తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లరగట్టే…. భారీగా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో 23 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా…. ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ బదిలీల్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆనంద్ స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ గా …
Read More »H-1B వీసాతో మస్క్, నాదెళ్ల, పిచాయ్.. ఇది మర్చిపోతే ఎలా?
అమెరికా టెక్ రంగం నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి కారణం కేవలం స్థానిక ప్రతిభ మాత్రమే కాదు. విదేశీ మేధస్సు, ముఖ్యంగా భారతీయులు అందించిన తోడ్పాటు కూడా అంతే ప్రధానమైనది. ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి ప్రపంచ నాయకులు తమ కెరీర్ ప్రారంభ దశలో H-1B వీసా సాయంతోనే అమెరికాలో నిలదొక్కుకున్నారు. ఈ వీసా ప్రోగ్రామ్ లేకపోతే అమెరికా నేడు ఈ స్థాయికి చేరుకుందా అన్న …
Read More »42 శాతం కోటాతోనే తెలంగాణ ‘లోకల్’ బరి
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు తాను చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా కీలకమైన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై శుక్రవారం రేవంత్ రెడ్డి సర్కారు ఏకంగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం రేపో, మాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు విన్న కాంగ్రెస్ శ్రేణులు, బీసీలు సంతోషంలో మునిగిపోయారు. వాస్తవానికి …
Read More »చైర్మన్కు ‘అవమానం’: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి!
ఏపీ శాసన మండలిలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్త చర్చకు తెరలేచింది. వాస్తవానికి ప్రజా సమస్యలపై చర్చ జరిగితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజును ప్రభుత్వం, అధికారులు కూడా ఉద్దేశ పూర్వకంగా అవమానిస్తున్నారని.. దీనిపై చర్చించి తీరాలని వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని మండలికి వచ్చి.. మోషేన్ రాజుకు క్షమాపణలు …
Read More »ట్రాక్టర్ పై మెడలో ఉల్లి దండతో వైఎస్ షర్మిల
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. అన్నదాతలకు అండగా, దిగజారుతున్న కనీస మద్ధతు దరలపై దండెత్తేందుకు బయలుదేరిన షర్మిల అందరినీ ఆకట్టుకున్నారు. విజయవాడలొని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ నుంచి బయలుదేరిన ఆమె ఏకంగా ట్రాక్టర్ పై ఎక్కారు. ఆపై తన మెడలో రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లిని ఆమె తన మెడలో వేసుకుని సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటికి …
Read More »తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి
తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నూతన పోలీసు బాసు (డీజీపీ)ని నియమించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డిని ఆ పదవి వరించింది. అక్టోబరు 1న శివధర్ రెడ్డి రాష్ట్ర డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి… చాలా కాలం పాటు ఇంటెలిజెన్స్ విభాగంలోనే పని చేశారు. ప్రస్తుతం కూడా ఆయన ఇంటెలిజెన్స్ శాఖ చీఫ్ గా కొనసాగుతున్నారు. తాజాగా శుక్రవారం ప్రభుత్వం జారీ …
Read More »‘జూబ్లీ హిల్స్’ను ఇలా గెలుద్దాం: కేసీఆర్ వ్యూహం
హైదరాబాద్లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యలో తాజాగా తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం పార్టీ కీలక నాయకులు, మాజీ మంత్రులతో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? జూబ్లీహిల్స్లో ఎలా విజయం దక్కించుకోవాలి? ఎవరెవరిని మచ్చిక చేసుకోవాలి? ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ను ఎలా …
Read More »‘వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నా ఫ్రెండ్ ప్రాణాలు తీశారు’
ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తే సింపుల్గా ఒక్క విషయం అర్థమవుతుంది. ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలోని వైఫల్యాలను హైలైట్ చేయటంతో పాటు జగన్ పాలన జరిగిన ఐదేళ్లలో చోటుచేసుకున్న పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా అలాంటి గతాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గత ప్రభుత్వంలో వేధింపులు ఎంత తీవ్రంగా ఉంటాయన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన ఆయన, చిన్న విషయాలను …
Read More »రాసుకునేటోళ్లను రాసుకోనీయండబ్బా: జగన్
ఇటీవల ఓ పత్రిక, మీడియాలో వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి గురించి సంచలన కథనాలు వెలుగు చూశాయి. ఆమె పార్టీ పగ్గాలను చేపడుతున్నారని.. త్వరలోనే దీనిపై నిర్ణయం రానుందని, ఇప్పటికే నాయకులతో ఆమె టచ్లో ఉన్నారని కూడా ఈ కథనం చెప్పుకొచ్చింది. ఇది వైసీపీలో సంచలనంగా మారింది. సహజంగా రెడ్డి నాయకులు మహిళా సారథ్యంలో పనిచేసేందుకు ఇష్టపడరు. అందుకే.. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుమార్తెను ఇంచార్జ్గా పెట్టినా.. ఆ …
Read More »పవన్ కు జ్వరం…చికిత్స కోసం హైదరాబాద్ పయనం
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఈ వారంలో సోమవారమే ఆయన జ్వరం బారిన పడినా… సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే జ్వరం తీవ్రత పెరగడంతో ఆయన మంగళగిరిలోని తన నివాసంలోనే చిన్నపాటి చికిత్సలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నారు. అయితే వైరల్ ఫీవర్ ప్రభావం మరింత తీవ్రం కావడంతో వైద్యులు హైదరాబాద్ లో మరింత మెరుగైన చికిత్స తీసుకోవాలని …
Read More »జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత
తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది. …
Read More »నాన్న కష్టాన్ని గుర్తు చేసుకున్న నారా లోకేశ్
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో నాడు సీఎం హోదాలో కొనసాగిన ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని హైదరాబాద్ ను ఎంతగానో అభివృద్ది చేశారు. చంద్రబాబు లేకుంటే అసలు హైదరాబాద్ ఇప్పుడున్నట్టు ఉండేది కాదేమో. నేటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ను నాడు చంద్రబాబు ఏ రీతిన అభివృద్ధి చేశారన్న విషయాన్ని ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ రెండు, మూడు మాటల్లో వివరించారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates