మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రోజాపై జనసేననేత, మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్లో తైతక్కలాడే రోజా కూడా పవన్ను విమర్శించడమా? అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమెకు పవన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. పవన్.. ఆమెలాగా అవినీతి అక్రమాలు చేయలేదన్నారు. భూముల కబ్జాలు కూడా చేయలేదని.. దొంగ చాటు వ్యాపారాలు కూడా లేవని మంత్రి వ్యాఖ్యానించారు. “రోజా గురించి.. తిరుపతి, నగరిలో అడిగితే …
Read More »యూరియా కోసం క్యూలైన్లో మాజీ మంత్రి!
తెలంగాణలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి నిల్వలు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నా.. స్థానికంగా అవసరమైన రైతులకు మాత్రం అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. శనివారం కరీంనగర్లో పోలీసు స్టేషన్ అడ్డాగా.. రైతులను క్యూలో నిలబెట్టి.. యూరియా కోసం టోకెన్లను పంపిణీ చేశారు. ఇది తీవ్ర వివాదంగా మారింది. దీనిపై రైతులు, సంఘాల నాయకులు కూడా ఆవేదన, …
Read More »మోడీకి పెద్ద చిక్కు: కేంద్ర మంత్రిపై అవినీతి ఆరోపణలు
కేంద్రంలో వరసుగా మూడోసారి కూడా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. తరచుగా కాంగ్రెస్ పార్టీని అవినీతి.. అక్రమాల పార్టీగా చెబుతారు. అంతేకాదు.. వారి హయాంలో స్కీములంటే (పథకాలు).. స్కాములేనని(కుంభకోణాలు) విమర్శలు గుప్పిస్తారు. అంతేకాదు.. తమ 10 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని.. ఒక్క స్కామ్ కూడా వెలుగు చూడలేదని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా …
Read More »‘జూబ్లీహిల్స్ మదే.. సర్వేలన్నీ మనవైపే’
త్వరలోనే జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించిన డివిజన్ల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఆయన వారికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సహా.. బీజేపీల వ్యూహాలపైనా వారితో చర్చించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ విజయంపై ధీమా వ్యక్తం …
Read More »అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారు: అయ్యన్న పాత్రుడు
వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయకుండా వారి తరఫున గళం వినిపించకుండా.. వారి సొమ్మును జీతంగా పొందే అర్హత ఎవరికీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలని అన్నారు. సభకు హాజరుకాకుండా …
Read More »నేను శివుడిని.. గరళం మింగాను: మోడీ షాకింగ్ కామెంట్స్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యానించారు. తనను తాను పరమశివుడితో పోల్చుకున్నారు. అంతేకాదు, శివుడి మాదిరిగా తాను కూడా గరళం మింగానని చెప్పారు. శివుడు తన కంఠంలో గరళం దాచుకున్నాడని, తాను మనసులో దాచుకున్నట్టు తెలిపారు. ఆ గరళం దేవతల కోసం శివుడు భరిస్తే, ఈ గరళం దేశ ప్రజల కోసం తాను భరిస్తున్నానని చెప్పడం మరింత సంచలనంగా మారింది. దేశం …
Read More »బీజేపీలోకి పోతుల సునీత దంపతులు
తెలుగు నేల రాజకీయాల్లో సత్తా కలిగిన నేతగా గుర్తింపు సంపాదించిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఏ రాజకీయ పార్టీలోనూ కుదురుగా ఉండలేకపోతున్నారు. తొలుత టీడీపీలో సుధీర్ఘ కాలం సాగిన సునీత ఆ తర్వాత వైసీసీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఆమె టీడీపీకి, ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరిపోయారు. ఇక వైసీపీ అధికారం కోల్పోగానే ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి …
Read More »అంతా మీ ఇష్టమేనా? షర్మిలపై సీనియర్ల విసుర్లు.. !
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సీనియర్ నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో అంతర్గత విమర్శలు ఎదుర్కొంటున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడు మరో చిక్కు వచ్చింది. ఇటీవల ఆమె తన కుమారుడిని వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వైసిపికి అలాగే షర్మిలకు మధ్య మాటల తూటాలని పేల్చేలా చేశాయి. ఇది ప్రత్యేక విషయం. అయితే అసలు షర్మిల ప్రకటన పై సొంత …
Read More »బనకచర్ల పై బాబు గేమ్ప్లాన్..
సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాల్లో బనకచర్ల ప్రాజెక్టు ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం, వెలిగొండ సహా పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే విధంగా రాయలసీమ ప్రాంతానికి కీలకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలెక్కించాలన్నది చంద్రబాబు వ్యూహం. అయితే దీనికి సంబంధించి భారీ ప్రణాళికలు ఉండడంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగానే అవుతుందని అంచనా …
Read More »ఇక నుంచి `జెట్ స్పీడ్`: తేల్చేసిన చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన వేగం పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. “ఇప్పటికి 15 మాసాలు గడిచాయి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేశాం. అనేక అభివృద్ధి పనులు చేశాం. కేంద్రంతో సంబంధాలు మరింత బలోపేతం చేశాం. పెట్టుబడులు తెస్తున్నాం. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు. కానీ, ఇక, నుంచి స్పీడ్ పెంచుతున్నాం. ఇకపై `జెట్ స్పీడ్`తో నేను ముందుకు పోతా.. నాతో కలిసి …
Read More »రేవంత్కు మరక: ఫస్ట్ టైమ్ ఏం జరిగిందంటే!
తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందికర ఘటన చోటుచేసుకుంది. ఇది విపక్షాలకు మరిన్ని ఆయుధాలు ఇచ్చేలా మారింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. యూరియా దొరకక ఇప్పటివరకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యా యత్నాలు చేశారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, యూరియా సమృద్ధిగానే ఉందని, కేంద్రం సరఫరా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి …
Read More »రేవంత్ రెడ్డిపై కేటీఆర్ షాకింగ్ కామెంట్లు
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాకాలంగా పదునైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పై అవమానకర రీతిలో రేవంత్ చేస్తున్న విమర్శలకు కేటీఆర్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. ఆ కౌంటర్లకు దీటుగా రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు నేతల మధ్య చాలాకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఆ మాటల యుద్ధం తారస్థాయికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates