ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పిఠాపురంలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొంటారు. శుక్రవారం ఉదయం స్థానిక ఓ కాలేజీలో సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారు. అనంతరం.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. అదేవిధంగా పలు …
Read More »`పీపీపీ`కి కేంద్రం అండ… బాబుకు భరోసా… !
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే కృష్ణా నదిపై రిసార్టుల ఏర్పాటు తేలియాడే పర్యాటక బోట్ల ఏర్పాటు విషయాన్ని ఆయన సీరియస్గా పరిశీలిస్తున్నారు. అయితే పిపిపి విధానంలో అంతా ప్రైవేటుకు అప్పజెప్పేస్తున్నారని దీనిలో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండదని చెబుతూ ప్రతిపక్షం వైసిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. నిరసన నిర్వహిస్తోంది. …
Read More »మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది. అయితే ఈ సర్వే క్షేత్రస్థాయిలో నిర్వహించిందికాదు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా మాత్రమే వారి ఆస్తులను అంచనా వేసి నివేదికను విడుదల చేస్తుంది. ఈ నివేదికలో తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీలు భారీ స్థాయిలో ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొనడం చర్చకు దారి …
Read More »తిరుమలపై ఎందుకీ పగ..?
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చి, అనేక కష్టాలు భరిస్తూ శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి పవిత్ర ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ రాజకీయాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ పాలన సమయంలో కల్తీ నెయ్యి, పరాకామణి దొంగతనం వంటి ఘటనలు జరిగాయని ఇప్పటికే ఆరోపణలు …
Read More »ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్ పేజీపై నిలిచారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల సృష్టికి కేంద్రబిందువుగా మారిన లోకేష్ను మ్యాగజైన్ ‘చీఫ్ జాబ్ క్రియేటర్’గా అభివర్ణించింది. స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో శిక్షణ పొందిన నారా లోకేష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ను కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా వేగవంతమైన …
Read More »భారత్పై ట్రంప్ సెగ… 50 కాదు… 500 శాతం?
భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తికట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతృప్తి పరచడం లేదని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్న ట్రంప్.. ఈ క్రమంలో మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా భారత్ను.. ముఖ్యంగా విశ్వగురువుగా పేరు తెచ్చుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన ఆత్మరక్షణలో పడేస్తున్నారు. తాజాగా.. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య మూడేళ్లుగా యుద్ధం సాగుతోంది. దీనిని నిలువరించి.. శాంతి దూతగా పేరు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకం ఎలా?
సభకు రాలేదు.. కానీ సంతకాలు మాత్రం ఉన్నాయి.. అదెలా..? ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల తీరు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కొందరు సభ్యులు సభకు వచ్చినట్లుగా హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసి, సమావేశాల్లో పాల్గొనకుండా తిరిగి వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టికి వెళ్లడంతో, …
Read More »సీమ సెంటిమెంటు… ఏ పార్టీకి సొంతం..!
రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇద్దరూ సీమ సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కానీ సీమ సమస్యలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు… అనేక ప్రాజెక్టులు మూలనపడ్డాయి. గాలేరు నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు నీరు …
Read More »‘తెలంగాణ ప్రాజెక్టులకు టీడీపీ అడ్డు చెప్పలేదు’
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల రాజకీయాలు వద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రెండురాష్ట్రాలకూ నీటి సమస్యలు ఉన్నాయని.. అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా సాగుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో అనవసర రాజకీ యాలు చేసుకుని.. ప్రజలను కన్య్ఫూజ్ చేయొద్దని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. అనంతరం.. మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు.. దరిమిలా రాజకీయంగా పలు …
Read More »ఇరు పార్టీలకు ప్రవీణ్ ప్రకాష్ ఒక రిక్వెస్ట్
ఏపీ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఒక రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఒక్క తప్పు కారణంగా తాను హీరో నుంచి విలన్గా మారిపోయానని ఆయన గతంలో పేర్కొన్నారు. తప్పు చేశానన్న భావనతోనే వాలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసినట్లు ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. తాజాగా సోషల్ …
Read More »ఏపీలో రోడ్ల నిర్మాణంలో గిన్నిస్ రికార్డ్
నేషనల్ హైవే నిర్మాణంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులకు రాష్ట్రం వేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. బెంగళూరు -కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్లను కలిపే 28.95కి.మీ రహదారిని 24గంటల్లోనే నిర్మించారని తెలిపారు. దీనికోసం 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వాడకం మరో రికార్డు అన్నారు. భారత ప్రభుత్వ, కేంద్ర మంత్రి గడ్కరీ విజన్, ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ టీమ్స్ నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. బెంగళూరు–కడప–విజయవాడ …
Read More »కలలో కూడా ఊహించని కాంగ్రెస్ – బీజేపీ పొత్తు
ఔను.. మీరు చదివింది నిజమే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజకీయాలు.. ఒకరిపై ఒకరు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు.. చేతులు కలిపాయంటే ఆశ్చర్యం వేస్తుంది. అంతేకాదు.. ఒకపార్టీపై మరోపార్టీ నిరంతరం విమర్శలు చేసుకునే బీజేపీ-కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయంటే.. కలలో కూడా ఊహించలేం. కానీ.. రాజకీయ అవసరాలు.. ఈ రెండు.. పార్టీలను కలపడం విశేషం. అయితే.. ఇదేదో రాష్ట్రస్థాయి ఎన్నిక కోసం కాదు!. కేవలం మేయర్ సీటు కోసమే!. అయినా.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates