Political News

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్ రిటైర్మెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 1993వ సంవ‌త్స‌రం అఖిల భార‌త స‌ర్వీసుల‌కు చెందిన సునీల్ కుమార్‌.. ఏపీలో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. వైసీపీ హ‌యాంలో సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసిన‌ప్పుడు వివాదాల‌కు కేంద్రంగా నిలిచారు. తాజాగా ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ గ‌డువు(జూన్ 30) రావ‌డంతో రాష్ట్ర …

Read More »

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు వ‌చ్చింద‌ని నేను అనుకుంటున్నా. ఆ పార్టీని ప్ర‌జ‌లు ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పార్టీలు, రాష్ట్రం కోసం ప‌నిచేసే నాయ‌కులు ఉన్నారు. వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం.. ప‌నిచేసేవారు ఎవ‌రూ లేరు. రాజ‌కీయాలు మ‌రీ అంత చెడిపోలేదు. చెడ్డ‌వి కూడా కావు. రండి. రాజ‌కీయ పార్టీల్లో …

Read More »

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న హైద‌రాబా ద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందిన విష‌యం తెలిసిందే. ముక్కుకు స‌ర్జ‌రీ కూడా చేయించున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా మ‌రోసారి ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న వెంట స‌తీమ‌ణి అన్నా కూడా వెళ్లారు. రెండు రోజుల పాటు ఆసుప‌త్రిలోనే ఉండ‌నున్న‌ట్టు పార్టీ …

Read More »

‘న‌కిలీ ఓట్ల‌తోనే రేవంత్ గెలిచారు’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ ర‌క్ష‌ణ‌సేన(టీఆర్ఎస్‌) పార్టీ అధ్యక్షురాలు క‌విత తీవ్ర వ్యాఖ్య లు చేశారు. న‌కిలీ ఓట్ల‌తోనే రేవంత్ విజ‌యం ద‌క్కించుకున్నార‌ని అన్నారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 33 వేల‌ న‌కిలీ ఓట్లు ఉన్నాయ‌ని.. రేవంత్ రెడ్డికి 32 వేల ఓట్ల మెజారిటీ ల‌భించింద‌ని.. అంటే.. ఆయ‌న న‌కిలీ ఓట్ల‌తోనే విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు క‌దా! అని క‌విత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న‌కిలీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆరోపించారు. …

Read More »

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా నిధులు మంజూరవుతూ, నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో “మేము కానీ, జగన్ గారు కానీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పాం” అంటూ కొత్త వాదనను ముందుకు తీసుకొస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల ప్రతిపాదన, అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం మౌనం, ఆ తర్వాత …

Read More »

ఇడుపు కాయితం ఇష్యూలోకి పవన్ ను టార్గెట్ చేసుడేంది కవిత?

ఒకరు వెళుతుంటే నలుగురు నానా మాటలు అనటం కొత్తేం కాదు. ఎప్పుడైతే సమాజం సోషల్ మీడియాలోకి షిప్ట్ అయ్యిందో.. ఆ పైత్యాలు సోషల్ మీడియా వేదికగా చేసుకోవటం ఎక్కువైంది. విచక్షణ మరిచి.. మర్యాదల్ని వదిలేసి నలుగురు ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడే ఎంతోమందికి.. సోషల్ మీడియా ఇప్పుడో వరమైంది. ఎందుకంటే.. తమ పైత్యాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తే నలుగురేంటి ఖర్మ.. నాలుగు వేలు.. ఒకవేళ సదరు పోస్టు వైరల్ అయితే …

Read More »

బీజేపీ బెంగాల్ రాజకీయం తెలంగాణలో పని చెయ్యదా?

తెలంగాణ‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీన్ దిశానిర్దేశం చేశారు. దీనికిగాను ఈ ఏడాది జ‌రిగిన ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌న్నారు. అక్క‌డ ప్ర‌జా పోరాటాల ద్వారానే అధికారం ద‌క్కించుకున్నామ‌ని నాయ‌కుల‌కు చెప్పారు. ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నారు. అయితే.. తెలంగాణ‌లో బెంగాల్ ఫార్ములా ప‌నిచేస్తుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. …

Read More »

మూసీ ప్రక్షాళన నా జీవిత లక్ష్యం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవిత లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఎవరు అడ్డుపడినా, ఎవరు సహకరించకున్నా కూడా మూసీని ప్రక్షాళన చేసి తీరతానని ఆయన ప్రతినబూనారు. ఈ మేరకు ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూసీ నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు …

Read More »

పవన్ అంటే అంత పగ ఎందుకు కవిత గారు?

అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు చేయాల్సిందే. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ తీరునే అవలంబిస్తున్నారు. మొన్నటిదాకా ఆమెలోని ఈ తీరు ఓ మోస్తరుగానే ఉన్నా…ఇటీవలి కాలంలో మాత్రం మరింతగా పెరిగిపోయిందని చెప్పాలి. తాజాగా ఇడుపు కాయితం పేరిట వస్తున్న ఓ సినిమాపై జరుగుతున్న వివాదం నేపథ్యంలోనూ ఆమె పవన్ …

Read More »

వైసీపీకి అమరావతిలో నో ఎంట్రీ?

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో శనివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు… రాజధానిలోకి వైసీపీ నేతల ఎంట్రీని దాదాపుగా నిలిపివేసిందనే చెప్పాలి. అమరావతిని రాజధానిగా గుర్తించడానికే ఇష్టపడని వైసీపీ నేతలకు అమరావతితో ఏం పని అన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఆదివారం సమావేశమై… రాజధానిలోకి వైసీపీ ఎంట్రీని కఠినతరం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించిన …

Read More »

బండికి బెంగ పోయిన‌ట్టేనా?

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ కు ప‌ద‌వీ గండం తొల‌గిపోయిన‌ట్టేన‌ని జాతీయ మీడియా స‌హా.. బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కేంద్ర మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బీజేపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ నెల‌లోనే అంటే.. కొద్ది రోజుల్లోనే ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం .. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో …

Read More »

నిర్మ‌ల‌మ్మ‌కు శాఖ మార్పు… ?

కేంద్ర మంత్రివ‌ర్గంలో ప్ర‌క్షాళ‌న ఖాయ‌మ‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కీల‌క‌మైన ఆర్థిక శాఖ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దాదాపు 10 సంవ‌త్స‌రాలుగా ఈ శాఖ‌కు మంత్రిగా ఉన్న నిర్మ‌లా సీతారామ‌న్‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని ఢిల్లీ వ‌ర్గాలు స‌హా.. బీజేపీ పెద్ద‌లు కూడా చూచాయ‌గా చెబుతున్నారు. అంతేకాదు.. ఆమె స్థానంలో ఆర్ బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్‌కు ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న …

Read More »