Political News

ద‌ళిత బంధు దెబ్బేసింది.. బేఫిక‌ర్‌: కేసీఆర్‌

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓడిపోతుంద‌ని తాను భావించ‌లేద‌ని ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ద‌ళిత బంధు ద్వారాఇచ్చిన రూ.10 ల‌క్ష‌లు పార్టీని గెలిపిస్తాయ‌ని అనుకున్న‌ట్టు తెలిపారు. అయితే.. అదే త‌మ పార్టీని ఓడించింద‌ని చాలా మంది త‌న‌కు చెప్పిన‌ట్టు వ్యాఖ్యానించారు. “ఓడితే ఓడినం.. కానీ, మ‌నం అమ‌లు చేసిన ద‌ళిత బంధు అనేక కుటుంబాల్లో వెలుగులు నింపింది. పార్ల‌మెంటు …

Read More »

22 నుంచి ‘ప్ర‌జాగ‌ళం’తో చంద్ర‌బాబు ప్ర‌చారం

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేప‌ట్ట‌నున్నారు. ఆదివారం చిల‌క‌లూరిపేట‌లో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం భారీ బ‌హిరంగ స‌భ హిట్ట‌యిన నేప‌థ్యంలో ఈ ‘ప్రజాగళం’ పేరుతోనే ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు నిర్వ‌హించ‌నున్నారు. టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన మూడు పార్టీల త‌ర‌ఫున కూడా టీడీపీ కార్య‌క‌ర్త‌లు ప‌నిచేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నున్నారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తగ్గకుండా వెంటనే …

Read More »

ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల టూర్ ప్రణాళిక సిద్ధ‌మైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు ఆయన బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు. సుమారు వ‌చ్చే ఎన్నిక‌ల పోలింగ్‌కు ఒక రోజు ముందు వ‌ర‌కు ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉండ‌నున్నారు. తాను స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారి ప్ర‌చారం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి వైసీపీ పక్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న …

Read More »

వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌.. టీడీపీ కీల‌క నేత‌కు గేలం?

కీల‌క‌మైన ఎన్నికల ముంగిట వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్ వేసింద‌నే టాక్ వినిపిస్తోంది. విశాఖ‌పట్నం జిల్లాలో టీడీపీకి బ‌ల‌మైన గ‌ళంగా ఉన్న కీల‌క నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తిని వైసీపీలోకి చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. టీడీపీలో సీనియ‌ర్ నేత అయిన బండారు.. పెందుర్తి టికెట్ ఆశించారు. అయితే, పొత్తుల్లో భాగంగా ఈ సీటును చంద్ర‌బాబు జనసేన పార్టీకి కేటాయించారు. దీంతో బండారు తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా …

Read More »

అంబటిని ఇరికించేసిన అనిల్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఐదేళ్లు గ‌డిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ స‌ర్కారు అతి పెద్ద ఫెయిల్యూర్ల‌లో పోల‌వరం ప్రాజెక్టు ఒక‌టి. ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేస‌రికి 70 శాతానికి పైగా పూర్త‌యిన ఆ మెగా ప్రాజెక్టును ఇంకో ఏడాదిలో పూర్తి చేస్తాం అంటూ.. ఒక్కో సంవ‌త్స‌రం గ‌డుపుతూ వ‌చ్చారు. కానీ చివ‌రికి ఎక్క‌డి గొంగ‌డి అక్క‌డే అన్న‌ట్లు త‌యారైంది ప‌రిస్థితి. డ‌యాఫ్రాం వాల్ కూలిపోవ‌డంతో …

Read More »

‘వైసీపీ మ‌తం పేరుతో రెచ్చ‌గొడుతోంది’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ దారుణాల‌కు పాల్ప‌డుతోంద‌ని అన్నారు. మ‌తం పేరుతో చిచ్చు పెట్టి.. ఓట్ల‌ను చీల్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, ముస్లిం సంఘాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలకు మేలు చేసింది, చేసేదీ తెలుగుదేశం పార్టీనేన‌ని తెలిపారు. అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు …

Read More »

మాయావతి తనపై ఒత్తిడి తెచ్చారు: ప్ర‌వీణ్‌కుమార్

మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్సీ తెలంగాణ ఇంచార్జ్ పదవికి ఆదివారం రాజీనామా చేసిన‌ ఆర్‌. ఎస్. ప్ర‌వీణ్‌కుమార్ తాజాగా బీఆర్ ఎస్ గూటికి చేరారు. ఎర్ర‌వ‌ల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఆయ‌న కారెక్కారు. కేసీఆర్ స్వ‌యంగా ఆయ‌న‌కు కండువా క‌ప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌వీణ్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, బ‌హుజ‌న స‌మాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావ‌తిపై ఆయ‌న …

Read More »

క‌డ‌ప ఎంపీ బ‌రిలో ష‌ర్మిల‌!

పంతం నీదా-నాదా.. అన్నట్టుగా సాగుతున్న ఏపీసీసీచీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాలు చివ‌ర‌కు క‌డ‌ప‌కు చేరాయ‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఆమె అసెంబ్లీకి పోటీ చేయాల‌ని అనుకున్నా.. పార్టీ అధిష్టానం ఆమెను క‌డ‌ప ఎంపీ బ‌రిలో నిలవాల‌ని ఒత్తిడి చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో ష‌ర్మిల‌.. క‌డ‌ప నుంచి పోటీ చేయాల‌ని దాదాపు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుత‌ సీఎం జ‌గ‌న్‌ త‌మ పార్టీని నాశ‌నం చేశార‌న్న ఆవేద‌న‌లో ఉన్న కాంగ్రెస్.. ఆయ‌న‌ను …

Read More »

వంద రోజుల్లో వంద త‌ప్పులు పట్టుకున్న KTR

వంద రోజుల్లో వంద త‌ప్పులు పట్టుకున్న KTR తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్‌.. ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆ పార్టీ మంచి జోష్‌పై ఉన్న విష‌యం తెలిసిందే. అంతేకాదు.. బీఆర్ ఎస్ పార్టీకి కూడా చుక్క‌లు చూపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ నేత‌ల‌ను కూడా తీసుకుని, కండువాలు …

Read More »

ప‌దుల సంఖ్య‌లో వ‌లంటీర్ల‌ను తొలిగింపు

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్య‌క్ర‌మాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేష‌న్‌ను రూ.20 వేల‌కు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్య‌ర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు …

Read More »

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి త‌మిళి సై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ రోజు ఉదయం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకొంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. కాగా, 2019, సెప్టెంబ‌రు 8న తెలంగాణ రాష్ట్ర గ‌వర్న‌ర్‌గా త‌మిళ‌నాడుకు చెందిన త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ బాధ్య‌త‌లు …

Read More »

ధర్మవరంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే పొత్తులో ఈ సీటును బీజేపీ ఖాతాలోకి వెళిపోతోందని. నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి కేటాయించవద్దని నియోజకవర్గంలోని తమ్ముళ్ళు భారీ ర్యాలి నిర్వహించారు. ఒకరకంగా ఇది నిరసన ర్యాలీ అనేచెప్పాలి. బీజేపీకి సీటు ఇవ్వద్దు టీడీపీనే పోటీచేయాలంటు ర్యాలీలో తమ్ముళ్ళు, క్యాడర్ గట్టిగా నినాదాలు చేశారు. ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)కు వ్యతిరేకంగా అని …

Read More »