టీడీపీ-జనసేన కూటమి తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు. ఈ రోజు 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతోపాటు 3 పార్లమెంట్ సీట్లు కేటాయించారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు విషయం …
Read More »వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా
ఏపీ అధికార పార్టీ వైసీపీ పార్లమెంటు సభ్యుడు, ఫైర్ బ్రాండ్ కనుమూరి రఘురామకృష్ణరాజు.. తాజాగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను త్వరగా.. సాధ్యమైనంత వేగంగా ఆమోదించాలని ఆయన కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఆయన నేరుగా అధికారిక పత్రంపై లేఖను పంపించారు. “మీరు నన్ను అనర్హుడినిచేయాలని అనుకున్నా.. నరసాపురం ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యం గౌరవించి.. నన్ను కాపాడింది” అని …
Read More »కేటీయార్ కు ఏమైంది ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీయార్ కు ఏమైందో అర్ధంకావటం లేదట. ఎందుకంటే నాలుగు రోజులుగా ఎవరితోను టచ్ లో లేరని పార్టీవర్గాలు చెప్పాయి. పార్టీలోని ఎంఎల్ఏలు, ఎంపీలు, సీనియర్ నేతలు కేటీయార్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే అందుబాటులో లేరని ఫోన్లో సమాచారం వస్తోందట. పార్టీ ఆఫీసులోను లేక, ఇంట్లోను అందుబాటులోక, ఫోన్లోను కలవటం కుదరకనపోతే మరి కేటీయార్ ఎక్కడున్నారనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో …
Read More »వీళ్ళది భలే పొత్తు
రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, వామపక్షాలు పొత్తుల్లో పోటీ చేస్తాయని కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రకటించారు. మీడియా సమావేశంలో షర్మిల వామపక్షాల కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ఎంతో ఆర్భాటంగా ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. నాలుగు రోజుల క్రితం వరకు సీపీఐ చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకోవటానికి తహతహలాడిన విషయం అందరుచూసిందే. బీజేపీతో పొత్తువద్దని టీడీపీ, జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకుందామని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ …
Read More »కేసీఆర్ సర్కారు చేసిన తప్పును చేయని రేవంత్
కీలక సమయాల్లో సీఎం స్థాయిలో ఉన్న వారు స్పందించే తీరుతో వారి రాజకీయ చతురత ఎంతన్న విషయాన్ని ఇట్టే గుర్తించొచ్చు. ఈ విషయంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ తప్పుల మీద తప్పులు చేస్తే.. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విషాద వేళ.. పట్టింపులకు పోకుండా.. రాజకీయాలకు తెర తీయకుండా.. హుందాగా వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. చిన్న వయసులో …
Read More »నేను నోరు విప్పడమే తప్పా?!: నారా భువనేశ్వరి
“నేను నోరు విప్పడమే తప్పా. నేను మాట్లాడిన దానిలోనూ రాజకీయాలు చూస్తారా? రాజకీయాలు చేస్తారా?” అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఫైర్ అయ్యారు. ఇటీవల చిత్తూరులో పర్యటించిన ఆమె.. “మా ఆయనకు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను.. మీ ఉద్దేశం ఏంటి? నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అని మహిళలను ప్రశ్నించారు. దీనికి సదరు మహిళలు.. ఒక్కరు కాదు.. ఇద్దరూ పోటీ చేయండి గెలిపించుకుంటాం! అని వ్యాఖ్యానించారు. అయితే, …
Read More »పెనమూలూరు నుంచి హీరో కృష్ణ సోదరుడు పోటీ?!
ఏపీలో అసెంబ్లీఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమున కలుగా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు వేసే అడుగులకు.. చెక్ పెడుతూ.. నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య పోటీ.. మరింత వేగంగా ఉంది. తాజాగా ఉమ్మడి కృష్నా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. పెనమలూరు నుంచి వైసీపీ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న పెడన ఎమ్మెల్యే కమ్ మంత్రి జోగి …
Read More »రైట్ మ్యాన్ ఇన్ ది రాంగ్ ప్లేస్: షర్మిల
వైసీపీకి రాజీనామా చేసి.. అవసరమైతే.. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై కూడా పోరాటం చేస్తానని చెప్పిన మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన కాంగ్రెస్ లో చేరతానని.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలోతన భాగస్వామ్యం కూడా ఉంటుందని పేర్కొన్నా రు. అంతేకాదు..వైఎస్ షర్మిల వెంటే తాను కూడా నడుస్తానని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. షర్మిల సమక్షంలో …
Read More »10 రోజుల్లో 2 సార్లు ముప్పు తప్పినా.. మూడోసారి ఘోరం!
అయ్యో అనిపించేలా జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) దుర్మరణం పాలు కావటం తెలిసిందే. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన ఆమె తన తండ్రి సాయన్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తరచూ ఏదో ఒక ప్రమాదానికి గురి కావటం.. అంతలోనే సేఫ్ గా బయటపడే లాస్య నందిత ఈసారి మాత్రం ప్రమాదం నుంచి బయటపడలేక ప్రాణాలు విడిచిన విషాదం అందరిని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. …
Read More »సీఎం జగన్ హెలికాప్టర్లు.. రఘురామ ఫిర్యాదు
ఏపీ సీఎం జగన్.. వచ్చే ఎన్నికల్లో ప్రచారం కోసం వినియోగించేలా రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకు నేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీనికి గాను ఒక్కొక్క హెలికాప్టర్కు 2 కోట్ల రూపాయల చొప్పున ప్రజాధనాన్ని ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సీరియస్గా తీసుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని దానిలో పేర్కొన్నారు. అంతేకాదు.. …
Read More »‘షర్మిల్కు సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు..’
ఔను.. ఈ మాట నిజమేనట. సాక్షాత్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా తాజాగా ఈ మాట అనేశారు. “ఆవిడ ఎందుకు ఏపీకి వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆస్తులు, అప్పులు.. అనేవి సీఎం జగన్, షర్మిల మధ్య లేనే లేవు. షర్మిలకు సీఎం జగన్ చిల్లిగవ్వ బాకీ లేరు. దివంగత వైఎస్సార్ జీవించి ఉన్నప్పు డే.. వీరికి ఆస్తులు పంచి ఇచ్చేశారు. ఈ విషయం మీకు(మీడియా) తెలియకపోయినా.. సీమ …
Read More »ఎమ్మెల్యే లాస్య పోస్టు మార్టమ్ రిపోర్ట్..
తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ నియోజకవర్గం నుంచి గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న భారత రాష్ట్రసమితి నాయకురాలు, శాసన సభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె వయసు 37 సంవత్సరాలు. అయితే, ఆమె పోస్టు మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సీటు బెల్టు పెట్టుకోకపోవడం ప్రధాన కారణమని వైద్యులు నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున పఠాన్చెరు ఓఆర్ …
Read More »