అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై ఆలోచిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. బెంగళూరులోని యలహంక నివాసాన్ని పరిమితంగా ఉపయోగిస్తున్న ఆయనపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో, పార్టీ వ్యవహారాల నిర్వహణకు మరింత అనుకూలమైన కేంద్రాన్ని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో హైదరాబాద్లోని లోటస్పాండ్ మళ్లీ జగన్ రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా …
Read More »తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజమే..
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ ఒక ట్వీట్ చేశారు. ‘ దైవం అంటే భక్తి లేదు. దేశం అంటే ద్వేషం. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు. ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు.. నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం.. అమరావతిని మార్చేస్తాం.. కట్టినవన్నీ కూల్చేస్తాం.. కంపెనీలన్నీ వెళ్లగొడతాం.. ఏమిటీ దుర్మార్గ పనులు జగన్ మోహన్ …
Read More »డీలిమిటేషన్… అందరిలోనూ ఒకే భయం!
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ శక్తివందన చట్టానికి సవరణల బిల్లు.. గురువారం పార్లమెంటుకు చేరింది. దీనిపై సభలో చర్చను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్రిజుజు ప్రారంభించారు. అనంతరం.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా దీనిపై ప్రసంగించారు. ఆ తర్వాత.. ఇతర పార్టీల సభ్యులు మాట్లాడారు. అందరిలోనూ ఒకే భయం! పార్లమెంటులో చర్చ …
Read More »మోడీ-షా… మాములోళ్ళు కాదండోయ్
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు. తాజాగా ఆ తీరును మరోసారి అందరికి అనుభవంలోకి వచ్చేస్తున్న పరిస్జితి. ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా రెండు కీలక అంశాల్ని తెలివిగా ఒకదాన్లోకి మరొకటి తీసుకొచ్చేయటం ద్వారా.. డబుల్ బెనిఫిట్ పొందాలన్న మాస్టర్ స్కెచ్ వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దశాబ్దాల పర్యంతం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు …
Read More »చంద్రబాబు అంటే ఆ మాత్రం ఉండదా?
పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్ సభ స్థానాల సంగతేంటి? 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. దీనికి తోడు బయటకు వచ్చిన బిల్లులోనూ దీనిపై స్పష్టత లేకపోవటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు (గురువారం) ఈ బిల్లును లోక్ సభలో …
Read More »బిల్లు బీజేపీది అయితే వైసీపీ మద్దతు ఉండదా
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే…బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ…తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా ఓకే చెప్పేసింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు సరైన దిశలోనే వెళుతోందని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త హోదాలో ఉన్న ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ప్రకటన ఇచ్చేశారు. నియోజకవర్గాల పునర్విభజనలో బీజేపీ ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోందని సజ్జల చెబుతున్నారంటే…బీజేపీ ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ …
Read More »విభజన చట్టానికి మించి తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు
లోక్ సభలో ఈ రోజు ప్రవేశ పెట్టే డీలిమిటేషన్ బిల్లు..మహిళా బిల్లు.. దీనికి తగ్గట్లుగా రాజ్యాంగ సవరణ బిల్లు మొత్తంగా ఒక్క అంశం మీదనే అందరి ఫోకస్ ఉంది. అది..నియోజకవర్గాల పునర్వభిజన బిల్లుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? మేలు జరుగుతుందా? అని. అయితే.. బిల్లులో కీలక అంశమైన.. నియోజకవర్గాల పెంపునకు సంబంధించి అనుసరించే మార్గంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇందుకు భిన్నంగా ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా.. నలుగురు కేంద్ర …
Read More »సభలో ప్రవేశ పెట్టే 3 బిల్లులు ఇవే… ఏ కూటమికి ఎంత బలం?
భారతదేశ చరిత్రలో ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 16)కు ఒక ప్రత్యేకత ఉండనుంది. సుదీర్ఘ విరామం తర్వాత లోక్ సభ స్థానాల పెంపునకు సంబంధించిన బిల్లుతో పాటు.. మహిళా రిజర్వేషన్ల అమలును మరింత ముందుకుతీసుకెళ్లే కీలక బిల్లును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని మోడీ సర్కారు భావిస్తోంది. అదే సమయంలో లోక్ సభలో స్థానాల పెంపుతోనే …
Read More »బీహార్పై బీజేపీ ముద్ర… ప్రాంతీయ పార్టీలకు అలెర్ట్
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు. అదేవిధంగా ఆయన కుటుంబం కూడా దాదాపు 40 సంవత్సరాలకు పైగానే రాజకీయాల్లో ఉంది. ఈ కుటుంబం గురించి పక్కన పెడితే బీహార్లో బిజెపి ప్రస్థానం ప్రారంభం కావడం, ఏకంగా ఇప్పుడు అధికారం దక్కించుకునే వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే అనేక ఆశ్చర్యకర …
Read More »మావిగన్కు చెక్… అమరావతి `అష్ట` దిగ్బంధం!
వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం+విజయవాడ+గుంటూరు నగరాలనుకలుపుతూ ఏర్పాటు చేసే రాజధాని)పై పెద్ద ఎత్తున వివాదం లేచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమరావతిని మరింత పటిష్టం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిని పూర్తిగా ఎనిమిది(అష్ట) జోన్లుగా విభజింది. దీంతో మావిగన్ ప్రాంతాలు సహా.. మరిన్ని ప్రాంతాలు ఈ రాజధాని పరిధిలోకి వచ్చాయి. ఫలితంగా మొత్తం రాజధాని ప్రాంతం 8,352.69 చదరపు కిలోమీటర్లకు చేరుతుంది. తద్వారా రేపు …
Read More »జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టిందని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా దినసరి కూలీలు, డ్రైవర్లు, హాకర్లు, చిరు వ్యాపారులు, పేదలు ఎంతో లబ్ధి పొందారని అన్నారు. వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత.. పేదలకు పెట్టే …
Read More »అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ను ప్రస్తావిస్తూ.. దానిని కొనియాడుతూ.. మరోవైపు అమరావతి వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి వైసీపీ కీలక నాయకుడు పేర్ని నాని తన మనసులోని మాటను మరోసారి బయట పెట్టారు. అమరావతిని తామేమీ అడ్డు కోవడం లేదన్నారు. అయితే.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates