పార్టీకి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసులరెడ్డి పెద్ద తలనొప్పిగా తయారైనట్లే ఉన్నారు. చీటికి మాటికి అలగటం, జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ తనపైన ఉందని పదిమందికి చాటుకోవటమే బాలినేని టార్గెట్ గా పెట్టుకున్నట్లుంది. అందుకనే ఏదో కారణంతో పార్టీపైన అలుగుతున్నారు. దీనివల్ల బాలినేని వచ్చే లాభం ఏమిటో తెలీదు కానీ పార్టీకి మాత్రం చిక్కాగ్గా ఉంది. బాలినేని అలగటం నేతలను పంపించి బుజ్జగించటం లేకపోతే చివరకు తానే రంగంలోకి దిగాల్సి రావటం …
Read More »అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలట
కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది. ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని …
Read More »సిక్కుల పై జగన్ ఫోకస్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల వారీగా.. మతాల వారీగా విడిపోతున్న ఓటు బ్యాంకుకు ఇప్పుడు మరో చేరిక వచ్చింది. సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కులాలను మరింతగా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో సిక్కు మతస్తులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో భాగంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ ఆయా వర్గాల వారితో భేటీ నిర్వహించడం సంచలనంగా మారింది. అంతేకాదు.. వారిపై వరాల జల్లు కురిపించారు. దీంతో సిక్కుల …
Read More »కడపలో ఆ సీటు టీడీపీదే..
ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా టిడిపి యువ నాయకుడు నారా లోకేష్ రాజంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. యువగలం పాదయాత్ర ఏడాది జనవరి 27వ తారీఖున ప్రారంభమైన తర్వాత కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పూర్తి చేసుకుని ప్రస్తుతం కడప జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా రాజంపేటలో ఆయనకు ప్రజలు భ్రమరథం పెట్టారు. నిజానికి 2014 ఎన్నికల్లో రాజంపేటలో టిడిపి తరఫున …
Read More »ఈటలను అధిష్టానం బుజ్జగిస్తోందా ?
ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ను బీజేపీ అధిష్టానం బుజ్జగిస్తోంది. పార్టీ చేరికల కమిటి ఛైర్మన్ గా ఈటల ఒక విధంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. ఈయన నాయకత్వంలో ఇతర పార్టీల్లోనుండి చెప్పుకోదగ్గనేతలెవరూ బీజేపీలో చేరలేదు. మహబూబ్ నగర్ కు చెందిన మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పార్టీలోకి వస్తారని అనుకుంటే చివరకు వాళ్ళు కూడా రావటంలేదు. వీళ్ళిద్దరినీ ఎలాగైనా పార్టీలోకి చేర్చుకోవాలని ఈటల ఎంతప్రయత్నించినా ఉపయోగం …
Read More »బాబు బాధ్యత నెరవేర్చారు.. మరి తమ్ముళ్ల మాటేంటి?
టిడిపిని గెలిపించేటటువంటి బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు భుజాల మీద నుంచి దాదాపు దిగిపోయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఎప్పటి వరకు కూడా సీనియర్లు యువ నాయకులు వారసులు అందరూ కూడా మీరు ఏదో ఒకటి చేయండి సార్ మేము ప్రజల్లోకి వెళ్తాం మీరు ఏదో ఒకటి గట్టి హామీ ఇవ్వండి సార్ మేము ప్రజలను కలుసుకుంటాం అని రొద పెట్టారు. అంతేకాదు వైసీపీ భారీ ఎత్తున సంక్షేమ పథకాల …
Read More »మొదలవుతున్న ఆపరేషన్ ‘ఘర్ వాపసీ’
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలవబోతోంది. బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్త నేతలను బయటకు రప్పించేందుకు ప్రయత్నాలతో స్పీడ్ పెంచింది. ఘర్ వాపసీ కార్యక్రమం రెండు విధాలుగా ఉండబోతోంది. మొదటిదేమో కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించటం. ఇక రెండో పద్దతి ఏమిటంటే బీఆర్ఎస్, బీజేపీల్లో అసంతృప్తిగా ఉన్ననేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవటం. విషయం ఏదైనా, పేరేదైనా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చేఎన్నికల్లో అధికారంలోకి …
Read More »ఏపీలో ముందస్తు.. బీజేపీ గ్రీన్ సిగ్నల్?
ఏపీపై బీజేపీ పెద్దల అభిప్రాయం ఏంటి? అసలు ఏపీని ఏ విధంగా వాళ్ళు డీల్ చేయాలి అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి అసలు బిజెపి పెద్దలు ఏపీలో పావులు కదపాలని గాని ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసిపి తమకు అనుకూలంగా ఉండడం వైసిపి నుంచి కావలసినవన్నీ జరుగుతుండటం బీజేపీకి కలిసివస్తున్నాయి. ఈ …
Read More »తీహార్ జైల్లో పెట్టినా గెలుపు నాదే
టీడీపీ మాజీ మంత్రి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల మధ్య తిరగకుండా అడ్డుకొనేందుకు వైసీపీ నేతలతో చేతులు కలిపి.. కుట్ర పన్ని కేసులు పెట్టారని టీడీపీ నేత, భూమా కుటుంబానికి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై నిప్పులు చెరిగారు. సుబ్బారెడ్డి చున్నీ లాగారని ఆమె అన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే తనను మాత్రమే …
Read More »కౌంటర్లతో వైరల్ అవుతున్న తేజ
ఎల్లుండి విడుదల కాబోతున్న దగ్గుబాటి అభిరాం డెబ్యూ అహింసకు అంతా రెడీగా ఉంది. సామాన్య ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు కానీ రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం దర్శకుడు తేజ ఏదైనా మేజిక్ చేయకపోతారాని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్ల కోసం విస్తృతంగా మీడియాకు అందుబాటులో ఉన్న తేజ సినిమాలో కంటెంట్ కంటే తన కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో కాస్త వివాదాస్పద ప్రశ్నలకు హైలైట్ …
Read More »ఏపీలో జూన్ 1 మరో బాదుడు.. భూముల ధరలకు రెక్కలు!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మరో బాదుడు కార్యక్రమానికి రంగం రెడీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలను పెంచేసింది. ఈ పెంచిన ధరలు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో స్థిరాస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో మార్కెట్ విలువలను సవరించనున్నారు. …
Read More »చంద్రబాబు ఉండవల్లి నివాసం జప్తు.. కోర్టు ఏమందంటే!
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు అద్దె నివాసాన్ని ఇటీవల ఏపీ ప్రభుత్వం జప్తు చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని లింగమనేని ఎస్టేట్స్ కోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు. కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates