Political News

ఆత్మ విమ‌ర్శ లేదా జ‌గ‌న్ స‌ర్‌!

ఎదుటి వారిపై ఒక వేలు చూపించేముందు నాలుగు వేళ్లు మ‌న‌వైపు చూపిస్తున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించాలి. అది వ్య‌క్తిగ‌త‌మైనా.. రాజ‌కీయాలైనా అంతే!. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఏపీలో వెలుగు చూసిన న‌కిలీ మ‌ద్యంపై వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ఒక ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు)గా వైసీపీ ప్ర‌శ్నించ‌డం త‌ప్పుకాదు. కానీ, గ‌తంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌ని.. …

Read More »

మీరే చెప్పండి: ఆ ప్యాలెస్‌ను ఏం చేయ‌మంటారు?!

“మీరే చెప్పండి: ఆ ప్యాలెస్‌ను ఏం చేయ‌మంటారు?!“- అంటూ.. ఏపీ ప్ర‌జల‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం బిగ్ ఆఫ‌ర్ ఇచ్చింది. అంతేకాదు.. “మీ సూచ‌న‌లు, స‌ల‌హాలు మాకు అత్యంత కీల‌కం. ప్ర‌తి ఒక్క‌రూ స్పందించాల‌ని కోరుతున్నాం. మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కీల‌క నిర్ణ‌యం తీసుకుంటాం.“ అని పేర్కొంది. ఈ మేర‌కు ప‌ర్యాట‌క శాఖ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే.. స‌ల‌హాలు.. సూచ‌న‌ల‌ను కేవ‌లం ఈ-మెయిల్ రూపంలో మాత్ర‌మే …

Read More »

అవే నా ప్ర‌పంచం: ప‌వ‌న్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “అవే నా ప్ర‌పంచం.. నేను వాటితో స్నేహం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా. అందుకే.. ఆ రూమ్ నుంచి వాటితో నింపేసుకుంటా“ అని వ్యాఖ్యానించారు. దీంతో స‌భికులు తొలుత విస్మ‌యం వ్య‌క్తం చేసినా.. చివ‌ర‌కు ముసిముసి న‌వ్వులు చిందించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో “ఆమె సూర్యుడిని క‌బ‌ళించింది!.“ అని పుస్త‌కాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు. ఈ …

Read More »

పొంగులేటి పెత్త‌నం చేస్తాడా?: కొండా ముర‌ళి ఫైర్‌

వ‌రంగ‌ల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ఉన్న మంత్రి సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి.. మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చారు. గ‌తంలో ఇదే జిల్లాకు చెందిన క‌డియం శ్రీహ‌రిపై విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ముర‌ళి.. అధిష్టానం ముందు వివ‌ర‌ణ ఇచ్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మంత్రి, ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. “పొంగులేటి మాపై పెత్త‌నం చేస్తాడా?  అంత‌.. మొగోడా?!“ …

Read More »

రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  మ‌రో రెండురోజుల్లోనే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాయి. బీఆర్ ఎస్ పార్టీ త‌ర‌ఫున మాజీ ఎమ్మెల్యే దివంగ‌త మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి సునీత బ‌రిలో నిలిచారు. ఇక‌, కాంగ్రెస్ త‌ర‌ఫున యువ నేత …

Read More »

అణ‌చివేత‌పై అలుపెరుగని పోరుకు.. `శాంతి` స‌త్కారం: ఎవ‌రీ మ‌రియా?

ప్ర‌పంచ శాంతి దూత‌గా.. వెనుజువెలా దేశానికి చెందిన 58 ఏళ్ల మ‌రియా కొరీనా మ‌చాడో ఎంపిక‌య్యారు. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా భావించే `నోబెల్ శాంతి` పుర‌స్కారానికి ఈ ఏడాది మొత్తం 16 అప్లికేష‌న్లు రాగా.. వీటిలో అంద‌రినీ తోసిరాజ‌ని మ‌రియా ఎంపిక‌య్యారు. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన మ‌రియా.. వెనుజువెలా స‌హా చుట్టుప‌క్క‌ల దేశాల్లోని నియంతృత్వం, పేద‌రికం, ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం నిరంత‌రం పోరాటం చేశారు. దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు …

