దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఇటీవల వై.ఎస్. షర్మిల చేసిన ఘాటు వ్యాఖ్యల అనంతరం ఈ వ్యవహారం మరింత రాజకీయ, కుటుంబ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ విజయమ్మ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ విజయమ్మ స్పష్టంచేసిన ప్రకారం., 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు కుటుంబ ఆస్తుల పంపకం …
Read More »జగన్ జగ్రత్త… అపరిచిత ఐఏఎస్ లేఖ?
వైసీపీ అధినేత జగన్కు కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ.. ఓ అపరిచిత ఐఏఎస్ లేఖ రాసినట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. సదరు ఐఏఎస్ అధికారి ఎవరు? అనే విషయాన్ని మాత్రం గోప్యం ఉంచారు. వాస్తవానికి ఆ ఐఏఎస్ అదికారి కూడా తన పేరును వెల్లడించకుండానే.. ఈ లేఖ రాసినట్టు చెబుతున్నారు. గత వైసీపీ హయాంలో కీలక పోస్టులో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారే ఈ లేఖ …
Read More »మంత్రులు కావాలనుకున్నోళ్లు…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు కావాలని..సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో పనిచేయాలని చాలా మంది తలపోశారు. గత ఏడాది జరిగిన మంత్రి వర్గ ప్రక్షాళనలో చాలా మంది తమకు సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారికి ఆశలు ఫలించలేదు. కేవలం ముగ్గురిని మాత్రమే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ కూడా ఉన్నారు. అయితే..అప్పట్లో మంత్రులు కావాలని అనుకున్నవారికి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.. `విప్` …
Read More »“జగన్ నీకు ఏం అన్యాయం చేశాడు షర్మిలమ్మా?”
వైయస్ షర్మిల ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ, “జగన్ నీకు ఏం అన్యాయం చేశాడో చెప్పమ్మా?” అంటూ ప్రశ్నించారు. ఇటీవల షర్మిల మాట్లాడుతూ, “అన్న అనే పదానికే కళంకం తీసుకొచ్చింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఇలాంటి అన్న ఉంటే శత్రువులు అవసరం లేదు” అని …
Read More »ఇందుమూలముగా.. బీజేపీ సుజనా రూటే సెపరేటట.. !
బిజెపి తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి విజయం దక్కించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రముఖ వ్యాపారవేత్త సుజనా చౌదరి తన రూటు సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇరకాటంలో పెడుతున్నాయి. సహజంగా ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని కొన్ని పరిణామాలపై మూడు పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. సమస్య ఎవరిదైనా అందరూ …
Read More »పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు స్పష్టత ఇచ్చారు. తన కుమారుడు దేవాంశ్ నారా చిన్ననాటి భక్తిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు. పూజ గదిలో కనిపిస్తున్నవి శివుడు బొమ్మతో పాటు ఒక చిన్న శివలింగమని తెలిపారు. అవి తన కుమారుడు దేవాంశ్ నారా కేవలం నాలుగేళ్ల వయసులో స్వయంగా తయారు చేసినవని …
Read More »హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం.. ఆనక… పార్టీ నాయకులకు దారి తప్పుతున్న వారిని సరిదిద్దే బాధ్యతలు అప్పగించడం వరకు టీడీపీ అధినేత,. సీఎం చంద్రబాబు పరిమితం అవుతున్నారు. తీవ్రమైన ఆరోపణలు వచ్చిన వారిపై కూడా.. ఇప్పటి వరకు కఠినంగా ఒక్క చర్చ కూడా తీసుకోలేదు. పైగా.. వారిని హెచ్చరిస్తున్నాం.. అని చెబుతూ.. సరిపెట్టుకుంటున్నారు. ఇది …
Read More »పెద్దిరెడ్డీ అనుచరుల అరెస్టు.. ఏం జరిగింది?
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక అనుచరులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన ముని తుకారాం, మరో కీలక అనుచరుడు మాధవరెడ్డిని తిరుపతి జిల్లా మదనపల్లెలో అరెస్టు చేశారు. అనంతరం వారిని విజయవాడకు తరలించారు. ఏంటి కేసు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలై …
Read More »వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం కాదు. ఉగాది సందర్భంగా పంచాగ కర్త చెప్పిన మాటలివి. ఉగాది వేడుకలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు పండితులు, సిద్దాంతులతో పంచాంగ శ్రవణం చదివించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. భాస్కరభట్ల …
Read More »బ్యాలెట్ పేపరుపై ఒకే పేరు.. ఒకే అభ్యర్థి.. 99.93 శాతం ఓటింగ్!
ఇదేదో చిత్రంగా ఉంది కదా! అనుకుంటున్నారా? కానీ నిజమే. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కనీసం ఒక స్థానానికి ఇద్దరైనా పోటీ చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఒకే అభ్యర్థి, ఒకే పేరు. ఓటు వేసేది మాత్రం ప్రజలు. చేసేది ఏముంది.. అదే పేరుకే, అదే నాయకుడికే ఓటేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఉత్తర కొరియా పరిస్థితి. ఉత్తర కొరియా అంటేనే నియంత పాలన గుర్తుకు వస్తుంది. …
Read More »కవిత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన పార్టీ పేరును `తెలంగాణ ప్రజా జాగృతి`గా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పార్టీ పేరును నిర్ణయించారని.. ఈ మేరకు ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే.. ప్రస్తుతం ఉన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం …
Read More »పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో బాలినేని పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఒంగోలు జనసేనలో చక్రం తిప్పాలనుకున్న బాలినేనికి పవన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. తన వైరివర్గం అయిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ కు చెక్ పెట్టాలని భావించిన బాలినేనికి చుక్కెదురైంది. దీంతో, జనసేనలో బాలినేని ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates