వైసీపీ హయాంలో అప్పటి ఆ పార్టీ నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణ రాజును అక్రమంగా అరెస్టు చేసి.. కస్టడీలో టార్చర్ చేసిన కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-4 నిందితుడుగా ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బీహార్ రాజధాని పట్నాలో విధులు నిర్వహిస్తున్నారు. …
Read More »కల్తీ పాల మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం
రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్ లో కల్తీ పాలు తాగి పలువురు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని, మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో …
Read More »ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. అయితే, ఆ కమిషన్ ఏర్పాటుపై మాజీ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆ పిటిషన్ …
Read More »‘పోటీ’లో పవన్ దారిలోనే విజయ్
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ కూడా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసే అవకాశం ఉంది. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం.. రెండు స్థానాల నుండి పోటీ చేశారు. అదే విధంగా, విజయ్ తన రాజకీయ …
Read More »వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాతే.. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నకిలీ నెయ్యి వినియోగంపై ఏకసభ్య కమిషన్ను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి.. వేమిరెడ్డి-సీఎంతో భేటీ అయిన దానికి …
Read More »ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు అధికారులపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయి. ఇలాంటి అధికారుల్లో అప్పటి సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఒకరు. ప్రస్తుత ఉప సభాపతి రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్కు గురి చేశారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంతో ఆయనపై …
Read More »అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి నష్టం కలిగించాయని భావిస్తున్న ప్రభుత్వం, ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలపై సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలను రద్దు చేసిన ప్రభుత్వం, తాజాగా రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో రాజధాని కోర్ ఏరియాలోని ఐదు జోన్లలో ఐదవ జోన్ అయిన ఆర్ …
Read More »‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2014లో పవన్ కల్యాణ్ రాజకీయాలను విమర్శిస్తూ ఆయన రాసిన పుస్తకం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే శ్రీనివాస్ పై జనసేన కార్యకర్తలు కేసు పెట్టగా ఆయనను అరెస్టు కూడా చేశారు. దీంతో, ఈ హత్య వెనుక పవన్, జనసేన …
Read More »కొణిదెల రూపురేఖలు మార్చేసిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటిస్తే.. అది అమలు కావాల్సిందే!. అది గిరిజన ప్రాంతమైనా.. మైదాన ప్రాంతమైనా.. చెప్పినట్టు చేయడమే ఆయన పని!. ఇప్పుడు కూడా అదే పని చేసి చూపించారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొణిదెల(పవన్ కల్యాణ్ ఇంటి పేరు కూడా ఇదే కావడం గమనార్హం) గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని.. అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ …
Read More »కామారెడ్డిలో ఏం జరుగుతోంది?
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు తగలబెట్టడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అరోరా భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించుకుంటానని, బహిరంగ చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే రమణా రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు …
Read More »ట్రంప్ నకు సుప్రీం షాక్.. భారత్ కు లాభమా? నష్టమా?
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టారిఫ్ ల విషయంలో అంతా నా ఇష్టం అంటూ అడ్డగోలుగా టారిఫ్ లు వడ్డించారు. ఇక, తనకు నచ్చని, తన మాట వినని దేశాలపై అయితే ట్రంప్ పగబట్టి మరీ టారిఫ్ లు విధించిన వైనంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే …
Read More »‘అన్ని శాఖలు రేవంత్ తీసుకుంటే ఎలా?’
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని అవుతానంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి ఈ రెండేళ్లలో నిజాయతీగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates