ప్రముఖ టాలీవుడ్ నటుడు ఆర్ నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లోని ఛలో రాజ్ భవన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు . రాజ్ భవన్ కు వెళ్లడానికి రైతుల వద్ద …
Read More »ఆ ఇద్దరితో కేసీయార్ కు కష్టమేనా ?
రాజకీయంగా కేసీయార్ కు కష్టాలు మొదలైనట్లే అనిపిస్తోంది. ప్రభుత్వపరంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా రాజకీయంగా ఏకకాలంలో ఇద్దరు గట్టి ప్రత్యర్ధులను ఎదుర్కోవటం మాత్రం కేసీయార్ కు ఇబ్బందనే చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రూపంలో గట్టి ప్రత్యర్ధి నిలబడ్డారు. తాజాగా పీసీసీ అధ్యక్షుని నియామకంతో రేవంత్ రెడ్డి కూడా మరోవైపు కేసీయార్ ను చెడుగుడు ఆడుకోవటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కేసీయార్ పై ఒంటికాలిపై …
Read More »టీడీపీలో మరో బిగ్ వికెట్ డౌన్ ?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి రోజులు ఎంత మాత్రం బాగోలేవు. ఎవరు ఎప్పుడు పార్టీకి దెబ్బేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయం హీటెక్కుతోన్న వేళ మరో హాట్ న్యూస్ బయటకు వస్తోంది. అదే టీడీపీ నుంచి మరో వికెట్ డౌన్ అవుతోందని.. ! ఈ సారి వికెట్ ఉత్తరాంధ్ర వంతుగా చెపుతున్నారు. ఉత్తరాంధ్రలో కీలక నగరం అయిన విశాఖపట్నంకు చెందిన ఓ కీలక నేత పార్టీ …
Read More »తెలంగాణలో పాదయాత్రల రాజకీయం ఫలిస్తుందా?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పాదయాత్రల జపం సాగుతోంది. కీలకమైన పార్టీలు సహా.. ఇంకా పురుడు కూడా పోసుకోని.. పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది. మరి ఈ పాదయాత్రల అంతిమ లక్ష్యం అధికారమేనన్న విషయం ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇది మేరకు సక్సెస్ అవుతుంది? మాటల మాంత్రికుడుగా పేరున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు ఈ పాదయాత్రలు ఏమేరకు ఆయా పార్టీలకు సత్ఫలిస్తాయి? అనేది కీలక …
Read More »కట్టుతప్పిన సీనియర్లకు గుణపాఠం
నానాటికీ తిరోగమన దిశగా పరుగులు పెడుతున్న తెలంగాణ కాంగ్రెస్కు జవసత్వాలిచ్చి.. పురోగమన బాట పట్టిస్తారనే భారీ ఆశతో పార్టీ అధిష్టానం.. యువ నాయకుడు, ఫైర్బ్రాండ్.. రేవంత్రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించిందని అంటున్నారు మేధావులు. నిజానికి తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాల ప్రస్తుత దశలో అధిష్టానం పార్టీ పగ్గాలు ఇవ్వడం కాదు.. చేపట్టడమే పెద్ద సవాల్.. అన్న విషయం మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ దూకుడు, మరోవైపు బీజేపీ …
Read More »రేవంత్పై రాజకీయం మంటలు.. టీకప్పులో తుఫానేనా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాట మంటలు రేగుతున్నాయి. భీషణ ప్రతిజ్ఞలు తెరమీదికి వస్తున్నాయి! మరి ఇవన్నీ.. మున్ముందు కూడా కొనసాగుతాయా? లేక.. టీకప్పులో తుఫాను మాదిరిగా సమసిపోతాయా? ఇదీ.. ఇప్పుడు.. ప్రధాన ప్రశ్న. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా.. నూతనంగా నియమితులైన.. రేవంత్ రెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పైకి ఏమీ అనకపోయినా.. లోలోన మథన పడుతున్నవారు.. పైకి వెళ్లగక్కుతున్నవారు.. ఇలా సీనియర్లు.. తమ …
Read More »రేవంత్కు పగ్గాలు.. కోమటి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించడం కాంగ్రెస్ పార్టీలో పెద్ద చిచ్చే రేపేలా ఉంది. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న నేతల్ని కాదని.. మొదట్నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి కొన్నేళ్ల కిందటే కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్ను టీపీసీసీ ప్రెసిడెంట్ను చేయడం ఏంటంటూ పార్టీలో అసంతృప్తి స్వరాలు మొదలయ్యాయి. ఇప్పటికే రేవంత్తో తీవ్ర విభేదాలున్న మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీకి …
Read More »అచ్చెన్న కానివాడైపోయాడా ?
