తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, దోషులను పట్టుకునే విషయంలో జగన్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చంద్రబాబు మండిపడ్డారు. అసలు జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అని ప్రశ్నించారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన …
Read More »అనంతపురంలో రామాలయం రథం దగ్ధం..రంగంలోకి చంద్రబాబు
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపిన వ్యవహారంపై దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని, రథాలు తగులబెట్టారని అయినా దోషులను పట్టుకోవలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా ఏపీలో మరో వివాదం రాజుకుంది. అనంతపురం జిల్లాలోని రామాలయంలో రథం తగలబడిన …
Read More »అమరావతికి మహర్దశ..చంద్రబాబు కీలక ప్రకటన
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపబోతున్నామని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ భేటీలో ఇదుకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చంద్రబాబు చెప్పారు. ఇక, అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. న్యాయశాఖపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు పలు కీలక …
Read More »లడ్డూపై చంద్రబాబువి నిరాధార ఆరోపణలు: ఎంపీ స్వామి
తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు, నెయ్యిని ఉపయోగించిన వ్యవహారంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కోట్లాదిమంది హిందువులు, భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై …
Read More »కమల వైపే మోడీ మొగ్గు.. కానీ, ఏం జరుగుతోందంటే
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి-అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. నాలుగేళ్ల కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోడీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఇక, ఇప్పుడు కూడా ప్రధాని మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. అయితే.. మోడీ రాకపై అధికార డెమొక్రాట్ల కంటే …
Read More »బీజేపీలోకి వైసీపీ రాజ్యసభ సభ్యుడు… నేడో రేపో ప్రకటన
వైసీపీ రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా కాదు.. గుండుగుత్తగానే పార్టీ నుంచి జంప్ చేస్తున్నారా? వారి ప్లాన్ వేరేగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను గమనిస్తే.. వైసీపీ నుంచి ఇద్దరు నేరుగా బయటకు వచ్చారు. మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు.. పార్టీకి, వైసీపీ ఇచ్చిన రాజ్యసభ సీట్లకు కూడా రాజీనామాలు సమర్పించారు. వీరిలో రమణ.. టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని …
Read More »బీజేపీ+జనసేన-వైసీపీ!!
తిరుమల లడ్డూ వివాదం తెరమీదికి వచ్చిన దరిమిలా ఏపీలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఈ విషయాన్ని మరింత తీవ్రంగా భావిస్తున్న డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు కూర్చున్నారు. మరోవైపు.. బీజేపీ నాయకులు కూడా దీనిని సీరియస్గా తీసుకున్నా రు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటిపై దాడికి కూడా యత్నం చేశారు. అంటే.. మొత్తంగా చూస్తే.. హిందూ అజెండా ఈ …
Read More »ముప్పేట దాడితో విరుగుతోన్న ఫ్యాన్ రెక్కలు ..!
రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. …
Read More »నారా లోకేశ్.. ఎక్కడ తగ్గాలో బాగా తెలుసుకున్నాడా?
ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్న సినిమా డైలాగ్ ఎంత పాపులర్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తనను తాను తగ్గించుకుంటున్న వైనం.. ఎక్కువ ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైనం చూస్తే.. లోకేశ్ మైండ్ సెట్ ముచ్చట వేస్తుందని చెప్పాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా.. టీడీపీలో ఆయన స్థానం ఏ పాటిదన్న విషయాన్ని ఇప్పుడు చెప్పుకోవాల్సిన …
Read More »లడ్డు గొడవ.. ఆయనెక్కడ?
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని.. అందులో జంతువుల కొవ్వుల తాలూకు అవశేషాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు, బయటపెట్టిన ల్యాబ్ రిపోర్టులు ఎంత సంచలనం రేపుతున్నాయో తెలిసిందే. నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది. జాతీయ మీడియా సైతం ఈ విషయం మీద చర్చలు పెట్టింది. తిరుమల శ్రీవారిని దేశవ్యాప్తంగా కొలిచే భక్తులు ఈ విషయమై విస్మయం …
Read More »ఈ సృజన్ రెడ్డి ఎవరు? కేటీఆర్ పొరబడ్డారా?
కేంద్ర ప్రభుత్వం అమ్రత్ పథకం నిధుల్లో రూ.8888 కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ గా మారింది. అదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన సంస్థకు కాంటాక్టు ఇచ్చినట్లుగా కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం స్పందిస్తే రేవంత్ రెడ్డి పదవి పోవటం ఖాయమన్న కేటీఆర్.. ఎన్నికల వేళ ఆర్ఆర్ట్యాక్స్ పై మోడీ వ్యాఖ్యలు.. తాము ఆధారాలతో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే సమయంలో …
Read More »ఆదివారం ఉదయాన్నే హైడ్రా బుల్డోజర్ కుకట్ పల్లికి!
గడిచిన కొద్దిరోజులుగా హైడ్రా కూల్చివేతల హడావుడి లేదు. వినాయక చవితి పండుగ సందర్భంగా కాస్తంత గ్యాప్ ఇచ్చినప్పటికి.. ఈ వీకెండ్ కూల్చివేతలు ఖాయమన్న అంచనాలకు తగ్గట్లే.. ఆదివారం ఉదయాన్నే కూల్చివేతలు మొదలయ్యాయి. అయితే.. ఇందులోనూ ఒక ట్విస్టు ఉంది. హిమాయత్ సాగర్ చెరువు పరిధిలోని అక్రమ కట్టడాలపై కన్నెర్ర ఖాయమన్న మాట వినిపించింది. అది కూడా కాదంటే మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా బుల్డోజర్లు హడావుడి చేయటం ఖాయమంటూ వార్తలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates