తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడి తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ ను పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లో కలిసి పరామర్శించారు. జగన్ కు మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. దాదాపు …
Read More »ఉద్యోగులు హ్యాపీయేనా ?
తెలంగాణాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉన్నట్లున్నారు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో 2వ తేదీన చాలామందికి జీతాలు పడ్డాయి. కొన్ని శాఖల్లోని కొంతమంది ఉద్యోగులకు మాత్రం పడలేదంతే. వీళ్ళకు కూడా వీలైనంత తొందరలోనే అంటే ఒకటి రెండు రోజుల్లోనే జీతాలు పడేట్లుగా ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రతినెలా మొదటి రెండురోజుల్లోనే జీతాలు పడక చాలా కాలమైంది. కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఏ రోజు జీతాలు పడతాయో కూడా …
Read More »జగ్గారెడ్డిలో ఇంతమంటుందా ?
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీ తరపున పోటీచేసిన చాలామంది ప్రముఖులు గెలవటం, పార్టీ అధికారంలోకి వచ్చి తన బద్ధి విరోధి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటాన్ని జగ్గారెడ్డి తట్టుకోలేకపోతున్నట్లున్నారు. తాను ఓడిపోవటం ఒకఎత్తయితే పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రవ్వటం మరో ఎత్తుగా మారింది. దీన్నే జగ్గారెడ్డి ఏమాత్రం సహించలేకపోతున్నారు. అందుకనే …
Read More »కాంగ్రెస్ లో విలీనమైన వైఎస్సార్టీపీ
అందరూ ఊహించినట్లే వైఎస్సార్టీపీకి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల విలీనం చేశారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తాను సంతోషిస్తున్నానని ఆమె అన్నారు. ఈరోజు …
Read More »ఆపరేషన్ 15..సాధ్యమేనా ?
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి(టీపీసీసీ) సమావేశంలో రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు ఉదాహరణ. టీపీసీసీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 15 సీట్లను పార్టీ గెలుచుకోవాలని చెప్పారు. నేతలు, కార్యకర్తలు అందరు సమిష్టిగా పనిచేస్తే 17 సీట్లలో 15 సీట్లలో గెలవటం పెద్ద కష్టమేమీకాదన్నారు. 15 సీట్లలో గెలవాలని పిలుపిచ్చారు కానీ మిగిలిన రెండుసీట్లను రేవంత్ ఎందుకు …
Read More »సుప్రింకోర్టు చేతులు దులిపేసుకుందా ?
రాజధానుల వివాదాన్ని వాయిదా వేయటం ద్వారా సుప్రింకోర్టు చేతులు దులిపేసుకున్నట్లుంది. అత్యవసరంగా విచారించాలని ప్రభుత్వం ఎంత విజ్ఞప్తిచేసినా ధర్మాసనం పట్టించుకోలేదు. ప్రభుత్వ వాదనలు తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చేపేరుతో కేసు విచారణను ఏప్రిల్ కు కోర్టు వాయిదావేసింది. కేసు విచారణను ఏప్రిల్ కు వాయిదా అంటేనే కోర్టు మనోగతం అర్ధమైపోతోంది. విషయం ఏమిటంటే మూడురాజధానులను ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి మాత్రమే …
Read More »సిట్టింగ్ లను గెలిపించలేవా జగన్?: చంద్రబాబు
సీఎం జగన్, ఆయన పాలనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టారీతిన అవినీతి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ జగన్ రాజకీయాలను అపవిత్రం చేశాడని, మంచి చెడుకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్ మారుస్తున్న విధానాన్ని తన జీవితంలో ఎన్నడూ వినలేదని, కనలేదని…45 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ అంతటి దారుణమైన ముఖ్యమంత్రిని, పాలనను ఏనాడూ చూడలేదని …
Read More »వైసీపీకి మల్లాది విష్ణు గుడ్ బై?
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను మారుస్తూ సీఎం జగన్ నిన్న రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు సర్దుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు నేతలు పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీకి గుడ్ బై చెప్పే …
Read More »తిరువూరు కేశినేని బ్రదర్స్ రచ్చ..ఎస్ఐకి గాయాలు
విజయవాడ రాజకీయాలలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం కొంతకాలంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కొద్ది నెలలుగా పార్టీతో అంటీముట్టనట్టుగా ఉండటం, తన సోదరుడు కేశినేని చిన్నితో విభేదాల నేపథ్యంలో పార్టీపై అలకబూనడం హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో కేశినేని చిన్నికి టికెట్ ఇచ్చేందుకు టిడిపి అధిష్టానం కూడా మొగ్గుచూపుతోందని, అందుకే పార్టీపై, చిన్నిపై నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారని …
Read More »నారా ఫ్యామిలి ఫుల్లు బిజీనా ?
ఒక్కసారిగా నారా ఫ్యామిలి ఫుల్లు బిజీ అయిపోయింది. బహిరంగసభలతో చంద్రబాబునాయుడు, నియోజకవర్గం పర్యటనతో లోకేష్, నిజం గెలవాలని పరామర్శయాత్రతో భువనేశ్వరి యాక్టివ్ అయిపోయారు. ఈనెల 5వ తేదీనుండి 29వ తేదీవరకు వరుసగా చంద్రబాబు బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు. అంటే 24 రోజుల్లో 25 బహిరంగసభల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. మధ్యలో ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అందుకనే ఒకేరోజు రెండు మూడు బహిరంగసభలను కూడా ప్లాన్ చేశారు. ఏరోజు ఎక్కడ …
Read More »ఫ్యామిలి ప్యాకుల కోసం ట్రై చేస్తున్నారా ?
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కోసం సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఉత్సాహంతో పాటు గెలుపు ధీమా కూడా పెరిగినట్లుంది. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో తమకు లేదా తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి కచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ సీనియర్లు పట్టుబడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. ముందుగా రేవంత్ రెడ్డితో ఒకమాట చెప్పి వెంటనే అధిష్టానం పెద్దలతో …
Read More »కేటీయార్ దుమ్ము దులిపేస్తున్నారా ?
ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీయార్ ను నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. ఓడిపోయినా ఇంకా కేటీయార్లో అహంకారం తగ్గలేదా అంటు మండిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏదో సమావేశంలో కేటీయార్ మాట్లాడుతు కేసీయార్ 32 మెడికల్ కాలేజీలను పెట్టేబదులు 32 యూట్యూబ్ ఛానళ్ళను ఏర్పాటుచేసుకునుంటే బీఆర్ఎస్ మళ్ళీ గెలిచేదన్నారు. అంటే ఏ ఉద్దేశ్యంతోనే కేటీయార్ ఈ మాటలన్నారో అర్ధంకావటంలేదు. కారణం ఏమిటంటే ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ తక్కువేమీ జరగలేదు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates