Political News

ఏపీలో 100 సీట్లు గెలిచే పార్టీ ఇదే

2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 151 సీట్లు గెలిచింది. కానీ, 2024 ఎన్నికల్లో ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు. 2019 ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైపన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడం గ్యారంటీగా కనిపిస్తోంది.. అయితే, 100 సీట్ల మార్క్‌కు చేరుకుంటుందా అంటే అదీ చెప్పడం కష్టమే. ఇక 2019లో చచ్చీచెడీ సింగిల్ సీటు కొట్టిన జనసేన వచ్చే ఎన్నికల్లో …

Read More »

న‌న్ను చంపేస్తామంటున్నారు.. రాజాసింగ్ సంచ‌ల‌న ట్వీట్‌

తెలంగాణ బీజేపీ ఫైర్‌బ్రాండ్, ఘోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. త‌న‌ను చంపేస్తామ‌ని కొంద‌రు బెదిరిస్తున్నార‌ని.. ఆయ‌నకు ప‌దే ప‌దే ఫోన్లు కూడా చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్‌ సీపీలను రాజాసింగ్‌ తన ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల కాలంలో త‌న‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారు ప‌నిచేయ‌డం లేద‌ని.. ప‌దే ప‌దే …

Read More »

డైలామాలో కాపులు.. కిం క‌ర్త‌వ్యం?

అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజ‌మే. కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైల‌మాలో ప‌డిపోయింది. తాము ఒంట‌రిగా ఎద‌గాల‌ని.. రాజ‌కీయంగా శాసించాల‌ని.. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడే ముఖ్య‌మంత్రి కావాల‌ని కొన్నాళ్లుగా కాపులు ఉద్య‌మిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర‌చుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. వారంతా డైల‌మాలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి కాపులు …

Read More »

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌పై వైసీపీ నిఘా నేత్రం

గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ క‌ర్నూలు, నెల్లూరు, విజ‌య‌న‌గ‌రం వంటి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఆయా జిల్లాల్లో మొత్తంగా వైసీపీ అసెంబ్లీ స్థానాలు.. పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా గెలుచుకుంది. అయితే.. ఎటొచ్చీ.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మాత్రం పాగా వేయ‌లేక‌పోయింది. అనుకున్న విధంగా క్లీన్ స్వీప్ చేయ‌లేకపోయింది. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ కీల‌క నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట‌లుగా ఉన్న …

Read More »

ఆయన్ను జగన్ పక్కన కూర్చోబెట్టుకుంటారా..

ఎట్టకేలకు మర్రి రాజశేఖర్ కోరిక తీరింది. ఆయన ఎమ్మెల్సీ అవుతున్నారు. తాజాగా ప్రకటించిన వైసీపీ అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు ఉంది. జగన్ కు కలిసి రాజశేఖర్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.. ఎప్పుడో చెప్పి ఇప్పుడు ఇచ్చి… నిజానికి మర్రి రాజశేఖర్ , జగన్ కు వీరాభిమాని. ఎప్పుడు చూసినా ఆయన జగన్ నామ స్మరణే చేసేవారు. 2019 ఎన్నికల ముందు జగన్ ఆయనకు చిలకలూరిపేట టికెట్ ఇవ్వలేకపోయారు. త్వరలోనే …

Read More »

అన్నా, చెల్లీ మధ్యలో ఆమె

వైఎస్ కుటుంబ విభేదాలు రోజుకొకటి బయట పడుతున్నాయి. తన మాట వినని షర్మిలను పూర్తిగా దూరం చేయాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయత్నాల వెనుక జగన్ కంటే ఆయన భార్య భారతీరెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా తాజాగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు షర్మిల పేరే కనిపించకూడదన్నట్లుగా వైఎస్ భారతి ప్రయత్నిస్తున్నారన్నది తాజా సమాచారం . జగన్ తన తల్లిని, చెల్లిని దూరం పెట్టడంలో భారతి కీలక …

Read More »

మంగ‌ళ‌గిరిలో గెలుపు ఎవ‌రిది… ఎవ‌రికి వారిదే ధీమా..!

గుంటూరు జిల్లాలో ఎక్క‌డ గెలిచినా.. గెల‌వ‌క‌పోయినా.. ఒకే ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం గెలిచి తీరాలి.. ఆ కిక్కే వేర‌ప్పా!! అంటున్నారు వైసీపీ, టీడీపీనాయ‌కులు. రెండుపార్టీల‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం చాలా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా లోకేష్‌ను గెలిపించుకోవాల‌ని.. టీడీపీ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఇక్క‌డ చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇటీవ‌ల యువ గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించ‌డానికి ముందు వ‌ర‌కు కూడా నారా లోకేష్ నియోజ‌క‌వ‌ర్గంలో వారానికి రెండు సార్లు ప‌ర్య‌టించారు. …

Read More »

నష్టం బాబుకా.. సాయిరెడ్డికా?

నందమూరి తారకరత్న మరణించిన సందర్భంగా అతడి పార్థివ దేహాన్ని దర్శించడానికి వచ్చిన సమయంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అగ్రనేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిల కలయిక అందరి దృష్టినీ ఆకర్షించింది. బాబు, సాయి రెడ్డి పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడం.. ఆ తర్వాత చంద్రబాబు కారు ఎక్కబోతుండగా అక్కడికి కూడా సాయిరెడ్డి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. సందర్భం ఏదైనప్పటికీ.. నిత్యం చంద్రబాబు, ఆయన తనయుడు …

Read More »

ఇల్లు తగలబెట్టుకుంటున్న వైసీపీ

ప్రతిపక్షంలో ఉండగా.. అధికార పార్టీ మీద నిందలు మోపడం.. ప్రతి విషయాన్నీ రాజకీయంగా మార్చడం.. బాగానే ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడిని కొనసాగిస్తే చూసే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. అధికారంలో ఉన్న వాళ్లు ఏం సాధించారా అని చూస్తారే తప్ప.. నిత్యం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ వాళ్లను ఏడిపించుకు తింటుంటే.. వాళ్లను ఇబ్బంది పెడుతుంటే.. వారి మీద బురదజల్లుతుంటే.. సున్నితమైన విషయాల మీద వివాదాలు …

Read More »

ఫ‌స్ట్ టైం.. మోడీకి షాక్‌.. ఏం జ‌రిగిందంటే!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే.. దేశానికి అధినేత‌. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు.. శుభాకాంక్ష‌లు.. అభినంద‌న‌లు .. ఆయ‌న ద‌ర్శ‌నం అయితే చాలు.. అనుకునే నాయ‌కులు అబ్బో.. అనిపించే అతిథి మ‌ర్యాదలు. ఇక‌, ఆయ‌న కోరితే అనుమ‌తు లేం ఖర్మ ఏపీ వంటి రాష్ట్రాల్లో అయితే.. రాజ్య‌స‌భ టికెట్లు, ఆయ‌న మిత్రుల‌కు పోర్టులు, కార్పెట్లు వ‌గైరా వ‌గైనా ఇచ్చేస్తున్న ప‌రిస్థితి తెలిసిందే. అయితే.. తొలిసారి న‌రేంద్ర మోడీని …

Read More »

గెలిచిన గల్లా.. ఏపీ నిర్ణ‌యంపై సుప్రీం కోర్టు స్టే

టీడీపీ ఎంపీ, ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ న్యాయ పోరాటంలో ఒకింత తెరిపిన ప‌డ్డారు. చిత్తూరు శివారులోని గ‌ల్లా కుటుంబానికి చెందిన అమ‌ర‌రాజా బ్యాట‌రీస్ కంపెనీని మూసివేయాలంటూ.. ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన నోటీసులను సుప్రీం కోర్టు ప‌క్క‌న పెట్టింది. స‌ద‌రు నోటీసుల‌పై స్టే విధించింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. …

Read More »

గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ దాడి!

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ క‌క్ష‌లు శ్రుతి మించాయి. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విరుచుకుప‌డ్డారు. చేతికి అందిన రాళ్ల‌తో దాడుల‌కు పాల్ప‌డ్డారు. దీంతో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ కార్యాల‌యానికి ఉన్న అద్దాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. ఇంత‌టితో కూడా ఊరుకోని కార్య‌క‌ర్త‌లు.. కార్యాల‌యంలో పార్కింగ్ చేసిన రెండు కార్లు, నాలుగు బైకుల‌కు కూడా నిప్పు పెట్టారు. అదేస‌మ‌యంలో కార్యాల‌యంలో ఎవ‌రైనా ఉన్నారేమో.. అనిలోప‌ల‌కు చొచ్చుకు వెళ్తే ప్ర‌య‌త్నం …

Read More »