Political News

టీడీపీలో పాత కాపుల‌కే పెద్ద‌పీఠ‌.. ఆ 25 సీట్లు ఫిక్స్‌…!

టీడీపీ కూడా వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల ఖ‌రారు ప్ర‌క్రియను ముమ్మ‌రం చేసింది. అయితే.. ఇది పైకి చెప్ప‌క‌పోయినా.. అంత‌ర్గ‌త స‌మావేశాల్లో 25 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఈ పాతిక మంది కూడా పాత‌కాపులే కావ‌డం గ‌మ‌నార్హం. నిజానికి వీరంతా గ‌త ఎన్నిక‌ల్లో మెజారిటీ సంఖ్య‌లో ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో వారికే టికెట్లు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం సిద్ధం చేసిన జాబితాలో …

Read More »

మా ఊరొస్తా..రక్షణ కల్పించండి: రఘురామ

తనను వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ చేసిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం కోర్టు చొరవతో రఘురామకు రాజద్రోహం కేసు నుంచి కాస్త ఊరట లభించింది. ఆ తర్వాత ఆయన ఏపీకి వచ్చేందుకు ప్రయత్నించగా..ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆ వ్యవహారం తర్వాత ఆయన ఏపీకి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా …

Read More »

ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదా ?

రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటం లేదట. కారణం ఏమిటంటే రెండో ఎన్నికకే నియోజకవర్గం మారాల్సి రావటమే కారణమని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ చర్చంతా మంత్రి విడదల రజని గురించే. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రజని రాజకీయాలపై ఇంట్రెస్టుతో రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. రావటం రావటమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తనకు టీడీపీలో టికెట్ రాదని అర్ధమవ్వగానే వెంటనే వైసీపీలో చేరిపోయారు. రజనీది …

Read More »

కాపు-కాంగ్రెస్‌-ర‌ఘువీరా.. కొత్త పాలిటిక్స్ ..!

రాష్ట్రంలో కొత్త రాజ‌కీయాలు పురుడు పోసుకుంటున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంద‌రూ మ‌రిచిపోయిన‌.. కాంగ్రెస్ పార్టీ వైపు పాత‌కాపులు ఇప్పుడు చూస్తున్నారు. అధికార‌ వైసీపీలో టికెట్ ద‌క్క‌ని నాయ‌కులు.. పొలో మంటూ కాంగ్రెస్ బాట‌ప‌డుతున్నారు. గ‌తంలో ఎవ‌రైతే.. ఈ పార్టీని భూస్థాపితం చేశారో.. ఎవ‌రైతే.. పార్టీని కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లించారో వారంతా ఇప్పుడు హ‌స్తం వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో చేరుతున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. ఉండ‌ర‌న్న‌ట్టుగా.. ఇప్పుడు …

Read More »

మాగుంట‌కు లైన్ క్లియ‌ర్‌.. కానీ, పెద్ద టార్గెట్ పెట్టారా..!

నిన్న మొన్నటి వ‌ర‌కు తీవ్ర ర‌స‌కందాయంలో ఉన్న‌ ఒంగోలు ఎంపీ టికెట్ పై స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన అనంతరం పార్టీ అధిష్టానం మాగుంటకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయ‌న కుమారుడికి కాకుండా.. మాగుంట‌నే ఈ ద‌ఫా పోటీ చేయాల‌ని ఆదేశించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిన్న …

Read More »

‘పెనం మీద ఉంటారా.. పొయ్యిలో ప‌డ‌తారా.. ‘

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో త‌మ డిమాండ్లు నెర‌వేర్చ‌లేదంటూ.. ప్ర‌భుత్వ ఉద్యోగులు ర‌గిలిపోతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వంతు పాత్ర పోషిస్తామ‌ని కూడా వారు హెచ్చరి స్తున్నారు. దీంతో స‌హ‌జంగానే ఉద్యోగుల ఓటు బ్యాంకు వైసీపీకి ఒకింత ఇబ్బందిగా మారింద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో గుడివాడ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని ఉద్యోగుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కొడాలి …

Read More »

వైసీపీలో మరో వికెట్..ఎంపీ బాలశౌరి ఔట్?

ఏపీలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తూ జగన్ రెండు లిస్ట్ లు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో, ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే …

Read More »

బోరు కొచ్చిన బండి.. ఎంపీ నానీపై పీవీపీ స‌టైర్లు

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, నిర్మాత‌.. పీవీపీ.. పొట్టూరి వ‌ర‌ప్ర‌సాద్‌.. తాజాగా టీడీపీని వీడిన విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఉర‌ఫ్ నానిపై స‌టైర్లు సంధించారు. ఆయ‌న‌ను ‘బోరు కొచ్చిన బండి’ అని వ్యాఖ్యానించారు. నాని.. తాజాగా సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. కానీ, …

Read More »

ఆ రెండు సీట్లు మాత్రం మాకే కావాలంటున్న పవన్

రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని అనుకుంటున్న రెండు నగరాల్లోని నియోజకవర్గాలపై జనసేన అధినేత కన్నేసినట్లు సమాచారం. ఇంతకీ ఆ నియోజకవర్గాలు ఏవంటే గుంటూరు పశ్చిమం, విజయవాడలో ఒకసీటని తెలిసింది. విజయవాడలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. విజయవాడ తూర్పులో టీడీపీ ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహిస్తుండగా, విజయవాడ సెంట్రల్, పశ్చిమంలో వైసీపీ ఎంఎల్ఏలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణులున్నారు. వీటిల్లో తూర్పు నియోజకవర్గాన్ని వదిలేస్తే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం …

Read More »

సెక్రటేరియట్ నిర్మాణంపైనే ఆరా ?

కేసీయార్ హయాంలో నిర్మితమైన సెక్రటేరియట్ భవనం వ్యయంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి బుధవారం నాడు సెక్రటేరియట్ నిర్మించిన కాంట్రాక్టు సంస్ధ ప్రతినిధులతో పాటు ఫైనాన్స్ ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. సెక్రటేరియట్ నిర్మాణానికి మొదట్లో వేసిన అంచనా వ్యయం ఎంత ? అంచనాలు ఎవరు రెడీచేశారు ? డిజైన్లను ఎవరిచ్చారు ? తర్వాత అంచనా వ్యయం ఎంతకు పెరిగింది ? ఎందుకు పెరిగిందనే విషయాలపై రేవంత్ …

Read More »

మ‌హామ‌హులే టీడీపీని వీడారు.. ఈయ‌నెంత‌?: చిన్ని

టీడీపీ నాయ‌కుడు, విజ‌య‌వాడ పార్ల‌మెంటు స్థానం నుంచివ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌నే ప్ర‌చారంలో ఉన్న కేశినేని శివ‌నాథ్ ఉర‌ఫ్ చిన్నత‌న సొద‌రుడు, ప్ర‌స్తుత విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌హామ‌హులే టీడీపీని విడిచి పెట్టి వెళ్లిపోయార‌ని..ఈయ‌న ఎంత‌? అని వ్యాఖ్యానించా రు. తాజాగా నాని.. టీడీపీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఎంపీప‌ద‌వికి కూడా రాజీనామా స‌మ‌ర్పించారు. ఈ నేప‌థ్యంలోబుధ‌వారం నాని పార్టీపైనా.. నారా …

Read More »

పాస్టు – ఫ్యూచ‌ర్‌.. చంద్ర‌బాబు కొత్త ఒర‌వ‌డి..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగాల్లో కొత్త ఒర‌వ‌డిని కొన‌సాగిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న రా.. క‌ద‌లిరా! స‌భ‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌సంగాలు ఆక‌ట్టుకుంటు న్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, మేధావులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తున్నారు. ముఖ్యంగా గ‌తానికి-ప్ర‌స్తుతానికి మ‌ధ్య ఉన్న తేడాను ఆయ‌న విశ‌దీక‌రిస్తున్న తీరు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటోం ద‌ని అంటున్నారు. సాధార‌ణంగా చంద్ర‌బాబు ప్ర‌సంగాల‌ను గ‌మ‌నిస్తే.. ఆవేశం, ఆక్రోశం క‌నిపించేవి. సీఎం …

Read More »