Political News

పరశురాముడి రూపంలో రాహుల్ గాంధీ

రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు చేయడం తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వివాదంలో నిలిచారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా పరశురాముడి రూపంలో రూపొందించిన చిత్రం, దానికి నిర్వహించిన పాలాభిషేకం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ జన్మదినాన్ని …

Read More »

‘బాబు, ప‌వ‌న్‌ల‌పై న‌మ్మ‌కం ఉంది’

వైసీపీ చేస్తున్న రాజ‌కీయాల‌కు చెక్ పెడుతూ.. విజ‌యవాడ కృష్ణలంక‌లోని సాయికృష్ణ కుటుంబం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ కుమారుడు ఎక్క‌డున్నా తీసుకురావాల‌ని.. లేదా.. మృత‌దేహాన్న‌యినా.. అప్ప గించాల‌ని కోరుకుంటున్న‌ట్టు సాయికృష్ణ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, మేన‌మామ‌లు తెలిపారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు సంపూర్ణ స‌హ‌కారం ఉంద‌న్నారు. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మ‌కు న‌మ్మకం ఉంద‌న్నారు. త‌మ‌కు జ‌రిగిన అన్యాయం వేరే ఏ కుటుంబానికీ …

Read More »

సాయికృష్ణ కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం

సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఘటనపై అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. డీఐజీ, ఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించే …

Read More »

ఈ స్పీడు నాడేది… జ‌గ‌న్‌?

విజ‌య‌వాడ యువ‌కుడు సాయికృష్ణ మిస్ట‌రీ కేసుపై రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. విష‌యం తెలిసిన వెంట‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హుటాహుటిన స్పందించారు. రాజ‌మండ్రి ఎస్పీ న‌ర‌సింహ కిషోర్ నేతృత్వంలో ఉన్న‌త‌స్థాయి విచార‌ణ‌కు ఆదేశించారు. అంతేకాదు.. ఈ విష‌యంలో ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా ఆదేశించారు. ఒక ప్ర‌భుత్వంగా ఎంత వ‌ర‌కు స్పందించాలో.. అంత‌వ‌ర‌కు ముఖ్యమంత్రి స్పందించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై స్పందించిన వైసీపీ నేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. వెంట‌నే …

Read More »

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని విపక్ష వైసీపీ ఆరోపిస్తుంటే… ఈ వ్యవహారంలో వైసీపీ చెబుతున్నవన్నీ అసత్యాలేనని అధికార కూటమి పార్టీల నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అదినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం నేరుగా సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. సాయి తల్లి విజయలక్ష్మిని ఆయన ఓదార్చారు. …

Read More »

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక సాధారణ రైతుపై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జైలు పాలవగా, ఆయనకు శిక్ష పడే వరకు చెప్పులు ధరించనని శపథం చేసిన రైతు తన మొక్కు తీర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. 2022 జనవరి 6న పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు …

Read More »

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసులో ఐపీఎస్ అధికారి(బీహార్ కేడ‌ర్‌) సునీల్ నాయ‌క్‌పై తీవ్రంగా మండిప‌డింది. స‌రెండ‌ర్ అవుతారా? లేక కేసులో వాద‌నలు కొన‌సాగిస్తారా? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. ఈ కేసులో అన్నీ తెలుసున‌ని వ్యాఖ్యానించింది. తాజాగా సునీల్ నాయ‌క్‌.. త‌న‌కు ముందస్తు బెయిల్ కావాల‌ని కోర్టును ఆశ్ర‌యించారు.. ఈ …

Read More »

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని తెలంగాణ ర‌క్ష‌ణ సేన(టీఆర్ ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటుతో పోల్చిన ప‌వ‌న్ పై ఎందుకు కేసు పెట్ట‌లేద‌ని ఆమె నిల‌దీశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్లే ప‌వ‌న్ వంటి వారు రెచ్చిపోతున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక‌.. …

Read More »

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది. తాము అధికారంలోకి వస్తే…ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను క్రమానుగతంగా భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ… అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పింది. అనుకున్నట్లుగానే ఆ ఎన్నికల్లో వైసీపీకి అధికారం దక్కగా… ఆ తర్వాత జాబ్ కేలండర్ అన్న మాట వైసీపీ నుంచి వినిపించ …

Read More »

‘రికార్డు’ వేలంపై హైకోర్టు స్టే!

అనుకున్నంతా అయ్యింది. హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటాయని చెప్పిన సర్కారీ వేలంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఎస్బీఐ అభ్యంతరాన్ని మన్నిస్తూ సర్కారీ వేలాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెరసి అన్ని రికార్డులను బద్దలు కొట్టేసిన సర్కారీ వేలం పాట ప్రశ్నార్థకంగా మారిపోయింది. గత నెల …

Read More »

బ్రేకింగ్… కారుమూరి కుమారుడు అరెస్ట్

ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న విషయం ఇటీవలే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ స్కాంలో ప్రత్యక్ష పాత్ర ఉందన్న ఆరోపణలతో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్టయ్యారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు …

Read More »

‘బీచ్ లో ఎందుకు… గీతంలో బార్ పెట్టండి’

ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే దిశగా బీచ్ లలో బార్లను ప్రవేశపెడుతున్న తీరుపై నిన్నటిదాకా అంతగా విమర్శలేమీ లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. ఈ దిశగా జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీచ్ లలో మాత్రమే …

Read More »