Political News

మీడియాకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్‌!

బీఆర్ఎస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాను ఉద్దేశించి కీల‌క హెచ్చ‌రిక‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి అనుకూలంగా తొత్తులుగా మారుతున్నార‌ని మీడియా సంస్థ‌ల‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. అయితే.. ప్ర‌జ‌లు కూడా చూస్తున్నార‌ని.. ఈ విష‌యం తెలుసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం మీడియాపై కూడా ఒత్తిడి తెస్తోందని, కొంద‌రు య‌జ‌మానులు లొంగిపోయార‌ని, అందుకే ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తి చూప‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అంటూ.. వేల కోట్లు …

Read More »

షాకింగ్‌: బీజేపీకి.. బీఆర్ఎస్ మేలు!

ఇదొక షాకింగ్ ప‌రిణామం. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్‌.. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. మంగ‌ళ‌వారం దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి త‌ర‌ఫున సీపీ రాధాకృష్ణ‌న్‌, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి త‌ర‌ఫున జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి త‌ల‌ప‌డుతున్న ఈ పోరులో త‌ట‌స్థ పార్టీల‌పై కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుకోగా.. వీరిని దూరంగా ఉంచే ప్ర‌య‌త్నాల్లో బీజేపీ నాయ‌కులు త‌ల‌మున‌క‌ల‌య్యారు. త‌మ‌కు …

Read More »

ఎవ‌రు ఎటువైపు: రేపు ఉప‌రాష్ట్ర‌ప‌తి పోరు!

దేశ రెండో పౌరుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అయింది. మంగ‌ళ‌వారం(ఈ నెల 9) పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఎన్నిక‌లో రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల‌లోని స‌భ్యుల‌తోపాటు.. నామినేటెడ్ స‌భ్యులు కూడా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే.. అస‌లు కాక తాజాగా ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న‌ ఎన్డీయే ప‌క్షాల త‌ర‌ఫున మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ బ‌రిలో ఉన్నారు. ఇక‌, …

Read More »

ప‌తాక స్థాయికి ‘కూట‌మి’

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఈ నెల 10వ తేదీ(బుధ‌వారం)నాటికి 15 నెల‌లు నిండుతున్నాయి. ఈ క్ర‌మంలో కూట‌మి బ‌లాన్ని మ‌రింత పెంచుకునేందుకు, ప్ర‌స్తుతం ఉన్న బ‌లాన్ని ప్ర‌జ‌ల ముందు చాటేందుకు మూడు పార్టీలు స‌ర్వ‌స‌న్న‌ద్ధ‌మవు తున్నాయి. గ‌త 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌లు ఉమ్మ‌డిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాయి. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వ‌చ్చాయి. ఉమ్మ‌డిగానే సీట్లు పంచుకున్నాయి. అధికారంలోకి వ‌చ్చాక ఉమ్మ‌డిగానే ప‌దవులు కూడా …

Read More »

జైల్లో క్ల‌ర్కుగా.. మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డు!

దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి దేవెగౌడ మ‌న‌వ‌డు, మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్‌కు ‘సెక్స్ కుంభ‌కోణం’ కేసులో జీవిత ఖైదు ప‌డిన విష‌యం తెలిసిందే. క‌ర్ణాట‌క‌లోని హాస‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న దేవెగౌడ పెద్ద కుమారుడి కొడుకు ప్ర‌జ్వ‌ల్‌.. ఇంట్లో ప‌నిమ‌నిషిని బెదిరించి సెక్స్ చేశార‌ని, ప‌లుమార్లు ఆమెతో ఉన్నార‌ని, ఆయా దృశ్యాలు వీడియోలు తీసి.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశార‌న్న‌ది కేసు. గ‌త‌ ఏడాది …

Read More »

బాబు ప్లేస్‌లో లోకేష్: కీలక బాధ్యతలు!

సీఎం చంద్రబాబు ప్లేస్‌లో మంత్రి నారా లోకేష్ కేంద్రంలో కీలక చక్రం తిప్పనున్నారు. మంగళవారం జరగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు ఓటు వేయేలా ఆయనే పర్యవేక్షణ చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. దీంతో సోమవారం మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీలతో భేటీ అవుతారు. …

Read More »

మఠంలో నారా లోకేష్ పర్యటన.. మోడీ సలహా మేరకేనా?

ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా కర్ణాటకలో పర్యటించారు. అక్కడి సుప్రసిద్ధ ఆదిచుంచనగరి మహాసంస్థాన మఠాన్ని ఆయన సందర్శించారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు నిర్మలానందనాథ మహాస్వామీజీని కలుసుకుని సుమారు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం అక్కడి కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మఠం నిర్వహణలో ఉన్న పలు స్కూళ్లు, మెడికల్ కాలేజీలను కూడా నారా లోకేష్ సందర్శించారు. వాటి వివరాలు తెలుసుకున్నారు. …

Read More »

జిల్లాకో చరిత్ర: టీడీపీలో రెండు పవర్ సెంటర్లు..!

జిల్లాకో విధంగా పవర్ సెంటర్లు ఏర్పడ్డాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులు తర్వాత జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాము చెప్పిన వారికి పనులు చేయాలని నామినేటెడ్ పదవులు తీసుకున్నవారు కోరుతుండగా, తమ నియోజకవర్గంలో తమ మాటను కాదని పనులు చేయడానికి వీలులేదని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎక్కువగా ఇది టిడిపిలోనే కనిపిస్తుండటం, పవర్ …

Read More »

పులివెందుల‌పై మ‌రో స్ట్రాట‌జీ.. జ‌గ‌న్ అలెర్ట్ అవుతారా..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌పై మ‌రో వ్యూహంతో ముందుకు సాగాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క‌స‌రత్తు కూడా ముమ్మ‌రం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. వైసీపీ త‌ర‌ఫున ఈ రెండు చోట్ల పోటీ చేసిన వారికి కనీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు. ఈ పెను దెబ్బ నుంచి వైసీపీ …

Read More »

ముందు మీరు.. త‌ర్వాతే.. నేను: జ‌గ‌న్ తీరుపై వైసీపీ విస్మ‌యం

‘జ‌గ‌న్ అంటే జ‌నం-జ‌నం అంటే జ‌గ‌న్‌’ ఒక‌ప్పుడు వైసీపీలో వినిపించిన నినాదం ఇది. అయితే.. రాను రాను ఈ నినాదం రూటు మారుతోంది. జ‌నం కోసం వైసీపీ చేస్తున్న కార్య‌క్ర‌మాలే త‌గ్గిపోగా.. ఇప్పుడు అర‌కొర‌గా నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు కూడా జ‌గ‌న్ లేకుండా పోతున్నారు. ఆయ‌న తాపీగా తాడేప‌ల్లిలోని ఆఫీసులో కూర్చొని కునుకు తీస్తుండ‌గా.. ఇత‌ర నాయ‌కులు, కార్యకర్త‌లు రోడ్డెక్కాల‌ని కోరుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయా కార్య‌క్ర‌మాలు మొక్కుబ‌డి ఫొటో సెష‌న్లుగా …

Read More »

మ‌ద్యం స్కామ్‌లో సంచ‌ల‌నం.. ‘వారంద‌రికీ’ బెయిల్‌!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌భుత్వం చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో మొత్తం 3500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారాయ‌ని, దారి మ‌ళ్లాయ‌ని, విదేశాల‌కు సైతం పంపించార‌ని ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే 14 మందిని అరెస్టు చేశారు. వీరంతా హైప్రొఫైల్ ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ప‌రిణామాల‌తో ఈ కేసు …

Read More »

బాబు ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు మ‌రింత డ్యామేజీ.. !

వైసీపీ అధినేత జ‌గ‌న్ అనుస‌రిస్తున్న మొండి వైఖ‌రిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ‌మవుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ కు ఇంటా బ‌య‌ట కూడా సెగ త‌గులుతోంది. స‌భ‌కు వెళ్లాల్సిందేన‌ని.. సీమ‌కు చెందిన నాయ‌కులు కోరుతున్నారు. ఇప్ప‌టికే భారీ డ్యామేజీ జ‌రిగింద‌ని.. దీని నుంచి బ‌య‌ట ప‌డేందుకు స‌భ‌ను వినియోగించుకుందామ‌ని.. చెబుతున్నారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇస్తే త‌ప్ప‌! …

Read More »