Political News

గ్రేటర్ పరిధి పెరగబోతోందా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ప్రభుత్వం పెంచబోతోందా ? ప్రభుత్వ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోయే ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం లేదా లీకులు ఇవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టమనే విషయంపై జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గ్రేటర్ చుట్టుపక్కలున్న 30 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను కూడా …

Read More »

సర్వేలకే అత్యంత ప్రాధాన్యతిస్తున్నారా ?

రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు తొందరలోనే రెండో జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. మరో వారంలోనే 30 మంది అభ్యర్ధుల పేర్లుండచ్చని పార్టీవర్గాల సమాచారం. దాదాపు వారంరోజుల క్రితం రిలీజ్ చేసిన మొదటిజాబితా పార్టీలో కలకలం రేపింది. ఎందుకంటే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు, బోడె ప్రసాద్, పల్లా శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి 30 మంది సీనియర్లకు టికెట్లు దక్కలేదు. దక్కలేదంటే పై నేతలు పోటీచేస్తున్న …

Read More »

మంగళగిరిలో కీలకమైన మార్పు

రాబోయే ఎన్నికలకు సంబంధించి పోటీచేయబోయే అభ్యర్ధులతో జగన్మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాల జాబితాను రిలీజ్ చేశారు. ఇందులో రెండుపేర్లు చాలా ఇంట్రెస్టింగుగా ఉన్నాయి. అవేమిటంటే నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జిగా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇన్చార్జిగా లావణ్యను ప్రకటించటం. విజయసాయిరెడ్డి పేరు తెరమీదకు రావటం అనూహ్యమనే అనుకోవాలి. ఇక్కడ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరుతున్నారు. అందుకనే కొత్తగా అభ్యర్ధిని దింపాల్సొచ్చింది వైసీపీకి. అనేక రకాల సర్వేలు, కాంబినేషన్లను ఆలోచించిన …

Read More »

టీడీపీలోకి బిగ్ షాట్స్

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో నేతల పార్టీ దూకుళ్ళు బాగా పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే టీడీపీలోకి కొందరు బిగ్ షాట్స్ చేరబోతున్నారు. శనివారం వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మైలవరం ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరుతున్నారు. అలాగే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కూడా చేరబోతున్నారు. ఇపుడు పార్టీలో చేరుతున్న, చేరబోతున్న వారందరికి మళ్ళీ అవే స్ధానాల్లో టికెట్లు ఇవ్వటానికి చంద్రబాబునాయుడు హామీ …

Read More »

బీజేపీలో తిరుగుబాటా ?

తెలంగాణా బీజేపీలో నేతలు తిరుగుబాటు చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునేని అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మల్కాజ్ గిరి పార్లమెంటు సీటు విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయంతో స్ధానిక నేతలు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారట. మల్కాజ్ గిరి పార్లమెంటులో ఈటల రాజేందర్ ను పోటీ చేయించాలని ఇప్పటికే అగ్రనేతలు డిసైడ్ చేశారు. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అయితే ఇదే సీటునుండి పోటీచేయటానికి చాలామంది నేతలు …

Read More »

స‌త్య‌వేడులో సైకిల్ స‌వారీ ఖాయ‌మేనా..!

చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి టీడీపీ విజ‌యం ప‌క్కానా? వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. చంద్ర‌బాబు ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. కానీ, ఆయ‌న మాత్రం త‌న‌కే టికెట్ అని అనుచ‌రుల‌కు చెబుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఆయ‌న వైపు తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో మారిన స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఈ ద‌ఫా స‌త్య‌వేడులో సైకిల్ …

Read More »

ఇక‌, తాయిలాల స‌మ‌యం.. వైసీపీనే ఫస్ట్‌

ఎన్నిక‌ల వేళ ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీల నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ముఖ్యంగా త‌మ‌కు ఓటేస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారికి తాయిలాలు పంచ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌లు చోట్ల ఓట‌ర్లు రోడ్డెక్కి మ‌రీ వీటిని ద‌క్కించుకున్నార‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు ఏపీ వంతు వ‌చ్చింది. ఇక్క‌డ ఇంకా ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ముందు జాగ్ర‌త్త‌గా అభ్య‌ర్థులుతాయిలాల పంపిణీలో అప్పుడే ప్రారంభించ‌శారు. …

Read More »

మా అన్నకు ఓటు వేయొద్దు: వైఎస్ సునీత

తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు శిక్ష పడాలని వైఎస్ సునీతా రెడ్డి గత ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే తనకు న్యాయం జరగడం లేదని ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సునీత పలుమార్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ పై సునీత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ …

Read More »

రెండుసార్లు సర్వే చేయించుకున్నారా ?

రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం విషయంలోసస్పెన్స్ కంటిన్యు అవుతునే ఉంది. ఏ నియోజకవర్గంలో నుండి తాను పోటీచేయబోతున్న విషయాన్ని పవన్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. దాంతో అనేక నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలోనే పవన్ పోటీచేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంనై ప్రచారం జరిగినా మళ్ళీ ఎందుకో మరుగునపడిపోయింది. అలాంటిది ఇపుడు సడెన్ గా మళ్ళీ ప్రచారం …

Read More »

సెగలు పుట్టిస్తున్న ‘మేడిగడ్డ’ రాజకీయం

తెలంగాణాలో మేడిగడ్డ బ్యారేజి రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. బ్యారేజీ నాసిరకం నిర్మాణం కారణంగా వేల కోట్ల రూపాయల అవినీతి జరగటమే కాకుండా బ్యారేజి ఎందుకూ పనికిరాకుండా పోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తేల్చేసింది. మేడిగడ్డ బ్యారేజి పనికిరాకుండా పోతే దీని ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పనికిరాదని మంత్రులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతిని, నాసిరకం నిర్మాణంపై క్షేత్రస్ధాయి …

Read More »

ఉద‌యం టీడీపీ.. రాత్రికి వైసీపీ.. ఖానా మజాకా!!

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు యూట‌ర్న్ తీసుకున్నాయి. ఇక్క‌డ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌.. త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలను ర‌క్తి క‌ట్టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డి టికెట్‌ను టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంలో భాగంగా జ‌న‌సేన‌కు ఇచ్చేందుకు చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ విష‌యంపై ఇంకా అదికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. అయితే.. దీనిపై ఇంకా ప్ర‌క‌ట‌న రాక‌ముందే.. జ‌లీల్ ఖాన్‌.. త‌న‌దైన శైలిలో మారాం …

Read More »

రాజ‌కీయ పార్టీలోకి చేరిన ద‌స్త‌గిరి.. పోటీపై క్లారిటీ

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి.. ఆయ‌ననే ఓడిస్తానంటూ.. వ్యాఖ్య‌లు చేసిన ద‌స్త‌గిరి తాజాగా ఓ రాజ‌కీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హ‌త్య చేసిన నిందితుల్లో ద‌స్త‌గిరి ఒక‌డు. అయితే.. త‌ర్వాత కాలంలో అప్రూవ‌ర్‌గా మారిపోవ‌డం.. బెయిల్ రావ‌డంతో ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు ఉన్నాడు. అయితే.. ఆయ‌న రెండు రోజుల కింద‌ట హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ.. తాను …

Read More »