Political News

గ‌జ‌ప‌తులు ఎంగిలి మెతుకుల కోసం ఎగ‌బ‌డ్డారు- సాయిరెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు.. విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ.. అశోక్ గ‌జ‌ప‌తిరాజుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్ప‌టి వర‌కు చేసిన విమ‌ర్శ‌ల‌ను దాటి భారీ రేంజ్‌లో దుయ్య‌బ‌ట్టారు. గ‌జ‌ప‌తులు బానిస‌ల‌ని.. బ్రిటీష్ వారి ఎంగిలి మెతుకుల కోసం ఎగ‌బ‌డ్డార‌ని తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. వ‌రుస ట్వీట్ల‌తో సాయిరెడ్డి రెచ్చిపోయారు. ఒక‌వైపు.. సాయిరెడ్డిని నిలువ‌రించాలంటూ.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి తీవ్ర ఒత్తిడి …

Read More »

డిమాండ్లను మోడి అంగీకరిస్తారా ?

ప్రధానమంత్రి నరేంద్రమోడితో జమ్మూ-కాశ్మీర్ నేతల సమావేశం కీలకమైనదనే చెప్పాలి. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చలు జరిగాయి. అయితే అన్నింటిలోను ఐదు అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగినట్లు ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పారు. ఐదే ప్రతిపక్షాలు పట్టుబట్టిన అంశాలపై నరేంద్రమోడి సానుకూలంగా స్పంధిస్తారా అనేది మాత్రం డౌటనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ-కాశ్మీర్ నుండి …

Read More »

వైఎస్ కూడా ఇలా చేయ‌లేదు.. జ‌గ‌న్‌పై బాబు ఫైర్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హారంపై మ‌రోసారి ఆవేద‌న‌, ఆక్రంద‌న వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తు న్న తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఇలా ఎప్పుడూ చేయ‌లేద‌ని అన్నారు. తాజాగా పార్టీ శ్రేణులు, మీడియాతో వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రిపై నిప్పులు చెరిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సహా… ఏపీని పాలించిన ముఖ్యమంత్రులెవరూ సీఎం జగన్ తరహాలో రాష్ట్రాన్ని తిరోగమన బాట పట్టించలేదన్నారు. రెండేళ్లలోనే …

Read More »

చైనా మ‌రో పైశాచికం.. క‌రోనా విష‌యంలో ఏం చేస్తోందంటే

డ్రాగ‌న్ కంట్రీ చైనా.. మ‌రో పైశాచానికి తెర‌దీసిందా? క‌రోనా పుట్టుక‌కు.. కేంద్ర‌మైన చైనా.. ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. వూహాన్ న‌గ‌రంలో తొలి కేసు న‌మోదు కావ‌డం మొద‌లు.. ప్ర‌పంచం మొత్తం క‌రోనా గుప్పిట్లోకి వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. ఫ‌లితంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలి.. ఉద్యోగాలు పోయి.. కుటుంబాల‌కు కుటుంబాలే ఆప్తుల‌ను పోగొట్టుకుని రోడ్డున ప‌డ్డ విల‌యం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ విప‌రీతానికి చైనానే కార‌ణ‌మ‌ని.. …

Read More »

కేజ్రీవాల్ తప్పుడు లెక్కలు.. తేల్చిన ఆడిట్..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామూలుగా బీభత్సం సృష్టించలేదు. ముఖ్యంగా దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ మరింత ఎక్కువగా కనపడింది. కరోనా రోగులు ఆక్సీజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఆక్సీజన్ కోసం ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్రంతో చిన్నపాటి యుద్ధమే చేసింది. ఢిల్లీ కి ఆక్సీజన్ ఇవ్వాలంటూ.. హైకోర్టు కూడా సీరియస్ అవ్వడంతో… కేంద్రం కూడా దిగి వచ్చి తర్వాత ఆక్సీజన్ అందించింది. …

Read More »

వైఎస్ పై శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ వ్యాఖ్యలు

సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం రాజకీయాల్లో మామూలే. జరుగుతున్న అంశాలకు సంబంధం లేని వారి పేర్లను తెర మీదకు తీసుకొచ్చి.. నోటికొచ్చినట్లు తిట్టటం మామూలే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా సరే.. …

Read More »

కేసీఆర్ పై ఈటల ప్రశంసలు.. ఫేక్ లేఖ హస్తం ఎవరిది?

