Political News

ఏపీ బీజేపీని మ‌లుపు తిప్పింది ఆయ‌నేనా..?

ఏపీ బీజేపీని మ‌లుపు తిప్పింది ఆయనేనా? ఆయ‌న సూచ‌న‌ల‌తోనే ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలోనూ.. రైతులు చేప‌ట్టిన ఉద్య‌మం విష‌యంలోనూ.. నాయ‌కుల మ‌ధ్య పొంతన లేకుండా పోయింది. ముఖ్యంగా గ‌తంలో రాష్ట్ర‌ పార్టీ సార‌ధిగా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌ధాని రైతుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. అదే స‌మ‌యంలో టాఠ్‌! ఇలా …

Read More »

3 రాజధానుల బిల్లు వెనుకపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన

అనూహ్యమైన నిర్ణయాన్ని ఏపీ సర్కారు తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లుగా పేర్కొన్న జగన్ సర్కారు సంచలనానికి తెర తీసింది. తొలుత ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపారు. అనంతరం ప్రకటన చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటును ఉద్దేశించి ప్రవేశ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్నట్లుగా చెబుతూ.. కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఆయనేం చెప్పారన్నది …

Read More »

ఆ విష‌యంలో టీడీపీని బీజేపీ హైజాక్ చేస్తుందా..?

రాజ‌కీయాల్లో పార్టీలు ఒక‌రిపై ఒక‌టి పైచేయి సాధించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మామూలే. ఒక‌రి క‌న్నా ఎక్కువ మంచి విధానాల‌తో మ‌రో పార్టీ ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఇది కామ‌న్‌గా జ‌రిగేదే. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యం లోనూ పోటీకి రాని.. బీజేపీ.. ఇప్పుడు కొత్త‌గా ఒక విష‌యంలో పెద్ద పోటీనే ఇస్తోంది. నిజానికి రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు అనేక ప్ర‌యాస‌లు ప‌డుతున్న నాయ‌కులు.. వ్యూహాలు దొర‌క్క, వేసిన వ్యూహాలు సైతం …

Read More »

స‌ల‌హాదారుల‌ను సాగ‌నంపుతారా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా? లెక్క‌కు మిక్కిలిగా ఉన్న స‌ల‌హాదార్ల సంఖ్య‌ను త‌గ్గించేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వంలోని మంత్రుల సంఖ్య కంటే స‌ల‌హాదారులే ఎక్కువ‌. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేబినేట్ సంఖ్య 25 అయితే.. అంత‌కంటే ఎక్కువ‌గా 33 మంది స‌ల‌హాదారులతో భారీ స్థాయిలో అడ్వైజ‌రీ క‌మిటీ నియ‌మించుకున్నారు. ఇంత‌మంది స‌ల‌హాదార్లు …

Read More »

కేంద్రం ఎఫెక్ట్‌.. అందుకే జ‌గ‌న్‌ యూట‌ర్న్‌?

దాదాపు రెండేళ్ల‌కు పైగా రైతుల పోరాటం.. పోలీసుల నుంచి లాఠీ దెబ్బ‌లు.. అవ‌మానాలు..మంత్రుల నుంచి ఈస‌డింపు మాట‌లు.. వెర‌సి.. అమ‌రావ‌తి విష‌యం ర‌గిలిన భోగిమంట‌లా.. కొన‌సాగింది. రైతులు వెనుదిరిగేది లేద‌ని.. త‌మ త్యాగాలు వృథా కారాద‌ని.. స్ప‌ష్టం చేస్తూ.. అమ‌రావ‌తికోసం. ఉద్య‌మించారు. మూడు రాజ‌ధానుల‌ను తిర‌స్క‌రించారు. అయితే.. తాము వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని., ప్ర‌భుత్వం భీష్మించింది. ద‌రిమిలా కోర్టులో ఈ కేసులు నాన‌డం..రోజువారి విచార‌ణ జ‌రుగుతుండ‌డం స‌ర్వ‌త్రా తీవ్ర ఉత్కంఠ‌కు వివాదానికి …

Read More »

పట్టు వదలని రైతు సంఘాలు

వ్యవసాయ చట్టాలు రద్దు చేసిన ప్రకటనతో అంతా అయిపోలేదని భారతీయ కిసాన్ సంఘ్ నరేంద్ర మోడీకి తేల్చి చెప్పింది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఇంకా మిగిలిన డిమాండ్లను కూడా వాపసు తీసుకోవాల్సిందే అంటు రైతు సంఘాలు గట్టిగా పట్టబట్టాయి. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా ఈరోజు ‘మహాపంచాయితి’ని నిర్వహిస్తున్నారు. తమ డిమాండ్ల చిట్టాను మోడి ముందు రైతు సంఘం ఉంచింది. దాంతో మోడి సర్కార్ లో టెన్షన్ …

Read More »

మూడు రాజ‌ధానుల బిల్లుల‌ ర‌ద్దు.. ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఏపీలో తీవ్ర ఉత్కంఠ‌కు, ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసిన‌.. మూడు రాజ‌ధానుల బిల్లును జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. దీంతో పాటు.. ఏపీ సీఆర్ డీఏ బిల్లును సైతం ర‌ద్దు చేసింది. తాజాగా ఈ విష‌యాన్ని రాష్ట్ర హైకోర్టుకు ప్ర‌భుత్వం తెలిపింది. మూడు రాజధానుల విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని ఏపీ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్‌ తెలిపారు. “వికేంద్రీకరణ బిల్లు, …

Read More »

వివేకా హత్యలో అల్లుడిదే కీలక పాత్ర ?

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సంచలనం సృష్టించిన వివేకానందరెడ్డి హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా పులివెందులలో పనిచేస్తున్న జర్నలిస్ట్ భరత్ యాదవ్ ప్రకటన చేసిన ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భరత్ చెప్పిన ప్రకారం, సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ ప్రకారం వివేకా హత్యలో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి కూడా పాత్రుందట. వివేకాకు నర్రెడ్డికి మధ్య రెగ్యులర్ గా పెద్ద గొడవలే జరిగేవట. గొడవలకు కారణం …

Read More »

రాజ‌ధాని ఎఫెక్ట్ పెరుగుతోంది… వైసీపీలో టెన్ష‌న్ మొద‌లైంది…!

ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ నేత‌ల‌దే పైచేయిగా ఉంది. ఎట్టి ప‌రిస్థిలోనూ మూడు రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డ‌తామ‌ని.. నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇటీవల వైసీపీ నాయ‌కుడు, మంత్రి క‌న్న‌బాబుకూడా ఇదే వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో పాద‌యాత్ర‌లోనూ పెయిడ్ ఆర్టిస్టులే ఉన్నార‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా వ్యాఖ్యానించారు. పాద‌యాత్ర‌ను త‌క్కువ చేసి చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, స్థానిక స‌మ‌రాన్ని చూపించి.. పాద‌యాత్ర‌ను ప్ర‌కాశం జిల్లాలో అడ్డుకునే ప్ర‌య‌త్నం …

Read More »

ఆయ‌నకు ఏ పార్టీ అయితే… బెట‌ర్‌..!

రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌త శ‌త్రువులు కారు. శాశ్వ‌త మిత్రులు కూడా కారు. 2019లో మిత్రులుగా ఉన్న నాయ‌కులు ఇప్పుడు చాలా పార్టీల‌కు శ‌త్రువులుగా మారారు. టీడీపీని తీసుకుంటే. వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌లారం, శిద్దా రాఘ‌వ‌రావు.. ఇలా అనేక మంది శ‌త్రువులుగా మారారు. వీరిలో కొంద‌రు పార్టీని టార్గెట్‌చేసి నిప్పులు చెరుగుతున్నారు. ఇక‌, అధికార పార్టీ వైసీపీకి కూడా ఇలా రెబ‌ల్ అయిన నాయ‌కుడు న‌ర‌సాపురం ఎంపీ …

Read More »

జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌.. నిజ‌మెంత‌…?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త నిజ‌మేనా ? అటు బీజేపీ నాయ‌కులు.. ఇటు టీడీపీ నాయ‌కులు దీనిపైనే ఆశ‌లు పెట్టుకున్నారా? అంటే.. అవుననే అంటున్నారు ప‌రిశీల‌కులు. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డి రాష్ట్రంలో రెండున్న‌రేళ్లు పూర్త‌య్యాయి. అయితే.. ఈ రెండున్న‌రేళ్ల కాలంలో జ‌గ‌న్ ఒక్కసారి కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌రాలేదు. అప్పుడ‌ప్పుడు.. కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ఆశించిన స్థాయిలో ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చిన‌ట్టు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రాలేదు. అదే చంద్ర‌బాబును …

Read More »

రివ‌ర్స్.. రివ‌ర్స్‌..! ఏపీ స‌ర్కారుకు కొత్త‌ క‌ష్టాలు…!

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అనూహ్యంగా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్రాజెక్టుల‌పై రివ‌ర్స్ మంత్రం ప‌ఠించింది. గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తిప‌డి.. ఎక్కువ మొత్తాల‌కు ప‌నులు అప్ప‌గించింద‌ని.. తాము ప్ర‌జాధ‌నాన్ని కాపాడుతామ‌ని.. చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. దాదాపు అన్ని కాంట్రాక్టు ల‌కు రివ‌ర్స్ మంత్రం అమ‌లు చేశారు. దీంతో కొంత మేర‌కు ఆయ‌న ప్ర‌జాధ‌నాన్ని వెన‌క్కి ర‌ప్పించారు. అయితే.. ఇప్పుడు ఇదే ఆయ‌న ప్ర‌భుత్వంపై ప‌గ‌బ‌ట్టింద‌ని అంటున్నారు …

Read More »