వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల కొంతకాలం తెలంగాణకే పరిమితం కానున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. షర్మిల గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకున్నారు వారితో కలిసి అల్పాహారం విందు చేసి చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు …
Read More »ఇండియా రోడ్ మ్యాప్ విడుదలవుతుందా ?
రెండురోజుల సమావేశాలు ముంబయ్ లో గురువారం మొదలవ్వబోతోంది. ఇండియకూటమిలోని 28 పార్టీల అధినేతల్లో దాదాపు ముంబయ్ కి చేరుకున్నారు. కూటమినేతల మధ్య ఇదే మూడో సమావేశం. మొదటి సమావేశం బీహార్ రాజధాని పాట్నాలో జరిగితే రెండో సమావేశం బెంగుళూరులో జరిగింది. ఇపుడు జరగబోయేది మూడో సమావేశం. ఈ సమావేశం కీలకమనే అంటున్నారు. ఎందుకంటే మూడు అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇంతకీ అంతటి కీలకమైన అంశాలు ఏవంటే …
Read More »రాజీవ్గాంధీతో భేటీనా..? అదెలా?
రాజకీయ నేతలు ఎప్పుడు తడబడి మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోలింగ్ చేద్దామా అని కొందరు కాచుకుని ఉంటారు. వారికి దొరికిపోయింది.. వైఎస్సార్ టీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె గురువారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. భేటీ అనంతరం బయటకు వచ్చిన షర్మిల విలేకరులతో …
Read More »యువగళానికి 200 రోజులు.. యువ నేత ప్రస్థానం!!
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కీలక రికార్డును సొంతం చేసుకుంది. ఈ పాదయాత్రకు అప్పుడే 200 రోజులు పూర్తయ్యాయి. ఈ 200 రోజుల యాత్ర కూడా అలవోకగా సాగిపోవడం గమనార్హం. తొలినాళ్లలో అటు పోలీసుల నుంచి ఇటు ప్రత్యర్థి పార్టీల నుంచి కొంత ఇబ్బందులు ఎదురైనా.. తర్వాత తర్వాత యాత్ర సునాయాశంగానే ముందుకు సాగిపోయిందని చెప్పాలి. సుదీర్ఘ లక్ష్యం వచ్చే 2024 …
Read More »ముందుగానే టికెట్లా.. ఆ నేతలు జిల్లాల్లో తిరగాలా?
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ ఓ మెట్టుపైనే నిల్చుంది. కాంగ్రెస్ ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పట్లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. అయితే దీని …
Read More »మోడీలో ఓటమిభయం పెరిగిపోతోందా ?
నరేంద్రమోడీలో ఓటమిభయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే వరసబెట్టి నిత్యావసరాల ధరలు తగ్గిస్తున్నారు. ఇంతకాలం జనాల నడ్డివిరుస్తు అన్నింటి ధరలను ఆకాశానికి పెంచేసిన మోడీ ప్రభుత్వంకు ఇపుడు హఠాత్తుగా జనాల ఇబ్బందులు గుర్తుకొస్తున్నాయి. రాఖీపౌర్ణమి సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధర 200 రూపాయలు తగ్గించటమే ఇందుకు నిదర్శనం. అలాగే పేదలు వాడే ఉజ్వల్ పథకంలోని గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 400 రూపాయలు తగ్గింది. వంటగ్యాస్ ధరలు తగ్గించటం వల్ల సుమారు 36 …
Read More »సస్పెన్సులో షర్మిల పర్యటన
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన సస్పెన్సును పెంచేస్తోంది. కొంతకాలంగా షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోతుందని జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. ఆ ప్రచారానికి తగ్గట్లే షర్మిల మూడుసార్లు బెంగుళూరు వెళ్ళి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తర్వాత మూడుసార్లు ఢిల్లీకి వెళ్ళారు. ఒకసారి స్పీడుగా జరుగుతున్న మంతనాలు మరోసారి నత్తను తలపిస్తున్నది. దాంతో విలీనం చర్యలు ఎందుకు స్పీడుగా …
Read More »రజినీని తిట్టిపోసి.. రజినీతోనే ఎలివేషనా?
కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని పొగిడినందుకు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన నాయకులు ఆయన్ని ఎంత తీవ్ర స్థాయిలో విమర్శించారో తెలిసిందే. జగన్ను కానీ, ఆయన ప్రభుత్వాన్ని కానీ పల్లెత్తు మాట అనకపోయినా చంద్రబాబును పొగడ్డమే రజినీ తప్పయిపోయింది. కొడాలి నాని, రోజా సహా చాలామంది …
Read More »చంద్రబాబు తీరును తప్పుబట్టిన సీపీఐ నారాయణ
ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కొంతకాలంగా వామపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీతో టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్లేనని, వైసీపీ గెలుపునకు చంద్రబాబు గేట్లు తెరచినట్లేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. వామపక్ష పార్టీలతో కలిసి బరిలోకి దిగితే వైసీపీని ఓడించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా …
Read More »ఆ వైసీపీ ఎమ్మెల్యేకు గడ్డుకాలం!
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి గడ్డు కాలం నడుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులే ఆయనకు వ్యతిరేకంగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారంటూ ఏకంగా వైసీపీ అధిష్ఠానాకి ఆ పార్టీ నాయకులే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 1999లో పలమనేరు నుంచి కాంగ్రెస్ తరపున తిప్పేస్వామి …
Read More »కేసీఆర్ కే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డెడ్ లైన్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేదు. ఆయన ఎంత చెబితే అంతా. నచ్చితే ఏ నాయకుడినైనా తలమీద ఎక్కించుకుంటారు. లేదంటే నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేస్తారు. రెండో అవకాశం ఇవ్వడం, బెదిరింపులకు లొంగడం కేసీఆర్ కు తెలియదనే చెప్పాలి. అలాంటిది తాజాగా కేసీఆర్ కే బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేనే డెడ్ లైన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో విజయంతో మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పట్టుదలతో …
Read More »కోడి కత్తికి బొత్స మేనల్లుడికి లింకేంటి?
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పై విశాఖ ఎయిర్పోర్ట్ లో కోడిగకత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి చేసిన శ్రీనివాసరావు దాదాపుగా ఐదేళ్లుగా బెయిల్ కూడా లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక, ఈ కేసులో విచారణకు రావాలని సీఎం జగన్ ను విజయవాడలోని ఎన్ ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య ఈ కేసు విశాఖకు బదిలీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates