Trends

భర్త క్షేమం కోసం తిరుమలలో కాలి నడకన పవన్ భార్య

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం తిరుపతిలోని అలిపిరి నుంచి కాలి బాటన బయలుదేరిన అన్న.. శుక్రవారం రాత్రికే తిరుమల చేరుకున్నారు. అనంతరం శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదికారులు ప్రొటోకాల్ మేరకు …

Read More »

నిన్న జొన్నగిరి… నేడు రామగిరి

రాయలసీమకు కరువు సీమ అనే ముద్ర శరవేగంగా తొలగిపోతోంది. తాగు, సాగు నీరు లేని నేలగా గతంలో ఉన్న సీమ జిల్లాలు ఇప్పుడు పుష్కలమైన నీటి వనరులతో అలరారుతున్నాయి. తాజాగా బంగారు గనులతో రాయలసీమ రతనాల సీమగా మారిపోతోంది. ఇప్పటికే రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో బంగారం వెలికితీత ప్రారంభం కాగా…త్వరలోనే శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి ప్రాంతంలోనూ గోల్డ్ మైన్స్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పరిశీలన పూర్తి కాగా… త్వరలోనే బంగారు …

Read More »

రోహిత్ శర్మ లేకుండా ప్రపంచ వరల్డ్ కప్?

ఇప్పటికే టెస్ట్, టీ20 లకు దూరమైన హిట్ మ్యాన్ వన్డేలకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ మొదలైంది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలోనూ అతను కేవలం 11 పరుగులే చేశాడు. ఇక వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌కు జులై 19న జరిగే మూడో వన్డేనే ఈ ఫార్మాట్‌లో చివరి …

Read More »

ఏపీలో మళ్లీ కరోనా కలకలం…?

యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే… ఇతర ప్రాంతాల గురించి అటుంచితే… ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే భావన వ్యక్తమవుతోంది. మునుపటి మాదిరిగా వందలు, వేల సంఖ్యలో కరోనా కేసులు లేకున్నా… అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు వెలువడే స్థాయిలో మాత్రం కొత్త కేసులు నమోదయ్యాయి. గత నెల 26 నుంచి గురువారం వరకు నమోదు అయిన కేసుల వివరాలే ఈ తరహా అప్రమత్తతను చాటి చెబుతున్నాయి.  దాదాపుగా రెండేళ్లకు …

Read More »

ఇస్రో కు షాకిస్తున్న రాజీనామాలు… కట్టడికి కొత్త రూల్స్!

భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెబుతుండటంతో ఏం జరుగుతుందో అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. గత కొన్ని నెలల్లోనే సుమారు 100 మంది నుంచి 120 మంది దాకా రాజీనామాలు చేశారని తెలుస్తోంది. మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలో ఈ సంఖ్య చిన్నదే అయినా, కీలక స్థానాల్లో ఉన్నవారు వెళ్లిపోవడం …

Read More »

వరల్డ్ కప్‌లో ఇండియా vs పాక్… మూడుసార్లు?

క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కొత్తగా ప్రకటించిన టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ దాయాదుల మధ్య ఒకే వరల్డ్ కప్‌లో ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ కొత్త పద్ధతి వల్ల చిన్న జట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే …

Read More »

అమెరికాకు అక్రమ ప్రయాణాలు బంద్… భారీగా తగ్గిన ఇండియన్స్!

మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ కొందరు మాత్రం ఏజెంట్ల మాయలో పడి దొంగచాటుగా, అక్రమ మార్గాల్లో అక్కడికి వెళ్లాలని చూస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల వాళ్ల ప్రాణాలకు ముప్పు రావడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కూడా చెడ్డపేరు వస్తోంది. అయితే ఇప్పుడు ఈ అక్రమ ప్రయాణాలకు బ్రేక్ పడింది. గతంతో పోలిస్తే అక్రమంగా …

Read More »

కని పెంచిన తల్లిదండ్రులే ప్రాణాలు తీసారు

తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలచివేశాయి. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన కొడుకులే మద్యం, మత్తు వ్యసనాలకు బానిసై నిత్యం వేధింపులకు దిగడంతో.. చివరకు కన్నబిడ్డలనే హత్య చేసే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని సూర్యాపేట పట్టణం సుందరయ్యనగర్‌లో భూక్యా అచ్చి అనే మహిళ తన కుమారుడు విజయ్‌ను గొడ్డలితో నరికి చంపింది. భర్త మరణం తర్వాత కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన …

Read More »

అమెరికా కొత్త బాంబ్… ఇండియాకు 100% టారిఫ్ సెగ?

రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా ఆదాయ వనరులను పూర్తిగా దెబ్బతీసి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా అమెరికా సెనేటర్లు ఒక సరికొత్త ఆంక్షల బిల్లును తెరపైకి తెచ్చారు. ఈ బిల్లు ప్రకారం రష్యా ఆయిల్ కొనే ఇండియా, చైనాతో పాటు మరో మూడు దేశాల ఎగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ …

Read More »

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయనాలతో సింథటిక్ పాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయించినట్లు గుర్తించారు. గత ఆరు నెలల్లో సుమారు 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు వినియోగదారులకు చేరి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో నిందితుల విక్రయ రిజిస్టర్లను …

Read More »

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…! 

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు… అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఒక మహిళ దుశ్చర్యకు పాల్పడింది. ఏకంగా న్యాయమూర్తి కుర్చీపైనే చేతబడికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కలకలం రేపింది. జడ్జి లేని సమయంలో కోర్టులోకి ప్రవేశించిన మహిళ, తెల్ల ఆవాలను జడ్జి కుర్చీపై చల్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 65 ఏళ్ల మంజుల అనే …

Read More »

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు వేరు.. ఘటనలు వేరు. కానీ రెండు సంఘటనల వెనుక కనిపిస్తున్న ప్రధాన కారణాలు మాత్రం కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు, నిరాశ. ఒకే రోజున వెలుగుచూసిన ఈ రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి …

Read More »