Political News

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఎంత‌టి విప‌రిణామాలు త‌లెత్తుతాయో చెప్పే హృద‌య విదార‌క ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. ఒక ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయురాలి క‌ఠిన వైఖ‌రి ఒక చిన్నారి ప్రాణాన్ని బ‌లిగొంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ జ‌నాల‌ను క‌దిలించేస్తోంది. ఆరేళ్ల ప్ర‌ణ‌య్ తేజ అనే అబ్బాయి ఒక ప్రైవేటు స్కూల్లో చ‌దువుకుంటున్నాడు. …

Read More »

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా నవ్వుతూ తమతో పనిచేసిన యువతి భోజనం పార్శిల్ తెచ్చుకునేందుకు వెళ్లి యాక్సిడెంట్ కు గురైందని లైఫ్ స్టైల్ లో పనిచేస్తున్న ఆమె సహోద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆగస్టు 16వ తేదీన మధ్యాహ్నం 3 …

Read More »

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి అంటూ సుష్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై …

Read More »

అప్పట్లో బాబు అసెంబ్లీకి రాకపోయినా…

ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయించిన ప్రకారం నేటితో ముగుస్తుంది. ఈసారి కూడా శాసన సభా సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ డుమ్మా కొట్టింది. డీఎస్సీ నియమకాలకు సంబందించి అక్రమాలు జరిగాయంటూ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేస్తున్న వైసీపీ అసెంబ్లీకి మాత్రం గైర్హాజరయ్యింది. నిజంగా డీఎస్సీ అక్రమాలపై చిత్తశుద్ధి వుంటే అసెంబ్లీలో దాని మీద …

Read More »

బాబు, లోకేశ్ ల మైండ్ లో చిప్ ఉందా?: జగన్

శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మెగా డీఎస్సీలో అవకతవకలంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే శాసనసభలో ఆ విషయంపై చర్చకు సిద్ధమని, జగన్ సభకు హాజరు కావాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం …

Read More »

సేవకు గుర్తింపు.. క్యాడర్ ఖుషీ

తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి రుజువైంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు దళవాయి రామదేవి, వర్ల రామయ్యలను ప్రతిపాదించడం ద్వారా పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీసీ మహిళా నాయకురాలికి అవకాశం కల్పించడంతో పాటు, సీనియర్‌ దళిత నేతకు పదవి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రామదేవి చాలాకాలంగా పార్టీ కార్యక్రమాల్లో …

Read More »

తండ్రి, కొడుకులు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల్లోనే…

తెలుగు రాజ‌కీయాల్లో కుటుంబ రాజ‌కీయాలు కొత్త కాదు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకులు, భార్య‌భ‌ర్త‌లు కూడా చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాథినిత్యం వ‌హించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలోనూ ప‌లు కుటుంబాల‌కు చెందిన నేత‌లు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు. సాక్షాత్తు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ కేబినెట్లో ఉన్నారు. ఇక చంద్ర‌బాబు వియ్యంకుడు, లోకేష్ మావ నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇక లోకేష్ తోడ‌ళ్లుడు, బాల‌య్య …

Read More »

న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో తెలంగాణా బిడ్డ

ఇప్పుడు అమెరికాలో కొత్తగా వినిపిస్తున్న పేరు సరితా కోమటిరెడ్డి. ఈ తెలంగాణా బిడ్డ న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి రేసులో ముందంజలో వున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించడంతో సరితా కోమటిరెడ్డి లైమ్ లైట్ లోకి వచ్చారు. భారతీయ సంతతికి చెందిన ఈ మహిళ వివరాలు తెలుసుకునేందుకు గూగుల్ తల్లి ఇంటి ముందు ఇండియన్స్ క్యూ కట్టారు. ఏఐ తలుపు తట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ …

Read More »

ప్రకాశం జిల్లాలో కోలుకోని వైసీపీ

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 8నియోజకవర్గాల్లో 6 స్థానల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. అప్పటివరకు అధికారంలో వున్న వైసీపీ కేవలం రెండు చోట్ల మాత్రమే అతి కష్టం మీద గెలిచింది. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో కూడా టీడీపీ జెండా ఎగరేసింది. ఇది అందరికీ తెలిసిందే.  ఈ రెండేళ్ల కాలంలో టీడీపీ బలం ఏమాత్రం తగ్గిన దాఖలాలు …

Read More »

జగన్ పాదయాత్ర తనకోసం కాదు

వైసీపీ అధినేత జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఏడాది నుంచి ఆయన పాద‌యాత్ర ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న చెప్పుకొచ్చారు. తాజాగా మ‌రోసారి ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన జ‌గ‌న్‌.. పాద‌యాత్ర త‌న కోసం కాద‌ని.. అక్క‌చెల్లెమ్మ‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోస‌మేన‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబును న‌మ్మి అధికారం అప్ప‌గిస్తే.. ఆయ‌న రాష్ట్రాన్ని ప్రైవేటుకు అమ్మేస్తున్నార‌ని విమ‌ర్శించారు. కేబినెట్ అంటే.. భూములు అమ్మేయ‌డ‌మేన‌ని.. లేదా …

Read More »

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్థాప్ పెట్టారు. వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ టూ స్థాయికి చేరుకొన్న ఆయన అత్యంత కీలకంగా వ్యవహారించారు. 2019 లో వైసీపీ అధికారంలోకి రావడంలో ఎంతో క్రియాశీల పాత్ర పోషించారు. వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పారు. వైసీపీ పార్టీలోనే కాకుండా జగన్ కేసుల్లో …

Read More »

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు తుందేమో కానీ.. ఆయ‌న‌కు మాత్రం ఎక్క‌డా విసుగ‌నిపించ‌దు!. అయితే.. ఇటీవ‌ల కాలంలో కొంత త‌గ్గించార‌నుకోండి. అయినప్ప‌టికీ మీడియా స‌మావేశాలు.. స‌భ‌ల్లో ఇప్ప‌టికీ.. మైకుపై చంద్ర‌బాబుయుద్ధ‌మే చేస్తున్నార‌ని త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతుంటారు. కాగా.. తాజాగా అంతర్జాతీయ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు కెమెరా అందుకున్నారు. చిత్రంగా అనిపించినా నిజ‌మే!. నిత్యం మీడియా …

Read More »