Trends

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం పది నిమిషాలే ఉన్నాడనే కారణంతో అభిమానులు తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురయ్యారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మైదానంలోకి దూసుకెళ్లి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరివేయడంతో పాటు టెంట్లు, బ్యానర్లు, బోర్డులను ధ్వంసం చేశారు. పలు రాష్ట్రాల నుంచి ఎంతో …

Read More »

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా టూర్–2025 కోసం భారత్‌కు వచ్చారు. ఈ సాకర్ మాంత్రికుడి పర్యటనతో ఫుట్‌బాల్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. మెస్సీని ఒక్కసారి ప్రత్యక్షంగా చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు అభిమానులు భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. హైదరాబాద్‌లో మెస్సీతో ఫోటో దిగేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఫీజు …

Read More »

ఏపీలో ఘోరం, లోయలో పడిన బస్సు.. 9 మంది దుర్మరణం

ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజు గారి మెట్ట మలుపు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ట్రావెల్ బస్సుగా గుర్తించారు. భద్రాచలం వెళ్లి అన్నవరం వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు …

Read More »

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు ఇచ్చే బీసీసీఐ కాంట్రాక్టులలో భాగంగా, ఈసారి వీరిద్దరికీ రెండు కోట్ల రూపాయల తగ్గింపు ఉండవచ్చని సమాచారం. దీనికి కారణం వారి ఫామ్ కాదు, ఫార్మాట్ ఎంపిక. టెస్టు క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న బోర్డు నిబంధనలే ఈ కోతకు దారి తీస్తున్నాయి. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు A+ ప్లస్ …

Read More »

ఇండిగో… కోపాలు తగ్గించేందుకు ఆఫర్లు

ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్ వోచర్లు ఇస్తామని ప్రకటించింది. కస్టమర్స్ కోపాన్ని ఈ కూపన్లతో తగ్గించే ఈ ప్రయత్నంపై సోషల్ మీడియాలో రకారకరాల కామెంట్స్ వెలువడుతున్నాయి. ఈ ఆఫర్ ప్రకారం, బాగా ఇబ్బంది …

Read More »

యువరాజ్ ఫోన్ చేస్తే ఆ ఆటగాడికి వణుకు

గ్రౌండ్‌లో అభిషేక్ శర్మ స్టైల్, అతడు అలవోకగా కొట్టే సిక్సర్లు చూసి అంతా ఈజీ అనుకుంటారు. కానీ ఆ ‘స్వాగ్’ వెనుక ఎవరికీ కనిపించని కఠోర శ్రమ దాగుంది. ఇప్పుడు సొంత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ యువ సంచలనం రాత్రికి రాత్రే స్టార్ కాలేదు. దీని వెనుక చిన్నప్పటి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటలకే మొదలయ్యే ఒక పెద్ద యుద్ధమే ఉంది. అభిషేక్ లైఫ్ స్టైల్ చిన్నప్పటి …

Read More »

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అమెజాన్ సంభవ్ సమ్మిట్ లో సందడి చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, వాటిని ఎలా అధిగమిస్తారనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరి చేత చప్పట్లు కొట్టిస్తోంది. తనకు క్రికెట్ కంటే ఇష్టమైనది మరొకటి లేదని స్మృతి తేల్చి చెప్పారు. …

Read More »

ట్రంప్ గోల్డ్ కార్డ్.. టాలెంట్ ఉంటే సరిపోదు..

అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా వీసా నిబంధనలు వాళ్లను అక్కడ ఉండనివ్వడం లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు. చదువుకున్నవాళ్లు వెళ్లిపోవడం దేశానికి అవమానం అని భావిస్తూ, వాళ్ళకోసం గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డ్ పొందాలంటే …

Read More »

ఆ రాష్ట్రంలో 400 మంది చిన్నారులకు HIV

హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇది దగ్గు ముఖం పట్టింది. బిహార్‌లోని ఒక జిల్లాలో మాత్రం హెచ్ఐవీ ఉధృతి పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య దాదాపు 8 వేలకు చేరింది. ఈ లెక్కలు అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి.  జిల్లాలో …

Read More »

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లపై విమర్శల వర్షం కురుస్తోంది. హార్దిక్ పాండ్యా (59 రన్స్) ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తే, టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్‌ను ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరి పాత స్కోర్లను బయటకు తీసి మరీ నిలదీస్తున్నారు. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో 12 …

Read More »

డేంజర్ జోన్లో జపాన్‌.. 2 లక్షల మందికి ముప్పు?

జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన “మెగాక్వేక్ అడ్వైజరీ” జారీ చేయడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సోమవారం రాత్రి అవోమోరి తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఈ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జరిగిన భూకంపం వల్ల పెద్దగా నష్టం జరగకపోయినా, ఇది రాబోయే పెను విపత్తుకు సంకేతం కావచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి 2011 నాటి సునామీ విపత్తును …

Read More »

లంచం తీసుకున్నాడని ఉరిశిక్ష వేసిన ప్రభుత్వం

చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్‌హుయి అనే మాజీ బ్యాంకర్‌కు మంగళవారం ఉరిశిక్ష అమలు చేశారు. చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన, దాదాపు 156 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ. 1,300 కోట్లు లంచం తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. 2014 నుంచి …

Read More »