Trends

కోడలు ‘దొంగ–పోలీస్’ ఆట: ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ?’

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పనపాలెం ప్రాంతంలో చిన్న చిన్న గొడవలతో మొదలైన అత్త–కోడళ్ల మధ్య విభేదాలు చివరికి ప్రాణహానికి దారితీశాయి. ‘దొంగ–పోలీస్’ ఆట పేరుతో అత్తను సజీవదహనం చేసిన సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. సుబ్రహ్మణ్య శర్మ, భార్య లలిత, తల్లి కనక మహాలక్ష్మి (66)తో కలిసి అప్పనపాలెంలో నివసిస్తున్నారు. అత్త తరచూ మందలించడం, గొడవపడటం వల్ల కోడలు లలిత మనస్తాపానికి గురై, అత్తను …

Read More »

10 మంది పేషెంట్లను చంపిన నర్సు

జర్మనీలో జరిగిన ఒక షాకింగ్ ఘటనలో ఒకరికి జీవిత ఖైదు పడింది. రాత్రిపూట తన పని భారాన్ని తగ్గించుకోవడానికి నర్సుగా పని చేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా 10 మంది పేషెంట్లను హత్య చేయడంతో పాటు, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ దారుణం డిసెంబర్ 2023 నుంచి మే 2024 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీలోని వుయెర్‌సెల్న్ ఆసుపత్రిలో జరిగింది. 44 ఏళ్ల ఈ నర్సు …

Read More »

సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి

ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి ఈరోజు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తో పాటు వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీచరణి, మిథాలి రాజ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, …

Read More »

చీమ చిటుక్కుమన్నా భయం.. భయం..

చీమలంటే ఆమెకు భయం.. ఆ భయమే ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. నమ్మడానికి ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలో చీమలంటే భయంతో పాతికేళ్ల మనీషా సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కూతురిని ఒంటరిని చేసి తనువు చాలించింది. నన్ను క్షమించండి.. ఈ చీమలతో బతకడం నావల్ల కావట్లేదు.. అంటూ ఆమె తన …

Read More »

లేక లేక కప్పు గెలిస్తే.. ఇలా అయ్యిందేంటి?

ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తొలి సీజన్ నుంచి ఎంతో ప్రయత్నించినా.. 16 సంవత్సరాల పాటు ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి కప్పులు సాధించగా.. బలం, ఆకర్షణ పరంగా ఆ రెండు జట్లకూ ఏమాత్రం తీసిపోనట్లు కనిపించే ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పూ దక్కలేదు. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో నిష్క్రమించడం.. ఇదీ వరస.  ఆర్సీబీ కప్పు గెలవకపోవడంపై ఎన్నో ఏళ్ల నుంచి …

Read More »

సోషల్ మీడియా మత్తులో భవిష్యత్తు నాశనం

చదువు అబ్బలేకో లేదా చదివిన చదువుకు ఉద్యోగాలు ఎవడూ ఇవ్వకో కొందరు యువత సోషల్ మీడియాలో తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టేస్తున్నారు. తప్పుడు ఐడిలు, ఫోటోలు పెట్టుకుని ఏం చేసినా ఏం మాట్లాడినా పట్టుకోలేరనే ధీమాతో లైన్ తప్పుతున్నారు. స్పేస్ పేరుతో ఓ యాభై వంద మంది కలిసి ఆడియో ద్వారా పరస్పరం మాట్లాడుకునే ట్రెండ్ ఈ మధ్య బాగా ఊపందుకుంది. ప్రమోషన్ల కోసం దర్శక నిర్మాతలు కూడా వీటిని …

Read More »

ఇక్కడ బస్సులు.. అక్కడ రైళ్ళు.. గాల్లో ప్రాణాలు!

వరుస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఎటునుంచి ఏం ఢీకొంటుందో.. మృత్యువు ఏ వైపు నుంచి దూసుకు వస్తుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంటోంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు.. దక్షిణాదిలో రైలు యాక్సిడెంట్లు కలవరపెడుతున్నాయి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి ఆరుగురు మహిళలు మృతి చెందారు. నిన్నటి చత్తీస్గడ్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 11 కు చేరింది. …

Read More »

ఇప్పుడు 51 కోట్లు.. అప్పుడు 8 వేలు

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలవడంపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు జరిగాయో చూస్తూనే ఉన్నాం. గత ఏడాది పురుషుల జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచినపుడు ఏ స్థాయిలో సెలబ్రేషన్ ఉందో.. ఇప్పుడు అదే స్థాయిలో సంబరాలు చేసుకున్నారు. ఇండియన్ టీం ఆడిన ప్రతి మ్యాచ్‌కూ స్టేడియాలు కిక్కిరిసిపోయాయి. ఫైనల్‌ టికెట్ల కోసం అయితే డిమాండ్ మామూలుగా లేదు. ఒక రోజు ముందే టికెట్లన్నీ సోల్డ్ ఔట్ అయిపోయాయి.  మహిళల …

Read More »

తిరుమలలో ఈమె ఎత్తు చూసి భక్తులు షాక్!

తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి వ‌చ్చిన ఓ మ‌హిళ‌.. ఏకంగా 7.3 అడుగుల హైట్ ఉండ‌డంతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ప్ర‌స్తుతం ఈమె ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. ఏడు అడుగుల పైన హైట్ ఉన్న ఈమె.. శ్రీలంక దేశానికి చెందిన ప్ర‌ముఖ క్రీడాకారిణి. పేరు త‌ర్జిని శివ‌లింగం. నెట్ బాల్ క్రీడ‌లో శ్రీలంక‌కు అనేక ప‌త‌కాలు కూడా తీసుకువ‌చ్చార‌ట‌. ప్ర‌స్తుతం ఆ క్రీడ …

Read More »

హర్మన్‌ప్రీత్.. అలా చేయాల్సింది కాదు

47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను సాధించింది భారత్. 1973లో ప్రపంచకప్ ఆరంభం కాగా.. 1978 నుంచి మన జట్టు ఆ టోర్నీలో పోటీ పడుతోంది. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో ఫైనల్ చేరినా కప్పు గెలవలేకపోయిన ఇండియా.. మూడో ప్రయత్నంలో తుదిపోరులో గెలిచింది. ఆదివారం దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో కప్పును సొంతం చేసుకుంది. పురుషుల జట్టు ఐసీసీ ట్రోఫీ గెలిస్తే ఇండియా అంతా ఎలా సెలబ్రేట్ …

Read More »

బస్సు ప్రమాదం.. పసిపాప పక్కనే ఆమె తల్లి!

కొద్ది రోజుల క్రితం కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మరువక తెలంగాణలోని చేవెళ్ల దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన దుర్ఘటనలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులలో ఏడాది వయసున్న చిన్నారి ఉండడం, ఆ పసిపాప …

Read More »

అమెరికాలో ఆకలీ కేకలా?

ప్రపంచానికి అగ్రగామిగా చెప్పుకునే అమెరికాలో ప్రస్తుతం ఆకలి సంక్షోభం తలెత్తింది. దీనికి కారణం మరేదో కాదు, అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వంలో నెలకొన్న ‘షట్‌డౌన్’. బడ్జెట్‌పై కాంగ్రెస్, శ్వేతసౌధం మధ్య నెలకొన్న పేచీ కారణంగా, పేద ప్రజలకు అందే అత్యవసర సంక్షేమ పథకాల నిధులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో, దాదాపు 4.2 కోట్ల మంది అమెరికన్లు తమ ఆహారం కోసం ఉచిత కేంద్రాల ముందు తెల్లవారుజామునే క్యూలు కట్టాల్సిన దయనీయ …

Read More »