ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ దిశగా ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం… స్థానిక పోరుకు సెప్టెంబరు నెలను ఎంపిక చేసినట్టుగా విశ్వసనీయ సమాచారం. గ్రామ పంచయతీల నుంచి నగర పాలక సంస్థల దాకా వరుసబెట్టి… అన్ని స్థాయిల స్థానిక సంస్థల ఎన్నికలను …
Read More »వైసీపీకీ ఓ ‘సూపర్ యాప్’ వచ్చేసింది!
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉండటం, ఆయా అంశాలపై కీలక నిర్ణయాలను కేడర్ తో పంచుకోవడం వంటి పలు కీలక పనులను సులభతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఏపీలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ సూపర్ యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ను పార్టీ అధినేత వైఎస్ …
Read More »కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో తొట్టతొలి హైడ్రోజన్ రైలు సాకారం!. 2004-14 మధ్య అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హైడ్రోజన్ రైలును తీసుకురావాలని ప్రణాళికలు చేసింది. కానీ, సాకారం కాలేదు. ఆ తర్వాత పగ్గాలుచేపట్టిన మోడీ.. కేవలం 5 సంవత్సరాల్లోనే హైడ్రోజన్ రైలు సాకారానికి నడుంబిగించారు. తాజాగా ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం …
Read More »ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలిచిన ముద్రగడ… రెండు పర్యాయాలు మంత్రిగా కూడా కొనసాగారు. అనారోగ్యంతో ముద్రగడ మరణించారు గానీ… ఇంకొంతకాలం ఆయన బతికి ఉంటే గవర్నర్ పదవిని కూడా చేపట్టేవారే. నిజమా? అంటే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారట. …
Read More »డ్రగ్స్ కోసం ఎగబడ్డ ఎమ్మెల్సీ కొడుకు… పట్టేసుకున్న పోలీసులు
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక రూపంలో డ్రగ్స్సరఫరా జరుగుతూనే ఉంది. అయితే.. ఈ డ్రగ్స్ కోసం.. ప్రజా ప్రతినిధుల కుటుంబాల్లోని వ్యక్తులు వస్తుండడం.. అర్ధరాత్రి, అపరాత్ర తేడా లేకుండా ఎగబడుతుండడం వంటివి అత్యంత దారుణంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, వారి సన్నిహితులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి …
Read More »హమ్మయ్య… ఎట్టకేలకు కదిలిన కమలనాథులు!
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవీ.. అని చెప్పిన పాపాన పోలేదు. అంతేకాదు..అత్యంత క్లిష్టమైన అంశాలైన తిరుమల శ్రీవారి లడ్డూ నుంచి డిప్యూటీ సీఎం పవన్పై తీవ్ర దుర్భాషల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పుడు కూడా బీజేపీ నోరు విప్పలేదు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రెండు సార్లు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి.. …
Read More »ఆంధ్రా సర్ ఆర్ధర్ ‘కాటన్’ చంద్రబాబు!
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్ గా ఇది జరిగే పని కాదు అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. అయితే, పట్టుదల ఉంటే దేనినైనా సాధించగలం అని నమ్మే చంద్రబాబు మాత్రం అటువంటి విమర్శలను పట్టించుకోకుండా తన లక్ష్యం కోసం అహర్నిశలు పాటుబడుతుంటారు. గోదావరి మరియు కృష్ణా నదుల అనుసంధానం లక్ష్యంగా డిజైన్ చేసిన …
Read More »ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు మరోసారి పాదయాత్రలను ప్రధాన రాజకీయ ఆయుధంగా ఎంచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు రెండేళ్ల ముందు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతానని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. దీంతో …
Read More »పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. “షాబాద్ ఘటన దారుణం“ అని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలపై గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హెచ్చరించిందని తెలిపారు. కానీ, పోలీసులు నామమాత్రంగానే స్పందిస్తున్నారని పేర్కొన్నారు. దీని ఫలితంగానే దారుణాలు చోటు చేసుకున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఇటీవల వరుసగా ఆరుగురిని ఓ వ్యక్తి కత్తితో …
Read More »ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా చెబుతుంటారు. పవన్ తన సొంత డబ్బులతో పార్టీని నడిపిస్తూ తన ఆస్తులు అమ్ముకున్న వైనంపై కూడా చర్చ జరిగింది. ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు అనేది ఎవరిని అడిగినా చెప్పే మాట. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ప్రజాధనాన్ని తన సొంత దుర్వినియోగం చేయకుండా ఉన్న వైనంపై …
Read More »ముద్రగడ పాడె మోసిన జగన్
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే ఉత్తరం మూలన ఈ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ అదినేత, మాజీ సీఎం జగన్.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తొలుత నివాళులర్పించిన ఆయన.. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముద్రగడ ఆశయాలను నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నం కూడా …
Read More »బాబు సర్కారును పొగిడిన కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం క్షీణించడంతో కృష్ణా డెల్టా సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల జలాశయంలో ఉన్న 32 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates