Political News

ఏలూరు ఎంపీ సీటుపై మాజీ డిప్యూటీ సీఎం కన్ను

జగన్ కేబినెట్లో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసి.. కేబినెట్ విస్తరణ సమయంలో పదవి కోల్పోయిన ఆళ్ల నాని ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతున్నారట. అందుకు ఆయన రంగం మొత్తం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ మంత్రివర్గంలో మొదటి విడతలోనే ఆరోగ్య మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పెద్ద పెద్ద పదవులు అందుకున్న ఆయన మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి పోగొట్టుకున్నారు. దశలవారీగా వీలైనంత ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలన్న జగన్ లెక్క …

Read More »

తమిళనాడు పాలిటిక్స్ వద్దంటున్న లోకేష్

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. ప్రతీచోట జన ప్రభంజనం కనిపిస్తోంది. పంచ్ డైలాగులతో లోకేష్ జనాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. సైకో ముఖ్యమంత్రిని గద్దె దించే రోజు వచ్చిందని అందరికీ చెబుతున్నారు. తాము అధికారానికి వస్తే చేయబోయేదేమిటో చెబుతున్నారు.. డైమండ్ పాప టు జబర్దస్త్ ఆంటీ లోకేష్ ఇప్పుడు రోజాకు టైటిల్ మార్చేశారు. ఇంతకాలం డైమండ్ రాణి, డైమండ్ పాప అని పిలిచిన లోకేష్ …

Read More »

పవన్ కల్యాణ్‌ను జీవీఎల్ ఇరుకునపెట్టారా?

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు రాజ్యసభలో మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రాయానికి, కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరడంతో జనసేనలో గుబులు మొదలైంది. ఏపీలో కాపుల ఓట్లను కన్సాలిడేట్ చేసే పనిలో పూర్తిగా తలమునకలైన జనసేన ముఖ్యనేతలకు జీవీఎల్ తాజా డిమాండ్ ఇరుకునపెట్టినట్లయింది. పవన్ కల్యాణ్ 2014 నాటి తన తటస్ఠ వైఖరిని వీడి కాపులను ఓన్ చేసుకునే దిశగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సమకాలీన …

Read More »

అన్నా రాజ‌కీయం యూట‌ర్న్‌.. ఏం జ‌రిగింది…?

అన్నా రాంబాబు. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే అగ్ర‌వ‌ర్ణ నేత కూడా! అయితే.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న మంచి వాడే అయినా.. నోరు కుద‌ర‌ద‌నే టాక్ ఉంది. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేయ‌డం..వివాదాల్లోకి త‌న‌ను తానే నెట్టేసుకోవ‌డం.. అన్నాకు వెన్న‌తో పెట్టిన విద్య. అందుకే ఆయ‌న ఏ పార్టీలోనూ ఇమ‌డ‌లేక …

Read More »

టైమ్‌కే ఎలక్షన్ అంటున్న జగన్

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు 14 నెలలే ఉందని, గడప గడపకు కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాలని ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు ఆయన హితబోధ చేశారు. కార్యక్రమాన్ని ఆషామాషీగా నిర్వహిస్తే ఊరుకోబోనని కుండబద్దలు కొట్టారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనని కొందరు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తిరగని వారు, తక్కువ రోజులు …

Read More »

కళా వెంకట్రావుకు ఉత్తరాంధ్ర బాధ్యతలు ?

kala Venkat rao

బీసీలు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కాకలు తీరిన రాజకీయ యోధుడు కళా వెంకట్రావుకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం అందుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు తన పని చేసుకుపోతుండగా ఆయన్ను డిస్టర్బ్ చేయకుండా కొన్ని పనులను కళా వెంకట్రావుకు అప్పగించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ ఇప్పుడు సామాజికవర్గం లెక్కలు చూస్తోంది. కాపు వర్గాలను పూర్తిగా తమ …

Read More »

ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడా ?

శ్రీలంకలో తమిళుల కోసం 1980లలో ఏర్పడిన మిలిటెంట్ సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ). తమిళనాడులో తమిళ వీరాభిమానులంతా ఎల్టీటీఈకి మద్దతిచ్చేవారు. 1991 ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎల్టీటీఈ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినా తమిళ అభిమానులు మాత్రం ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతిస్తూనే ఉన్నారు.. ఇప్పుడు నెడుమారన్.. తమిళనాడులో నెడుమారన్ అనే నాయకుడు ఉన్నారు.తొలినాళ్లలో ఆయన కాంగ్రెస్ లో …

Read More »

స‌జ్జ‌ల కుమారుడి డామినేష‌న్ కూడా పెరిగిపోయిందా…!

ఏపీ అధికార పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న ప్ర‌భుత్వ స‌ల‌హాదారు విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రు లు తీవ్ర అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే. ఒక‌రిద్ద‌రు అయితే బాహాటంగానే ఈ విష‌యాన్ని చెప్పు కొచ్చారు. త‌మ‌కు ఎలాంటి స్వేచ్ఛ లేద‌ని.. తాము ఏం చేయాల‌న్నా.. కాళ్లు చేతులు క‌ట్టేసిన‌ట్టు ఉంటోం ద‌ని కూడా వారు వాపోయారు. దీనికి కార‌ణం.. స‌ల‌హాదారు స‌జ్జ‌లేన‌న్న ఎమ్మెల్యేల అభిప్రాయం. ఇటీవ‌ల ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు …

Read More »

వైసీపీలో చేరిన కైకలూరు టీడీపీ అభ్యర్థి

టీడీపీ పుంజుకొంటోందని ఆ పార్టీ నేతలంతా బలంగా నమ్ముతున్న సమయంలో కీలక నేత ఒకరు ఆ పార్టీని వీడడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ పదవి హామీ కైకలూరు టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. టీడీపీలో తనకు టికెట్ రాదేమోనన్న అనుమానంతో ఉన్న ఆయనకు వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో వెంటనే పార్టీ ఫిరాయించినట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేత నారా లోకేశ్ …

Read More »

రాజ్య‌స‌భ‌లో రంగా పేరు.. జీవీఎల్ ఏమ‌న్నారంటే!

ఇదొక అనూహ్య ప‌రిణామం. ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం పేరు కూడా ఎత్తని నాయ‌కుడి గురించి.. ఏకంగా బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌రసింహారావు.. ఏకంగా రాజ్య‌స‌భ‌లోనే దివంగ‌త వంగ‌వీటి మోహ‌న రంగా గురించి సుమారు 4 నిమిషాల పాటు మాట్లాడారు. ఏక‌ధాటిగా ఆయ‌న చేసిన ప్ర‌సంగం ఆద్యంతం ఆస‌క్తిగా ఉండ‌డంతోపాటు.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి కూడా గురి చేసింది. ఇంత‌కీ.. జీవీఎల్ ఏమ‌న్నారంటే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా-మచిలీపట్నం …

Read More »

కైక‌లూరు టీడీపీలో కుంప‌టి.. కీల‌క నేత జంప్?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం పోరాడుతున్న టీడీపీకి పంటి కింద రాళ్ల మాదిరిగా ప‌రిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 175 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని.. నాయ‌కులు చెబుతున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని క్లూ ఇస్తున్నారు. దీంతో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే.. త‌మ‌కు ఎక్క‌డ పోటీకి అవ‌కాశం లేకుండా పోతుంద‌న‌ని భావిస్తున్న టీడీపీ నేత‌లు త‌మ …

Read More »

మోడీ గెలిచారు.. ప్ర‌జ‌లు ఓడారు.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే చాలు.. మండిప‌డుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, అవ‌కాశం ద‌క్కితే చాలు విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్‌.. మోడీపై విరుచుకుప‌డ్డారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్‌.. ప్ర‌తి విష‌యంలోనూ మోడీని టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల్లో కీల‌క‌మైనవి చూస్తే.. మోడీ గెలిచారు.. కానీ, ప్ర‌జ‌లు ఓడారు.. అనే కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. …

Read More »