ఏపీ సీఐడీ చీఫ్గా పనిచేసి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ.. టీడీపీ నేత, ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు కోరారు. సునీల్ పనిగట్టుకుని కులాలనురెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్(డీవోపీటీ)కి లేఖ రాశారు. ఈ లేఖలో తాజాగా సునీల్ కుమార్ చేసిన …
Read More »‘నా మిత్రుడు పవన్’ – ఈ కూటమి చానా కాలం ఉంటది!
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “నా మిత్రుడు..“అంటూ ఆయనను సంబోధించారు. తరచుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి మరింత నొక్కి చెప్పారు. `నామిత్రుడు నేను.. నిరంతరం ఒకే విధంగాఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మేలు చేసేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇద్దరం కూడా.. పేదల కోసం చర్చిస్తాం. ప్రజల మంచి చెడులపై …
Read More »లోకేష్ చెబుతున్న ఆ సైకో ఎవరు?
“మనం ఒక సైకోతో పోరాడుతున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అనుక్షణం గుర్తుంచుకోండి.“ అని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. మంగళగిరిలోని పార్టీకార్యాలయంలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఎవరికి వారు సొంత రాజకీయాలు చేయడం సరికాదన్న ఆయన పార్టీకిఒక సిద్ధాంతం.. ఒక లైన్ ఉన్నాయని.. …
Read More »`రాజ్`భవన్లకు పేరు మార్పు: కేంద్ర సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న రాజ్ భవన్లకు పేరు మార్చింది. ఇక నుంచి రాజ్ భవన్లను `లోక్ భవన్`లుగా సంబోధించాలని.. అధికార, అనధికార జాబితాలు.. పత్రాలు.. సహా మీడియా కూడా ఇదే తరహాలో పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో …
Read More »అప్పుడు 10 వేలు, ఇప్పుడు 160 కోట్లు – చంద్రబాబు
హైదరాబాద్ సిటీ శివారు కోకాపేటలో భూముల ధరలు సరి కొత్త రికార్డులను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ భూములను కొనుగోలు చేసేందుకు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు సైతం పోటీ పడుతుండడం ఆసక్తికరంగా మారింది. గత వారం రెండు దఫాలుగా నాలుగు ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా, ఐదు ఎకరాల స్థలాన్ని ఎకరాకు రూ.151కోట్ల చొప్పున నలుగురు వ్యక్తులు దక్కించుకున్నారు. ఇది ఇరు తెలుగు రాష్ట్రాల్లో …
Read More »ప్రజాపాలనకు రెండేళ్లు: ఉత్సవాల నేపథ్యం.. మంచీ-చెడులు ఇవీ!
తెలంగాణలో పదేళ్ల పాటు వేచి చూసి.. 2023 ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ పాలన చేపట్టి.. ఈ నెల(డిసెంబ రు) 9వ తేదీకి రెండు సంవత్సరాలు పూర్తికానున్నాయి. అప్రతిహత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధిపత్యానికి, పాలనకు చెక్ పెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికార పగ్గాలు చేపట్టి.. రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబరు 1 నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజాపాలన …
Read More »గడువుకు ముందే.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి
సాధారణంగా కేసుల నుంచి తప్పించుకుంటున్న కొందరు నిందితులు పోలీసులు, కోర్టుల ఆదేశాలను కూడా విస్మరిస్తున్నారు. వీరిలో వైసీపీకి చెందిన నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై జంట హత్యల కేసు నమోదైంది. ఈ కేసులో వారు ఏ8, ఏ9గా ఉన్నారు. అయితే.. కొన్నాళ్లపాటు తప్పించుకుని తిరిగి.. హైకోర్టు నుంచి …
Read More »మోదీ vs ప్రియాంక – ఏంటి ఈ ‘డ్రామా’ పాలిటిక్స్?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఫైర్ అయింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి ప్రధాన మంత్రి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో `డ్రామాలు` చేయొద్దని.. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కొత్త తరం ఎంపీలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా కార్యక్రమాలు అమలు చేయాలని.. అరుపులు కేకలతో నినాదాలతో సభాకార్యక్రమాలకు …
Read More »సూపర్ సిక్స్ కోసం కూటమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలుసా?
ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై పరోక్షంగా సెటైర్లు గుప్పించారు. “నన్ను లైట్(తేలికగా) తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు ఇస్తే.. అవి అమలు కావని ప్రచారం చేశారు. కానీ.. సూపర్ సిక్స్ హామీలను సక్సెస్ చేశాం. దీంతో వాళ్లు లైట్(పలుచన) అయిపోయారు“ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఏలూరు జిల్లాలో నిర్వహించిన ప్రజా సేవలో(ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ) పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు …
Read More »ఇవేం మాటలు అంబటి… ఓడినా మైండ్ సెట్ మారదా?
దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా దరిద్రపుగొట్టు రికార్డు ఏపీ సొంతం. విభజన నేపథ్యంలో అటు ఇటు కాకుండా పోయిన ఏపీకి ఎప్పటికి రాజధాని సమకూరుతుందన్న ప్రశ్న సగటు ఆంధ్రోడ్ని వెంటాడి వేధిస్తోంది. నిజానికి రాజధాని అంశంపై జగన్ సర్కారు వ్యవహరించిన తీరు.. ఆ పార్టీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు ఆ పార్టీని దారుణంగా దెబ్బ తీశాయి. 2019 ఎన్నికలకు ముందు అమరావతిని కంటిన్యూ చేస్తామని చెప్పిన జగన్.. …
Read More »‘సర్’ కోసం టీడీపీ ఆరాటం.. రీజనేంటి?
ఇతర రాష్ట్రాలు వద్దని గోల చేస్తున్న ‘సర్’ ప్రక్రియపై ఏపీ అధికార పార్టీ టీడీపీ సానుకూలత వ్యక్తం చేయడం.. ఎంత వేగంగా అయితే.. అంత వేగంగా ఏపీలో సర్ ప్రక్రియను ప్రారంభించేలా కేంద్రాన్ని కోరతామని.. ఆపార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చెప్పడం విశేషం. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ద్వారా 2001కి ముందు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఆధారాలు సేకరిస్తారు. దీని …
Read More »H-1B వీసాలు రద్దు చేస్తే అమెరికాకే నష్టం: ఎలాన్ మస్క్
అమెరికాలో ఉద్యోగం చేయాలనేది ప్రతి భారతీయ టెక్కీ కల. కానీ మారుతున్న నిబంధనలు, ట్రంప్ సర్కార్ ఆంక్షలతో ఆ కల చెదిరిపోతుందేమో అనే భయం అందరిలో ఉంది. సరిగ్గా ఈ సమయంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు భారతీయ టెక్కీలకు పెద్ద ఊరటనిచ్చాయి. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో పాల్గొన్న మస్క్, H-1B వీసాల ఆవశ్యకత గురించి కుండబద్దలు కొట్టారు. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates