Trends

హైదరాబాద్ లో అద్దెకు బాయ్ ఫ్రెండ్లు

హైదరాబాద్ లో రోజురోజుకూ పాశ్చత్య సంస్కృతీ పెరిగిపోతుంది. కో లివింగ్ పీజీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉద్యోగం, చదువు పేరుతో మహా నగరంలో అడుగుపెట్టిన యువత రంగురంగుల లోకంలో పడిపోతున్నారు. తేనే పూసిన కత్తులతో దోస్తీ చేస్తున్నారు. ఇలాంటి వారి బలహీనతలను క్యాష్ చేసుకుందుకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు. అందమైన అబ్బాయిలను ఎరగా వేసి అమ్మాయిలను మోసం చేసేందుకు తెగిస్తున్నారు. ఇందులో భాగమే అద్దెకు బాయ్ ఫ్రెండ్. …

Read More »

మూడు కోట్లు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకో

ఒకప్పుడు లక్షలాది రూపాయల కట్నకానుకలు ముట్టచెబితేనే కానీ అమ్మాయిల పెళ్లిళ్లు కావడం కష్టమయ్యేది. లేకపోతే అత్తారింటి వేధింపులు భరించాల్సి వచ్చేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. పెళ్లి చేసుకునే అమ్మాయిలు బెదిరింపులకు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. తిరుపతిలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్ధం చేసుకున్న కాబోయే వరుడ్ని వేధించడం మొదలుపెట్టింది ఒక యువతి. 3 కోట్ల రూపాయలు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకోమని బెదిరింపులకు …

Read More »

బాల్టిమోర్‌లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు మరియు యువజన సదస్సు

బాల్టిమోర్, మేరీల్యాండ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు మరియు యువజన సదస్సు ఘనంగా, చిరస్మరణీయంగా ముగిశాయి. ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పాల్గొన్న ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సాహిత్యం, సామాజిక సేవ, యువజన భాగస్వామ్యం, వ్యాపార–పెట్టుబడి అవకాశాలు, ప్రజాసేవ, వినోద కార్యక్రమాల సమ్మేళనంగా నిలిచాయి. …

Read More »

5 స్టార్ హోటళ్లలో కుళ్లిన మాంసం..

ఇంటికంటే గుడి పదిలం అన్నది పాత సామెత. ఇంటి తిండి కంటే హోటల్ తిండే బెటర్ అనేది నేటి ట్రెండ్. ఉదయం టిఫిన్ నుంచి మొదలుకొని రాత్రి భోజనం వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లో ఒక్క ఆర్డర్ కొడితే చాలు క్షణాల్లో ఇంటి ముందు వాలిపోయే హోటల్ తిండికి చాలా మంది అలవాటు పడిపోయారు. ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు సరదాగా అలా బయటకు వెళ్లి హోటల్ తినడం …

Read More »

ఇప్పటికీ సచినే నెంబర్ వన్

సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు పోటీ పడుతున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పి 13 ఏళ్ళు దాటినప్పటికి దేశంలోని టాప్ టెన్ సెలబ్రిటీల్లో సచిన్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. పిచ్ మీద ఆడుతున్న క్రీడాకారులతో పోటీ పడుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు సృష్టించి క్రికెట్ …

Read More »

నా మొగుడ్ని యాక్సిడెంట్ చేసి చంపేయ్

నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్ చేయడం మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. భర్త ప్రాణం కోసం పోరాడిన సావిత్రి పుట్టిన నేల మీద ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్న భర్తలను కడ తెరుస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. పొద్దున్న లేస్తే పేపర్ నిండా మొగుడ్ని చంపిన భార్యలు, ప్రియుడ్ని హత్య చేసిన ప్రియురాళ్ళకు …

Read More »

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి ముప్పు పొంచి ఉందని, ఆయన స్థానంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ఆ కుర్చీలో కూర్చోబెట్టే యోచనలో బోర్డు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వివాదానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ టూర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వచ్చిన పుకార్లే. రెండో …

Read More »

హీలియం సిలిండర్… సిఏ ఆత్మహత్య

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఆ వ్యక్తి హోటల్‌లో ఒంటరిగా గది తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ఎంతకీ గదిలో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు తీసి చూడగా అతను విగతజీవిగా ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న …

Read More »

ఆన్ లైన్లో తండ్రి అంత్యక్రియలకు హాజరు

రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో బుక్ చేసి తెప్పించుకోవడం ఇప్పుడు మామూలై పోయింది. హరియాణలో ఒక కూతురు ఒక అడుగు ముందుకేసి తండ్రి అంత్యక్రియలను ఆన్ లైన్లో చూడటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హతవిధి… మానవ సంబంధాలు ఏ స్థాయికి దిగజారాయో కదా అని కొందరు పెద్దలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతకూ ఏమి …

Read More »

మ్యాచు లేదు… డ్యూటీలో జాయిన్ అయిన స్టార్ క్రికెటర్

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కలేదు, ఆగస్టు చివర్లో మొదలయ్యే దేశవాళీ టోర్నీలకు కూడా ఇంకాస్త సమయం ఉంది. ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అతను పట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ అసిస్టెంట్ మేనేజర్‌గా తన విధులు ప్రారంభించి …

Read More »

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అనూహ్యంగా జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీకి అవకాశం ఇచ్చింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న ఈ నిర్ణయం షమీ భవిష్యత్తుపై మళ్ళీ అనుమానాన్ని మిగిల్చింది. షమీ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా …

Read More »

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత అక్యూట్ ఎన్‌సెఫాలిటిస్‌ (మెదడు వాపు) కేసుల్లో 35 మందికి చాందిపుర వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఏడుగురు చిన్నారులు ఐసీయూలో వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. చాందిపుర వైరస్‌ ప్రధానంగా …

Read More »