Political News

మా అబ్బాయిని మంత్రిని చేయండి!

క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సీఎం సిద్ద‌రామ‌య్య‌.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం.. ఆయ‌న పీఠాన్ని సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌స్తుత డిప్యూటీ ముఖ్య మంత్రి డీకే శివకుమార్ అధిరోహించే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో సిద్దూ కొన్నాళ్లుగా త‌ప్పుకోన‌ని మారాం చేసిన‌ప్ప‌టికీ.. తాజాగా మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం సీటును వ‌దులుకున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సిద్ద‌రామ‌య్య‌కు కొన్ని ఆఫ‌ర్లు …

Read More »

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని ముందుకు నడిపించే విషయంలో జరుగుతున్న పొరపాట్లు.. వంటి అంశాలను ఇటీవల ఆయన చర్చించారు. ఈ క్రమంలో పార్టీ విషయంలో గతంలో జరిగిన పరిణామాలు అదేవిధంగా సీనియర్ నాయకుల నుంచి ఎదురైనా ఇబ్బందులు కొంతమంది నాయకులు పార్టీని వీడే వెళ్లిపోవడం ఆ తర్వాత వచ్చిన గ్యాప్ వంటి అంశాలపై ఆయన …

Read More »

ప‌సుపు సేన‌-జ‌న‌సేన‌.. ఇక‌, తిరుగులేదుగా!

ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా పై స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటు టిడిపిలోను అటు జనసేనను నాయకత్వాన్ని ముందుకు నడిపించేందుకు క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు ఉమ్మడిగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి మహానాడులో తీసుకున్న నిర్ణయం ప్రకారం అటు పసుపు సేన ఇటు జనసేన నాయకులను కార్యకర్తలను ముందుండి నడిపించేందుకు …

Read More »

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. పవన్ స్ట్రాటజీ అదుర్స్

గోదావరి పుష్కరాలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా… పని ఒకటే గానీ… రెండు రకాల ప్రయోజనాలు ఇచ్చే దిశగా సాగుతోంది. ఇప్పటికే రెండు రోజుల పాటు గోదావరి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చిన పవన్…తాజాగా శుక్రవారం పవిత్ర గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించే దిశగా ఓ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. ఈ …

Read More »

20 ఏళ్లుగా వెయిటింగ్..

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ ఇప్పటిది కాదు. దాదాపు 20 సంవత్సరాలకు పైగానే ఈ డిమాండ్ ఎప్పుడూ చర్చల్లోకి వస్తోంది. తరచుగా ఆయన గురించి మాట్లాడిన ఎవరైనా భారతరత్న తీసుకురావాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఈ ఆలోచన సాకారం కాలేదు. తాజాగా జరిగిన మహానాడులో మరోసారి అన్నగారికి భారతరత్న తీసుకురావాలన్న డిమాండ్ తెరమీదకు …

Read More »

తెలంగాణ ఏర్పడ్డాక.. తొలిసారి.. ఎన్టీఆర్ విగ్రహం

ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగం ఒకటేనన్నా.. అంటూ ప్రాంతాల విభేదాలను పక్కన పెట్టి తెలుగువారంతా కలిసి ఉండాలని కోరుకున్న నాయకుడు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన నేత అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ నడిబొడ్డున మైత్రీవనంలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 12 సంవత్సరాలకు అన్నగారి విగ్రహం ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ …

Read More »

ఈ రచ్చ ఏంది సామీ..?

ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఎంతకూ సద్దుమణగడం లేదు. ఇటు నాగేశ్వర్, అటు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ వివాదం ఇక ముగిసినట్టేనని ప్రకటించిన తర్వాత కూడా ఈ వివాదం అంతకంతకూ రచ్చగా మారుతోంది. గురువారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద చోటుచేసుకున్న రచ్చ ఈ వివాదానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా తెలంగాణ జర్నలిస్టులు రంగంలోకి దిగగా… వారికి వ్యతిరేకంగా …

Read More »

సీఎం పోస్ట్ వదిలినా గేమ్ ఆగలేదు..

దక్షిణాది రాష్ట్ర కర్ణాటకలో గడచిన మూడు రోజులుగా ముఖ్యమంత్రి పదవి మార్పు దిశగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు చివరాఖరుకు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసే దాకా దారి తీశాయి. సీఎం సీటును వదిలేసిన సిద్ధరామయ్య… రాజ్యసభ సభ్యత్వాన్ని మాత్రం తీసుకోనని తేల్చి చెప్పేశారు. సీఎం పదవిని వదిలేశాక తాను ఓ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని ఆయన గురువారం సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా …

Read More »

సాయిరెడ్దిని సిట్ ప్రశ్నలేమీ అడగలేదా..?

ఏపీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో గురువారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాడు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కె.నాగేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. విచారణ నిమిత్తం సిట్ కార్యాలయానికి వచ్చిన సాయిరెడ్డి… విచారణ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విచారణలో సిట్ అదికారులు తనను ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు …

Read More »

పెద్ద‌ల స‌భ‌కు విజ‌య్‌.. మంచిదేనా.. ?

అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన మహానాడు వేదికగా ఆయనను సమర్ధించే కార్యకర్తలు, నాయకులు విజయ్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వాలని తీర్మానం చేశారు. అయితే, ఈ సీటు వస్తుందా.. రాదా.. అనే విషయాన్ని పక్కన పెడితే అసలు విజయ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఎంతవరకు మంచిది? ఎంతవరకు భవిష్యత్తు ఉంటుంది? అనే అంశాలు …

Read More »

వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వం!

2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని పాతాళానికి పాతి పెడతామని ఆయన ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలతో జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ఈసారి ప్రజలకు ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పేందుకు తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలను నిరంతరం కలుసుకుని జగన్ …

Read More »

టీడీపీ ప్లాన్ సక్సెస్ అయితే రాజకీయాలు మారిపోతాయా?

టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ చేసిన ప్రకటన భారీగా చర్చకు దారి తీసింది. వాస్తవానికి 33% రిజర్వేషన్ అనేది జాతీయ స్థాయిలో ఒక వైపు చర్చ నడుస్తోంది. పార్లమెంట్లో ఇటీవల బిల్లు ప్రవేశపెట్టి కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి వచ్చింది. …

Read More »