బంగారంతో పోటీ పడుతున్నట్టుగా భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్కడో కాదు. తెలంగాణలోనే !. రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీజీ ఐఐసీ) పలు ప్రాంతాల్లో భూములను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయదుర్గం భూములు బంగారాన్ని మించిపోయాయి. గత వారం.. ఇక్కడ ఎకరం 264 కోట్ల రూపాయలు పలకగా.. కేవలం వారంలోనే మరో ఐదు కోట్ల రూపాయలు ఎగబాకి.. శుక్రవారం ఏకంగా 269 …
Read More »మీ ఫిజికల్ హెల్ప్ వద్దు… డబ్బుంటే ఇవ్వండి!
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. “భౌతికంగా మీరు మాకు సాయం చేసేందుకు వస్తామని వర్తమానం పంపుతున్నారు. మంచిదే. కానీ, మీ భౌతిక సాయం మాకు వద్దు.“ అని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి బాలేంద్ర షా కార్యాలయం సహా.. విదేశాంగ శాఖ కూడా సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశాయి. అయితే.. ఇదేసమయంలో డబ్బులు సాయం …
Read More »ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?
అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద వదిలి దంపతులు నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. చీకట్లో వణుకుతూ ‘అమ్మా.. నాన్నా’ అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం స్థానికులను కలచివేసింది. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు. డ్రైవర్గా పనిచేసే సాయి అప్పుల పాలై వాటిని తీర్చలేక …
Read More »దేశవ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమయ్యారు?
దేశవ్యాప్తంగా 288 మంది నేపాల్ వరదల్లో గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 532 మంది ఆచూకీ కనిపించకుండా పోయారని.. అయితే.. వీరిలో 288 మంది మినహా మిగిలిన వారి ఆచూకీ తెలిసిందని.. వారిని నేపాల్ సహాయక బృందాలు కాపాడాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ప్రకటించారు. అయితే.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మిగిలిన వారి ఆచూకీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇక, …
Read More »మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్లో అమానవీయం
నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో కొట్టుకొచ్చిన మృతదేహాల నుంచి నగలు అపహరించిన ఇద్దరిని నేపాల్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. భోటెకోశి నది ఉప్పొంగడంతో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. బురద, శిథిలాల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బాధితుల చెవులకు ఉన్న ఆభరణాలను తొలగిస్తున్న దృశ్యాలు …
Read More »ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి
దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని దీన స్థితి నెలకొంది. దీని ఫలితమే పశ్చిమ బెంగాల్ లో మాల్డా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలో కేవలం 25 రోజుల్లో60 మంది నవజాత శిశువులు మృతి చెందారు. అందులో ఒకే ఒక్కరోజు 10 మంది చెందడంతో ఏమి జరుగుతుందో అర్ధం కాక వైద్యులు సైతం ఆందోళనకు …
Read More »నేపాల్ విషాదం… కన్నీరు పెట్టుకున్న సద్గురు
నేపాల్–టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక జలప్రళయంలో కైలాస మానససరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఈశా ఫౌండేషన్కు చెందిన సుమారు 80 మంది సభ్యులు గల్లంతైనట్లు సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. గల్లంతైన వారిలో 34 మంది పురుషులు, 46 మంది మహిళలు ఉన్నారని, 22 మంది అమెరికన్లు, 12 మంది కెనడియన్లు, 11 మంది ఆస్ట్రేలియన్లు, 9 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారని వెల్లడించారు. అయితే వారి పరిస్థితిపై …
Read More »డ్రైవర్ నిద్రపోతే సీటు లేపుతుంది
అర్ధరాత్రి దాటింది.. రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కళ్లపై నిద్రమత్తు.. దృష్టి రహదారిపైనే ఉన్నా.. మెదడు మాత్రం నెమ్మదిగా స్పందించడం మొదలుపెడుతుంది. ఇలాంటి సమయంలో డ్రైవర్ అలసటను ముందుగానే గుర్తించి హెచ్చరిస్తే? ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉంటుంది. ఈ ఆలోచనకు రూపమే ‘ఇంటెల్లీ సీట్’. ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్ బాలసుబ్రమణియన్ నేతృత్వంలోని రిహాబిలిటేషన్ బయోఇంజినీరింగ్ బృందం, హరీతా సంస్థతో కలిసి ఈ స్మార్ట్ డ్రైవర్ సీటును అభివృద్ధి …
Read More »బిగ్ రివీల్ పేరుతో రూ.8.5 కోట్ల వసూల్… చివరికి ఏం చూపించాడు?
సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా హైప్ సృష్టించిన ‘ఆగస్టు 25’ బిగ్ రివీల్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారీగా డబ్బులు వసూలు చేసి.. చివరికి నామమాత్రపు కంటెంట్ విడుదల చేశారంటూ పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ‘25 ఆగస్టు 2026’ పేరుతో ఓ సోషల్ మీడియా ఖాతాను సృష్టించిన వ్యక్తి.. ఆగస్టు 25న భారీ విషయాన్ని వెల్లడించబోతున్నానంటూ కొద్ది రోజుల పాటు వరుసగా రీల్స్ …
Read More »తెలుగు రాష్ట్రాల్లో ఘోరం… రెండు ప్రమాదాల్లో 13 మంది మృతి
తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. …
Read More »టిబెట్లో భూకంపం వల్లే నేపాల్లో వరదలు?
నేపాల్ లో ఒక్కసారిగా విరుచుకొని పడిన వరద దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కళ్ళ ముందే మనుషులు కొట్టుకొని పోవడం ఒళ్ళు గగుర్పాటు కలగజేస్తుంది. ఈ వరదల విషయం కూడా కొన్ని మీడియా సంస్థలు యధావిధిగా చైనా కుట్రగా ప్రచారం చేశాయి. కానీ టిబెట్లో సంభవించిన భూకంపం తమ దేశంలో వరదలకు కారణంగా భావిస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ప్రకటించారు. టిబెట్లో బుధవారం ఉదయం …
Read More »రీల్స్ కోసం రెండు చేతులు పోగొట్టుకుంది
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లిన ఓ టీనేజర్ ఊహించని ప్రమాదానికి గురైంది. గర్హ్వా జిల్లాలో జరిగిన ఈ ఘటనలో యువతి తన స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ సమీపంలో వీడియో తీస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో అటుగా రైలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారింది. రైలుకు దూరంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates