రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా మంచి ఫలితాలు సాధించాలన్నది రేవంత్ రెడ్ది టార్గెట్. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో అయితే దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. మరికొన్ని జిల్లాల్లో మెజారిటి స్ధానాల్లో గెలిచింది. అయితే వివిధ జిల్లాల్లో ఇంతటి ప్రభావం చూపించిన కాంగ్రెస్ గ్రేటర్ …
Read More »ఓకే.. ‘కారు’ సర్వీసింగుకే వెళ్లింది.. డౌట్ వస్తుందబ్బా!
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కేటీఆర్.. తాజాగా “మా కారు సర్వీసింగుకే వెళ్లింది” అని మరోసారి కుండబద్దలు కొట్టారు. అయితే.. ఆయన గత డిసెంబరులో ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ మాటను 50 నుంచి 60 సార్లు చెప్పి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. కేటీఆర్ చెబుతున్న మాట ఇదే కావడం గమనార్హం. సందర్భంతో పనిలేకుండా.. సమయంతో నూ పనిలేకుండా.. …
Read More »టికెట్ వస్తుంది.. రాకపోతే, చేతులు ముడుచుకుని కూర్చోను!
టీడీపీ-జనసేన టికెట్ల పంపకాల వ్యవహారం అగ్గిని రాజేస్తోంది. 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 118 స్థానాలతో కూడిన తొలి జాబితాను మాత్రమే టీడీపీ-జనసేనలు జారీ చేశాయి. వీటిలో టికెట్ దక్కని వారు ఒకవైపు నిప్పులు చెరుగుతున్నారు. అంతేకాదు.. రోడ్డెక్కి నిరసనలు కూడా చేస్తున్నారు. అయితే.. మరో 57 నియోజక వర్గాలకు అసలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో దాదాపు అన్నీ కాంప్లికేటెడ్ నియోజకవర్గాలే కావడం గమనార్హం. ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గం …
Read More »టీడీపీ-జనసేన.. అసలు సవాల్ ముందుంది
మొత్తానికి తెలుగుదేశం-జనసేనల కూటమి నుంచి తొలి జాబితా బయటికి వచ్చేసింది. టీడీపీ నుంచి 94 మంది.. జనసేన నుంచి 5 మందిని తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన మొత్తంగా 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. దీనిపై జనసైనికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమందేమో.. పవన్ అన్నట్లే ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు, మెజారిటీ గెలవడం, జగన్ను ఓడించడం ప్రధాన లక్ష్యం …
Read More »ఏపీలో రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు?
రేవంత్ రెడ్డి షెడ్యూల్ రెడీ అయ్యిందా ? తెలంగాణా సీఎం రేవంత్ షెడ్యూల్ ఇపుడు రెడీ అవటం ఏమిటి ? ముందుగానే రెడీ అయిపోతుంది కదాని అనుమానం వచ్చిందా ? షెడ్యూల్ సిద్ధమైంది తెలంగాణాలో కాదు ఏపీలో. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయటానికి ఏపీలో రేవంత్ షెడ్యూల్ ను ఏపీ కాంగ్రెస్ రెడీ చేసిందట. మొదటి బహిరంగసభ ఈనెల 25వ తేదీన తిరుపతి జిల్లాలో జరగబోతోంది. …
Read More »“రెండు రోజుల్లో బూతులు నేర్చుకుని వస్తా.. కాసుకో!”
“రెండు రోజుల్లో బూతులు నేర్చుకుని వస్తా.. కాసుకో!”- అంటూ వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యేపై టీడీపీ నాయకుడు, తాజాగా టికెట్ దక్కించుకున్న నేత విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడడమే రాజకీయం అనుకుంటే.. తాను కూడా బూతులు నేర్చుకుని వచ్చి మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య యుద్ధం ఓ రేంజ్లో సాగుతోంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున సిట్టింగ్ …
Read More »ముద్రగడలో అయోమయం పెరిగిపోతోందా ?
పాలిటిక్స్ లో మళ్ళీ యాక్టివ్ అవుదామని అనుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంలో అయోమయం పెరిగిపోతోందా ? గ్రౌండ్ లెవల్ లో జరుగుతున్న డెవలప్మెంట్లను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే నెలరోజులుగా ముద్రగడ జనసేనలో చేరుతారని జరిగిన ప్రచారం ఉత్త ప్రచారంగానే మిగిలిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానిస్తారని ఒకపుడు పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో …
Read More »రేవంత్ ప్రత్యామ్నాయం చూపిస్తున్నారా ?
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి చాలామంది సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పీసీసీ లెవల్లోనే కాకుండా తమకున్న పరిచయాలతో ఏఐసీసీ స్ధాయిలో కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దాంతో టికెట్ల కోసం సీనియర్ల నుండే రేవంత్ రెడ్డిపై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. దాంతో వీలైనంతమంది సీనియర్లను పోటీలో నుండి తప్పించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అందుకనే టికెట్లకు ఆల్టర్నేటివ్ మార్గాన్ని రేవంత్ కొందరు సీనియర్లకు చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే నామినేటెడ్ …
Read More »తెలంగాణపై మోడీ ఎన్నికల వరాలు
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ అవ్యాజమైన ప్రేమను కురిపిస్తోం ది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఇక్కడ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో 15 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు ఆయన శంకు స్థాపనలు చేయనున్నారు. వీటి విలువ రూ.230 కోట్లకుపైగానే ఉండనుంది. వీటికి సోమవారం(రేపు) ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 …
Read More »100 నుంచి 150 సీట్లలో కాంగ్రెస్ ఒంటరి గెలుపు : కనుగోలు
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతలు.. 370-400 సీట్లలో విజయం దక్కించుకుంటామని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఉన్న పార్లమెంటు సీట్లను చూస్తే.. 543 స్థానాలకు గాను .. బీజేపీనే 400 తన ఖాతాలో వేసుకుంటే..(ఎన్డీయే మిత్రపక్షాలు) మిగిలిన 143 సీట్లు మాత్రమే మిగులుతాయి. వీటిలో ప్రాంతీయ పార్టీలైన తృణమూల్, ఆప్, వైసీపీ, బీజేడీ, జేయూడీ, ఎస్పీ వంటివి ఉన్నాయి. ఇవి తలా 10 చొప్పున …
Read More »మేనల్లుడి రిసెప్షన్కు మేనమామ డుమ్మా!
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి, అట్లూరి ప్రియల వివాహం రాజస్థాన్లొ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. విహానంతరం హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో శనివారం రాత్రి ఘనమైన రిసెప్షన్ ఇచ్చారు. అయితే.. ఈ కార్యక్రమానికి రాజారెడ్డి మేనమామ, ఏపీ సీఎం జగన్ డుమ్మా కొట్టారు. నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఆయన రిసెప్షన్కు వచ్చే సరికి గైర్హాజరయ్యారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. రాజారెడ్డి …
Read More »ఏ చిన్న ఛాన్సు వదలని రేవంత్
ఒక ఘటన ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నాయకురాలు లాస్య నందిత ఘోర రోడ్డు ప్రమాద ఘటన. పటాన్చెరు ఓఆర్ ఆర్ రోడ్డుపై జరిగిన దుర్ఘటనలో లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం.. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని.. అతి వేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనా.. ఎమ్మెల్యేగా …
Read More »