Political News

ప్రకాష్‌రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా?

సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తరఫున అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేయగా, క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవల కేరళలో జరిగిన సాహిత్య …

Read More »

ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి రేవంత్

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతల బ్రేక్‌ఫాస్ట్ సమావేశానికి హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విందుకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, …

Read More »

బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ఇన్ని హామీలా?

ఎన్నిక‌లు అన‌గానే పార్టీలు ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నించ‌డం కామ‌నే. అయితే.. ఒక‌ప్పుడు అంటే.. ప‌ది ప‌దిహేనేళ్ల కింద‌టి వ‌ర‌కు రాష్ట్రాల ఆర్థిక స్థితిగ‌తుల‌ను దృష్టిలో పెట్టుకుని నాయ‌కులు హామీలు గుప్పించేవారు. త‌ద్వారా.. ప‌రిమితంగానే ఉచితాల బాట ప‌ట్టేవారు. కానీ, త‌మిళ‌నాడు వంటి కీల‌క రాష్ట్రాల్లో ఈ ప‌రిమితి దాదాపు 40 ఏళ్లుగా క‌నిపించ‌డం లేదు. రాష్ట్రాల బ‌డ్జ‌ట్‌తో సంబంధం లేదు. కేవ‌లం ఓట‌ర్ల‌ను ఆ క్ష‌ణంలో మ‌చ్చిక …

Read More »

‘మోడీ – షా’లకు పరాభవం స్వయంకృతమే!

వరుసబెట్టి మూడు పర్యాయాలు కేంద్రంలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమికి శుక్రవారం గట్టి షాకే తగిలింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఏళ్ల తరబడి సాగుతున్న ప్రక్రియ. అదే సమయంలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన అంశం నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండింటినీ ఒకేసారి అమలు చేయాలని బీజేపీ కీలక నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తలచింది. వరుసగా మూడు పర్యాయాలు అధికారం దక్కించుకున్న తనకు ఇదేమీ పెద్ద పనే కాదని …

Read More »

మ‌హాసేన రాజేష్ వాట్ నెక్ట్స్‌… !

మహాసేన రాజేష్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కరలేదు. యూట్యూబ‌ర్‌గా ప్రారంభమైన రాజేష్ ప్రస్థానం తర్వాత కాలంలో రాజకీయాల వైపు మళ్ళింది. ముఖ్యంగా టిడిపిని సమర్ధించే వ్యక్తుల్లో రాజేష్ ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయ‌న‌ గత ఎన్నికల సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాలని కూడా భావించారు. టికెట్ కూడా ఖరారు అయినట్టు చర్చ కూడా నడిచింది. కానీ, అనూహ్యంగా ఒక …

Read More »

లోకేష్ టీం.. బ‌రువు బాధ్య‌త‌లు ఎక్కువే!

టీడీపీ రాష్ట్ర, జాతీయ క‌మిటీల‌ను తాజాగా ప్ర‌క‌టించారు. వీటిలో మెజారిటీ ప‌ద‌వుల‌ను యువ‌త‌కు కేటా యించారు. దీనినే పార్టీలో కొంద‌రు `లోకేష్ టీం`గా పేర్కొంటున్నారు. వీరంతా కూడా లోకేష్‌తో అనుబంధం ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. మంచిదే.. పార్టీలో అధినేత మొద‌లు ఎవ‌రో ఒక‌రితో అనుబంధం ఉండ‌డం త‌ప్పుకాదు. కానీ.. తాజాగా ఎంపికైన ప‌ద‌వుల‌ను గ‌మ‌నిస్తే.. కీల‌కంగా ఉన్న యువ నాయ‌కుల‌కు భారీ బ‌రువు బాధ్య‌త‌లే క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా 3 రూపాల్లో …

Read More »

వీగిన మ‌హిళా బిల్లు.. ఎందుకిలా? ఏం జ‌రిగింది?

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన మూడు రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లులు లోక్‌స‌భ‌లో వీగిపోయాయి. వీటిలో ప్ర‌ధాన మైంది.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు. వాస్త‌వానికి 2023లో చ‌ట్టం అయిన‌.. దీనిని మ‌రోసారి స‌వరించ‌డం ద్వారా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను కేంద్రం ప్ర‌తిపాదించింది. ఇదే ఇప్పుడు ఈబిల్లు వీగిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. దీనికి మ‌రో కీల‌క కార‌ణం.. `రాజ‌కీయం`. ఎన్నిక‌ల వేళ మోడీ స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా దీనిని తీసుకువ‌చ్చింద‌న్న ప్ర‌తిప‌క్షాలు.. అన్నంత ప‌నీచేశాయి. …

Read More »

కేంద్రంలోని విపక్షాలపై జగన్ ఫైర్

లోక్ సభలో ఒక చారిత్రాత్మక బిల్లుపై ఓటింగ్ జరిగింది. అనూహ్యంగా ఎన్డీఏ ఓటింగ్ లో ఓటమి ఫాలయింది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ఈ రెండు బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు తమ నిర్ణయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే …

Read More »

కవిత ఫస్ట్ టార్గెట్ కారు వీరులే

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నోట నుంచి వస్తున్న వ్యాఖ్యలు… తాను వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ లో అంతకంతకూ టెన్షన్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉండగా… ఆ పార్టీతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత… తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు జాడల్లో నడిచారు. అయితే ఇప్పుడు తండ్రి పార్టీకే పోటీ అంటూ కవిత చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే …

Read More »

‘ఉత్తరాది’పై ‘దక్షిణాది’దే విజయం!

డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం యావత్తు దేశాన్ని తట్టి లేపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదేంటంటే… ఉత్తరాది ప్రాధాన్యాన్ని మరింతగా పెంచుతూ దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే దిశగా జరుగుతున్న ఎన్డీఏ ఎత్తులన్నీ చిత్తు అయ్యాయయన్నదే ఆ విశ్లేషణ సారాంశం. మరింత సూటిగా చెప్పాలంటే.. ఉత్తరాది లాబీపై దక్షిణాది లాబీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ఎన్డీఏ ఆలోచనతో ఒక్కసారిగా …

Read More »

వీగిపోయిన బిల్లులు… ఓట్లు ఇంత తక్కువా?

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం కోసం గురువారం నుంచి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ఈ బిల్లులపై లోక్ సభలో సుదీర్ఘ చర్చ జరగగా… శుక్రవారం రాత్రి బిల్లులపై ఓటింగ్ జరిగింది. మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కాల్సి ఉండగా… అంతకంటే తక్కువ మంది ఎంపీలు మాత్రమే బిల్లుకు అనుకూలంగా …

Read More »

మ‌త ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు ఉంటాయా?

మ‌త‌ప‌రంగా రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పించేది లేద‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్ల‌మెంటులో తెగేసి చెప్పారు. మ‌హిళా బిల్లు స‌హా.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై శుక్ర‌వారం సాయంత్రం ఏక‌బిగిన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీ విధానాల‌ను.. ఆ పార్టీ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన వ్య‌వ‌హారాల‌ను తూర్పార‌బ‌ట్టారు. “త‌న మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ పార్టీ మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌ను తీసుకురావాల‌ని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలా మేం …

Read More »