Political News

ఆ ఒక్క మాటతో మంగ‌ళ‌గిరి మ‌న‌సు దోచేసిన లోకేష్‌!

రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. అయితే.. ఈ సెంటిమెంటు వ్య‌వ‌హారం ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క నేత‌కు ఒక్కొక్క ర‌కంగా ఉంటుంది. ఈ విష‌యంలో టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్‌.. మ‌రో అడుగు ముందుకు వేశారు. శ‌నివారం రాఖీ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఆయ‌న మంగ‌ళ‌గిరి కార్యాల‌యంలోనే అందుబాటులో ఉన్నారు. వాస్త‌వానికి సీఎం చంద్ర‌బాబు వెంట ఆయ‌న కూడా.. మ‌న్యం జిల్లాకు వెళ్లి.. జ‌న జాతీయ ఆదివాసీ …

Read More »

బాబూ ఇది చాలా మంచి పని

గిరిజ‌నులు, ఆదివాసీల‌ను వైసీపీ ఓటు బ్యాంకుగా మార్చింద‌ని.. వారిని ఓటు బ్యాంకుగానే చూసింద‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. శ‌నివారం.. జ‌న‌ జాతీయ ఆదివాసీ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. అల్లూరి సీతారామ‌రాజు మ‌న్యం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్యటించారు. ఈ సంద‌ర్భంగా స్థానిక గిరిజ‌నుల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు. తొలుత గిరిజ‌నుల సంప్ర‌దాయ నృత్యాల‌ను తిల‌కించారు. కొమ్ముల‌తో చేసిన త‌ల‌పాగాను ధ‌రించారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో చంద్ర‌బాబు …

Read More »

ఈసీ వర్సెస్ రాహుల్.. మరింత హీటెక్కింది

కేంద్ర ఎన్నికల సంఘం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల మధ్య నెలకొన్నవివాదం అంతకంతకూ ముదురుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సహకారంతోనే విజయం సాధించిందని రాహుల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై గురువారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ ఈసీపై సంచలన ఆరోపణలను గుప్పించారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా …

Read More »

రెండు రాష్ట్రాల్లో.. రాజ‌కీయ రాఖీలు.. !

రాఖీ పండుగ అంటే.. అన్న‌, త‌మ్ముళ్ల మేలు కోరి.. మ‌హిళ‌లు క‌ట్టే రాఖీ అన్న విష‌యం తెలిసిందే. ఇక‌, త‌మ తోబుట్టువు మేలు కోరి.. అన్న‌ద‌మ్ములు కూడా.. కానుక‌లు ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ద‌క్షిణాదిలో ఈ పండుగ జోరుగా సాగుతోంది. అయితే.. సాధార‌ణ రాఖీ పండుగ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ రాఖీ పండుగ మాత్రం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ఇరుగు పొరుగు పార్టీల‌కు చెందిన నాయ‌కులు …

Read More »

గువ్వలతో వెళ్లే ఆ ఐదుగురు ఎవరు?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో పొలిటికల్ జంపింగ్ లు మొదలైపోయాయి. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బీజేపీ కార్యాలయానికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాంచందర్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ కు చెందిన ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు. …

Read More »

మోడీ అర్జెంట్‌ కేబినెట్ భేటీ..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ టైమ్ అర్జెంటుగా కేబినెట్ భేటీ నిర్వహించారు. వాస్తవానికి కేబినెట్ భేటీ అంటే బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం కేబినెట్ మంత్రులతో ప్రధాన మంత్రి చర్చిస్తారు. ఆయన దేశంలో లేకపోయినప్పుడు మాత్రమే వాయిదా పడుతూ ఉంటుంది. ఈ దఫా మాత్రం శుక్రవారం మధ్యాహ్నం అనూహ్యంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులకు స్వయంగా ఫోన్లు చేసిన ప్రధాన మంత్రి మీటింగ్‌కు అర్జెంటుగా రావాలని …

Read More »

‘పడకగది ముచ్చట్లు కూడా విన్నారు’

తెలంగాణలో బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి పలు వివరాలను అధికారులకు అందించారు. ఆధారాలను కూడా సమర్పించారు. సుమారు 4 గంటలకు పైగానే ఆయన విచారణ ఎదుర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ హయాంలో పడకగది ముచ్చట్లు కూడా విన్నారని అన్నారు. ఈ కేసును …

