ఏపీ బీజేపీలో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతోంది. కన్నా లక్ష్మీ నారాయణ నిష్క్రమణ తర్వాత కమలం పార్టీలోని అసమ్మతి వాదులంతా గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. సోము వీర్రాజు సంగతి తేల్చేయ్యాల్సిందేనని, ఆయన నాయకత్వంలో పనిచేయలేమని చెప్పేందుకు రెడీ అవుతున్నారు. వీర్రాజు, జీవీఎల్ సహా నలుగురు నేతల పెత్తందారీతనాన్ని భరించలేకపోతున్నామని బీజేపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మంగళవారం మీటింగ్ కేన్సిల్ వీర్రాజుకు వ్యతిరేకంగా అసమ్మతి వాదులు మంగళవారం ఒక మీటింగ్ ఏర్పాటు …
Read More »కాపుల కోటలో వెలమదొర.. సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారా?
ఏలూరు ఎంపీ, వైసీపీ నేత కోటగిరి శ్రీధర్ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈ మార్పులు ఆళ్ల నానికి అనుకూలం కావొచ్చేమో కానీ కోటగిరి శ్రీధర్కు ఏమాత్రం అనుకూలం కాదని.. ఏలూరు ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నీ దాదాపు …
Read More »‘ఆమెకు అప్పులున్నాయి సర్.. టికెట్ నాకే ఇవ్వండి’
టీడీపీలో ఆళ్లగడ్డ అసెంబ్లీ టికెట్కు తీవ్రమైన పోటీ ఉంది. భూమా అఖిలప్రియ మరోసారి ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తుండగా ఏవీ సుబ్బారెడ్డి కూడా ఇక్కడి నుంచే టికెట్ కోరుతున్నారు. అఖిల తండ్రి నాగిరెడ్డి ఉన్న కాలంలో ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న సుబ్బారెడ్డికి.. నాగిరెడ్డి మరణం తరువాత ఆ కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. అంతేకాదు.. అఖిల ప్రియ, సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. తనను …
Read More »ఇద్దరూ అధిష్టానానికి దగ్గరే.. టికెట్ ఎవరికో మరి?
తెలంగాణలోని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి మళ్లీ టికెట్ ఆశిస్తుండగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూడా మెదక్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ ప్రజల్లో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని, తామే బరిలో ఉంటామని చెప్తుండడంతో కార్యకర్తలు, ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు. అటు పద్మ దేవేందర్ రెడ్డి, ఇటు సుభాష్ …
Read More »సత్తెనపల్లి టీడీపీలో కన్నా టెన్షన్
మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరడం ఖాయమైపోయింది. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా తేలిపోయింది. దానికి తగ్గట్టుగా రెండు మూడు రోజులుగా కన్నా..సత్తెనపల్లిలో తిరుగుతూ టీడీపీ నేతలందరినీ పలుకరిస్తున్నారు. పొరుగున ఉన్న పెద కూరపాడు నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించినప్పుడు సత్తెనపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు… కన్నా రాకతో సత్తెనపల్లి టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారంతా ఇప్పుడు సైడైపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. …
Read More »కాపుల ఓట్లు ఎటు… ఒక్కటే టెన్షన్.. టెన్షన్..!
కాపు ఓటు బ్యాంకుఎటు వైపు? రాష్ట్రంలో 25 శాతంగా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఎవరు ప్రాధాన్యం ఇస్తున్నారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా రెండు రోజుల కిందట ఉమ్మడి తూర్పు గోదావరిలో జరిగిన కాపు నాడు సమావేశంలో ఎటు వైపు మొగ్గు చూపాలనే విషయంపై కాపులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. వైసీపీ, టీడీపీలు కూడా కాపులను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ …
Read More »ముఖ్యమంత్రి పవనే.. తేల్చేసిన హరిరామజోగయ్య
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా..టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని.. కాపు సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఎన్నికల కు సంబంధించి ఒక సర్వే రిపోర్టును మీడియాకు విడుదల చేశారు. వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో కుప్పకూలడం ఖాయమని తెలిపారు. జగన్కు ఆయన పార్టీకి కేవలం 55 స్థానాల్లోనే విజయం …
Read More »కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడిన తరువాత ఆ పార్టీలోని మరికొందరు అసంతృప్తులూ అదే బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కన్నా ఇంటికి విష్ణుకుమార్ రాజు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీలో పరిస్థితులు ఏమాత్రం బాగులేవని.. పార్టీలోని సమస్యలను హైకమాండ్కు ఎన్నిమార్లు …
Read More »పట్టాభి సహా 16 మందిపై హత్యాయత్నం కేసులు..
గన్నవరంలో కాలిపోయింది.. టీడీపీ వాహనాలు. గన్నవరంలో దాడికి గురైంది టీడీపీ కార్యాలయం. గన్నవరంలో బూతులు తిట్టించుకుంది.. టీడీపీ నాయకులు. గన్నవరంలో భౌతిక దాడికి గురైంది టీడీపీ కార్యకర్తలు. సో.. బాధితులు ఎవరు? అంటే.. పదో తరగతి పిల్లాడిని అడిగినా.. టీడీపీ నేనని చెబుతాడు. కానీ… ఏపీ పోలీసులు మాత్రం.. టీడీపీ నేతలేనని అంటున్నారు. వారిపైనే కేసులుపెట్టారు. అవి కూడా హత్యాయత్నం కేసులు పెట్టారు. మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు …
Read More »ఏపీలో 100 సీట్లు గెలిచే పార్టీ ఇదే
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 151 సీట్లు గెలిచింది. కానీ, 2024 ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైపన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.. అయితే, 100 సీట్ల మార్క్కు చేరుకుంటుందా అంటే అదీ చెప్పడం కష్టమే. ఇక 2019లో చచ్చీచెడీ సింగిల్ సీటు కొట్టిన జనసేన వచ్చే ఎన్నికల్లో …
Read More »నన్ను చంపేస్తామంటున్నారు.. రాజాసింగ్ సంచలన ట్వీట్
తెలంగాణ బీజేపీ ఫైర్బ్రాండ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ట్వీట్ చేశారు. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని.. ఆయనకు పదే పదే ఫోన్లు కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజాసింగ్ తన ట్వీట్కు ట్యాగ్ చేశారు. విషయం ఏంటంటే.. ఇటీవల కాలంలో తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు పనిచేయడం లేదని.. పదే పదే …
Read More »డైలామాలో కాపులు.. కిం కర్తవ్యం?
అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజమే. కాపు సామాజిక వర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైలమాలో పడిపోయింది. తాము ఒంటరిగా ఎదగాలని.. రాజకీయంగా శాసించాలని.. తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కొన్నాళ్లుగా కాపులు ఉద్యమిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తరచుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులను గమనిస్తే.. వారంతా డైలమాలో పడిపోయినట్టు తెలుస్తోంది. నిజానికి కాపులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates