Political News

భారత నూతన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్

భారత దేశ నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ఈ రోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు లాంఛనమే అయినప్పటికీ…ఇండి కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తారని భావించారు. ఈ క్రమంలోనే ముందుగా ఊహించినట్లుగానే సీపీ రాధాకృష్ణన్ ఈ ఎన్నికలో గెలుపొందారు. రాధా కృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. …

Read More »

ఏపీలో మోగిన న‌గారా.. స్థానిక స‌మ‌రానికి రంగం రెడీ!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. వ‌చ్చే ఏడాదితో రాష్ట్రంలోని కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌కు గ‌డువు తీరుతుంది. ఈ క్ర‌మంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల క‌మిష‌న‌ర్ నీలం సాహ్ని నోటిఫికేష‌న్ జారీ చేశారు. మొత్తం నాలుగు ద‌శ‌ల్లో స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో నీలం సాహ్ని మీడియాతో మాట్లాడారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల‌ను స్వేచ్ఛ‌గా ప‌క్ష‌పాత రహితంగా నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని …

Read More »

వైసీపీతో మిలాఖ‌త్‌.. ఇక‌, వారికి చుక్క‌లే.. !

రాష్ట్రంలో చిత్రమైన రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలోని నాయకులతో చేతులు కలిపి పనులు చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. ఇది గత ఏడు నెలలుగా వినిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి వారికి చెక్ పెట్టేదిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ప్రభుత్వం నుంచి చిన్నాచితక కాంట్రాక్టులు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిని వైసిపి లోని అనుకూల నాయకులతో కలిసి …

Read More »

‘సూప‌ర్ సిక్స్‌’కు జీఎస్టీ దెబ్బ‌.. !

జీఎస్టీ తగ్గింపు ప్రభావం రాష్ట్రంలో ఎంతవరకు ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏ మేరకు దీని ప్రభావం పడుతుంది? అనేది ఆర్థిక శాఖలో చర్చిగా మారింది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా పన్నులపై ఆధారపడి పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటివి …

Read More »

రూటు మార్చిన ఫైర్ బ్రాండ్‌.. ఇప్పుడు ఆప‌న్న నేత‌..!

ఒకప్పుడు ఆయన నోరు విప్పితే విమర్శలు. నోరు విప్పితే వివాదాలు అనే మాటను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మీడియా ముందుకు వస్తే సంచలనాలకు వేదిక అనే మాట కూడా వినిపించేది. దీంతోనే గత ఎన్నికల సమయంలో అసలు టికెట్ ఇచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం వెనకడుగు వేసింది. అటువంటి నాయకుడు ఇప్పుడు ప్రజల మనిషిగా, ప్రజల నాయకుడిగా ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతగా రాజకీయ వర్గాల్లో …

Read More »

‘సీఎం.. డిప్యూటీ సీఎంలు సినిమాల్లో నటించకూడదన్న రూల్ లేదు’

ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నోళ్లు సినిమాల్లో నటించకూడదా? అలా నటించటం చట్ట విరుద్ధమా?అన్న ప్రశ్నలకు ఇప్పటికే ఇచ్చిన తీర్పుల ప్రకారం.. అలాంటిదేమీ కనిపించదు. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ హైకోర్టుకు తెలియజేశారు అడ్వొకేట్ జనరల్ దమ్మలాపాటి శ్రీనివాస్. ఇంతకూ ఏం జరిగిందంటే.. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ వాదన ఏమంటే.. ఏపీకి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్ ను సినిమాల్లో నటించకుండా …

Read More »

జ‌గ‌న్ మామ వ‌ర్సెస్ రాజా అల్లుడు.. అప్పుడే చ‌ర్చ‌.. !

పులివెందుల నియోజకవర్గంలో తమకు తిరుగులేదని భావిస్తూ వచ్చిన వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జగన్‌కు ఇప్పుడు భవిష్యత్తు రాజకీయాల్లో ఇబ్బందికర పరిణామాలు తప్పవనే సంకేతాలు తెర‌ మీదకు వచ్చాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల చేసిన ప్రకటన పులివెందుల రాజకీయ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి …

Read More »

4 కార్పొరేష‌న్లు: 51 మంది డైరెక్ట‌ర్లు.. ఏం పందేరం బాబూ!

ఏపీలో ప‌ద‌వుల పందేరంలో హైలెట్‌గా నిలిచే వార్త ఇది!. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో సీఎం చంద్ర‌బాబుపై ఉన్న ఒత్తిళ్ల‌కు ఇది నిలువుట‌ద్దంగా మారుతోంది. ప్ర‌స్తుతం టీడీపీలో అనేక మంది నాయ‌కులు ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. వీరిని సంతృప్తి ప‌రిచేందుకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీంతో కార్పొరేష‌న్ల‌కు పెద్ద ఎత్తున డైరెక్ట‌ర్ల‌ను నియ‌మిస్తూ.. జంబో కార్పొరేష‌న్లుగా మారుస్తున్నారు. ఒక‌ర‌కంగా చూస్తే.. కార్పొరేష‌న్లో సిబ్బంది కంటే కూడా.. డైరెక్ట‌ర్ల సంఖ్యే …

Read More »

తెలంగాణ స‌మాజానికి బీఆర్ ఎస్ ఏం చెబుతుంది?

తెలంగాణ స‌మాజం కోసం, తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా పేరున్న బీఆర్‌ఎస్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం వివాదంగా మారింది. తెలంగాణ ప్ర‌జ‌ల గౌర‌వాన్ని ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లిన పార్టీగా కూడా బీఆర్‌ఎస్ ప‌దే ప‌దే చెబుతోంది. మ‌రి అలాంటి పార్టీ, తెలంగాణ‌కు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుద‌ర్శ‌న్‌రెడ్డి ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో పాల్గొంటే, ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సింది పోయి ఏకంగా ఈ ఎన్నిక‌ల నుంచి త‌ప్పుకుంటామ‌ని …

Read More »

ఆ ఇద్దరికి బుద్ధి చెప్పాల‌నే: కేటీఆర్ కామెంట్స్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సీనియ‌ర్ నాయ‌కులు ప‌లువురు సోమ‌వారం భేటీ అయ్యారు. ఆయ‌న నిర్ణ‌యం మేర‌కు ఈ ఎన్నిక‌ల్లో ఓటుకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అనంత‌రం మాజీ మంత్రి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. “ఆ రెండు పార్టీల‌కు బుద్ధి చెప్పాల‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఎన్నిక‌ల‌కు దూరంగా …

Read More »

టీటీడీ ఈవోపై సర్కారు వేటు.. ఏం చేసిందంటే!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) జె. శ్యామలరావుపై సర్కారు బదిలీ వేటు వేసింది. ఆయనను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా నియమించింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించింది. ఈ మేరకు పలు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేశ్ కుమార్ మీనా, …

Read More »

ఔను.. మా అబ్బాయి రాజ‌కీయాల్లోకి వ‌స్తాడు: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుమారుడు రాజా రెడ్డి రాజ‌కీయ ఎంట్రీపై ఆమె స్పందించారు. త్వ‌ర‌లోనే రాజారెడ్డి రాజ‌కీయాల్లో వ‌స్తాడ‌ని చెప్పారు. క‌డ‌ప జిల్లా నుంచే తాత గారి వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయాల్లోరావాల‌ని రాజా కూడా అనుకుంటున్న‌ట్టు ష‌ర్మిల వ్యాఖ్యానించారు. అయితే.. ఏ నియోజ‌క‌వ‌ర్గం అనే విష‌యంపై ష‌ర్మిల స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల‌ను రాజా అధ్య‌య‌నం చేస్తున్నాడ‌ని.. త్వ‌ర‌లోనే అవ‌స‌రాన్ని …

Read More »