తెలంగాణాలో పరిస్ధితులను అడ్వాంటేజ్ తీసుకుని బలపడటంలో బీజేపీ ఫెయిలైందని పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టారు. మీడియాతో కొండా మాట్లాడుతు పార్టీని బలోపేతం చేయటం కోసమే సీనియర్లంతా తరచూ సమావేశమై మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు. కొంతకాలంగా పార్టీలోని ఓ పదిమంది సీనియర్లు తరచు కలుస్తున్నారు. ఇందులో మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ఏలున్నారు. వీళ్ళంతా వ్యక్తిగతంగా తీసుకుంటే బాగా బలవంతులనే చెప్పాలి. తమ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలే. …
Read More »రేవంత్రెడ్డి చుట్టూ సీనియర్ల చిక్కుముళ్లు.. !
నిజమే. ఇప్పడు తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్రెడ్డి వ్యవహారంపై సీనియర్ల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ముఖ్యంగా ఆయనను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న వీ. హనుమంతరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్బాబు వంటి చాలా మంది పేరున్న నాయకులు రేవంత్పై అంతర్గత సంభాషణల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఆదిపత్యం పెరిగిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది అధిష్టానం …
Read More »భువనేశ్వరి దిగేసినట్లేనా ?
తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నారా భువనేశ్వరి కొంగు బిగించినట్లేనా ? తాజాగా రాజమండ్రి పార్టీ నేతలతో మాట్లాడిన తీరుచూస్తుంటే అలాగే అనిపిస్తోంది. స్కిల్ స్కామ్ లో రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుకు మద్దతుగా భువనేశ్వరి, బ్రాహ్మణి అప్పుడప్పుడు పార్టీ నేతలతో సమావేశం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. తొందరలోనే టీడీపీకి మద్దతుగా అత్తా, కోడళ్ళిద్దరు రోడ్లపైకి వస్తారని, చంద్రబాబుకు మద్దతుగా ప్రచారం మొదలుపెడతారని పార్టీ నేతలు చెబుతున్నదే. అదేపద్దతిలో ముందు భువనేశ్వరి ప్రజల్లోకి …
Read More »కేసీయార్ కీలకమైన నిర్ణయం
రాబోయే ఎన్నికల విషయమై కేసీయార్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోగా ఎంఎల్ఏలు, అభ్యర్ధులతో సమావేశమవ్వాలని. కనీసం రెండుసార్లయినా మీటింగులు పెట్టుకోవాలని కేసీయార్ అనుకున్నట్లు పార్టీవర్గాల టాక్. ఎన్నికల్లో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్ధులు చేయాల్సిన ఖర్చులు, ప్రచారం చేసుకోవాల్సిన పద్దతి, అసంతృప్త నేతలను బుజ్జగించటం, ద్వితీయ శ్రేణినేతలు, క్యాడర్ ను లైనులో పెట్టుకోవటం తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించాలని అనుకున్నారట. ఎంఎల్ఏలు, అభ్యర్ధులపై జనాల్లో ఉన్న …
Read More »బలం చాటుకుంటున్న మల్లారెడ్డి అల్లుడు
బీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసే అవకాశం దక్కిందనే సమాచారంతో రాజశేఖర్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి మల్కాజిగిరిలో బల ప్రదర్శన నిర్వహించారు. దాదాపు వెయ్యి మందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి టికెట్ తనకు ఖాయమవడంతోనే మర్రి …
Read More »నాట్ బిఫోర్ మీ..బాబుకు సుప్రీం జడ్జి షాక్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై దాఖలైన ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, …
Read More »జనసేన స్పీడ్ ఎంత?
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన కార్యక్రమాల అమలుకు తొందరలోనే జాయింట్ యాక్షన్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యింది. టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొందరలోనే జనసేన నేతలతో ఒక సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. రెండు పార్టీల నేతల సమావేశంలోనే జాయింట్ యాక్షన్ కార్యక్రమాలకు ప్లాన్ రెడీ చేయాలని కూడా డిసైడ్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు …
Read More »హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును ఏ 14గా పేర్కొంటూ సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సిఐడి తాజాగా లోకేష్ ను ఏ14 గా పేర్కొనడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తన యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభం …
Read More »బలం చాటాలనుకుంటున్న కాంగ్రెస్
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకేసారి అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి బలం చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందనే చెప్పాలి. త్వరలోనే మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ 119 స్థానాల్లో దాదాపు 80 సీట్లు కచ్చితంగా గెలవడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో …
Read More »బీజేపీ కొత్త డ్రామానా ?
ఎన్నికలు మరో ఆరు మాసాల్లో ఉందనగా బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందా ? జరుగుతున్నది చూస్తుంటే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు. మీడియాతో జీవీఎల్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కనీసం ఇప్పట్లో లేనట్లే అని ప్రకటించారు. ఇంతముఖ్యమైన నిర్ణయాన్ని ఒక మామూలు ఎంపీ ప్రకటించటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం …
Read More »పథకాలకు బ్రేకులు తప్పవా ?
తెలంగాణాలో అమలవుతున్న అనేక పథకాలకు బ్రేకులు పడబోతున్నాయని సమాచారం. ఎందుకంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేట. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే షెడ్యూల్ ఎన్నికలు మరో మూడు నెలల్లో కి వచ్చేశాయి. కొన్ని పథకాలకు ఇప్పటికీ అవసరమైన నిధులు అందలేదు. దాంతో కేసీయార్ లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ప్రచారంలో …
Read More »‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’.. ఇదే కొత్త ప్రోగ్రాం
ఏపీలో ఎన్నికలకు మరో ఆర్నెల్లు మాత్రమే సమయం ఉన్న వేళలో.. రాజకీయం వేడెక్కిన వేళ.. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు వీలుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. దాని పేరు.. ఆ ప్రోగ్రాం ఎలా సాగుతుందన్న విషయాల్ని వెల్లడించారు. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు.. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇన్ ఛార్జులు.. ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ వెల్లడించారు. ఇదే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates