Political News

చంద్ర‌బాబు త‌ల్లి దండ్రుల‌పై జ‌గ‌న్ షాకింగ్ కామెంట్స్‌..

ఏపీ సీఎం చంద్ర‌బాబు కుటుంబంపై సాక్షాత్తూ వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నోరు చేసుకున్నారు. ఇంటి పెద్ద కొడుకు అయి ఉండి.. త‌న త‌ల్లి,తండ్రి చ‌నిపోతే.. చంద్ర‌బాబు క‌నీసం త‌ల కొరివి కూడా పెట్ట‌లేదు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఏ రోజూ వారిని తన ఇంటికి ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేద‌ని.. ఇలాంటి వ్య‌క్తి త‌న‌ను, త‌న కుటుంబాన్నిరోడ్డుకు లాగుతున్నార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. సుమారు గంట‌న్న‌ర‌పైగా మీడియాతో …

Read More »

కాళింగుల అసంతృప్తి కి కారణమేంటి బాబూ

సామాజిక వ‌ర్గాల బ‌లం లేకుండా ఏ రాజ‌కీయ పార్టీ కూడా మ‌న‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. జిల్లాకో విధంగా సామాజిక వ‌ర్గాలు ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఇలానే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో వీరంతా టీడీపీవైపే నిల‌బ‌డ్డారు. దీంతో శ్రీకాకుళం స‌హా విజ‌యన‌గ‌రంలోని కొన్ని ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. ఇంత జ‌రిగినా.. త‌మ‌కు …

Read More »

ఎగ్జిట్ పోల్స్‌: జార్ఖండ్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ‌!

ఉత్త‌రాది రాష్ట్రాల్లో కీల‌క‌మైన జార్ఖండ్‌లో 81 స్థానాలు ఉన్న అసెంబ్లీకి రెండువిడ‌త‌ల్లో జ‌రిగిన ఎన్నిక‌లు ముగిశాయి. మంగ‌ళవారం సాయంత్రం 6 గంట‌ల‌తో రెండో విడ‌త పోలింగ్ ప్ర‌క్రియ కూడా ముగిసింది. గ‌నుల‌కు ఖిల్లాగా గుర్తింపు పొందిన ఈ రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకునేందుకు బీజేపీ శ‌త విధాల ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌రోసారి ప‌రాభ‌వం త‌ప్పేలా లేద‌ని ప‌లు స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే.. ఎవ‌రు గెలిచినా.. …

Read More »

ఎగ్జిట్‌పోల్‌: మ‌హారాష్ట్ర‌లో క‌మ‌ల వికాసం?

తాజాగా ముగిసిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు త‌ల‌కో ర‌కంగా వ‌చ్చాయి. అయితే.. మెజారిటీ సంస్థ‌లు బీజేపీకి ప‌ట్టంక‌ట్టాయి. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి(భారీ కూట‌మి) కూట‌మికి ప‌ట్టం క‌ట్ట‌డం విశేషం. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడ‌త‌లో బుధ‌వారం(న‌వంబ‌రు 20) పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌శాంతంగానే ఈ ప్ర‌క్రియ సాగిపోయింది. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్.. సాయంత్రం …

Read More »

ఏపీ అసెంబ్లీలో ఏం జ‌రుగుతోంది? అన్ని వేళ్లూ అధికారుల వైపే!

ఏపీ అసెంబ్లీలో ఏం జ‌రుగుతోంది? అంటే.. సాధార‌ణంగా బ‌డ్జెట్ స‌మావేశాలు కాబ‌ట్టి చ‌ర్చ‌లు జ‌రుగుతాయి… ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ్యులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు జ‌వాబిస్తారు.. అనే ఆన్స‌రే వ‌స్తుంది. అయితే.. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం మాత్రం. కానీ,స‌భ్యులు, స్పీక‌ర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే.. అంత‌కు మించి ఏదో జ‌రుగుతోంద‌ని అర్ధ‌మ‌వుతోంది. మంత్రులు ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. స‌భ్యులు మాత్రం ఆగ్ర‌హంతో ఉన్నారు. మంత్రులు ఎవ‌రూ స‌భ‌లో ఉండ‌డం లేద‌ని కొంద‌రు …

Read More »

క‌డ‌ప ఉక్కు.. చెల్లి పెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీలా మారింది: ష‌ర్మిల సెటైర్లు

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు, మాజీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల సెటైర్లు పేల్చారు. క‌డ‌ప ఉక్కు.. చెల్లి పెళ్లి మ‌ళ్లీ మ‌ళ్లీలా మారింద‌ని ఎద్దేవా చేశారు. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మాణాన్ని విభ‌జ‌న చ‌ట్టంలోనే పేర్కొన్నార‌ని.. అయితే, దీనిని నిర్మించే విష‌యంలో గ‌త వైసీపీ, టీడీపీ ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌య్యాయ‌య‌ని ఆమె విమ‌ర్శించారు. కేవ‌లం శంకు స్థాప‌న‌ల‌కే గ‌త రెండు ప్ర‌భుత్వాలు …

Read More »

మ‌రో పదేళ్లు చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉండాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఐదే ళ్లు కాదు.. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉంటార‌ని తేల్చి చెప్పారు. “నేను మా స‌భ్య‌లు ప‌క్షాన చెబుతున్నా.. ఐదేళ్లు కాదు.. వ‌చ్చే ప‌దేళ్లు కూడా చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉంటారు. ఆయ‌న మ‌మ్మ‌ల్ని కోర‌డం కాదు.. ఆదేశించాలి. ఆయ‌న విజ‌న్ మేర‌కు మేం ప‌నిచేస్తాం. ఈ విష‌యంలో నేను స్వ‌యంగా …

Read More »

విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్ కాదన్న గవర్నర్

విమానాన్ని కనుగొన్నది ఎవరు అని ఆరో తరగతి పిల్లవాడిని అడిగితే ఠక్కున రైట్ బ్రదర్స్ అని సమాధానమిస్తాడు. 1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా విమానంలో ప్రయాణించారని పాఠాల్లో చాలా మంది చదువుకున్నారు. అయితే, రైట్ బ్రదర్స్ కన్నా ముందే భారతదశంలో విమానం తయారైందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై ఉత్తర ప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు. …

Read More »

జ‌గ‌న్ జ‌ట్టులో క‌ల‌వ‌రం.. ఇలా అయితే క‌ష్ట‌మే.. !

వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ జ‌ట్టులో క‌ల‌వ‌రం పెరిగిపోయిందా? నేత‌ల నుంచి అధికారుల వ‌ర‌కు అంద‌రూ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లో మునిగిపోయారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌ను ఎత్తి చూపిస్తున్నారు. అంతే కాదు.. అధికారుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. టార్గెట్ అవుతున్నారు. అయితే.. ఇదేదో కొన్ని రోజులు ఉంటుంద‌ని అనుకున్నా.. త‌ర్వాత‌.. కూడా కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌నుల శాఖ అప్ప‌టి డైరెక్ట‌ర్ …

Read More »

ఐదు నెలల్లోనే దూకుడు.. వ‌చ్చే నాలుగేళ్ల మాటేంటి ..!

టీడీపీ అధినేత‌.. సీఎం చంద్ర‌బాబు ఐదు నెల్ల‌లోనే దూకుడు పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఐదు మాసాలే అయింది. ఇంత‌లోనే అనేక రూపాల్లో సీఎంచంద్ర‌బాబు త‌న స‌త్తా చాటుతున్నా రు. ఒక‌వైపు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేస్తూనే.. మ‌రోవైపు, పాల‌నా ప‌రంగా బ‌ల‌మైన సంకేతాలు ఇస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమం పేరుతో వేస్తున్న అడుగులు సామాన్యుల‌ను మ‌రింత‌గా బాబువైపు మ‌ళ్లేలా చేస్తున్నాయి. పింఛ‌న్ల పెంపుతో ప్రారంభ‌మైన చంద్ర‌బాబు పాల‌న‌.. ఇప్పుడు అమ‌రావ‌తి …

Read More »

కేసీఆర్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్: రేవంత్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. హనుమకొండలో జరిగిన ప్రజా పాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన రోజే రుణమాఫీపై చర్చ పెడతామని, కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా? అని రేవంత్ …

Read More »

జ‌గ‌న్ కు క్యూసెక్కుల‌కు, టీఎంసీల‌కు తేడా తెలీదు

జ‌గ‌న్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. త‌మ్ముడి మ‌ర‌ణం త‌ర్వాత‌.. తొలిసారి అసెంబ్లీకి వ‌చ్చిన ఆయ‌న మంగ‌ళ‌వారం స‌భ‌లో చేప‌ట్టిన సాగునీట ప్రాజెక్టుల‌పై చ‌ర్చ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టునుతామే పూర్తి చేస్తామ‌ని ఈ స‌మయంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌కు ఆ అవ‌కాశం ఇచ్చేది లేద‌న్నారు. అదే …

Read More »