ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కొంతకాలంగా ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రను దోచుకునేందుకే వారు ఈ జిల్లాలకు ఇన్చార్జిలుగా వచ్చారని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతల ఆరోపణలను నిజం చేస్తూ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఎవడో సుబ్బారెడ్డి అంట కడప …
Read More »వైసీపీకి ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు.. ఫుల్ స్కెచ్!
తెలుగు దేశం పార్టీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి 94 సీట్లు ప్రక టించిన తర్వాత.. తమకు సీటు ఇవ్వలేదంటే.. తమకు ఇవ్వలేదంటూ.. టీడీపీ నాయకులు చంద్రబాబుకు మొర పెట్టుకుంటున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ నాయకులు టీడీపీ నేతలపై వైపు చాలా దీక్షగా చూస్తున్నారు. ఎవరైనా.. ఊ.. అంటే చాలు.. పిలిచి పార్టీలో చేర్చుకుని కండువా కప్పేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే.. 48 …
Read More »‘చంద్రబాబు రాముడు.. నేను ఆంజనేయుడిని’
రాజకీయాల్లో చంద్రబాబు రాముడు వంటివారు. నేను ఆయనకు ఆంజనేయుడి టైపు – అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు, టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఆయన పశ్చిమ నియోజకర్గం టికెట్ ను ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిని జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీ నాయకుడు పోతిన వెంకట మహేష్కు ఇవ్వాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. ఇటీవల ఈ విషయం తెలిసి.. తన రక్తంతో …
Read More »తొలి జాబితాపై బాబు హ్యాపీ..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు టీడీపీ-జనసేన మిత్రపక్షం 118 స్తానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే ఇక, మిగిలిన కీలకమైన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీ కలసి వస్తే.. అంటూ. చంద్రబాబు ఇటీవల వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ ఆ పార్టీ కలిసి వచ్చినా.. 10-15 సీట్లలోపే అవకాశం ఇస్తారు. మిగిలి స్థానాల్లో అంటే.. 42లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే.. జనసేన నుంచి అభ్యర్థులు ఎక్కువగా …
Read More »రమణ దీక్షితులుపై వేటు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్న రమణ దీక్షితులును ఆ పదవి నుంచి తొలగించింది. వాస్తవానికి ఆయనను గత చంద్రబాబు ప్రభుత్వంలోనే పక్కన పెట్టారు. దీనిపై న్యాయపోరాటం కూడా జరిగింది. న్యాయస్థానం కూడా రమణ దీక్షితులుకు ఉపశమనం కల్పించలేదు. అయితే.. తర్వాత వచ్చిన వైసీపీ ఆయనకు ప్రధాన అర్చకత్వం బాధ్యతలు అప్పగించింది. ఇది మరోసారి వివాదంగా మారడంతో …
Read More »సుప్రీం కోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే, తాజాగా మరోసారి ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల తర్వాత ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ …
Read More »టీడీపీలో చేరబోతున్నా: ఎంపీ లావు
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిరోజులుగా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనను గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించగా ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే లావు త్వరలోనే టిడిపిలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా పలుమార్లు భేటీ …
Read More »మైలవరం టీడీపీ పంచాయతీ తేలినట్లేనా?
ప్రస్తుతం ఏపీలో మైలవరం శాసనసభ టికెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉండడంతో మైలవరం అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించలేదు. టికెట్ పై చంద్రబాబు నుంచి హామీ వచ్చిన వెంటనే ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు మైలవరం టికెట్ ను ఆశిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఈరోజు …
Read More »గంటా మళ్లీ మారక తప్పదేమో !
హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవద్దు. తెలుగుదేశంపార్టీ సీనియర్ తమ్ముడు గంటా శ్రీనివాసరావుకు రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి జిల్లాలో సీటులేదు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చటం గంటా స్టైల్. అందుకనే ఇపుడ అసలు నియోజకర్గమే లేకుండాపోయింది. దాంతో గంటాను విశాఖపట్నం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలోని చీపురపల్లి నియోజకవర్గంలో పోటీచేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. చీపురుపల్లిలో పోటీచేయటం గంటాకు ఏమాత్రం ఇష్టంలేదు. తన జిల్లాను వదిలేసి ఎక్కడా 150 కిలోమీటర్ల దూరంలో …
Read More »కేసీఆర్ ఫోన్లు ఎత్తడం లేదట
బీఆర్ఎస్ చాప్టర్ దాదాపు క్లోజ్ అయిపోయిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ చాప్టర్ క్లోజ్ అంటే తెలంగాణ లో కాదు. జాతీయస్థాయిలో అని అర్ధం. తెలంగాణాను బేస్ చేసుకుని దేశమంతా పార్టీని విస్తరింప చేయాలని కేసీయార్ చాలా కలలు కన్నారు. అందుకు కొంత ప్రయత్నాలు కూడా చేశారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వీటిల్లో కూడా మహారాష్ట్రకు చాలాసార్లు …
Read More »ఒత్తిడి పెరిగిపోతోందా ?
ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కొద్ది బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. టీడీపీ, జనసేనతో పొత్తుంటుందో ఉండదో ఆమె చెప్పలేకపోతున్నారు. అధికారికంగా బీజేపీ, జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ ఆచరణలో మాత్రం అది కనబడటంలేదు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పొత్తు కుదుర్చుకున్నారు. సీట్ల సర్దుబాటు కూడా మొదలైపోయింది. కాబట్టి మాకు జనసేన మిత్రపక్షమే అని పురందేశ్వరి చెప్పేదంతా …
Read More »అన్నీ కవితే డిసైడ్ చేస్తారా ?
కల్వకుంట్ల కవిత వ్యవహారం భలే విచిత్రంగా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈనెల 26వ తేదీన అంటే సోమవారం విచారణకు హాజరవ్వాలని సీబీఐ ఇదివరకే కవితకు నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరవ్వటం కుదరదని కవిత బదులిచ్చారు. దాంతో కవితను లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా చేర్చుతు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద విచారణకు హాజరవ్వాల్సిందే అని సీబీఐ మళ్ళీ నోటీసులు జారీచేసింది. దానికి కవిత ఆదివారం మళ్ళీ ఇంకో …
Read More »