“అనుమానం లేదు.. వైసీపీ గేమ్ ఈజ్ ఓవర్.” అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడుతూ.. ఆసాంతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రజల్లో ఇంత కసి ఎప్పుడూ చూడలేదు. గేమ్ ఈజ్ ఓవర్… కూటమి అన్ స్టాపబుల్. ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ (టీడీపీ) తొక్కుకుంటూ పోతుంది… గ్లాసు (జనసేన) కూడా ఎక్కడిక్కడ కుమ్మేసుకుంటూ పోతుంది… …
Read More »త్రిశంకు స్వర్గంలో రాధా.. రాజకీయాలు షట్డౌన్!
వంగవీటి రాధా. ఈ పేరు చెబితే చాలు ఆయనకు పరిచయం అక్కర్లేదు. అలాంటి నాయకుడు ఇప్పుడు కీలకమైన ఎన్నికల వేళ త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన ఇప్పుడు అసలు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి అధికారికంగా ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ, అలా ఆ పార్టీ క్లెయిమ్ చేసుకోవడంలేదు. అసలు పార్టీలో రాధా పేరు తలుచుకునేవారు కూడా లేరు. అంతేకాదు.. అసలు రాధా గురించిన …
Read More »కాంగ్రెస్లో చేరిన కడియం ఫ్యామిలీ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి.. తన కుమార్తె కావ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీపాదాస్ మున్షి.. కడియం శ్రీహరికి, కావ్యకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు. కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా …
Read More »నారా లోకేష్కు ‘జడ్’ కేటగిరీ భద్రత: ఇక, తనిఖీలు తప్పినట్టే
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల వేళ.. స్థానిక అధికారులు.. పోలీసుల నుంచి అడుగడుగునా తనిఖీలు తప్పినట్టే అయిందని అంటున్నారు సీనియర్ నాయకులు. అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ …
Read More »పవన్ ను ఓడించబ్బా: జనసేన నేతకు జగన్ టార్గెట్
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. పైగా ఎన్నికల సమయంలో నాయకులు కప్పదాట్లు.. గోడదూకుళ్లు కూడా సహజమే. అయితే.. చిత్రం ఏంటంటే.. జనసేనలో చేరిన రెండు వారాల్లోనే కీలకమైన నాయకుడు జంప్ చేయడం. అదేసమయంలో పవన్ పనితీరును కూడా విమర్శించడం. వాస్తవానికి పదేళ్లుగా ఉన్న నాయకులు కూడా తాజా ఎన్నికల్లో చాలా మంది టికెట్లు తెచ్చుకోలేక పోయారు. అయినప్పటికీ.. వారు పార్టీ లైన్ను దాటేందుకు సాహసించలేదు. కానీ, తాజాగా రెండు వారాల కిందట …
Read More »ఇంత డబ్బున్నా.. రఘురామకు టికెట్ లేదా?!
“నా దగ్గర ఎన్నికల్లో పోటీచేసేంత డబ్బులేదు. అందుకే ఎన్నికలకు దూరంగా దూరంగా ఉంటున్నా”- ఇదీ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ చెప్పిన మాట. అంటే.. టికెట్ ఇవ్వడానికి డబ్బు కూడా ఒక కొలమానం అని ఆమె చెప్పకనే చెప్పారు కదా! మరి ఈ విసయంలో రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏం పాపం చేశారు? ఆయన దగ్గర డబ్బుకు కొదవ లేదని.. ఆయన సమర్పించిన అఫిడవిట్లలోనే(2019) స్పష్టంగా ఉందికదా! …
Read More »ఔను.. సర్దుకు పోతా.. బీజేపీని గెలిపిస్తా: పరిటాల శ్రీరాం
“ఔను.. నేను ధర్మవరం టికెట్ ఆశించా. నాలుగున్నరేళ్లుగా ఇక్కడే పడుకున్నా. ఇక్కడే తిన్నా. ఇక్కడే పనిచేశా. టీడీపీ జెండాను గ్రామ గ్రామాన ఎగిరేలా చేశా. అయితే.. పొత్తులో భాగంగా నాకు టికెట్ రాలేదు. ఇది కొంత బాధగానే ఉంది. అలాగని పార్టీని వీడి పోను. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యం. ఇక్కడ బీజేపీ నేత సత్య కుమార్కు టికెట్ ఇచ్చారు. సంతోషం కలిగింది. ఆయనను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తా” అని ఉమ్మడి …
Read More »పిఠాపురంలోనే ఇల్లు: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి కొబ్బరికాయ కొట్టారు. ఇక్కడ నుంచే ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించారు. వారాహి వాహనానికి అధికారులు అనుమతి లేదని చెప్పారు. దీంతో పవన్.. వేరే వాహనంపై ప్రచారం చేశారు. కొద్దిదూరం పర్యటించి.. స్థానికులతో మమేకమయ్యారు. అంనంతరం ఆయన ప్రసంగిస్తూ.. పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. అంతేకాదు.. తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని.. అలా …
Read More »మూకుమ్మడి రాజీనామాలు పెద్ద డ్రామా: షర్మిల
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. “ప్రత్యేక మోదా కోసం.. గత ఎన్నికలకు ముందు మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్న జగన్ పిలుపు పెద్దడ్రామా” అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే విషయంలో జగన్.. నాటకాలాడారని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 22 మంది …
Read More »‘ఏపీని ఎంత నాశనం చేయాలో అంతా చేశాడు’
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని.. అందుకే తాను ఎన్నికల బరిలోకి దిగానని ఆయన చెప్పారు. అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని.. పరోక్షంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తనను రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్ణయించిందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు …
Read More »సీఎం జగన్ బస్సుపైకి చెప్పు విసిరిన వ్యక్తి!
ఏపీ సీఎం జగన్ పర్యటనలో ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే కర్నూలులో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటించిన సీఎం జగన్కు మహిళలు ఖాళీ బిందెలతో ఎదురొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న హై సెక్యూరిటీ బస్సుపైకి ఆగంతుకుడు చెప్పులు విసిరాడు. అనంతపురం జిల్లాలో సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన …
Read More »నా సెక్యూరిటీ ఆఫీసర్ మాటకు కన్నీళ్లు తిరిగాయి: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా సెక్యూరిటీ ఆఫీసర్ నాకో మాట చెప్పాడు. ఆ మాట విన్నాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. జగన్ పాలనలో రాష్ట్రం గంజాయి వనంగా మారిపోయింది. దీనికి బానిసలై.. అనేక మంది యువకులు జీవితాలను పాడు చేసుకుంటున్నారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ప్రజాగళం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates