దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటి వరకు ఆరు దశల్లో పూర్తయింది. మరో దశ పోలింగ్ జరగాల్సి ఉంది. అది జూన్ 1న జరగనుంది. ఇక, ఎన్నికల ఫలితాలు.. జూన్ 4న తేలిపోనున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం గట్టారు..? ఎవరిని అందలం ఎక్కించారు? ఎవరిని దించేశారు? అనేది జూన్ 4న తెలిసిపోతుంది. దీంతో జూన్ 4 పై సహజంగానే చర్చ ఉంది. అయితే.. దీనికి మించి ఇప్పుడు జూన్ 1 …
Read More »చివరి ఎన్నికల సెంటిమెంటు వర్కవుట్ అయ్యేనా?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో కొందరు నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చివరి ఎన్నికలంటూ.. చెప్పుకొచ్చారు. వీరిలో వైసీపీ, టీడీపీకి చెందిన హేమా హేమీ నాయకులు వున్నారు. మరి వారు ఈ ఎన్నికల్లో సక్సెస్ అవుతారా? వారు ప్లే చేసిన సెంటిమెంటు వర్కవుట్ అవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వారు చివరి ఎన్నికలు అన్నా.. ఓటరు దేవుడు ఎలా కరుణించాడనేది.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొడాలి నాని: …
Read More »ఏపీలో కూటమిదే అధికారం: అమిత్ షా ధీమా
ఏపీలో ఎన్డీయే కూటమి(టీడీపీ+జనసేన+బీజేపీ) అధికారంలోకి వస్తుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తాజాగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి బాగా పనిచేసిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్దిలో సాగాలంటే.. ఏపీలో కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా విశ్వసించారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో కూటమి వస్తుందని బలంగా నమ్ముతున్నట్టు తెలిపారు. అదేవిదంగా పార్లమెంటు స్థానాల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని …
Read More »18 దాటితే.. కేంద్రంలో బాబుదే చక్రం!
పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు 400 సీట్లు రావాలని బీజేపీ పెద్దలు లక్ష్యం గా పెట్టుకున్నారు. దీనినే పదే పదే ప్రచారం కూడా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు… అబ్ కీ బార్ చార్ సౌ పార్(ఈసారి 400 సీట్లు) అంటూ.. ప్రచారం ఊదర గొడుతున్నారు. కానీ, దేశంలో నెలకొన్న పరిస్థితులు.. పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అన్ని సీట్లు రావడం కష్టమని.. కీలక సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ …
Read More »షర్మిల ఓడితే..
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. గట్టిగానే ప్రచారం చేసుకున్నా రు. పార్టీ ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గే నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు కీలక నేతలను తెచ్చు కుని కడపలో ప్రచారం చేయించారు. సబలు పెట్టారు. సెంటిమెంటు కురిపించారు. ఎవరూ ఊహించని విధంగా కరడు గట్టిన ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేయలేని విధంగా సీఎం జగన్ను.. దునుమాడారు. తీవ్ర వ్యాఖ్యలతో …
Read More »రేవ్ పార్టీ వ్యవహారం మంత్రికి తెలుసా? లేదా?
దక్షిణాది రాష్ట్రాల్లో సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు ఏపీలో ఉన్నాయని.. బెంగళూరు పోలీసులు భావించినట్టే జరుగుతోంది. ఈ రేవ్ పార్టీలో తొలిరోజే… మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అయితే.. దీనిపై రాజకీయం రేగడంతో కాకాని సవాళ్లు రువ్వారు. అది తన కారు కాదన్నారు. తనకు తన అనుచరులకు కూడా.. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. …
Read More »తెలంగాణ సీఎం రేవంత్తో బాలయ్య భేటీ రీజనేంటి?
టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బాలయ్య ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి ఇది సాధారణ సమావేశమే అని అనుకుం టున్నా.. కీలకమైన విషయాలు చర్చించేందుకు నందమూరి వచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించేందుకు రెండేళ్లుగా బాలయ్య …
Read More »ఆయనకు మెజారిటీ తగ్గినా.. ఓడిపోయినట్టే!
ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే విషయం తెలిసిందే. అయితే.. ఈసారి ఇదే వైఎస్ కుటుంబంలో తలెత్తిన వివాదంతో.. అన్నా చెల్లె ళ్లు చీలిపోయారు. దీంతో ఇక్కడ రాజకీయ దుమారం రేగింది. ఫలితంగా.. ఇక్కడ సీఎం జగన్కు పెద్ద పరీక్ష పెట్టినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ‘జగన్ ఓడిపోవడం కుదిరే పని కాదు. ఇది ఎవరూ చేయలేరులే… కానీ, ఆయనకు మెజారిటీ తగ్గినా …
Read More »హైదరాబాద్తో ఏపీ రుణం తీరిపోయింది
హైదరాబాద్ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాజధానే అన్న విషయం చాలామంది మరిచిపోయే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా విభజించిన సమయంలో హైదరాబాద్ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే 2014లో రాష్ట్రం విడిపోయాక రకరకాల కారణాల వల్ల ఏడాది తిరక్కుండానే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. కొంత కాలానికే 90 శాతం ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి అమరావతి, …
Read More »పోలింగ్ సరే.. ఇది మరీ టెన్షన్.. !
ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే.. దాని తాలూకు పర్యవసానం.. దాడులు.. హింస వంటివి కొన్నేళ్ల వరకు కూడా రాష్ట్రాన్ని వెంటాడనున్నాయి. అంటే.. ఆయా కేసుల్లో ఇరుక్కున్న నాయకులు.. చేసిన నేతలు.. అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. సో.. పోలింగ్ వ్యవహారం.. ఇలా టెన్షన్ రేపింది. ఇక, ఇప్పుడు మరో కీలక విషయం తెరమీదికి వచ్చింది. అదే.. కౌంటింగ్. వచ్చే నెల 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది. రాష్ట్ర …
Read More »మాచర్లపై పవన్ ఎందుకు సైలెంట్ ?
మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన విధ్వంసకాండకు ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలవంచుకుంది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఈవీఎంను, వీవీ ప్యాట్ను ధ్వంసం చేసిన తీరు అన్ని వర్గాల ప్రజలకూ ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రజస్వామ్య దేశంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని, పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలూ ఈ ఘటనను తీవ్రంగా …
Read More »సీతక్కకు పార్టీ పగ్గాలు.. ఫలితాల తర్వాత ముహూర్తం!
తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మారబోతున్నారా? అధ్యక్షురాలిగా సీతక్క బాధ్యతలు తీసుకోవడం ఖాయమా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అధ్యక్షురాలిగా సీతక్కను కాంగ్రెస్ హైకమాండ్ నియమించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫలితాల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని హైకమాండ్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో తర్వాత ప్రెసిడెంట్ ఎవరూ అనే చర్చ జోరందుకుంది. ఇందులో సీతక్క వైపే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates