Political News

ఆ ఇద్దరి పైనే అందరి కళ్ళూ

ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ)కి ఎవరు నేతృత్వం వహించాలనే విషయమై సస్పెన్సు పెరిగిపోతోంది. నేతృత్వం వహించే విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అయితే బాగుంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించారు. అయితే ఇదే సందర్భంలో మరో ఇద్దరి పేర్లు కూడా భాగస్తుల పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 19 ప్రతిపక్షాలు కలిసి రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోడిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జేసీసీని ఏర్పాటు …

Read More »

తాలిబాన్ల కిరాతకం.. శవాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి…!

ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలా అమెరికా రక్షణ దళం.. ఆప్ఘానిస్తాన్ ని వదిలేసి వెళ్లిందో లేదో.. ఇలా తాలిబాన్లు తమ అరాచకాలను రెట్టింపు చేయడం గమనార్హం. అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేటాడుతున్నారు. తాజాగా ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి తీసుకెళ్లారు తాలిబన్లు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియాలో …

Read More »

విజ‌య‌మ్మ స‌భ‌కు వెళ్తే మంట‌.. వెళ్ల‌క‌పోతే.. తంటా..

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. స‌తీమ‌ణి.. ఒక‌ప్ప‌టికీ కాంగ్రెస్ నేత‌ల‌కు వ‌దిన‌మ్మ‌.. అమ్మ‌.. అక్క అని ఆత్మీ యంగా పిల‌వ‌బ‌డిన‌ విజ‌య‌మ్మ పిలిచింది! వైఎస్ 12వ వర్ధంతికి అంద‌రూ రండి.. ఆయ‌న‌ను స్మ‌రించుకుం దాం! అని ఆహ్వానించింది. మ‌రి ఇప్పుడు వెళ్లాలా? వ‌ద్దా? చేవెళ్ల చెల్లెమ్మ‌.. స‌బితా ఇంద్రారెడ్డి నుంచి రాజ మండ్రి అన్న‌య్య‌.. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ వ‌ర‌కు అంద‌రిదీ ఇదే ప్ర‌శ్న‌.. ఇదే అంత‌ర్మ‌థ‌నం. సెప్టెంబ‌రు 2 వైఎస్ పుష్క‌ర …

Read More »

ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఈటల

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ నేపథ్యంలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే తనపై పోటీకి కెసిఆర్ ఆర్ కే లేదా ఆయన అల్లుడు మంత్రి హరీష్ రావు ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడదామని…. తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా …

Read More »

జ‌గ‌న్ ఎక్క‌డుంటే.. అదే రాజ‌ధాని: మంత్రి మేక‌పాటి

ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌ధాని విష‌యం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని.. రాజ‌ధాని రైతులు 700 రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా న‌డుస్తున్నాయి. ఈ విష‌యంలో ఒక ఉద్విగ్న‌భ‌రిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. అయితే.. అధికార పార్టీ నేత‌లు.. మంత్రులు మాత్రం త‌ర‌చుగా అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేస్తూ.. రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా.. రాష్ట్రంలో చ‌ర్చ జ‌ర‌గ‌డం.. అమ‌రావ‌తి రైతులు మ‌రింత ఆగ్ర‌హం …

Read More »

తెలంగాణ సర్కారుకు షాక్ – స్కూళ్లు తెరవద్దని తేల్చేసిన హైకోర్టు

సెప్టెంబరు ఒకటి నుంచి తెలంగాణలో స్కూళ్లు ప్రారంభంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కారణంగా ఆన్ లైన్ చదువులకు ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. తాజాగా ప్రభుత్వం స్కూళ్లను ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. స్కూళ్లు ఓపెన్ చేయటం.. కచ్ఛితంగా స్కూళ్లకు వెళ్లాల్సిందే అన్నది సరి కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు …

Read More »

ఈసారి కూడా ఇడుపులపాయలో అన్నాచెల్లెలు ఎదురుపడనట్లే

సెప్టెంబరు 2.. ఇప్పుడీ డేట్ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల రాజకీయనేతలతో పాటు.. సామాన్యులంతా సెప్టెంబరు 2 వంక ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్ర ఉత్కంఠను రేపుతున్న ఇదే రోజున దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్థంతి జరగనుంది. జయంతి రోజున వైఎస్ కుమారుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కుమార్తె షర్మిలలు ఎవరికి వారుగా ఇడుపుల పాయలో నివాళులు అర్పించటం తెలిసిందే. తెలంగాణలో …

Read More »

రూ.7వేల కోట్ల అప్పుకు ఏపీ సర్కారు అలా చేస్తుందా?

అప్పుల తిప్పలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూ వేధిస్తున్నాయి. తలకు మించిన సంక్షేమ పథకాల అమలుతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. అప్పుల మీద అప్పులు తీసుకొస్తూ బండి నడిపే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రూ.7వేల కోట్ల అప్పు కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రంగంలోకి దిగింది. అయితే.. ప్రభుత్వం ఇచ్చే కొత్త గ్యారెంటీకి అవకాశం లేకున్నా.. ఫైలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. …

Read More »

ఉద్యోగి ఫిట్ గా ఉంటే నెల జీతం బోనస్

కరోనా మాయదారి ఎంట్రీతో యావత్ ప్రపంచం మారిపోయింది. కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా మారింది. అన్ని మారిపోవటం.. ప్రతి దగ్గర కరోనా ప్రభావం పడింది. కరోనా ముందు వరకు ఆఫీసులకు వెళ్లి రావటం ఉంటే.. మాయదారి మహమ్మారి పుణ్యమా అని అందుకు భిన్నమైన పరిస్థితి. నెలల తరబడి సాగుతున్న వర్కు ఫ్రం హోం ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. సరైన వ్యాయామం లేకపోవటం.. ఇష్టారాజ్యంగా ఆహార అలవాట్ల కారణంగా …

Read More »

రేవంత్ రెడ్డి కి చెక్.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!

తెలంగాణలో కేసీఆర్ కి పంటికింద రాయిలాగా.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తగులుతూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా… కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉంటారు. అందుకే రేవంత్ రెడ్డిని పడగొట్టేందుకు టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. రేవంత్ ని ఓడించేందుకు భారీ కసరత్తే జరిగింది. రేవంత్ కి కంచుకోటలా ఉండే కొడంగల్ లోనే.. ఆయనను స్వల్ప మెజార్టీతో ఓడించారు. …

Read More »

బ్రేకింగ్.. ఈనాడుకు కార్టూనిస్ట్ శ్రీధర్ టాటా

ఈనాడు పత్రికలో వార్తలకంటే ముందు పాఠకులు ఎంతో ఆసక్తిగా చూసే అంశం.. కార్టూన్. తెలుగులో దశాబ్దాలుగా నంబర్ వన్ కార్టూనిస్ట్‌గా కొనసాగుతున్న శ్రీధర్ ఈ కార్టూన్లు వేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనాడుతో శ్రీధర్‌ది విడదీయరాని అనుబంధం. ఈనాడు పత్రిక వయసు 41 ఏళ్లయితే.. అందులో 40 సంవత్సరాలు శ్రీధర్ పని చేయడం విశేషం. అంటే ఈనాడుతో ఆరంభం నుంచి కొనసాగుతున్నారన్నమాట. ఆయన కార్టూన్ల స్థాయి గురించి.. అవెంతగా తెలుగు పాఠకులకు …

Read More »

వైఎస్ సన్నిహితులతో విజయమ్మ భేటీ ?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితులకు ఆయన భార్య విజయమ్మ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లో విజయమ్మ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కు సన్నిహితులుగా ఉన్నవారిని, మంత్రివర్గంలో కలిసి పనిచేసిన వారిని, గట్టి మద్దతుదారులుగా ఉన్నవారికి విజయమ్మ ఇప్పటికే ఫోన్లుచేసి ఆహ్వానించినట్లు సమాచారం. ఆ ప్రత్యేక కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తారనే విషయంలో క్లారిటీలేదు. అయితే కార్యక్రమానికి …

Read More »