Trends

అమ్మా, నాన్నలకు చెప్పకుండా ఐఏఎస్ కొట్టేశాడు 

దేశవ్యాప్తంగా సివిల్స్ ఫలితాలలో 1016 మంది విజయం సాధించారు. ఇందులో 664 మంది పురుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. ఇందులో తెలుగమ్మాయి అనన్యరెడ్డి 22 ఏళ్ల మొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించింది. ఇక వెయ్యిలోపు 30 మంది తెలుగువారు సివిల్స్ లో విజయం సాధించారు. అయితే జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన కేరళకు చెందిన సిద్దార్థ్ రామ్ కుమార్ తన కుటుంబసభ్యులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. …

Read More »

జ‌గ‌న్ ఆ స్కూల్లోనే ప‌రీక్ష పేప‌ర్లు కొట్టేశాడు: ప‌వ‌న్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ ప‌దోత‌ర‌గతి ప‌రీక్ష‌ల‌ప్పుడు ప్ర‌శ్న ప‌త్రాల‌ను హైద‌రాబాద్‌లోని శివ‌శివానీ పాఠశాల నుంచి కొట్టేసి ప‌రీక్ష‌లు రాశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ‌నివారం జ‌గ‌న్‌పై జ‌రిగిన దాడి చిన్న‌దేన‌ని అయితే.. వైసీపీ నాయ‌కులు దీనిని పెద్ద‌దిగా ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. జ‌గ‌న్ త‌న నాట‌కాలు క‌ట్టిపెట్టాల‌ని ప‌వ‌న్ సూచించారు. జ‌గన్‌కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతోంది. …

Read More »

విడి 12 ఇంకా బోలెడు పనుంది

ది ఫ్యామిలీ స్టార్ కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే విజయ్ దేవరకొండ చేయబోయే తర్వాతి సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొనేవి. కానీ జరిగింది వేరు. మార్నింగ్ షోకు వచ్చిన టాక్ కంటే దారుణంగా ఫెయిల్ కావడం టీమ్ జీర్ణించుకోలేకపోతోంది. రౌడీ హీరో నెక్స్ట్ ప్రాజెక్టు దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్యాన్ ఇండియా మూవీ. స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ బాగానే చేశారు. టైం ఎక్కువ దొరకడంతో మేజిక్ అనే చిన్న చిత్రాన్ని కొత్తవాళ్ళతో గౌతమ్ పూర్తి చేశాడు. రెండూ సితార బ్యానర్ లోనే రూపొందాయి. ఇంకేం విడి 12కి రూట్ క్లియరని అనుకోవడానికి లేదు.

Read More »

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. గోదావ‌రి వంట‌కాల‌ను రుచి చూడాల్సిందే!!. ఇలా.. తెలుగు వంట‌కాల రుచుల‌ను అంద‌రికీ చేరువ చేస్తోంది గోదావ‌రీస్‌.. యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK). ఈ క్ర‌మంలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌, క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనూ గ‌త …

Read More »

మార్కులు వేయకుంటే చేతబడే..

పరీక్షల కోసం సరిగ్గా చదవని వాళ్లు ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎన్నెన్నో వేషాలు వేస్తారు. చిట్టీలు పెట్టి కాపీ కొట్టడానికి చూస్తారు. లేదంటే పక్కోడి పేపర్ చూసి జవాబులు దించేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు ప్రబుద్ధులు మాత్రం పరీక్ష పేపర్లలో ఏవో కాకమ్మ కథలు రాయడం.. లేదంటే తమ శాడ్ స్టోరీస్ రాసి.. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఇక్కడో లెజెండ్ మాత్రం తన పరీక్ష …

Read More »

పిక్ టాక్: చీరకే అందమొచ్చిందే..

గత ఏడాది అమిగోస్ అనే సినిమా ఒకటి వచ్చిన సంగతి కూడా జనాలకు గుర్తు లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఆ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన అమ్మాయి.. ఆశికా రంగనాథ్. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ అమ్మాయి మన జనాల దృష్టిలో పడలేదు. కానీ అక్కినేని నాగార్జున, విజయ్ బిన్నిల దృష్టిని మాత్రం ఈ కన్నడ అమ్మాయి బాగానే ఆకర్షించింది. విజయ్ దర్శకత్వంలో నాగ్ నటించిన ‘నా సామి రంగ’ కోసం ఈ అమ్మాయినే కథానాయికగా ఎంచుకున్నారు. ఈ సినిమా ప్రోమోల నుంచే ఆశిక కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది.

Read More »

పదే పదే పుట్టింటికి వెళ్లటం భర్తను హింసించినట్లే: హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకుల కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వేళ స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. పదే పదే పుట్టింటికి వెళ్లటం కూడా భర్తను మానసికంగా హింసించటమేనని స్పష్టం చేసింది. భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికి పుట్టింటికి వెళ్లటాన్ని తప్పు పట్టింది. భార్యభర్తల మధ్య పరస్పర ప్రేమ.. విశ్వాసం.. ఆరాధన భావన ఉంటే వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందన్న న్యాయమూర్తి.. …

Read More »

యాపిల్ విషం.. 600 మంది ఉద్యోగుల తొలగింపు

అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ టెక్‌ సంస్థ యాపిల్ సంస్థ‌.. విషం చిమ్మింది. ఉద్యోగుల‌ను ఉన్న‌ప‌ళంగా ఉద్యోగాల నుంచి తీసేసి ఇంటికి పంపించేసింది. దీంతో 600 మంది ఉద్యోగులు ఇంటికే ప‌రిమితం అయ్యారు. కారు, స్మార్ట్‌వాచ్ డిస్‌ ప్లే ప్రాజెక్టులను నిలిపివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియా ఎంప్లాయ్‌మెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేసింది.

Read More »

ఒకే ఒక్కడు ముకేశ్ అంబానీ.. ఘనతలెన్నో

ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఇది పాత విషయమే. ఎందుకంటే బుధవారమే దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ప్రపంచంలో టాప్ 10 మంది అత్యంత సంపన్నుల్లో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ముకేశ్ అంబానీ గొప్పతనం.. ఆయన సాధించిన ఘనతల్ని చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం. ఒక భారతీయుడిగా ముకేశ్ …

Read More »

శాంతి స్వరూప్ ఎందుకంత ప్రత్యేకం

ఇప్పటి జనరేషన్ కి అవగాహన లేదు కానీ న్యూస్ రీడర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శాంతి స్వరూప్ మరణ వార్త మీడియాలో హైలైట్ కావడం చూసి ఆశ్చర్యపోయే ఉంటారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటూ హైదరాబాద్ లో తుదిశ్వాస తీసుకున్న ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుంటే గొప్పదనం అర్థమవుతుంది. శాంతి స్వరూప్ దూరదర్శన్ ఛానల్ లో 1983లో వార్తలు చదివే యాంకర్ గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టారు. …

Read More »

శాంతి స్వ‌రూప్ ఇక‌లేరు!

వార్త‌లు చ‌ద‌వడం.. ఒక వృత్తి. ఇప్పుడు ఈ వృత్తిలో అనేక మంది రాణిస్తున్నారు. అయితే.. ఇన్ని మీడియా చానెళ్లు లేన‌ప్పుడు.. 1980-99ల మ‌ధ్య దూర‌ద‌ర్శ‌న్ లో ప్ర‌సార‌మ‌య్యే వార్త‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉండేది. అయితే.. దీనిలోనూ ఎంతో మంది యాంక‌ర్లు ప‌నిచేసినా.. ఒకే ఒక్క పేరు మాత్రం ఉమ్మ‌డి ఏపీలో మార్మోగి పోయేది. అదే.. శాంతి స్వ‌రూప్‌. ఆయ‌న వార్త‌లు చ‌దివితే.. చ‌దివిన‌ట్టుగా అనిపించ‌దు. మ‌న త‌మ్ముడో.. అన్నో.. బాబాయో.. …

Read More »

ఇది క‌దా.. ప‌త‌నం అంటే

సిరితా వ‌చ్చిన వ‌చ్చును… పోయిన పోవును.. అన్న‌ట్టుగా ప‌త‌నం ముంగిట చివురుటాకులా వ‌ణుకుతోంది.. ఆన్‌లైన్ పాఠాలు బోధించే బైజూస్ అగ్ర‌సంస్థ‌! అయితే.. ఈ ప‌త‌నం కూడా.. కేవ‌లం 12 మాసాల్లోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఉవ్వెత్తున ఎగిసి ప‌డిన స‌ముద్ర కెర‌టంగా దేశ‌వ్యాప్తంగా అన‌తి కాలంలోనే గుర్తింపు పొందిన ఈ స్టార్ట‌ప్‌.. అంతే వేగంగా ప‌త‌నం బాట ప‌ట్టింది. దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్ గా బిజినెస్ ప్రపంచంలో ప్రశంసలు …

Read More »