి వివాహేతర సంబంధం వెలుగుచూసింది. ఈ ఘటనలో భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య.. అతనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. అయితే.. …
Read More »పెంపుడు పిల్లి చనిపోయిందని.. ఉరేసుకున్న విద్యార్థిని!
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పెంచుకుంటాయి. ఒక్కొక్కసారి యజమానులు మృతి చెందిన సందర్భంలో పెంపుడు జంతువులు కూడా నిద్రాహారాలు మానేసి ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. అయితే.. దీనికి భిన్నంగా తాజాగా ఓ పెంపుడు పిల్లి మృతి చెందిందన్న దిగులుతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య …
Read More »ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి పంచాంగకర్తలు చెబుతుంటారు. ఇదే మాదిరిగా ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా ఒక పంచాంగ కర్త చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా పంచాంగకర్త పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. …
Read More »డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం అందించేందుకు సిద్ధమవుతోంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా అని అన్ని కేసులకు ఇది వర్తించదన్నది మర్చిపోకూడదు. డిజిటల్ మోసాలకు.. సైబర్ నేరస్తుల బారిన పడినోళ్లకు రికవరీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతదాకా ఎందుకు? సైబర్ మోసాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకున్నా.. వారు చేసే మోసాలకు.. …
Read More »పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే చాలామందికి ఓటములు, అవమానాలు ఎక్కువగా ఎదురవుతాయేమో అన్న అపోహ కలుగుతుంది. కానీ వాస్తవానికి ఈ పేరుకు అలాంటి ప్రతికూల అర్థం లేదని పండితులు స్పష్టం చేస్తున్నారు. “పరాభవ” అనే పదాన్ని విభజిస్తే –“పరా” అంటే పరాశక్తి, పరాభట్టారిక (లలితాదేవి),“భవ” అంటే భవుడు, పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆదిదంపతులైన …
Read More »విమాన సంస్థలపై కొరడా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సమూలంగా మారుస్తూ.. కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం.. విమానయాన సంస్థలు.. ఇక నుంచి తమ సీటింగ్లో 60 శాతం సీట్లపై ఎలాంటి నిర్బంధాలు విధించేందుకు అవకాశం ఉండదు. ఆయా సీట్లను సాధారణ రేట్లకే కేటాయించాలి. అదేవిధంగా ఒకే పీఎన్ ఆర్ నెంబరు ఉన్న సీట్లను పక్కపక్కనే …
Read More »డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో అంత్యక్రియలు నిర్వహించడం గగనంగా మారింది. థాయ్ సంప్రదాయం ప్రకారం మృతదేహాలను దహనం చేయడానికి వాడే స్మశాన వాటికల ఫర్నేసులకు డీజిల్ తప్పనిసరి. అయితే, పెట్రోల్ బంకుల్లో నిల్వలు నిండుకోవడం, ఉన్నచోట కూడా కేవలం వాహనాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆలయాల వద్ద డీజిల్ నిల్వలు నిశ్శేషమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే …
Read More »ఆంటీలతో చాట్ చేయండి అంటూ…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్టు వైరల్గా మారింది..“ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలు, ఆంటీలతో చాట్ చేయండి” వంటి ప్రకటనలు చూస్తే మోసపోవద్దని సీపీ సూచించారు. ఇలాంటి యాడ్స్ వెనుక సైబర్ నేరగాళ్ల ఉచ్చు దాగి ఉందని స్పష్టం చేశారు. యువత …
Read More »రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ
ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ పవన్ అనే వ్యక్తి తనను తాను కాల్చుకుని మరణించాడు. తూర్పు ఢిల్లీలోని దల్లూపురా ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గన్ను లోడ్ చేసి గుండె మీద పెట్టుకుని సరదాగా ఫోజులిస్తుండగా, అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కడంతో బుల్లెట్ నేరుగా దూసుకుపోయింది. తీవ్ర గాయాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స …
Read More »SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..
‘ద హండ్రెడ్’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ వ్యవహారంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. మనం ఇచ్చే ఫీజుల ద్వారా ఆ ఆటగాళ్లు పాక్ ప్రభుత్వానికి పన్నులు కడతారని, ఆ డబ్బుతో కొనే ఆయుధాలు మన సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలను తీస్తాయని ఆయన చేసిన హెచ్చరిక మేకర్స్ను ఆత్మరక్షణలో పడేసింది. …
Read More »`బంధానికి` మరో చిక్కు.. స్లీప్ డైవర్స్లో భారత్ ఫస్ట్!
అన్యోన్య కాపురమే.. వైవాహిక బంధానికి.. చూడముచ్చటైన జంటకు.. నిదర్శనం. అయితే.. కారణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్ డైవర్స్` చిక్కులు తెస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఓ సర్వేలో `స్లీప్ డైవర్స్` విషయంలో భారత్ ముందుందని తేలింది. ఇది భారత నాగరిక వ్యవస్థకు పెద్ద ఇబ్బందిగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా స్లీప్ డైవర్స్ యాట్టిట్యూడ్ పెరిగితే.. ఆత్మహత్యలకు, మానసిక రోగాలకు.. కుటుంబాల విచ్ఛిన్నానికి కూడా …
Read More »బైక్ పొగ పీల్చి నలుగురు మృతి.. ఏం జరిగింది?
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో శనివారం రాత్రి జరిగింది. త్యాగరాజ వీధికి చెందిన మురళి అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇటీవల మెకానిక్ వద్ద మరమ్మతు చేయించాడు. ఇంజిన్లో సమస్య ఉండటంతో బైక్ను బోర్ చేసిన అనంతరం రాత్రంతా స్టార్ట్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates