టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అన్నీ గుర్తుంచుకున్నా. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు“ అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా శుక్రవారం రాజమండ్రిలో పర్యటించిన లోకేష్.. స్థానిక పార్టీ కేడర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ హయాంలో పడిన ఇబ్బందులను.. అవమానాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. …
Read More »జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న మహిళానాయకురాలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.. సుంకర పద్మశ్రీ.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆమెకు జనసేన నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెబుతున్నారు. వాస్తవానికి ఆది నుంచి కూడా …
Read More »ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ రావు… దేనికో తెలుసా?
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు వెళ్లిన ఆయన స్వయంగా తన ఇంటి పత్రాలను వారికి ఇచ్చి.. సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం.. 20 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే.. ఆయన గతంలోనూ మంత్రిగా పనిచేసి ఉండడం.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంత పెద్ద మొత్తం అప్పు చేయాల్సిన అవసరం …
Read More »నిన్న బాబు – నేడు పవన్!!
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ సూత్రం తెలుసుకున్న నేత సీఎం చంద్రబాబు నాయుడు. 23 స్థానాలు గెలిచినప్పుడైనా, 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నప్పుడైనా ఆయన అదే పంథాను అనుసరిస్తున్నారు. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని, వారితో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తుంటారు. వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. అదే బాటలో జనసేన పార్టీ అధినేత పవన్ …
Read More »పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిఫార్సుతో ఈ నిధులు కేటాయించబడినట్లు దేవాదాయ వర్గాలు వెల్లడించాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనప్రాయంగా వెల్లడించారు. …
Read More »గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. మరోవైపు ప్రజా వేదికలో జనంతో మమేకమవుతుంటారు. కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇస్తుంటారు. చివరికి మారుమూల గల్లీలో ప్రజలకు సమస్య ఏర్పడినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు. పాలనలో మంత్రి లోకేష్ సరికొత్త పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో ఓ గల్లీలో ప్రజలకు …
Read More »రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిని ఏం చేయాలన్న అంశంపై కొన్నాళ్లుగా ప్రభుత్వం అంతర్మథనం చెందుతోంది. ఈ క్రమంలో మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత రెండు మాసాలుగా అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో ప్రజల నుంచి మేధావుల దాకా అందరి అభిప్రాయాలు …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై చంద్రబాబు రివ్యూ
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. శుక్రవారం ఉదయమే పార్టీ నాయకులతో ఆయన టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. తాజాగా తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ సాధించిన విజయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో అదే ఫలితం ఏపీలోనూ రావాలని సూచించారు. టిడిపి శ్రేణులు… నాయకులు ప్రజలకు చేరువ కావాలన్నారు. పార్టీ కార్యక్రమాలు.. …
Read More »అభివృద్ధికి ఆటంకాలు ఎందుకు జగన్?
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలని కుయుక్తులు పన్నుతోందంటూ టీడీపీ నేతలు అంటున్నారు. వారి వాదనలకు బలాన్ని చేకూర్చేలా విశాఖపట్నంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం రహేజా కార్ప్కు కేటాయించిన భూములపై ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అధ్యక్షుడు జి. శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు …
Read More »ఎన్టీఆర్ అభిమాని పాడే మోసిన నందమూరి తనయులు
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణలు గురువారం తిరుపతిలో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి, అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసారు. నందమూరి కుటుంబం తరపున రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, ఎన్టీఆర్ రాజు నందమూరి వీరాభిమానిగా ఎనలేని సేవలు చేశారని, రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా …
Read More »విదేశీ యూనివర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డు లభించడం పట్ల ఏపీలోని టీడీపీ నాయకులు, శ్రేణులు, ప్రభుత్వ వర్గాలు, మంత్రులు.. అధికారులు సైతం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇక, నారా వారి కుటుంబం అయితే.. సంతోషంలో మునిగి తేలుతోంది. మంత్రి లోకేష్ నుంచి ఆయన సతీమణి, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, సతీమణి …
Read More »బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు అని శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, యుద్ధం జరగకపోయినా సరే, అక్కడ మన ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టింది. అప్పట్లో సమస్య ఒక కొత్త దేశం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates