Political News

రేవంత్ ఈ ఫైర్ కొన‌సాగించు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్ర‌భుత్వంపైనా.. సీఎం కేసీఆర్‌పైనే ఓ రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. నిజానికి ప్ర‌భుత్వం ఆమోదించిన బిల్లుల‌ను తాను ముద్ర వేయ‌కుండా తొక్కిపెట్ట‌డంపై కేసీఆర్ సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు. అప్ప‌టి వ‌ర‌కు కూడా ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వివాదాలు సాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇవి మ‌రీ ఓ రేంజ్‌కు పెరిగాయి. తాజాగా ఉగాదిని పుర‌స్క‌రించుకుని రాజ్‌భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ …

Read More »

వైసీపీ కుప్ప‌కూలుతుంది.. టీడీపీ ఉగాది పంచాంగం!

ఎవ‌రి పంచాంగం వారిదే. ఎవ‌రి భ‌విష్య‌త్తు వారిదే. శోభ‌కృత్ నామ నూత‌న ఉగాది సంవ‌త్స‌రం రోజు అన్ని పార్టీలూ ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో టీడీపీ నిర్వ‌హించిన ఉగాది వేడుక‌లు హైలెట్‌గా నిలిచాయి. పంచాంగ క‌ర్త మాట్లాడుతూ.. ఈ ఏడాది సైకిల్‌ దూసుకెళ్తుందన్నారు. ప్రజల్లో నారా లోకేష్‌కు మంచి గుర్తింపు వస్తుందని, చంద్ర‌బాబు.. చంద్రుడు.. ఇంద్రుడై.. చక్రం తిప్పుతారని వెల్ల‌డించారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి ప్రజల్లో మంచి …

Read More »

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఇలా అయిపోయిందేంటి?

బీఆర్ఎస్‌కు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. నేరుగా కేసీఆర్ కుటుంబమే దిల్లీ లిక్కర్ కుంభకోణంతో ఆపసోపాలు పడుతుంటే పార్టీలో లుకలుకలు, కార్యకర్తల కోపాలతో మరిన్ని సమస్యలు మొదలవుతున్నాయి. రచ్చ గెలుద్దామని కేసీఆర్ బయల్దేరుతుంటే ఇంట్లో తంటాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల రెబల్స్ రెడీ అవుతున్నారు. ఇంకొన్ని చోట్ల అసంతృప్తులు నిత్యం అలజడి రేపుతున్నారు.. మరికొన్ని చోట్ల బీజేపీకి కోవర్టులు తయారువుతున్నారనీ బీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారు.. ఇవన్నీ ఎక్కడో …

Read More »

విడదల రజినిపై నందమూరి కుటుంబం నుంచి పోటీ

ఏపీ మంత్రి విడదల రజిని వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ ఎదుర్కొనక తప్పేలాలేదు. మర్రి రాజశేఖర్‌కు రీసెంటుగా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో వచ్చే ఎన్నికలలో విడదల రజినికి చిలకలూరిపేట సీటు గ్యారంటీ అని తేలిపోయింది. దీంతో ఆమె టికెట్ విషయంలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై ఫ్రీ అయిపోయారు. టీడీపీ నుంచి పాత ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకే టికెట్ వస్తుందన్న లెక్కలలో ఉంటూ అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తూ వెళ్తున్నారు. అయితే… …

Read More »

23 టెన్షన్ పెరిగిపోతోందా ?

గురువారం అంటే 23వ తేదీన జరగాల్సిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు రెండు పార్టీల్లో టెన్షన్ పెంచేస్తోందా ? పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎంఎల్ఏ కోటాలో భర్తీ కావాల్సిన ఏడు ఎంఎల్సీ స్దానాలకు గురువారం పోలింగ్ జరగబోతోంది. మామూలుగా అయితే సంఖ్యా బలాన్ని చూసుకుంటే ఏడుస్ధానాలను వైసీపీ ఏకగ్రీవంగా ఖాతాలో వేసుకోవాలి. కానీ చివరి నిముషంలో టీడీపీ పోటీలోకి దిగటంతో ఎన్నిక అనివార్యమైంది. గెలుపుకు అవసరమైన …

Read More »

కేంద్ర కార్యాలయానికి దారేదీ…

బెల్లం చుట్టూ ఈగెలు ముసురుతాయంటారు. అధికారం ఉన్న చోటే రాజకీయ నాయకులు ఉంటారంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతున్నా కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారం లేని చోట ఉండేందుకు రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు… జగన్ నాలుగేళ్ల పాలనలో అరాచకాలు, అవకతవకలకు విసిగిపోయి జనం వైసీపీకి దూరమవుతున్నారు. ఓటర్లు క్రమంగా మళ్లీ టీడీపీ వైపుకు జరుగుతున్నారు. జననాడిని కొంతమంది …

Read More »

అరెస్ట్ ప్రమాదం నుంచి కవిత బయటపడినట్లేనా

దిల్లీ లిక్కర్ కేసులో నిండా మునిగిపోయారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేస్తుందని రెండు రోజులుగా ప్రచారమైనా అలాంటిదేమీ జరగకపోవడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే.. కవితను అరెస్ట్ చేయకపోవచ్చని… ఆమె విచారణ కోసం దిల్లీ వచ్చిన తొలి రోజు నుంచే కేటీఆర్, హరీశ్ రావులు కేంద్రంతో సంప్రదింపులకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని.. కవిత అరెస్ట్ ఉండదన్న హామీ లభించిందని వినిపిస్తోంది. తాజాగా …

Read More »

అమ‌రావ‌తిలో జ‌గ‌న్ స‌ర్కారు మ‌రో చిచ్చు.. ర‌గులుతున్న ఆర్-5

ఆది నుంచి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం, సీఎం జ‌గ‌న్.. ఎప్ప‌టిక‌ప్పుడు.. ఇక్క‌డ ఏదో ఒక వివాదాన్ని సృష్టించ‌డం.. రైతుల క‌డుపు మంట‌ను రెచ్చ‌గొట్ట‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆర్‌-5 వివాదాన్ని మ‌రోసారి స‌ర్కారు రెచ్చగొట్టింది. రాష్ట్రంలో ఎక్క‌డెక్క‌డో ఉన్న పేద‌ల‌కు.. ఇక్క‌డ భూములు కేటాయించ‌డ‌మే ఆర్‌-5 ఉద్దేశం.అయితే.. దీనిని ఆది నుంచి కూడా రైతులు వ్య‌తిరేకిస్తున్నారు. తాము బూములు ఇచ్చింది కేవ‌లం రాజ‌ధాని …

Read More »

జ‌న‌సేన‌ తో న‌ష్ట‌పోయాం: బీజేపీ హాట్ కామెంట్స్‌

ఏపీలో నిన్న‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌-బీజేపీ పొత్తుపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నాయ‌కులు.. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో(ఉత్త‌రాంధ్ర సిట్టింగ్ స్థానం బీజేపీ కోల్పోయింది) జ‌న‌సేన‌తో పొత్తుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆపార్టీ అధికార ప్ర‌తి నిధి.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక పోయిన‌.. ప్ర‌స్తుత ఎమ్మెల్సీ పీవీఎన్ మాధ‌వ్ తీవ్ర‌స్థాయిలో హాట్ కామెంట్స్ కుమ్మ‌రించారు. జ‌న‌సేన‌తో న‌ష్ట‌పోయామ‌న్నారు. ఏదో పేరుకే తాము …

Read More »

నొప్పి తెలీకుండా చంపేయండి: సుప్రీం కోర్టు

తీవ్రమైన నేరాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న వారి విష‌యం పై సుప్రీం కోర్టు సంచ‌లన వ్యాఖ్య‌లు చేసింది. సాధార‌ణంగా ప్ర‌పంచ దేశాలు అన్నీ కూడా.. మ‌ర‌ణ శిక్ష‌ల‌కు దూరంగా ఉంటున్నాయి. ఇలాంటి వాటిని తీవ్రంగా కూడా తీసుకుంటున్నాయి. అయితే.. భార‌త్‌ లో ఇప్ప‌టికీ.. ఉరి శిక్ష విధించ‌డం.. అమ‌లు చేయ‌డం అమ‌ల్లోనే ఉంది. దీని పై ప్ర‌జాస్వామ్య వాదులు రాద్ధాంతం చేస్తున్నా .. ఉద్య‌మాలు నిర్వ‌హిస్తున్నా.. ఈ చ‌ట్టం మాత్రం …

Read More »

ఆయనకు నోటీసులే రాలేదా ?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ వేగం పెరిగింది. కవితను ఈడీ అన్ని కోణాల్లో విచారిస్తోంది. ఇప్పటికే 12 మంది ఈ కేసులో అరెస్టయ్యారు. వారికి వరుస కస్డడీలు కొనసాగుతున్నాయి. అందులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా చప్పాలి. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన తనయుడు రాఘవ రెడ్డి పేర్లు కూడా ఛార్జ్ షీటులో ఉన్నాయి. రాఘవ రెడ్డి ఇప్పటికే అరెస్టయ్యారు. ఆయన …

Read More »

ఏడుగురు ముఖ్యమంత్రుల్ని పిలిస్తే ఒక్కరు రాలేదట!

మచ్చ పడిన వేళ ఏం చేయాలి? ఆ మచ్చను విజయవంతంగా చెరిపించుకునే పనిలో నిమగ్నం కావాలి. అందుకు భిన్నంగా తన తోటి ముఖ్యమంత్రులు ఏడుగురిని విందునకు ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? మామూలుగా అయితే మొహమాటం కోసమైనా హాజరయ్యే వారేమో. కానీ.. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ. చూస్తూ.. చూస్తూ ఆయనతో పెట్టుకోవటం ఎందుకు అనుకున్నారో కానీ.. ముచ్చట పడి విందునకు ఆహ్వానించిన ముఖ్యమంత్రికి మిగిలిన సీఎంలు అంతా కలిసి గైర్హాజరుతో …

Read More »