ఇది కరోనా కాలం. ప్రభుత్వ సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన సమయం. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో ఓ అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులు హాజరయ్యారు. ఐతే కలెక్టర్ సమావేశంలో సీరియస్గా మాట్లాడుతూ.. సిబ్బంది ఈ సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతూ సూచనలు ఇస్తుంటే.. ఉద్యోగులు మాత్రం అవేమీ పట్టనట్లు వాళ్ల పనిలో వాళ్లు మునిగిపోయారు. …
Read More »గంగూలీ గురించి క్రేజీ రూమర్
క్రికెటర్గా ఉన్నపుడు.. ఆటకు టాటా చెప్పేశాక.. ఎప్పుడూ సౌరభ్ గంగూలీ వార్తల్లో వ్యక్తే. బ్యాట్స్మన్గా, కెప్టెన్గా భారత క్రికెట్పై అతను వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. భారత క్రికెట్ రాతనే మార్చేసిన ఆటగాడతను. ఆటకు వీడ్కోలు చెప్పాక కొంత కాలం వ్యాఖ్యాతగా కొనసాగిన దాదా.. ఆ తర్వాత క్రికెట్ పాలనలోకి వచ్చి అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు. ముందు బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడయ్యాడు. ఆపై అనూహ్యంగా బీసీసీఐ పీఠాన్ని కూడా …
Read More »కేసుల సంఖ్యలో ఆ 19 రాష్ట్రాలను బీట్ చేసిన తూ.గో జిల్లా
ఆంధ్రప్రదేశ్లో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు దాదాపు 6-8 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో మరో 8,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా….మొత్తం కేసుల సంఖ్య 3,61,712కి చేరింది. గత 24 గంటల్లో 86 మంది మరణించగా…కరోనాతో ఇప్పటివరకు 3,368 మంది మరణించారు. ఇక, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. గడచిన 24 …
Read More »ఘోరం.. ఐదంతస్థుల భవనం కుప్పకూలిపోయింది
కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ గఢ్ జిల్లాలోని కాజల్ పురా ప్రాంతంలో ఓ భారీ భవనం ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది. ఐదు అంతస్థుల ఈ భవనం పూర్తిగా కుప్పకూలిపోగా.. శిధిలాల కింద 75 మంది వరకూ చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. 25 మంది ప్రాణాలతో బయటపడగా.. ఇంకో 50 మంది శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిలో చాలామంది మరణించి ఉంటారని …
Read More »తెలంగాణకు ఏమైంది? రెండో రోజు భారీగా కేసులు నమోదు
తెలంగాణకు ఇరుగుపొరుగున ఉన్న మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు కావటం తెలిసిందే. దేశంలో అత్యధిక కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. మూడో స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలుగా ఉండటం గమనార్హం. అయినప్పటికీ.. ఈ మూడు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉండేది. దీంతో.. కాస్తంత మెరుగ్గా ఉందనుకుంటున్న …
Read More »రాహుల్ వెర్సస్ సీనియర్లు.. సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ హాట్
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పు విషయమై నెలకొన్న అంతర్గత సంక్షోభం తీవ్ర స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని విడిచిపెట్టడానికి సోనియా గాంధీ సిద్ధమవుతుండగా.. ఆ పదవిని చేపట్టేందుకు రాహుల్ సుముఖంగా లేని విషయం తెలిసిందే. రాహుల్కు పగ్గాలప్పగించే విషయంలో పార్టీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ప్రక్షాళన అవసరమని పేర్కొంటూ.. రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలో 23 మంది సీనియర్ నేతలు ఇటీవల …
Read More »తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్
కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలకు గుడ్ న్యూస్. కీలక సమయంలో కేంద్రం తీపికబురు తెలిపింది. లాక్ డౌన్ విముక్తి అయిపోయి అన్లాక్ దశలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నా… ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న ప్రజలకు కొనసాగుతున్న కష్టాలకు చెక్ పడింది. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఉండకూడదని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అంతరాష్ట్ర రవాణ విషయంలో కీలక …
Read More »ఈ అమ్మాయి కథ చదివి తీరాల్సిందే
అన్ని సౌకర్యాలూ ఉంటాయి. దేనికీ లోటుండదు. శుభ్రంగా చదువుకోమంటే చాలామందికి శ్రద్ధ ఉండదు. ఇంకొంతమందేమో.. సౌకర్యాల లేమిని, ఆర్థిక ఇబ్బందులనే సాకుగా చూపించి సరిగా చదవరు. కానీ మహారాష్ట్రకు చెందిన స్వప్నాలి సుతార్ మాత్రం అలా కాదు. ఆమెకు ఎటు చూసినా ఇబ్బందులే. కానీ అవేవీ ఆమె చదువులో అద్భుతాలు చేయనివ్వకుండా ఆపలేదు. మారు మూల అటవీ ప్రాంతంలో పుట్టిన గిరిజన అమ్మాయి స్వప్నాలి. తనది పేద కుటుంబం. తల్లిదండ్రులు …
Read More »నన్నొకడు మోసం చేసి సీఎం అయ్యాడు-మోహన్ బాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరెత్తితే చాలు మంటెత్తిపోతారు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు. ఒకప్పుడు బాబుతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన ఆయన.. ఆ తర్వాత ఆయనకు దూరమయ్యారు. ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. గత కొన్నేళ్లలో బాబు పేరెత్తితే చాలు మోహన్ బాబు తిట్ల వర్షం కురిపించేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల ముంగిట తన విద్యా నికేతన్ …
Read More »పండుగపూట.. తన బలగం ఏమిటో చూపించిన ఎంపీ రఘురామ
తరచూ వార్తల్లోకి వస్తున్నారు నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. సొంత పార్టీపై తరచూ గళం విప్పుతూ.. అసమ్మతివాదిగా.. ఫైర్ బ్రాండ్ గా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఢిల్లీలో ఉంటున్న ఆయన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేయటంతో సొంత పార్టీ నేతలు.. కార్యకర్తలు ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. …
Read More »సీఎం కేసీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన మంత్రి అనుచరుడు
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి వ్యక్తిగత అనుచరులు.. పనులు చేసే వారికి సంబంధించిన సమాచారం పెద్దగా బయటకు వచ్చేది కాదు. మారిన కాలానికి తగ్గట్లు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్.. సోషల్ మీడియా పుణ్యమా అని.. సదరు ప్రముఖులతో కూడిన ఫోటోల్ని ప్రముఖంగా పోస్టు చేసుకోవటం.. వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటం ఈ మధ్యన పెరుగుతోంది. పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటం వరకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం బాగానే ఉన్నా.. దాన్ని అడ్డు పెట్టుకొని …
Read More »కొవాక్జిన్ వ్యాక్సిన్ చేసే విధానంలో మార్పునకు కేంద్రం ఓకే
కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు జరుగుతున్నాయి. పలు సంస్థలు ఇప్పటికే క్లినిక్ ట్రయల్స్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు దశలు పూర్తి అయి.. మూడో దశను చేపట్టారు. భారత్ విషయానికి వస్తే.. ప్రఖ్యాత భారత్ బయోటెక్ సంస్థ తన కొవాక్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ టీకాకు సంబంధించి కేంద్రం కీలక అనుమతుల్ని జారీ …
Read More »