Political News

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తుకు, నవ భారతావనికి సరికొత్త వారసులు యువతేనని అన్నారు. 10 రోజులుగా జరుగుతున్న ఘటనలు తీవ్రంగా బాధించాయని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి …

Read More »

సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసే వరకు దారితీసింది. విద్యార్థి లోకం, విపక్షాల నుంచి వెల్లువెత్తిన తీవ్ర నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఆయన శనివారం తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రికి సమర్పించారు. పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని …

Read More »

మోడీకి క‌ళ్లు చెదిరేలా స్వాగ‌త ఏర్పాట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో వారంలో ఏపీకి రానున్నారు. ఆగ‌స్టు 1వ తేదీన ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురానికి రానున్నారు. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ విమానాశ్ర‌యం నిర్మాణం 99 శాతం పూర్త‌యింది. దీనిని గ‌త నెల‌లోనే ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ప్ర‌ధాని అప్పాయింట్‌మెంటు ల‌భించ‌క‌పోవ‌డంతో దీనిని ఆగ‌స్టు 1కి వాయిదా వేశారు. ఇక‌, ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో …

Read More »

రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ వీడియో రాజకీయంగా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తనపై వచ్చిన విమర్శలను, వ్యతిరేకతను ప్రజలతో నేరుగా మాట్లాడే అవకాశంగా మలుచుకున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి, వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే అది భారీ స్పందనను రాబట్టింది. తనపై విసిరిన రాళ్లను మెట్లుగా మార్చుకోవడం అంటే.ఇదేనేమో? గురువారం అర్థరాత్రి …

Read More »

ష‌ర్మిల ఎక్క‌డున్నారు… ఫోన్ స్విచ్ఛాఫ్‌!?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? అనే విష‌యాలు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టిన విద్యార్థుల ఆందోళ‌న‌ల‌కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాల్లోనూ నిర‌స‌న‌లు చేప‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ బంగ‌ళాల‌ను(లోక్‌భ‌వ‌న్‌) ముట్టడించే కార్యక్ర‌మాలు చేప‌ట్టారు. త‌మిళ‌నాడు, తెలంగాణ, క‌ర్ణాట‌క స‌హా.. అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉద్య‌మించింది. మ‌రి …

Read More »

మోడీ పై ఆర్ ఎస్ ఎస్ గుస్సా…?

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి.. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా జ‌రుగుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌పై ఆర్ ఎస్ ఎస్ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్ ఎస్ ఎస్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి.. విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా స్పందించ‌డంతో ఈ వ్య‌వ‌హారం బీజేపీలోనూ తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి.. బీజేపీ విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల వెనుక ఆర్ …

Read More »

అన్ని దారులు `ధ‌ర్మేంద్ర` వైపే..!

కేంద్ర ప్ర‌భుత్వం ఎన్ని రూపాల్లో ప్ర‌య‌త్నించినా.. విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక‌పోతోంది. ఇప్ప‌టికే బ‌ల ప్ర‌యోగం చేయ‌డంతో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. ప్ర‌పంచ దేశాలు ఏ స‌మ‌స్య వ‌చ్చినా చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం చూడాల‌ని హిత‌వు ప‌లికే ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంలో ఏం చేస్తార‌న్న అంశంపై ప్ర‌పంచ దేశాలు కూడా ఆస‌క్తిగా ఎదురు చూశాయి. ఈ క్ర‌మంలో అతిక‌ష్టం మీద కేంద్ర ప్ర‌భుత్వం విద్యార్థి నేత‌ల‌తో చ‌ర్చ‌ల‌కు …

Read More »

36 వేల దరఖాస్తులు… పవన్‌కు పెద్ద టాస్కే!

ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఇది పెద్ద పరీక్షే. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక ముందడుగు వేస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాల్ 36 వేలకుపైగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనే. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కమిటీల్లో వివిధ స్థాయిల్లో బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన జనసైనికులు, వీరమహిళలు, నాయకుల నుంచి అందిన దరఖాస్తుల పరిశీలన, ఎంపిక ప్రక్రియను పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ …

Read More »

కోమటి బ్రదర్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత అధికార పార్టీలో ఈ తరహా విభేదాలు చాలా సార్లే కనిపించినా… తాజా వివాదం మాత్రం ఓ రేంజికి ఎగసిందని చెప్పాలి. అంతేకాకుండా గతంలో మాదిరిగా కాకుండా… ఈ దఫా ఎగసిన వివాదం బహిరంగంగా పెచ్చరిల్లింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి …

Read More »

వివేకా హ‌త్య‌… సునీత గోడు అర‌ణ్య రోద‌న‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్ బాబాయి, మాజీ మంత్రి వివేకా నంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి ఆయ‌న కుమార్తె, డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు కొట్టివేసింది. “ఇంకా సాగ‌దీయ‌డం స‌రికాదు. ఇక చాలు.“ అని కోర్టు వ్యాఖ్యానించిన‌ట్టు సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు. అయితే.. త‌న తండ్రి హ‌త్య‌కు సంబంధించి న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న పోరు ఆగ‌ద‌ని సునీత స్ప‌ష్టం చేశారు. ఈ …

Read More »

తూచ్.. మల్లారెడ్డి పార్టీ మారట్లేదు!

పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇటీవలి కాలంలో విమర్శల సుడిలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న మల్లారెడ్డి త్వరలోనే పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారంపై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే వస్తున్న మల్లారెడ్డి… తాజాగా శుక్రవారం కూడా అదే తరహా కౌంటర్ తో మీడియా ముందుకు వచ్చారు. ఎప్పటిమాదిరిగానే… ఈసారి …

Read More »

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్ ఇండియా కావాల‌ని కోరుకుంటే.. మోడీ మాత్రం లీకిన్‌ ఇండియాను ఇచ్చార‌ని వ్యాఖ్యానించారు. గ‌త 25 రోజులుగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థుల‌కు తాము ఆది నుంచి అండ‌గా ఉన్నామ‌ని.. కానీ, కొంద‌రు ఈ విష‌యాన్ని గ‌మ‌నించ‌లేక త‌మ‌పై నింద‌లు వేస్తున్నార‌ని.. ప‌రోక్షంగా సీఎం రేవంత్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. …

Read More »