Read More »

మిథున్ రెడ్డి మెలిక‌.. వైసీపీ ఇరుక్కుపోతుందా ..!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తెచ్చిన కొత్త డిమాండ్ కూట‌మి పార్టీల‌కు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తుందా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీలో తెర‌మీదికి వ‌చ్చిన‌.. న‌కిలీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో .. అనేక మంది టీడీపీ నాయ‌కుల పాత్ర ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌రింత మంది ప్ర‌మేయం ఉంద‌న్న …

Read More »

నారా వారి రికార్డు : సీఎంగా 15 ఏళ్ల రికార్డు ..!

టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు మ‌రో రికార్డును సొంతం చేసుకున్నారు. 15 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నేతగా ఆయ‌న మ‌రో శిఖ‌రాన్ని అందుకున్నారు. వాస్త‌వానికి దేశంలో 15 ఏళ్ల‌పాటు ముఖ్యమంత్రులుగా ప‌నిచేసిన వారు ఒక‌రిద్ద‌రు ఉన్నా.. చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌త వేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే వ్య‌క్తి.. అందునా ప్రాంతీయ పార్టీగా ఆవిర్భ‌వించిన టీడీపీ త‌రఫున 15సంవత్స‌రాల పాటు ఆయ‌న ముఖ్య మంత్రిగా ప‌నిచేయడం రికార్డేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. …

Read More »

నోబెల్ ఎఫెక్ట్‌: ట్రంప్‌కు నిద్ర‌లేని రాత్రి!

ప్ర‌పంచ శాంతి దూత‌గా.. త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిద్ర‌లేని రాత్రి వ‌చ్చింది. గ‌త రెండు, మూడు మాసాలుగాఆయ‌న నోబెల్ శాంతి బ‌హుమ‌తిపై ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌పంచంలో ఈ బ‌హుమ‌తికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. `ప్ర‌పంచ శాంతి దూత‌`గా ఆవిర్భ‌వించేందుకు.. నోబెల్ పుర‌స్కారం అంత్యంత కీల‌కం. దీనిని తాను కైవ‌సం చేసుకునేందుకు ట్రంప్ చేసిన ప్ర‌య‌త్నాలు.. బెదిరింపులు కూడా అంద‌రికీ తెలిసిందే. ఈ …

Read More »

జూబ్లీహిల్స్ పోరు: గెలిస్తే కాంగ్రెస్ రికార్డే!

హైద‌రాబాద్‌లోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారిన విష‌యం తెలిసిం దే. తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా.. దీనికి నోటిఫికేష‌న్ ఇచ్చేసింది. ఇక‌, ఇప్పుడు దంగ‌ల్ య‌మ రేంజ్‌లో సాగ‌నుంది. ముఖ్యంగా అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలైన‌.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఉప పోరును రిఫ‌రెండంగా భావిస్తున్నాయి. త‌మ పాల‌న‌కు ప్ర‌జ‌లు వేసే మార్కులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అద్దం ప‌డుతుంద‌ని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. …

Read More »

లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌.. 50 ముక్కలుగా నరుకుతారు: గవర్నర్

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం స్నాతకోత్సవంలో ఆమె విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా అమ్మాయిలు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లకు దూరంగా ఉండాలని గట్టిగా కోరారు. “ఈ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ట్రెండ్‌గా మారింది, కానీ దానికి దూరంగా ఉండాలని నేను అమ్మాయిలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను” అని గవర్నర్ హెచ్చరించారు. …

Read More »

ప్రశాంత్ కిశోర్ పార్టీ.. అభ్యర్దులతో షాక్ ఇచ్చాడుగా!

ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ జన్ సూరాజ్ పార్టీనీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ ఎన్నికల కోసం తమ మొదటి అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసి ఆశ్చర్యం కలిగించారు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మామూలు లీడర్లు కాకుండా, టెక్ట్స్‌బుక్స్ రాసిన ప్రముఖ గణిత శాస్త్రవేత్తలు, మాజీ బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, డాక్టర్లు వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు ఉండడం ఇప్పుడు బీహార్ …

Read More »