నిజమే. తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన వెంకటరమణ జీవితం… ఆరిపోతున్న దీపాలకు వెలుగేనని ఘంటాపథంగా చెప్పొచ్చు. పుట్టినప్పటి నుంచి కాలు బయటపెట్టిందే లేదు… కూర్చున్నది లేదు.. నడిచిందీ అసలే లేదు.. స్కూలుకు వెళ్లింది లేదు.. అయితేనేం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా అతడు ఉద్యోగం చేస్తున్నాడు. తనకు కలిగిన జీవితకాల వైకల్యాన్ని అతడు తనకు శాపంగా పరిగణించలేదు. తనకు వచ్చిన వైకల్యాన్ని చూసి భయపడనూ లేదు. గుండె నిబ్బరంతో జీవితం సాగించాలని …
Read More »పదహారోసారి… పెరోల్పై బయటకు డేరా బాబా
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మరోసారి పెరోల్ లభించింది. 30 రోజుల పెరోల్ మంజూరుతో రోహ్తక్ జిల్లా సునారియా జైలు నుంచి ఆయన ఉదయం బయటకు వచ్చారు. 2017లో అత్యాచార కేసులో దోషిగా తేలి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్కు ఇది 16వ సారి పెరోల్ కావడం గమనార్హం. గతంలో కూడా ఆయనకు పలుమార్లు తాత్కాలిక విడుదలలు లభించాయి. ఈ …
Read More »ఇదేనా వార్నర్కు ఇచ్చే గౌరవం?
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అత్యంత ఇష్టపడే విదేశీ క్రికెటర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా అతను ఇండియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ మెగా క్రికెట్ లీగ్లో వార్నర్ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడినపుడు తనకున్న ఫాలోయింగే వేరు. డెక్కన్ ఛార్జర్స్ స్థానంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీని చేపట్టిన సన్రైజర్స్ మొదట్లో కొన్నేళ్లు తీవ్రంగా తడబడింది. జిడ్డు ఆటకు మారు పేరుగా ఉంటూ.. …
Read More »ఆగని ‘పెట్రో’ బాదుడు.. 10 రోజుల్లో 7 రూపాయలు…
దేశంలో మరోమారు ఇంధన ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పై దాదాపుగా రూ.3 మేర పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చేసింది. అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలలోనే మూడు దఫాలుగా ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా …
Read More »తూర్పు `మంటలు`… ఏపీ చరిత్రలో తొలిసారి!
సూర్యుడు తూర్పున ఉదయించును.. అనే మాట తెలిసిందే. అయితే.. తాజాగా అదే సూర్యుడు.. ఏపీలోనితూర్పు గోదావరి జిల్లాను తాజాగా మంటెత్తించాడు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎండ మంటలు రేపింది. భానుడి భగ భగలతో తూర్పుగోదావరి వాసులు అల్లాడిపోయారు. ఏ మండలంలో చూసినా.. ఉష్ణోగ్రతలు.. 48 డిగ్రీలకు పైమాటే అన్నట్టుగా నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఇంటి నుంచి ప్రజలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి …
Read More »భర్తను చంపి.. జేసీబీతో గొయ్యి తీసి…
ఆధునిక కాలంలో వివాహేతర బంధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తన జీవితంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిందో మహిళ. ఆపై తన చేతులతోనే చంపేసిన భర్తను పాతిపెట్టేందుకు ఆమె ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసింది. ఆపై భర్త శవాన్ని ఆ గోతిలో పాతిపెట్టి… భర్త కనిపించడం లేదని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ఆ అర్థాంగే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు …
Read More »బెజవాడను వణికించిన ట్రాయాంగిల్ లవ్ స్టోరీ
నిజమే… ఒక్క యువతిని ఇద్దరు స్నేహితులు ప్రేమించిన వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి… గురువారం రాత్రి బెజవాడ నగరాన్ని వణికించేసింది. ఆ యువతిని ప్రేమించిన ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువుగా మారి నడిరోడ్డుపై పోరాడుకున్నారు. ఈ పోరాటం కర్రలతోనే, కత్తులతోనే జరగలేదు. అత్యాధునిక థార్ కార్లతో జరిగింది. ఒక కారులో ఒకరు…మరో కారులో మరొకరు కూర్చుని వారిద్దరూ పరస్పరం కార్లతోనే డీకొట్టుకున్నారు. వెరసి ఈ ఘర్షణతో నెలకొన్న …
Read More »ధోని రికార్డుకు బ్రేక్
ఇండియన్ క్రికెట్లోనే ఐపీఎల్లో అద్భుతమైన రికార్డులున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిచింది. కొన్నేళ్ల నుంచి ఫామ్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ.. ఒక్కో సీజన్ను పొడిగించుకుంటూ ఐపీఎల్లో కొనసాగుతూ వచ్చాడు మహి. 2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి సీజన్లోనూ ఆడుతున్న అతి కొద్దిమంది క్రికెటర్లలో ధోని ఒకడు. ఈ జాబితాలో ధోని కాకుండా విరాట్ కోహ్లి, …
Read More »కాక్రోచ్ జనతా పార్టీ.. సరదా ట్రెండా? లేక..?
దేశంలో ఇప్పుడు “కాక్రోచ్ జనతా పార్టీ” పేరే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పేరు వింతగా ఉన్నా.. దీని వెనుక యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, అసంతృప్తి, వ్యవస్థపై కోపం కనిపిస్తోందని చాలామంది చెబుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువతను “బొద్దింకల్లా తయారయ్యారు” అని వ్యాఖ్యానించారనే వార్తల తర్వాత.. మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల అభిజీత్ దీష్కే అనే యువకుడు “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో కొత్త పార్టీని …
Read More »ధోని పేరు చెప్పి మోసం చేశారా?
లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కొన్నేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. 2022, 2023 సీజన్లలోనే అతను ఆట నుంచి వైదొలుగుతాడని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు నిజం కాలేదు. ఒక్కో సీజన్ పొడిగించుకుంటూ 2026 ఐపీఎల్కు కూడా రెడీ అయిపోయాడు ధోని. కానీ మరి కొన్ని గంటల్లో ఐపీఎల్ ఆరంభం కాబోతుండగా.. అతడి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాకిచ్చింది. …
Read More »కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే ఉన్న ఆమె మొన్న విడుదలైన ‘రాకస’ సినిమా నిర్మాతగా ఆమెకు మంచి విజయం అందుకున్నారు. కమర్షియల్గా నిలబడటమే కాదు, కంటెంట్తో కూడా మెప్పించింది. తెర వెనుక బిజీగా ఉంటూనే, తెర ముందు తన గ్లామర్ని మాత్రం తగ్గనివ్వడం లేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హడావుడిలోంచి ‘పది నిమిషాలు దొంగిలించాను’ …
Read More »ఐపీఎల్ లో ధోనీ… ఇదే ఫైనల్ ఆన్సరా?
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చెపాక్ మైదానంలో వరుసగా చేదు జ్ఞాపకాలు మిగిలేలా ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిపోవడమే కాకుండా, ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్ ఆడటంపై వచ్చిన ఒక అప్డేట్ ఫ్యాన్స్ గుండెల్ని పిండేస్తోంది. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని 44 ఏళ్ల ధోనీ, చెపాక్లో జరిగిన చివరి మ్యాచ్ ముగిశాక గ్రౌండ్ లోకి వచ్చి అభిమానులకు అభివాదం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates