టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలోని లోపాలను ఎత్తి చూపడం .. విమర్శించడం వంటివి ప్రతిపక్ష పార్టీలుగా.. ప్రత్యర్థినాయకులుగా తప్పుకాదు. కానీ, ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే?! అది ముమ్మాటికీ ఈ విమర్శలు చేసిన వారికి మేలు జరగకపోగా.. చంద్రబాబుకు మాత్రం సానుభూతి పెరుగుతుంది. ఎందుకంటే.. ఒకప్పటి మాదిరిగా వ్యవస్థలు లేవు. ఇప్పుడు అన్నీ క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఏం జరుగుతోంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే …
Read More »రిజర్వేషన్ సంగతేంటి? తేల్చని రేవంత్!
తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదం కూడా అయిన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే అంశం మరోసారి పెండింగులోనే పడింది. ఇది అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. న్యాయ ప్రక్రియ నుంచి అనేక రాజకీయాలకు వరకు రిజర్వేషన్ విషయం తీవ్రమైన ఉత్కంఠ రేపింది. హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు.. ప్రభుత్వం పోరాడినా.. తిరిగి ఇది పెండింగులోనే ఉంది. ఈ క్రమంలో తాజాగా గురువారం సాయంత్రం …
Read More »దేవుడా.. కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు దగ్థం.. 20 మందికి పైనే మృతి
ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు (వి. కావేరి) కర్నూలు శివారు చిన్నటేకూరులో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ దారుణ రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైనే మరణించారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా చెబుతున్నారు. పన్నెండు మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ …
Read More »వైసీపీ కార్యకర్తల నోళ్లు మూయించిన జగన్
విశాఖపట్నానికి ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ రావడం మీద వైసీపీ కార్యక్తలు గత కొన్ని రోజులుగా ఎంత రాద్దాంతం చేస్తున్నారో, ఎన్ని విమర్శలు గుప్పిస్తున్నారో తెలిసిందే. 80 వేల కోట్లకు పైగా పెట్టుబడితో గూగుల్.. ఈ డేటా సెంటర్, ఏఐ హబ్లను ఏర్పాటు చేస్తుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. కూటమి ప్రభుత్వం మీద సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. జనాల్లో కూడా దీనిపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ …
Read More »ఆస్ట్రేలియా-దుబాయ్ టూర్.. పెట్టుబడుల లెక్క ఇదీ!
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్లు విదేశాల్లో పర్యటించారు. నారా లోకే ష్ పర్యటన ముగియగా.. చంద్రబాబు మరో రెండు రోజులు కొనసాగించనున్నారు. ఇక, ఈ పర్యటనల ప్రధాన లక్ష్యం.. పెట్టుబడుల వేటేనన్నది అందరికీ తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పనకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తీసుకువచ్చిన 10 లక్షల కోట్ల పెట్టుబడుల …
Read More »బీహార్ దంగల్: కాంగ్రెస్ క్లారిటీ.. బీజేపీకి సెగ!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో 15 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమిలో ఏర్పడిన అనిశ్చితి పూర్తిగా తొలిగిపోయింది. దీంతో ఇప్పుడు.. మహాఘట్ బంధన్ నాయకులు పుంజుకున్నారు. పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. అయితే.. మరో చిన్న సమస్య ఈ కూటమిని వెంటాడుతోంది. 8 స్థానాల్లో కూటమిలోని మూడు కీలక పార్టీలు.. కాంగ్రెస్-ఆర్జేడీ-సీపీఐలు.. …
Read More »గూగుల్ డేటా సెంటర్ మంచిదే కానీ… జగన్ బాధేంటంటే..
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ.. తన అనుబంధ సంస్థ రైడెన్తో కలిసి.. విశాఖపట్నంలో గూగుల్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కారుతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి రాష్ట్రానికి రానుంది. ఉద్యోగాలు కూడా వస్తాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అంతే కాదు.. విశాఖ రూపు రేఖలు కూడా మారుతాయన్నారు. ఇది వాస్తవమేనని ఐటీనిపుణులు, మేధావులుకూ డా ఒప్పుకొన్నారు. రాజకీయంగా కొందరు సానుకూల …
Read More »కొలికపూడి వ్యవహారంపై చంద్రబాబు సీరియస్.. సస్పెన్షన్ వేటుకు రెడీ?
రాష్ట్రంలో రాజకీయ మంటలు రేపిన తిరువూరు ఎమ్మెల్యే, ఎస్సీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అబుదాబీ పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్రంలో వర్షాలు.. వరదల పరిస్థితిపై ప్రతి రెండు గంటలకు ఒకసారి.. అధికారులతో ఫోన్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా తెరమీదికి వచ్చిన.. కొలిక పూడి వ్యవహారంపైనా ఆయన స్పందించారు. “దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నా. దీని వెనుక ఎవరున్నారు? …
Read More »బాలకృష్ణపై తాగుబోతు వ్యాఖ్యలు.. ఆధారం ఉందా జగన్?
టీడీపీ సీనియర్ నాయకుడు, హిందూపురం నియోజకవర్గం నుంచి వరుస విజయాలు అందుకున్న నట సింహం నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ఉంది. ఈ విషయంలో తేడా లేదు. నందమూరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి అభిమానుల వరకు బాలయ్యను సమర్థిస్తారు. ఆయన కొన్ని సందర్భాల్లో అభిమానులపై చేయిచేసుకున్నారు. అయినా, ఆయన విషయంలో అభిమానులు పాజిటివ్గా ఉన్నారు. ఇలాంటివారు వైసీపీలో కూడా ఉన్నారు. అయితే, తాజాగా మాజీ సీఎంవైసీపీ అధినేత జగన్ …
Read More »ఏం స్టామినా బాబూ.. సోషల్ మీడియాలో ప్రశంసలు..!
ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత సాధారణంగా ఎవరైనా అలసిపోవడం సహజం. ఎంత విమానంలో ప్రయాణించినా అలుపు సొలుపు అనేది కచ్చితంగా వస్తుంది. వెంటనే విశ్రాంతి మందిరాలకు వెళ్తారు. ఒక గంట, రెండు గంటలు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది సహజంగా జరిగేది. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 75 ఏళ్ల వయసులో కూడా నవయువకుడిలాగా వ్యవహరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధాన …
Read More »కూటమి.. 15 ఏళ్ల కాపురానికి 10 సూత్రాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఇక, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని వల్లె వేస్తున్నారు. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాదు, ప్రభుత్వం కార్యక్రమాల్లోనూ ఇదే మాట చెబుతున్నారు. ఇక, చంద్రబాబు కూడా పార్టీ నాయకులకు …
Read More »మీ పెట్టుబడికి మా హామీ: చంద్రబాబు భరోసా
ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటమే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం దుబాయ్కు వెళ్లిన ఆయన, అక్కడ నుంచి గురువారం ఉదయం అబుదాబీకి చేరుకున్నారు.క్కడి పారిశ్రామిక వేత్తలను కలుసుకుని వారికి కూడా ఏపీ ప్రాధాన్యాన్ని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలిపారు. మీ పెట్టుబడికి మా హామీ అంటూ ఆయన భరోసా కల్పించారు. సీఎం చంద్రబాబు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates