ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అదినేత చంద్రబాబు ప్రశంసలు గుప్పించారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో పయనిస్తోం దన్నారు. దేశాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. దేశ బలమేంటో.. ప్రధాని మోడీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. …
Read More »పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే తమ పనైపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ బలంగానే నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. టీడీపీ, జనసేన ఇప్పుడే పొత్తులపై అధికారికంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈలోపు.. ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వీలైనంత మేర దూరం పెంచి.. పొత్తు పొడవకుండా …
Read More »ఎన్నికల పొత్తుపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ .. !
2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ మెట్టు దిగి ప్రధాని మోదీతో మాట్లాడతారా.. గతాన్ని మరిచి రాజీకి రెండు పార్టీలు సిద్ధమవుతాయా. చాలా కాలంగా వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ అధినేత స్వయంగా సమాధానమిచ్చారు. నేరుగా ఆ మాట చెప్పకుండానే పొత్తుకు పచ్చజెండా ఊపారు.. రిపబ్లిక్ టీవీ చర్చావేదికలో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లుగానే మాట్లాడారు. ప్రధాని మోదీ …
Read More »భార్య కోసం.. తల్లినీ.. చెల్లినీ వదిలేశాడు: వైఎస్ ఆత్మీయుడి విమర్శలు
ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలనుపోలీసులు అరెస్టు చేయడం.. జైలుకు వెళ్లడం వంటి సంఘటనలు జరుగుతున్నా.. ఆమె అన్నగా సీఎం జగన్ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా మాట్లాడిన వైసీపీ ఒకప్పటి నేత, తెలంగాణకు చెందిన నాయకుడు.. వైఎస్కు ఆత్మీయుడు గోనె ప్రకాశరావు..తీవ్ర విమర్శలు చేశారు. తన భార్య భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ …
Read More »మహానాడు వేదిక మారింది.. రాజమండ్రిలో కాదు.. !
ఏటా మే 28న టీడీపీ ఘనంగా నిర్వహించే మహానాడు వేదిక నిర్ణయం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఏడాది మహానాడును రాజమండ్రిలో నిర్వహించాలని పార్టీ నాయకులు భావించారు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం.. తపిస్తున్న టీడీపీ బలమైన వర్గం ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మహానాడును నిర్వహించాలని తలపోసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ వంటివారు స్థలం కోసం కూడా అన్వేషించారు. అయితే.. అనూహ్యంగా ఈ …
Read More »షర్మిలకు బెయిల్.. కానీ.. సంచలన ఆంక్షలు!
పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో సోమవారం రాత్రంగా గడిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాదనలు..తీవ్ర ఉత్కంఠ అనంతరం.. సంచలన ఆంక్షలతో బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. తొలుత మంగళవారం ఉదయం కోర్టులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఈ పిటిషన్పై షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. …
Read More »అమరావతికి ‘సీమ’ మద్దతు.. విశాఖకు నో
ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటంపై అప్పట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు అంతగా ఇష్టపడని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జగన్ సర్కారు రాజధానిని విశాఖకు తరలించే ప్రక్రియ చేపట్టటం.. త్వరలోనే ఆ పని మొదలవుతుందన్ స్పష్టమైన సందేశాన్ని ఈ మధ్యనే వెల్లడించటం తెలిసిందే. అయితే.. విశాఖకు రాజధానిని తరలించటంపై సీమ వాసుల వాదన ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా దీనికి సంబంధించి కీలక ప్రకటన …
Read More »చంద్రబాబు భద్రతను పెంచబోతున్నారా ?
వరుసబెట్టి చంద్రబాబునాయుడుపై జరుగుతున్న దాడి ప్రయత్నాలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయినట్లు సమాచారం. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న విషయం తెలిసిందే. జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న వ్యక్తులకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) భద్రత కల్పిస్తుంది. తాజాగా ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో రాళ్ళదాడికి ప్రయత్నం జరిగింది. ఆమద్య తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పర్యటనలో కూడా దాడికి ప్రయత్నం జరిగింది. అందుకనే చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖ రివ్యూ …
Read More »ప్రత్యర్థిని తేల్చే విషయంలో కేటీఆర్ తొందరపడ్డారా?
తెలంగాణ రాష్ట్ర మంత్రి.. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ కీలక వ్యాఖ్య చేశారు. మరికొద్ది నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. తమ రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల్లో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీగా చెప్పేసిన ఆయన.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. తమకు పోటీ కాంగ్రెస్ తోనే అని.. అది కూడా రెండో …
Read More »జగన్ మదిలో సుప్రీం గుబులు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్యమనస్కంగా ఉంటున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కొంత ఊరట లభించినట్లే అనుకున్నా సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వులతో జగన్ కు టెన్షన్ పట్టుకుందని చెబుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే ఇచ్చినప్పటి నుంచి జగన్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడటం లేదని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల సమాచారం. తాము ఒకటి …
Read More »తెలంగాణాలో కూడా కర్నాటక మోడలేనా ?
తొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో కూడా కర్నాటక మోడల్ నే అమలు చేయాలని బీజేపీ అగ్రనేతలు డిసైడ్ అయినట్లున్నారు. మేడ్చల్ బహిరంగసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్ను రద్దుచేస్తామని ప్రకటించారు. ముస్లింలకు ఇపుడు తెలంగాణాలో అమల్లో ఉన్న 4 శాతం రిజర్వేషన్లు రద్దుచేస్తారట. అలా రద్దుచేసిన …
Read More »జగనే మా భవిష్యత్తుకు వెనకాల.. ఇంత పెద్ద షాక్ తగిలిందా…!
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం.. మా నమ్మకం నువ్వే జగన్.. జగనే మా భవిష్యత్తు కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఈ నెల 7న ప్రారంభమై 20న ముగియాల్సి ఉంది. అయితే..దీనికి వస్తున్న స్పందనతో సీఎంజగన్ ఈ కార్యక్రమాలను ఈ నెల 29 వరకు పొడిగించారని వైసీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోందని.. ఇప్పటికి 70 లక్షల మంది …
Read More »