ఈ అనుమానమే అందరిలోను పెరిగిపోతోంది. మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జిల్లాలోని టీడీపీ సీనియర్లలోని మెజారిటి నేతలతో గ్యాప్ పెరిగిపోతోందని టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి హోదాలో అచ్చెన్న జిల్లాలో ఫుల్లుగా చక్రం తిప్పారు. మిగిలిన ఎంఎల్ఏలతో పాటు చాలామంది సీనియర్లను కూడా పెద్దగా పట్టించుకోలేదనే ఆరోపణలకు కొదవేలేదు. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నంటే మంటగా ఉన్న చాలామంది నేతలు దూరంగానే ఉంటున్నారు. విషయం అర్ధమైపోయిన అచ్చెన్న కూడా …
Read More »వైసీపీ నేతల్లో నిరుత్సాహం ?
వరుసగా రెండోసారి కూడా అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలు వాయిదా వేసుకోవాలని నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగానే ఈ సంవత్సరంలో నిర్వహించాలని అనుకున్న ప్లీనరీని కూడా వాయిదా వేయాలని జగన్మోహన్ రెడ్డి అత్యత ముఖ్యనేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరగాల్సిన మొదటి ప్లీనరీని ఎంతో ఘనంగా నిర్వహించాలని పోయిన సంవత్సరమే అనుకున్నారు. జూలై 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు …
Read More »హిడెన్ అజెండా సక్సెస్ అవుతుందా ?
తెలంగాణా మంత్రులు రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని హిడెన్ అజెండాను అమలు చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. మొదటిదేమో హుజూరాబాద్ లో తొందరలోనే జరగబోయే ఉపఎన్నిక. ఇక రెండోదేమో షర్మిల పెట్టబోయే పార్టీ విషయంలో జనాల మైండ్ సెట్ ను ముందుగానే సెట్ చేసే ప్రయత్నం. రాజకీయపార్టీల నేతల ఆలోచనల ప్రకారం రానున్న సెప్టెంబర్ మాసంలో హూజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఉపఎన్నికలో గెలవటం …
Read More »జగన్పై ఆర్కే సంచలన పలుకు
ప్రతి శనివారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో.. మరుసటి రోజు ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ‘కొత్త పలుకు’ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సమకాలీన రాజకీయాలపై విశ్లేషణతో ఈ వ్యాసం రాస్తుంటారు. అందులో అంశాలు సంచలనాత్మకంగా ఉండేలా చూసుకుంటారాయన. బడా రాజకీయ నాయకులకు సంబంధించి లోగుట్టులన్నీ తనకు బాగా తెలిసినట్లుగా ఆయన ఇందులో వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ముఖ్యంగా తనకు బద్ధ శత్రుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ …
Read More »రేవంత్ కే పీసీసీ ఎందుకిచ్చారో తెలుసా ?
మొత్తానికి అనుకున్నది అదికూడా చాలా స్పీడుగా రేవంత్ రెడ్డి సాధించారు. రేవంత్ ను తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమిస్తు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. సీనియర్ల నుండి ఎన్ని అభ్యంతరాలున్నప్పటికీ వాటిని కాదని అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపటం ఆశ్చర్యంగా ఉంది. అయితే రేవంత్ కు పీసీసీ పీఠ దక్కటం అంత సులువుగా మాత్రం సాధ్యంకాలేదు. తొందరలోనే సాధారణ ఎన్నికలున్న కారణంగా కేసీయార్ పై గట్టిగా పోరాటం చేయగలిగిన నేత …
Read More »