పులివెందులలో ఏం జరుగుతోంది.? కడపలో ఏం జరుగుతోంది.? కుప్పం అలాగే పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి, సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో పరిస్థితుల్ని పట్టించుకోకపోతే ఎలా.? ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.! వాస్తవానికి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ నియోజకవర్గాల్లో వైసీపీ పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, అక్కడ వైసీపీని కాదని, ఇంకో పార్టీకి ఓటేసేంత రిస్క్ అక్కడి ఓటర్లు చెయ్యరన్నది వైసీపీ …
Read More »చంద్రబాబు వ్యూహం ఫలిస్తే, ఇదో పెను సంచలనమే
2019 ఎన్నికల్లో ఓ వేవ్ వచ్చింది.. అది అనూహ్యమైన వేవ్.! ఎవరూ ఊహించనంత గొప్ప విజయం వైసీపీకి దక్కింది. నిజానికి, వైసీపీ కూడా అంతటి విజయాన్ని ఊహించి వుండదు. ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. అంటాం ఇలాంటి విక్టరీని. మళ్ళీ ఇంకేదన్నా రాజకీయ పార్టీ లేదా, కొన్ని పార్టీల కూటమి అలాంటి విజయం సాధించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అంతటి వ్యతిరేకత, అధికార పార్టీ మీద వుండాలి. విపక్షాలన్నీ ఐక్యంగా …
Read More »కేశినేని బ్రదర్స్ ఫోన్లు ట్యాప్ చేయిస్తున్న బాబు, జగన్?
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కీలక పార్టీ తరఫున పోటీ చేస్తున్న కేశినేని బ్రదర్స్ పరస్పరం సంచలన ఆరోపణలు చేసుకున్నారు. నా ఫోన్ టీడీపీ అధినేత చంద్రబాబు ట్యాప్ చేస్తున్నారని.. ప్రస్తుత ఎంపీ కేశీనేని నాని ఆరోపించగా.. కాదు, నా ఫోనే సీఎం జగన్ ట్యాప్ చేస్తున్నారంటూ.. కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఇద్దరూ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా రు. నాని నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే ఉన్నారు. …
Read More »డ్రగ్స్ ను BJPకి అంటించిన షర్మిల
బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ లో విశాఖ పోర్టుకు చేరిన 25 వేల కిలోల డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ వెనుక ఉన్నది మీరంటే మీరని టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్ పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ డ్రగ్స్ వెనుక బీజేపీ హస్తం …
Read More »బీఆర్ఎస్ : అభిప్రాయాలకు వాల్యూ ఇచ్చారే!
ఇప్పటి వరకు అటు అసెంబ్లీకైనా.. ఇటు పార్లమెంటుకైనా అభ్యర్థులను ప్రకటించేందుకు.. అంతా తన ఇష్టం అన్నట్టుగానే వ్యవహరించిన తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి అదికూడా చివరి నిముషంలో మాత్రం రూటు మార్చారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే..ఇటీవల కాలంలో కీలక నాయకులు జంప్ చేశారు. దీంతో రూటు మార్చుకుని.. అందరికీ ఫోన్లు చేసి.. అందరి అభిప్రాయాలు తెలుసుకుని పార్టీ టికెట్లను ఖరారు చేయడం …
Read More »పీ-గన్నవరం, పోలవరం.. జనసేనకే!
ఏపీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం సహా కీలకమైన ఎస్టీ నియోజకవర్గం పోలవరం కూడా జనసేన ఖాతాలోకే చేరాయి. వాస్తవానికి పీ. గన్నవరంలో తొలుత టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా ఈ సీటు జనసేనకు మారింది. తొలి విడత టీడీపీ జాబితాలో ఆ పార్టీ నేత మహాసేన రాజేశ్ కు(యూట్యూబర్గా గుర్తింపు పొంది.. రాజకీయ విశ్లేషణలు, వైసీపీపై …
Read More »రూ.500,200 నోట్ల రద్దుతోనే వైసీపీకి చెక్ : చంద్రబాబు
రాబోయే ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసేందుకు డిజిటల్ కరెన్సీ రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, పెద్దనోట్ల రద్దు మాదిరిగా రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర సంపదనంతా హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. తమ అక్రమాలను వైసీపీ నేతలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించారని ఎద్దేవా చేశారు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేశారని, జగన్ వంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పారు. జగన్ నోరు …
Read More »పులివెందుల గ్రౌండ్ రిపోర్ట్: జగన్కి తిరుగులేదుగానీ..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన్ని రాజకీయంగా ఢీ కొట్టే సత్తా ఎవరికైనా వుందా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇలా వైఎస్ కుటుంబీకులే చాలాకాలంగా పులివెందుల నియోజకవర్గాన్ని ఏలుతున్నారు.! ఔను, ఏలుతున్నారనడమే కరెక్ట్.! పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడటమంటే చిన్న విషయం కాదు.. శాల్తీలు లేచిపోతాయ్.. అనే భావన ఒకటుంది. వైసీపీ శ్రేణులు ఇదే మాట …
Read More »ఆ ఆరు ఎందుకు ఆపారు?.. బాబు వ్యూహంపై తమ్ముళ్ల తర్జన భర్జన
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆయా పార్టీలకు పోగా.. 144 అసెంబ్లీ స్థానాలను తన దగ్గర ఎట్టుకున్నారు. ఈ క్రమంలో తొలి విడతలోనే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మలి విడతలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక, తాజాగా 11 మందిని ప్రకటించారు అయితే.. మొత్తం 144లో ఇప్పటి …
Read More »లోకేష్ వాల్లకి టికెట్లు ఇప్పించేసుకున్నట్టే
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వెంట నడిచిన నాయకులకు న్యాయం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది.. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. ఈ యా త్ర ద్వారా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇక, ఈ యాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది ఇలానే అనేక మంది యాత్రకు సహకరించారు. ఆర్థిక సాయం చేయడంతోపాటు.. జనాలను తరలించ డం వరకు …
Read More »ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయట్లేదు..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్కు-పోలింగ్కు మధ్య భారీ గ్యాప్ వచ్చింది. దీంతో నాయ కులు ఎక్కడికక్కడ తొంగుంటున్నారు. ఇప్పుడే ప్రచారం చేస్తే జేబులు ఖాళీ అవుతాయని అనుకుంటు న్నారో.. లేక.. ఇప్పటి నుంచి అన్నిరోజులు ఎండలో తిరగలేమని బావిస్తున్నారో.. తెలియదు కానీ.. అన్ని పార్టీల నాయకులు, టికెట్లు ప్రకటించిన తర్వాత కూడా పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. అయితే.. ఈ సమ యాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు సద్వినియోగం …
Read More »పవన్ వర్సెస్ గీత.. ఆస్తుల్లోనూ పోటీ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈయనపై వైసీపీ తరఫున సీనియర్ నాయకురాలు, కాకినాడ ఎంపీ వంగా గీత ఢీ అంటున్నారు. వీరిద్దరి విషయం రాజకీయంగా చర్చకు వస్తున్న తెలిసిందే. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనేది ఒక చర్చ అయితే.. ఎవరెవరి ఆస్తులు ఎంత? అనేది కీలకంగా మారింది. ఇటీవల పవన్ మాట్లాడుతూ.. తనను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates