“ఏపీలో కూటమి బలం ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ రెండు ఫొటోలు చాలు!“ ఈ మాట అన్నది ఎవరో టీడీపీ నాయకులో.. బీజేపీ నేతలో కాదు.. తటస్థులు, రాజకీయ విశ్లేషకులు!!. అంతేకాదు.. నెటిజన్లు కూడా ఫిదా అవుతున్న ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అవే.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటో. దీనిలో …
Read More »నిద్ర లేదు.. ఆహారం తినాలని లేదు: పీకే ఆవేదన
ఆయన అనేక మంది నాయకులను చూశారు. అనేక పార్టీల గెలుపు ఓటములను కూడా దగ్గరగా పరిశీలించారు. అంతేకాదు ఒక పార్టీ గెలుపుకోసం పనిచేసి మరో పార్టీని ఓడించారు. ఇలా గత 10 సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రసాంత్ కిషోర్ ఉరఫ్ పీకే. అయితే ఆ అనుభవం తన దాకా వస్తే కానీ ఓటమిలో ఉన్న ఆవేదన ఆయనకు అర్థం కాలేదు. …
Read More »ఏపీ కొత్త ఎమ్మెల్యేలు: ఒక్కొక్కరు ఒక్కోలా …!
రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? వారు.. ప్రజలకు ఏమేరకు చేరువ అవుతున్నారు? .. ఈ ప్రశ్నలు ఎవరో.. ప్రత్యర్థులు అడుగున్నవి కాదు. సాక్షాత్తూ వారికి టికెట్ ఇచ్చి.. వారు గెలిచేలా ప్రోత్సహించి, ప్రచారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వస్తున్న డౌట్లు. ఈ క్రమంలోనే కొత్తవారిని దారిలో పెట్టాల్సిన బాధ్యతను వారిని సరైన విధంగా ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యతను కూడా ఇంచార్జ్ మంత్రులకు అప్పగించారు. అయితే.. …
Read More »జగనే… నన్ను దూరం పెట్టాడు: షర్మిల
వైసీపీ అధినేత జగన్ సోదరి, ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల.. మరోసారి తన అన్నను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జగన్కు దూరం కాలేదని.. జగనే తనను, తన తల్లిని కూడా దూరం పెట్టాడని ఆమె అన్నారు. “ఎవరు చెప్పారు.. జగన్కు నేను దూరంగా ఉన్నానని?” అని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు..”జగన్ ఎప్పుడు అడిగినా.. నేను రాజకీయంగానే కాదు.. కుటుంబ పరంగా కూడా …
Read More »టీడీపీ మహిళా నేత: ఎన్నికల్లో ఓడి.. జనం మనసు గెలిచి.. !
“ప్రజలకు సేవ చేసేందుకు ఎన్నికల్లోనే గెలవాలా?. ఒక సంకల్పంతో వచ్చాం. అది నెరవేర్చుకునేందుకు ఎన్నికలు ఒక అవకాశం. ఎన్నికల్లో గెలిచి ఉంటే.. మన సంకల్పం మరింత పదును తేరుతుంది. అలాగని ఓడినా.. సంకల్పాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఏదో ఒక రకంగా సేవలు అందించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా.”-ఇదీ.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. చివరి క్షణం వరకు గట్టి పోటీ ఇచ్చిన.. టీడీపీ నాయకురాలు, తొలిసారి …
Read More »ఎస్సై అరెస్టు: టపాసులు కాల్చి జనం సంబరాలు!
అవినీతి.. అడుగడుగునా చేతులు తడపాల్సిందే. పనికావాలన్నా.. మాట వినాలన్నా.. నోట్ల కట్టలు చేతులు మారాల్సిందే. ఇదీ.. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉన్న పోలీసు స్టేషన్లలో కనిపిస్తున్న అవినీతి భూతం. ఇప్పటి వరకు అనేక వందల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే.. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన ఇప్పటి వరకు జరిగిన అన్ని ఘటనలకు పరాకాష్ఠగా మారింది. అవినీతి అనకొండగా మారిన జిల్లాలోని టెక్మాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ …
Read More »తమిళనాడులో ‘బీహార్ గాలి’: మోడీ
రాజకీయ విశ్లేషకులు ఊహించిందే జరిగింది. తమిళనాడులో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఖచ్చితంగా ఎన్నికల వ్యూహాన్ని ఆవిష్కరిస్తారని విశ్లేషకులు అంచనా వేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఆయన పర్యటన పెట్టుకోవడం కూడా కీలక వ్యూహమేనని చెప్పారు. దీనిని నిజం చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు.. ఎన్నికలకు చాలా ముందే.. తమిళనాడు …
Read More »నేను పారిపోను..ప్రశాంత్ కిషోర్
బీహార్ ఎన్నికల ఫలితాలు ప్రశాంత్ కిషోర్ (PK)కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా తనకు నిద్ర కూడా సరిగా పట్టలేదని ఆయన నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ఒప్పుకున్నారు. ‘జన్ సూరజ్’ పార్టీ పెట్టి, తొలి ఎన్నికల్లోనే ఇలాంటి దారుణమైన పరాభవం ఎదురవుతుందని అస్సలు ఊహించలేదట. కానీ, “మనం క్విట్ చేసేంత వరకు ఓడిపోయినట్లు కాదు” అంటూ పీకే తనదైన స్టైల్లో స్ట్రాంగ్ …
Read More »కవిత అరెస్టు చేసిన పోలీసులు, అసలేం జరిగింది?
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు.. ఉన్న పలువురు మద్దతు దారులు, జాగృతి సంస్థ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీంతో హైదరాబాద్లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. అయితే.. తనను అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని.. కార్మికుల పక్షాన పోరాటం చేస్తుంటే.. ప్రభుత్వం తన గొంతు నొక్కాలని ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. అయినా.. తను ప్రజల పక్షానే …
Read More »నదుల అనుసంధానంపై తెలంగాణ విమర్శలకు చంద్రబాబు కౌంటర్
నదుల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. నదుల అనుసంధానం ఆగేది లేదన్నారు. వాస్తవానికి కొన్నాళ్ల కిందట బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు తలపోశారు. అయితే.. దీనికి తెలంగాణ నుంచిపెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలో మార్పులు చేసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పుబట్టింది. “చంద్రబాబు వేరే రూపంలో బనకచర్ల చేపడుతున్నారు” …
Read More »ఆయనో తిరుగులేని శక్తి: చంద్రబాబుకు భారీ కితాబు!
ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ కితాబు లభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచుగా అనేక విషయాలను పంచుకునే ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా నుంచి ఆయన అనూహ్య ప్రశంసలు లభించాయి. చంద్రబాబును ఆయన తిరుగులేని శక్తిగా అభివర్ణించారు. డెవలప్మెంటును కలలు కంటుంటారని మహీంద్రా తెలిపారు. ఈవిషయంలో చంద్రబాబుకు అచంచలమైన అంకితభావం ఉందన్నారు. చంద్రబాబు నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సింది ఇదేనని చెప్పారు. ఎప్పటికప్పుడు తాను అప్డేట్ అవుతూ.. ప్రతి …
Read More »ఇందిరమ్మ జయంతి… మహిళలకు రేవంత్ కానుక ఇదే!
నేడు(నవంబరు 19) దేశ మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ జయంతి. 1917, నవంబరులో ఆమె జన్మించారు. దేశానికి ప్రధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేదలను తనవైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా.. ఇందిరమ్మ ప్రజా ప్రాభవం కోల్పోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి `ఇందిరా మహిళా శక్తి` అనే పేరు పెట్టింది. ఈ పథకం కింద.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates