వైసీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్..ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ఆఫీసుపై 2021లో జరిగిన దాడి నేపథ్యంలో నమోదైన కేసులో ఆయన తొలుత అరెస్టు అయ్యారు. 14 రోజుల పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ వచ్చింది. కానీ, ఇంతలోనే.. అమరావతిలోని వెంకట పాలెంలో ఉన్న ఎస్సీ కాలనీలో మరియమ్మ …
Read More »1996 నాటి చంద్రబాబును చూస్తున్నా: రామ్మోహన్ నాయుడు
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో అమరావతి డ్రోన్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా డ్రోన్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అమరావతి, మంగళగిరి, విజయవాడలో 2 రోజులపాటు జాతీయ స్థాయిలో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై రామ్మోహన్ …
Read More »డ్రోన్లు.. రౌడీ షీటర్లకు చంద్రబాబు వార్నింగ్
రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అమరావతిలో డ్రోన్ సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డ్రోన్ సమ్మిట్ ఏపీలో ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్-2024’ ను ఏపీ సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత సదస్సులో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. …
Read More »ఏపీ-తెలంగాణ.. తిరుమల లొల్లి!
ఏపీ.. తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన హామీల వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిని తేల్చుకునేందుకు ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఇవి నేరుగా ఇరు రాష్ట్రాల ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలు ఇరు రాష్ట్రాల్లోనూ తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య తిరుమల వ్యవహారం లొల్లిగా మారే ప్రమాదం ఏర్పడింది. తాజాగా తెలంగాణకు చెందిన జడ్చర్ల …
Read More »బడ్జెట్పై బాబు వ్యూహం.. ఈ సారికి ఉందా.. లేదా..?
ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ ప్రభుత్వాలు తమకు వచ్చే ఆదాయాన్ని, చేసే వ్యయాన్ని కూడా ప్రజలకు వివరించాలి. అసెంబ్లీలో ప్రకటించి ఆమేరకు చేయాలి. ఇది దేశవ్యాప్తంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా చేసే పనే. అయితే.. ఏపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎన్నికలు జరగడంతో ఓటాన్ అకౌంట్(4 మాసాలకు) వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇది కొనసాగింది. జూన్లో …
Read More »సజ్జల అరెస్టు… డేట్ ఫిక్స్ అయిందా..?
వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం ఖాయమైనట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబంధించి కొంత తటపటాయింపు అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన 120వ నిందితుడిగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం విచారణ దశలోనే ఆయనను ఉంచారు. అయితే.. దీనికంటే బలమైన కేసు కోసం అన్వేషణ సాగుతున్నట్టు …
Read More »అవినాష్ కోసం.. అన్నీ వదులుకుంటున్నారా?
నిత్యం నిప్పులు చెరుగుతూ.. తన కంటిపైకునుకు లేకుండా చేస్తున్న సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల విషయంలో జగన్ నాలుగు కాదు..నలభై అడుగులు వెనక్కి వేస్తున్నారన్న విషయం తెరమీదికి వచ్చింది. ఆమెకు ఆస్తుల్లో పంపకాలను.. చేసేయాలని, ఆమె కోరుకున్న విధంగానే ఇచ్చేయాలని జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన బెంగళూరు వేదికగా సెటిల్మెంట్ కూడా జరిగిపోయిందని అంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు.. జగన్ మొండిగా ఉన్న ఈ విషయంలో …
Read More »ఇదే నిజమైతే.. షర్మిల ఫేడ్ అవుట్!!
అన్నా చెల్లెళ్లు కలిసి పోయారని.. ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటున్నారని.. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంలో వస్తున్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.తరచుగా బెంగళూరుకు వెళ్తున్న జగన్.. ఈ విషయంపై ఎక్కువగానే దృష్టి పెట్టినట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆస్తుల వివాదం సమసిపోయే దశకు చేరుకుందని అంటున్నారు. ఇక, షర్మిల వ్యవహార శైలి కూడా గత …
Read More »2 గంటలు 21కి.మీ.: దేశంలోనే టాప్ ఫిట్ నెస్ సీఎం ఆయనే!
అవును.. రెండే రెండు గంటల్లో 21 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తటం కొందరు క్రీడాకారులకు.. మారథాన్ లో పాల్గొనే వారికి పెద్ద విషయం కాదు. కానీ.. తీరిక లేని రాజకీయాల్లో తలమునకలయ్యే రాజకీయ అధినేతలు.. రాష్ట్రానికి అన్నీ తామై అన్నట్లు వ్యవహరించే ముఖ్యమంత్రికి ఇదే మాత్రం సులువు కాదనే చెప్పాలి.అయితే.. ఆ భావన తప్పన్న విషయాన్ని చేతల్లో చేసి చూపించారు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. తాజాగా తమ రాష్ట్రంలో జరిగిన …
Read More »వైసీపీకి భారీ షాక్: అస్త్ర సన్యాసంలో నలుగురు ఉద్ధండులు
ఏపీ ప్రతిపక్షం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా కాదు.. మూకుమ్మడిగానే ఆ పార్టీని వదిలేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయ భాను వంటి ఆది నుంచి వైసీపీతో కలిసి నడిచిన నాయకులు పార్టీ మారిపోయారు. ఇక, మధ్యలో వచ్చి.. మధ్యలోనే వెళ్లిపోయిన నాయకులకు లెక్కేలేదు. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక, ఇప్పుడు నలుగురు ఉద్ధండ …
Read More »జగన్ వర్సెస్ లోకేష్: లా అండ్ ఆర్డర్ రాజకీయం!
ఏపీలో ‘లా అండ్ ఆర్డర్’పై తాజాగా రాజకీయ దుమారం రేగింది. తాజాగా శనివారం.. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఇంటర్ చదువుతున్న ఓ బాలిక(15ఏళ్లు)ను అదే జిల్లా, ఆ బాలిక సొంత పట్టణానికే చెందిన విఘ్నేష్(21) అనే వివాహితుడు వేధించాడు. అంతేకాదు.. ప్రేమ పేరుతో ఉన్మాదిలా వ్యవహరించి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 10 గంటల పాటు అల్లాడిపోయిన బాలిక.. చివరకు ప్రాణాలు …
Read More »విచారణకు రండి.. : దువ్వాడకు తిరుపతి పోలీసుల పిలుపు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రేమికురాలు, సహచరి దివ్వెల మాధురికి తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని వారు కోరారు. ఈ నెల 21-23 మధ్య విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి నుంచి ప్రత్యేకంగా శ్రీకాకుళానికి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన పోలీసు బృందం వీరికి వేర్వేరుగా ’41 ఏ’ నోటీసులు ఇచ్చారు. వీటిని వారు తీసుకున్నట్టు …
Read More »