Political News

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఈ అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల ఏపీలోని టీడీపీ నాయ‌కులు, శ్రేణులు, ప్ర‌భుత్వ వ‌ర్గాలు, మంత్రులు.. అధికారులు సైతం ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక‌, నారా వారి కుటుంబం అయితే.. సంతోషంలో మునిగి తేలుతోంది. మంత్రి లోకేష్ నుంచి ఆయ‌న స‌తీమ‌ణి, చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, స‌తీమ‌ణి …

Read More »

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే అతిపెద్ద వ్యూహాత్మక సవాలు అని శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హెచ్చరించింది. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, యుద్ధం జరగకపోయినా సరే, అక్కడ మన ప్రాముఖ్యతను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టింది. అప్పట్లో సమస్య ఒక కొత్త దేశం …

Read More »

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు. “ఏదో ఇచ్చేశాం.. మీరేదో ఖ‌ర్చు చేసేశాం.. అంటే కుద‌ర‌దు. ప్ర‌తి రూపాయికీ ఫ‌లితం చూపించాలి. అది ఎలా వినియోగం అవుతోంది? ఎవ‌రికి మేలు చేస్తోంది? ల‌క్ష్యం సాధించే దిశ‌గా వేసిన అడుగులు ఎలా ఉన్నాయి.?  ఇత‌రుల‌కు స్ఫూర్తినిస్తున్నాయా?  లేదా? అనే విష‌యాల‌పై అధ్య‌య‌నం చేస్తా. మీరు కూడా అలానే వ్య‌వ‌హ‌రించాలి“ …

Read More »

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు ఉండ‌గా.. ఏరికోరి సీఎం చంద్ర‌బాబుకు మాత్ర‌మే ఈ అవార్డు ఎలా ద‌క్కింది? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు.. ప్ర‌స్తుతం దేశంలో అభివృద్ధిలో ముందుకు సాగుతున్న రాష్ట్రాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర ముందంజ‌లో ఉన్నాయి. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు కూడా పోటీ ప‌డుతున్నాయి. మ‌రోవైపు తెలంగాణ కూడా ఈ జాబితాలో ముందుంది. …

Read More »

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వైసీపీ కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించారు. దానికి ముందు జగన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల అంశంలో వారిని రెండు నెలల్లో జైలుకు పంపుతాను అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య …

Read More »

వారిని కూడా జైల్లో వేస్తానంటున్న జగన్

ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. పీపీపీ విధానంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తే తప్పేంటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తుండగా, ఇది ఒక స్కామ్ అంటూ వైయస్ జగన్ ఆరోపిస్తున్నారు. పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలను దక్కించుకున్న వారిని తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో వేస్తామంటూ …

Read More »

వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న సీఎం

2029లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ తామే విజ‌యం దక్కించుకుంటామ‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవ‌రు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ముగిసిన మూడు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అద్భుత‌మైన తీర్పుతో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బ‌ల‌ప‌రిచార‌ని చెప్పారు. గురువారం హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మొత్తం 12,702 గ్రామ పంచాయ‌తీల్లో కాంగ్రెస్ మెజారిటీ …

Read More »

రుషికొండ ప్యాలెస్ విశాఖకే ఆణిముత్యమా?

వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, విశాఖలో రుషికొండ ప్యాలెస్ కోసం జగన్ 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ, జనసేన, బీజేపీలు దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రుషికొండ ప్యాలెస్ అంశంపై జగన్ స్పందించారు. తాను 240 కోట్ల రూపాయలు పెట్టి రుషికొండ ప్యాలెస్ …

Read More »

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ దానిని పూర్తి చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీ మాజీ సీఎం జగన్ కలిశారు. వైసీపీ నేతలు సేకరించిన కోటి సంతకాల ప్రతులను లోక భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ …

Read More »

‘అవున‌యా… అదేమ‌న్నా జ‌గ‌న్ సొంత‌మా?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి ఒక ప్ర‌త్యేక `క్యాలెండ‌ర్‌` తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది మొద‌ల‌య్యే ఆర్థిక సంవ‌త్స‌రం(ఏప్రిల్ 1) నుంచి ఈ క్యాలెండ‌ర్‌ను అమల్లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి తాజాగా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ స‌హా అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు …

Read More »

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన `విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫ‌ర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిష‌న్ -గ్రామీణ్‌(వీబీ జీ-రామ్‌జీ) బిల్లును గురువారం స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. అయితే.. దీనిని నిర‌సిస్తూ.. విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆందోళ‌నకు దిగాయి. బిల్లు ప్ర‌తుల‌ను చించేసి.. లోక్‌స‌భ‌లో వెద‌జ‌ల్లాయి. అంతేకాదు.. స్పీక‌ర్ పోడియంను చుట్టుముట్టి …

Read More »

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసుతో పాటు పలు కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే, అనారోగ్య కారణాల నేపథ్యంలో వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. అయితే, తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో వంశీపై సునీల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. …

Read More »