Political News

‘అనంతపురం అంటే టీడీపీ..టీడీపీ అంటే అనంతపురం’

తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అనంతపురం జిల్లా కంచుకోట వంటిది. అన్న ఎన్టీఆర్ మొదలు బాలకృష్ణ వరకు అందరినీ అనంతపురం అక్కున చేర్చుకుంది. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ వంటి నేతలను ఆ జిల్లా అందించింది. ఇక, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురంలోని 14 స్థానాలకుగాను 14 టీడీపీ కైవసం చేసుకుందంటే అక్కడ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అనంతపురం అంటేనే టీడీపీ…టీడీపీ అంటేనే …

Read More »

తాట తీస్తాం.. స్మగ్లర్లకు పవన్ మాస్ వార్నింగ్

ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్ ను ఈరోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎ, బి, సీ మరియు నాన్‌గ్రేడ్‌ల వారీగా దుంగల వివరాలు తెలుసుకొని రికార్డులు పరిశీలించారు. ప్రతి గోడౌన్లో రికార్డులను పరిశీలించిన అనంతరం, ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక …

Read More »

‘కూటమి కలిసి ఉంటే వైసీపీకి మంచిది’

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు వ‌చ్చే 15 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే కాద‌ని.. జీవితాంతం క‌లిసి ఉండాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. జీవితాంతం కూట‌మిగా ఉంటేనే వైసీపీకి మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా ఉండాల‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మి క‌ట్టార‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే కూట‌మి కొన‌సాగాల‌ని కోరుకుంటున్నామ‌న్నారు. త‌ద్వారా.. వ్య‌తిరేక …

Read More »

ఆ 48 మంది ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్

ఓ పక్క అమరావతి రాజధాని నిర్మాణ పనులు..మరో పక్క రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాల్లో వేట..మరో పక్క సంక్షేమ పథకాల అమలుపై నేరుగా పర్యవేక్షణ…ఇలా ఏపీ సీఎం చంద్రబాబు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. అయినా సరే ప్రతి నెలా 1వ తేదీన సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంచుతున్నారు. అంతేకాదు, ఈ క్రమంలో వారేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అన్న విషయాన్ని స్వయంగాతెలుసుకుంటారు. ముఖ్యమంత్రి అయినా …

Read More »

తిరుప‌తి అడవుల్లో పవన్… ఆ లుక్ ఏంటి డీసీఎం సార్

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. శ‌నివారం తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని మామండూరులో ఉన్న అట‌వీ ప్రాంతాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. అట‌వి త‌ల్లి బాట కార్య‌క్ర‌మాన్ని గ‌తంలో ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో అట‌వీ విస్తీర్ణాన్ని పెంచాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా మామండూరులో దీనికి శ్రీకారం చుట్టారు. మామండూరు అట‌వీ ప్రాంతం ఒక‌ప్పుడు ద‌ట్టంగా ఉండేది. అయితే.. త‌ర్వాత కాలంలో వృక్షాల చోరీ.. స‌హా …

Read More »

దమ్ముంటే పట్టుకోరా శికవత్తు అని పోలీసులకు దొంగ సవాల్

100 బండ్లు దొంగతనం చేశా…నా మీద కేసులున్నాయి…ఏం చేసుకుంటారో చేసుకోండి….అంటూ పోలీసులకు ఓ బైక్ దొంగ సవాల్ విసిరాడు. తన మిత్రులతో పందెం కాసి మరీ దమ్ముంటే పట్టుకోరా షెకావత్….పట్టుకుంటే వదిలేస్తా బైక్ దొంగతనాలు.. అంటూ ఏకంగా ఓ వీడియో చేశాడు. అయితే, ఇది సినిమా కాదు…కాబట్టి పోలీసులు ఆ వీడియోను చూసి ఆ దొంగను 24 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి నారా లోకేశ్ తన …

Read More »

బీహార్ కు లోకేష్.. పెద్ద బాధ్యతే!

ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పై పెద్ద బాధ్యత ఉంచారు. ఎన్డీఏ తరపున పాట్నాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం పాట్నాకు నారా లోకేశ్ వెళ్లనున్నారు. ఎన్డీఏ తరపున పాట్నాలో లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం పాట్నాలో రెండు సమావేశాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు బీహార్ ఛాంబర్ ఆఫ్ …

Read More »

ఏపీపై పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం.. 4 గంట‌ల్లో ల‌క్ష కోట్లు!

కేవ‌లం 4 గంట‌ల చ‌ర్చ‌లు.. సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన భ‌రోసా.. ఇంకేముంది.. ఏపీపై మ‌రో ల‌క్ష కోట్ల రూపాయ‌ల పైచిలుకు.. పెట్టుబ‌డుల క‌నక వ‌ర్షం కురిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పెట్టుబ‌డుల ప్ర‌య‌త్నాలు.. ఒక ఎత్త‌యితే, తాజాగా ఒక్క శుక్ర‌వారం రోజే.. కేవ‌లం 4 గంట‌ల్లోనే భారీసంఖ్య‌లో సంస్థ‌లు, పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రావ‌డం.. పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీక రించ‌డం.. త‌ద్వారా ఉద్యోగాల క‌ల్ప‌న‌కు మార్గం సుగ‌మం కావ‌డం.. వెంట …

Read More »

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఏపీలో రియాక్షన్!

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నిక ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 11న జరగబోయే ఈ పోలింగ్‌లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ పోటీ పడుతున్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా సహజంగా ప్రజల్లో కొంత ఆసక్తి ఉంటుంది., అయితే జూబ్లీహిల్స్ …

Read More »

మాగంటి మృతిపై సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాటల యుద్ధాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లారు. తాను మాగంటి గోపీ కుమారుడినని, తనను అమెరికా నుంచి ఇక్కడకు రావద్దని కొందరు నేతలు బెదిరించారని ఓ యువకుడు మాట్లాడిన వీడియో సంచలనం రేపింది. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం …

Read More »

తాట తీస్తా… ప్రైవేటు కాలేజీలకు సీఎం వార్నింగ్

ఫీజు రీయింబర్స్‎మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం బంద్ న‎కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం బకాయిలు 3 వేల కోట్లు మాత్రమే అని చెబుతుంటే..కాలేజీల యాజమాన్యాలు ఆరు వేల కోట్లు డిమాండ్ చేస్తున్నాయని టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆ కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తమాషాలు …

Read More »

రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకున్న కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు సీఎంగా ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. అలా …

Read More »