మాజీ మంత్రి ఈటల రాజేందర్… ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన.. కారు దిగేసి.. కషాయం గూటికి చేరారు. ఈ క్రమంలో… ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. పలు రకాల ఆరోపణలుచేశారు. పార్టీ మారే క్రమంలో.. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమే అని అందరూ అనుకున్నారు. అయితే.. సడెన్ గా ఈ రోజు ఈటల పేరిట.. సీఎం కేసీఆర్ ని …

Read More »

ఆపుతారా? జైలుకు పంపేయ‌మంటారా?.. జ‌గ‌న్‌కు మ‌రో షాక్‌.!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై సుప్రీం కోర్టు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌మ‌ని కోర‌కుండానే.. బాధ్య‌త వ‌హించాల‌ని.. ఏ ఒక్క‌ విద్యార్థికి క‌రోనా సోకినా.. రూ. కోటి ప‌రిహారం చెల్లించాల‌ని హెచ్చ‌రించింది. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు ప‌రీక్ష‌ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గింది. ఇది జ‌రిగి 24 గంట‌లు కూడా కాక‌ముందే.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు …

Read More »

#Thankyoulokeshanna ట్రెండింగ్

ఇంతకుముందు సోషల్ మీడియాలో నారా లోకేష్ పేరు ట్రెండ్ అవుతోందంటే అది ట్రోలింగ్‌లో భాగంగానే అని ఫిక్సయిపోయేవాళ్లు. కానీ ఈ రోజు లోకేష్ గురించి ఒక పాజిటివ్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. #Thankyoulokeshanna.. ఈ హ్యాష్ ట్యాగ్ మీద వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి. తెలుగుదేశం మద్దతుదారుల బ్యాకప్‌తోనే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండొచ్చు కానీ.. ఇందులో సామాన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. లోకేష్ …

Read More »

దేశాలను వణికించేస్తున్న డెల్టా వేరియంట్

మనదేశాన్ని వణికించేసిన డెల్టా వేరియంట్ ఇపుడు ప్రపంచంమీద పడింది. ప్రపంచంలోని సుమారు 85 దేశాలను డెల్టా వేరియంట్ వణికించేస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రిటన్, రష్యా, స్పెయిన్, కెనడా లాంటి అనేక దేశాల్లో రెండు టీకాలను వేసుకున్న జనాలకు కూడా డెల్టా వేరియంట్ సోకుతుండటం. టీకాలు వేసుకున్నాం కదా ఇక మనకేం కాదు అని ధైర్యంగా బయట తిరిగేస్తున్న జనాలు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయంఇది. అగ్రరాజ్యం అమెరికాలో నమోదవుతున్న …

Read More »

కేసీఆర్ తో సహపంక్తి భోజనం.. 18మందికి అస్వస్థత

సీఎం కేసీఆర్ ఇటీవల తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించి… గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సంగతి తెలిసిందే. కాగా… సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన గ్రామస్థుల్లో దాదాపు 18మంది అస్వస్థతకు గురవ్వడం గమనార్హం. కేసీఆర్ పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ తొలుత అస్వస్థతకు గురకావడంతో ఆమెను భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. తర్వాత ఆగమ్మ కోలుకోవడంతో వైద్యులు ఆమెను …

Read More »

మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టెస్టు చేస్తే కొవిడ్ ఉందో లేదో చెప్పేస్తుందట

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని …

Read More »