Read More »

ఇది కూడా ఒక కేసా? కూనంనేని హ్యాపీస్‌

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని కొత్త‌గూడెం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2023లో విజ‌యం ద‌క్కించుకున్న క‌మ్యూనిస్టు నాయ కుడు, సీపీఐ నేత‌.. కూనంనేని సాంబ‌శివ‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌పై న‌మోదైన కేసును, అదేవిధంగా పిటిష‌న్‌ను కూడా సుప్రీంకోర్టు ప్రాథ‌మిక ద‌శ‌లోనే తోసిపుచ్చింది. ఇలాంటి కేసులు కూడా కేసులేనా? స‌మ‌యం వేస్ట్.. అని వ్యాఖ్యానిస్తూ.. కూనంనేనిపై న‌మోదైన పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. దీంతో కామ్రెడ్ కూనంనేనికి ఇక‌, చిక్కులు తొలిగిపోయిన‌ట్టే. ప్ర‌స్తుతంతెలంగాణ అసెంబ్లీలో …

Read More »

‘జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య’

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గత ఆరు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. హత్య జరిగి ఇంత కాలం అయినా సీబీఐ విచారణ పూర్తికాకపోవడం వివిధ అనుమానాలకు దారితీస్తోంది. ఈ కేసుపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి మాటల్లో, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డిల ఆధ్వర్యంలోనే వివేకా హత్య జరిగిందని ఆరోపించారు. వివేకాతో …

Read More »

వైసీపీకి.. కొత్త స‌ల‌హాదారులు?

ఒక‌ప్పుడు వైసీపీ ఎలాంటి అడుగులు వేయాల‌న్నా స‌ల‌హాదారుల‌ను వెంట‌పెట్టుకునేది. ముఖ్యంగా ప్ర‌జ ల మ‌ధ్య‌కు వెళ్లాల‌న్నా.. ప్ర‌జ‌ల‌తో చ‌ర్చ‌లు చేయాల‌న్నా.. ఇత‌ర ప‌థ‌కాల‌ను రూపొందించాల‌న్నా.. కూడా స‌ల‌హాదారుల‌కు పెద్ద పీట వేసేవారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా.. స‌ల‌హాదారుల‌కు ప్రాధాన్యం ఉంది. కానీ, ఎన్నిక‌ల అనంత‌రం… కొంద‌రు వారంత‌ట వారుగా త‌ప్పుకొన్నారు. మ‌రికొంద‌రిని పార్టీనే త‌ప్పించింది. అయితే.. ఎప్పుడైనా స‌ల‌హాదారులు ఉంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీలో …

Read More »

కేసీఆర్, కేటీఆర్, సంతోష్ ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదు

తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త నిజం బయటకు వస్తోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలపై నిఘా పెట్టేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించగా.. ఆ తర్వాత ఈ వ్యవహారం మరింత విస్తృతంగా జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని నేతలపైనా నిఘా పెట్టేందుకు కూడా పార్టీ అధిష్ఠానం ఫోన్ ట్యాపింగ్ నే వినియోగించిందని శుక్రవారం కేంద్ర మంత్రి బండి …

Read More »

తగ్గేదేలే!…అమెరికాకు భారత్ గట్టి కౌంటర్!

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాకు ప్రపంచంలోని చాలా దేశాలు వణికిపోవచ్చు గాక… భారత దేశం మాత్రం నువ్వెంత? నీ పన్నులెంత? అన్నట్టుగా అమెరికా టారిఫ్ లను అలా లైట్ తీసుకుంది. అంతటితో ఆగని భారత్… అమెరికాకు దిమ్మతిరిగిపోయే రీతిలో రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చిపడేసింది. అమెరికాతో కీలకమైన ఆయుదాల కొనుగోలు ఒప్పందాలను భారత్ రద్దు చేసుకుంది. అందులో భాగంగా ముందుగా క్షిపణుల కొనుగోలును నిలిపివేస్తున్నట్లు బారత్ శుక్రవారం మధ్యాహ్నం సంచలన నిర్ణయం తీసుకుంది. మున్ముందు …

Read More »