అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చిన హామీలిచ్చేస్తున్నారు. తన హామీలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమన్న విషయంపై రాహుల్ కసరత్తు చేశారా లేదా అన్నదే అర్ధం కావటం లేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. పరివర్తన్ యాత్రలో గుజరాత్ లోని అహ్మదాబాద్ రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ …
Read More »ఆ పొరపాటే కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా?
రాజకీయంగా తమకు ఎదురుండకూడదనే ఎవరైనా అనుకుంటారు. ఇందుకు ఒక్కొక్కరు ఒక్క పంథాను అనుసరిస్తారు. తెలంగాణాలో కేసీయార్ గతంలో అనుసరించిన, ఇపుడు అనుసరిస్తున్న విధానమే ఇపుడు ఆయన మెడకే చుట్టుకుంటోంది. 2014లో అధికారంలోకి వచ్చింది బొటాబొటి మెజారిటితో మాత్రమే. 119 అసెంబ్లీ సీట్లలో అప్పట్లో టీఆర్ఎస్ కు వచ్చింది 64 సీట్లు మాత్రమే. అధికారం అందుకోవాలంటే ఏ పార్టీ అయినా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాల్సిందే. అలాంటిది టీఆర్ఎస్ …
Read More »గుజరాత్లో రాహుల్ హామీలే హామీలు..
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉంది. దీనిని గట్టెక్కించే చర్యలు చేపట్టాల్సిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యర్థి పార్టీలకు మరిన్ని ఆయుధాలు అందించేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జాతీయ స్థాయి పార్టీని ఆయన ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న గుజరాత్ను ఆయన టార్గెట్ చేసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ బలం గత పాతికేళ్లుగా …
Read More »కేసీఆర్ నమ్మకం ఏంటో ?
కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడితే దేశవ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని కేసీయార్ ప్రకటించారు. 24 గంటల కరెంటు ఇపుడు తెలంగాణాలో మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. 2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని జనాలకు పిలుపిచ్చారు. జనాలు ఆశీర్వదిస్తే కచ్చితంగా దేశ రాజకీయాల్లోకి వెళతానని కూడా చెప్పారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరు పోరాడాలన్నారు. కొంతకాలంగా నరేంద్రమోడీని కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరు చూస్తున్నదే. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను జాగ్రత్తగా …
Read More »నిజామాబాద్ నుంచే జాతీయ రాజకీయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్ల పాలనలో మోడీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని ప్రశ్నించారు. దేశంలో ఉన్నవాటినే వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోడీ చేస్తున్న ఏకైక పని అని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో …
Read More »వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: చంద్రబాబు
ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే టీడీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని.. పార్టీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన చెన్నుపాటి గాంధీపై దాడిని చంద్రబాబు ఖండించారు. గాంధీపై దాడి అమానుషమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీమూకలు రెచ్చిపోతున్నారని, ప్రశాంతంగా ఉన్న విజయవాడను కిష్కింధగా మార్చరని మండిపడ్డారు. రౌడీయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగుపడలేదని, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. గాంధీపై దాడి …
Read More »ఏపీలో గురుపూజా రాజకీయం.. ఏం జరుగుతోందంటే
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. అంటూ.. గురుదేవులను పూజించుకునే వేళ.. ఏపీలో రాజకీయం అనేక కీలక మలుపులు తిరుగుతోంది. గురుపూజలకు కూడా రాజకీయం అలుముకుందని తెలుస్తోంది. ప్రస్తుతం కం ట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులుకేసులు పెట్టి వేధించడాన్ని నిరశిస్తూ.. గురువులు.. మూకుమ్మడిగా ఈ ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే సర్కారుకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా.. ఉపాధ్యాయులు …
Read More »వైసీపీలోకి ముద్రగడ కుటుంబం ?
గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభం కుటుంబం తొందరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కొడుకు ముద్రగడ గిరిబాబు వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముద్రగడ చాలాకాలంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కాపులను బీసీల్లో చేరుస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలుచేయాలన్న డిమాండుతో ముద్రగడ …
Read More »బీజేపీని జూనియర్ ఆదుకోగలరా?
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నది వాస్తవం. వామపక్షాలు, కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందో బీజేపీ పరిస్ధితి కూడా అదే విధంగా ఉంది. కాకపోతే కమలనాథులు ప్రతి చిన్న విషయానికి ఎగెరిగెరి పడుతున్నారు. కారణం ఏమిటంటే కేంద్రంలో అధికారంలో ఉండటమే తప్ప మరోటి కాదు. మరి ఇంటి పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామన్న బిల్డప్ ఇస్తోంది. దీనికి కారణం ఏమిటంటే జూనియర్ ఎన్టీయార్ లాంటివాళ్ళ తమకు సేవలందించటానికి సిద్ధంగా …
Read More »తుమ్మల తేల్చుకోలేక పోతున్నారే!!
తుమ్మల నాగేశ్వరరావు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనకు ఒకప్పుడు తిరుగులేదు. కానీ, ఓడలు బళ్లు అయినట్టుగా.. ఆయన పరిస్థితి ఇప్పుడు సందిగ్ధావస్థలో పడిపోయింది. ఉన్న పార్టీ పట్టించుకోవడం లేదు. వెళ్దామనుకునే పార్టీల్లో సత్తాపై.. ఆయనకు ధైర్యం లేదు. దీంతో ఇప్పుడు ఆయన డోలాయమాన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఆది నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న తుమ్మల.. 2014 తర్వాత.. అనూహ్యంగా టీఆర్ఎస్ …
Read More »మునుగోడుపై.. కేసీఆర్ కసి
ఉప ఎన్నికే అయినా.. సార్వత్రిక ఎన్నికను మించిపోయినట్టు కనిపిస్తోంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసి.. బీజేపీలోకి చేరారు. ఈ క్రమంలో తన ఎమ్మెల్యే పదవిని కూడా ఆయన వదులుకున్నారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే.. ఇది అధికార పార్టీ జీవన్మరణ సమస్య కావడంతో ఇక్కడ నుంచి …
Read More »10 జిల్లాల్లో కాంగ్రెస్ ఓకే.. మరి వాటి సంగతేంటి?
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. విజయం తమదేనని చెప్పుకోవడం వరకే కాంగ్రెస్ నేతలు పరి మితమవుతున్నారా? భారం మొత్తం పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్పై వేసి.. తాము చోద్యం చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఉగాది పచ్చడిని తలపిస్తోందని చెబుతున్నారు. కేవలం 10 జిల్లాల్లో మాత్రమే.. పార్టీ పరిస్థితి బాగుందని.. ఆయా జిల్లాల్లో ఆశాజనమైన ఫలితం వచ్చేందుకు అవకాశం ఉందని అంటున్నారు. …
Read More »