Political News

ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్: చడీ చప్పుడు లేని కాంగ్రెస్!

ఔను.. నిజమే! ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. షెడ్యూల్ కూడా విడుదలైంది. మరో రెండు మూడు రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే కేరళలో నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో పెద్దగా చడీ చప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రచారం, స్టార్ క్యాంపెయినర్ల సందడి కనిపించేది. కానీ ఈసారి అలాంటి వాతావరణం ఎక్కడా …

Read More »

సిద్దిపేట నుంచి గెలిస్తే.. మంత్రి సీటు: రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌కు బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఇదేస‌మయంలో ప్ర‌తిప‌క్ష‌ బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావుకు సెగ పెంచేశారు. సిద్దిపేట నుంచి విజ‌యం ద‌క్కించుకునే కాంగ్రెస్ నేత ఎవ‌రైనా స‌రే.. మంత్రి వ‌ర్గంలో సీటు ఖాయ‌మ‌ని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సిద్దిపేట ఎవ‌రి జాగీరూ కాద‌న్న రేవంత్‌.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్క‌డ గెలిచి తీరుతుంద‌ని తేల్చి …

Read More »

అవమానాలే మిగిలాయా.. జీవన్ రెడ్డి బిగ్ డెసిషన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అనేక అవమానాలు, అనుమానాలు, సందేహాల మధ్య పార్టీలో కొనసాగలేమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, “నా రాజకీయ జీవితానికి మీ తోడు కావాలి. మీ మార్గదర్శనం కావాలి” అంటూ కార్యకర్తలను ఉద్దేశించి జీవన్ రెడ్డి ఆదివారం సాయంత్రం బహిరంగ లేఖ రాశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. గత 20 …

Read More »

ఫేక్ చలాన్ వలలో జనసేన ఎమ్మెల్యే

వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. పెద్దా చిన్నా అనే బేధం లేదు. ఎవ‌రు అందివ‌స్తే.. వారిని మోస‌గించ‌డ‌మే!. వారి సొమ్మును కాజేయ‌డ‌మే. అది ఏ రూపంలో అయినా కావొచ్చు. ఇందుగ‌ల‌దందు లేద‌ను సందేహం లేదు. సైబ‌ర్ మోసాలు ఏ రూపంలో అయినా.. విజృంభించ‌వ‌చ్చు. ఇదీ.. ప్ర‌స్తుతం పెరిగిన‌ టెక్నాలజీ ప్ర‌జ‌ల‌కు సంక‌టంగా మారిన దుస్థితిని క‌ళ్ల‌కు క‌డుతోంది. శ‌నివారం.. ఓ మాజీ డీజీపీ మ‌న‌వ‌రాలిని కోటి రూపాయ‌ల‌కు పైగా …

Read More »

2004 గాయం మర్చిపోలేదా? ఇక మళ్లీ జరగదన్న చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. దీంతో అప్పట్లో ఓటమి ఎదురైందని వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని …

Read More »

వైసీపీలో గుడివాడ పేచీ..!

వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేత కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బలమైన ఆర్థిక స్థాయి ఉండి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్నవారి కోసం వెతుకుతోంది. గత మూడు నెలలుగా గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ ఇదే దృష్టితో ఉంది. దీనికి కారణం, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటించిన నేపథ్యమే. గత ఎన్నికల్లోనే ఆయన ఈ …

Read More »

నంది అవార్డులపై మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాష్ట్రంగా అవతరించాక నంది అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోవడం గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రకటించి వరుసగా రెండేళ్లు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఏపీలోనూ నంది అవార్డులు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు గట్టిగా గళం వినిపించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించినట్లుగా ఈ ముగ్గురూ మాట్లాడడం మీద …

Read More »

అసెంబ్లీ టికెట్ కోసం సీఎంతో ఇంటర్వ్యూ

ఔను!. నిజ‌మే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టికెట్ కావాలంటే ముందుగా ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాలి. ఈ ఇంటర్వ్యూలో పాల్గొనాలంటే.. ఎంట్ర‌న్స్ ఫీజును చెల్లించాలి. ఈ ఫీజు నాన్ రిఫండ‌బుల్‌. ఒక వేళ ఇంట‌ర్వ్యూలో విఫ‌ల‌మై.. సీటు రాక‌పోతే దీనిని యాగీ చేయ‌డానికి, న్యాయ‌ప‌ర‌మైన పోరాటం చేయ‌డానికి కూడా వీల్లేదు. అంతేకాదు.. ఇంట‌ర్వ్యూకు వ‌చ్చేవారు.. త‌మ సొంత ఖ‌ర్చుల‌తో రావాలి.. సొంత బ‌స ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని రోజులైనా వేచి ఉండాలి. ఇంట‌ర్వ్యూ అయ్యాక‌.. …

Read More »

ఫ‌లించ‌ని బిజ్జ‌గింపులు.. జీవ‌న్ రెడ్డి `పంతం` ఇదే!

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, జ‌గిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి.. పార్టీని వీడేందుకే సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే ఆయ‌న బీఆర్ ఎస్ పార్టీలో చేర‌నున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. బీఆర్ ఎస్ పార్టీ కూడా ఆయ‌న‌తో చ‌ర్చ‌లు పూర్తి చేసింద‌ని.. కేసీఆర్ కీల‌క ప‌ద‌విని ఆఫ‌ర్ చేశార‌ని.. మ‌ళ్లీప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. మంత్రిప‌ద‌విని కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలిసింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ‌కత్వం.. తొలుత జీవ‌న్ రెడ్డి …

Read More »

వ‌డివ‌డిగా ఉద్యోగాలు.. `కూట‌మి` లెక్క ఇదీ!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌ల‌లో వ‌డివ‌డిగా ముందుకు సాగుతోంది. ఎక్క‌డ ఏ చిన్న అవ‌కాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 ల‌క్ష‌ల మంది పైచిలుకు నిరుద్యోగుల‌కు.. ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌లు చేసింది. గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు.. 20 ల‌క్ష‌ల మందికి ఐదేళ్ల‌లో ఉద్యోగాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ …

Read More »

తిరుమలలో లడ్డూ నాణ్యతపై సీఎం బాబు ఆరా

త‌న మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు.. శ‌నివారం ఉదయ‌మే తిరుమల శ్రీవారి ద‌ర్శనం చేసుకున్నారు. అనంత‌రం.. శ్రీవారి ప్ర‌సాదాన్ని రుచి చూశారు. ఆ త‌ర్వాత‌.. ఫ్యామిలీ అంతా గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోగా.. సీఎం చంద్ర‌బాబు స‌హా తిరుమ‌ల బోర్డు చైర్మ‌న్ నాయుడు, అధికారుల‌తో కలిసి.. ఆయ‌న క్యూలైన్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా …

Read More »

శ్రీవారి ఆలయానికి సాధారణ భక్తుడిలా.. చంద్రబాబు!

ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ప్రవేశం ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి …

Read More »