తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలకు మధ్య పలు కేసుల విచారణకు సంబంధించి రాజకీయం జోరుగా సాగుతోంది. బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హయాంలో జరిగిన.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారిందని..దీనిని సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కానీ, దీనిపై ఇప్పటి వరకు అతీ గతీ లేదని, కేసీఆర్ను కాపాడుతున్నారని సీఎం …
Read More »అంటే.. ఇక వైసీపీని అలా పిలవచ్చా!!
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు పెద్దగా కౌంటర్లు ఇవ్వలేకపోయారు. కానీ, తాజాగా పెరుగుతున్న యాక్టివిటీతో మాటల మంటలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ అధినేత నుంచి దిగువస్థాయి నాయకుల వరకు వైసీపీని గొడ్డలి పార్టీ అని సంభోదిస్తున్నారు. దీనిని సమర్థించుకుంటున్నారు. అయితే.. వాస్తవానికి గొడ్డలి పార్టీ అనే పదం కొంత …
Read More »ఇక… జాతీయ జనసేన?
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అనుకున్నట్టుగానే వైసీపి ప్రభుత్వాన్ని దింపేందుకు కూటమిగా ఏర్పడి.. ఎన్నికల్లో కలివిడిగా వ్యవహరించి విజయం దక్కించుకున్నారు. వచ్చే 15 సంవత్సరాల పాటు.. ఆయన కూటమిదే అధికారం అని కూడా తరచుగా చెబుతున్నారు. ఇవన్నీ.. ఎందుకు గుర్తుచేయాల్సి వస్తోందంటే.. పట్టుదలకు.. కృషికి.. పవన్ నిలువెత్తు నిదర్శనం …
Read More »వైసీపీ ఫేస్బుక్ బ్లాక్… సర్కారుపై జగన్ ఫైర్
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్.. ఇలా అన్ని మాధ్యమాల్లోనూ వైసీపీ నాయకులు దూకుడుగానే ఉంటున్నారు. వీటిలో కామెంట్లతో పాటు.. ఫొటోలు, విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపైనే ఎక్కువగా విమర్శలు ఉంటున్నాయి. అయితే.. ప్రజాస్వామ్యంలో ఎవరి భావప్రకటనా స్వేచ్ఛ వారికి ఉంటుంది. వైసీపీ చేసే కామెంట్లకు టీడీపీ కూడా అదే రీతిలో బదులిస్తంది. …
Read More »ఢిల్లీలో జనసేన కీలక భేటీ
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని అశోకా హోటల్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ కీలక నేతలు హాజరు కానున్నారు. దాదాపుగా 150 మంది ముఖ్య నేతలు పాలుపంచుకుంటున్న ఈ సమావేశంలో పార్టీ తరఫున వివిధ చట్ట సభల్లో ప్రాతినిధ్యం …
Read More »అమరావతిపై కామెంట్స్… వీడియోతో కొట్టిన లోకేష్!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఇటీవల కొందరు నేతలు.. మేధావులమని చెప్పుకొనే కొందరు విమర్శలు చేస్తున్నారు. పనులు మందగించాయని.. పనిచేస్తున్న కార్మికులు కూడా వెళ్లిపోతున్నారని.. వారు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ప్రధాన మీడియా చర్చల్లోనూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వేసవి కాలంలోనే పనులు ముందుకు సాగడం లేదని.. వర్షాకాలం ప్రారంభమైతే.. ఇక, పనులు సాగవని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో అమరావతిపై కామెంట్స్ చేసేవారికి.. తాజాగా …
Read More »సతుల ఇలాకాల్లో.. పతుల రాజకీయం.. !
రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది.. రెండేళ్ల కాలంలో వారి పనితీరు ఏ విధంగా సాగింది. వారి ద్వారా ఆయా పార్టీలకు జరిగిన మేలు ఎంత అనే విషయాలను పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం స్థానికంగా చేస్తున సానుకూల కార్యక్రమాలు వంటి వాటికంటే కూడా పురుష ఎమ్మెల్యేలతో సమానంగా అంతకన్నా ఎక్కువగా ఒక్కొక్క నియోజకవర్గంలో మహిళ ఎమ్మెల్యేలు చేతులు తడపాల్సిందేనని …
Read More »నయా మోసం… బాబుతో వీడియో కాల్
ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ షార్ట్ కట్ లో ఏఐ. అలాంటి ఏఐని వినియోగిస్తూ.. బాబు పేరునే వాడుకుంటూ ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోయారు. బాబు మీతో మాట్లాడతారని చెప్పి… విశాఖకు చెందిన ఓ వ్యక్తిని బుట్టలో వేసేసిన సైబర్ నేరగాళ్లు.. బాదితుడి ఫోన్ కు ఏఐ సాయంతో బాబుతోనే మాట్లాడించారు. ఇంకేముంది… స్వయంగా సీఎం చంద్రబాబే తనతో మాట్లాడారన్న భావనతో వ్యక్తి సైబర్ నేరగాళ్లు అడిగిన డబ్బు ఇస్తూ పోయారు. రూ.80 …
Read More »ముద్రగడతో వంగవీటి కుమార్తె భేటీ?
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె.. ఆశా కిరణ్ భేటీ అయ్యారన్న వార్త ఉభయ గోదావరి జిల్లాల్లో చక్కర్లు కొడుతోంది. గత ఏడాది మధ్యలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు.. ఆశా కిరణ్ మీడియా ముందు ప్రకటించారు. అయితే.. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ముందు ప్రజా క్షేత్రంలోకి అడుగు పెడతానని.. తర్వాత రాజకీయాలవైపు వస్తానని ఆమె …
Read More »ముందు పగ… తర్వాతే అభివృద్ది అంటే ఎలా జగన్?
2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో ధీమా చూపించిన వైసీపీ శ్రేణులంతా గప్ చుప్ అయిపోయాయి. ఆపై కొంతకాలం పాటు సైలెంట్ గానే ఉన్న వైసీపీ శ్రేణులు…తమ పరాజయానికి కారణమేమిటన్న దానిపై బాగానే ఆలోచించాయి. ఈ సందర్భంగా తమ పరాజయం కంటే కూటమి పార్టీల గెలుపునకు కారణమేమిటన్న దానిపైనే వైసీపీ నేతలంతా దృష్టి సారించినట్లున్నారు. లోకేశ్ …
Read More »చిన్ని వర్సెస్ నాని… పీక్స్ కు వెళ్లినట్టే!
కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్ని… ఇద్దరూ తోడబుట్టిన అన్నదమ్ములే. అంతేనా వారిద్దరూ ఒకే పార్టీతోనే రాజకీయాలు మొదలుపెట్టారు. ఇద్దరూ బెజవాడ నుంచే ఎంపీలుగా విజయం సాధించారు. 2024 ఎన్నికల దాకా ఈ అన్నాదమ్ముల మధ్య ఎంత విభేదాలున్నా బయటకు అయితే రాలేదు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా పొడచూపిన విభేదాలతో టీడీపీని వీడిన నాని వైసీపీలో చేరిపోయారు. ఇక అప్పటి …
Read More »లోకేశ్ చెప్పినట్టు ‘రాయల్’ సీమే!
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు రాయలసీమను రతనాల సీమ చేస్తామంటూ చెప్పేవారు. ఎన్నికల సమయంలో అందరి నోటా వినిపించే ఈ మాట… ఆ తర్వాత ఎప్పుడో ఆయా పార్టీల బహిరంగ సభల్లోనే వినిపించేది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. కూటమి పాలనలో రాయలసీమ రతనాల సీమ కాలేకున్నా… ‘రాయల్’ సీమగా అయితే మారిపోయింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates