Political News

తుఫానును ఆప‌లేదు.. కానీ: చంద్ర‌బాబు

తాజాగా వ‌చ్చిన మొంథా తుఫాను, అనంత‌రం జ‌రిగిన న‌ష్టం.. క‌ష్టంపై సీఎం చంద్ర‌బాబు గురువారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు అధికారుల‌తో స‌మీక్ష‌ల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ప్ర‌తి ప్రాంతం, మండ‌లం స‌హా గ్రామాల నుంచి స‌మాచారం సేక‌రించారు. ఎంత న‌ష్టం వ‌చ్చింది.. ఎంత క‌ష్టం మిగిలింది ?  అనే అంశాల‌ను ఆయ‌న కూలంక‌షంగా చ‌ర్చించారు. సాగు, ర‌హ‌దారుల న‌ష్టంపై ప‌క్కా క్లారిటీని తీసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తుఫానును …

Read More »

ఆ 40 శాతం కోస‌మైనా చేసిందేముంది.. జ‌గ‌న్ ..!

గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు 40 శాతం మేర‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేశార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌ర‌చుగా చెబుతున్నారు. అందుకోస‌మైనా.. వారి త‌ర‌ఫున ప్ర‌శ్నించేందుకైనా.. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని ఆయ‌న ఇటీవ‌ల కూడా ప్ర‌భుత్వాన్ని, స్పీక‌ర్‌ను కూడా కోరారు. ఇదిలావుంటే.. మొంథా తుఫాను స‌మయంలో జ‌గ‌న్ అందుబాట‌లో లేని విష‌యం తెలిసిందే. తాను బెంగ‌ళూరులో ఉన్నాన‌ని.. విమాన సేవ‌లు నిలిపివేయ‌డంతో రాలేక పోయాన‌ని చెప్పారు. కానీ, పార్టీ …

Read More »

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు. బుర‌ద‌లోనే న‌డుస్తూ.. పొలం మ‌ధ్య‌కు వెళ్లి ప‌రిశీలించారు. రైతుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా విన్నారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. ప్ర‌భుత్వం …

Read More »

ష‌ర్మిల‌కు ఏపీ గుర్తులేదా ..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డం.. తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. వైసీపీ అధినేత‌, త‌న సోద‌రుడు జ‌గ‌న్‌పై ఆమె అనేక వ్యాఖ్య‌లు చేసి.. సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా న్యూస్‌గా కూడా మిగిలారు. అయితే.. పార్టీ అధిష్టానం చేసిన కొన్ని సూచ‌న‌ల‌తోపాటు.. స్థానిక నాయ‌కత్వం కూడా.. ష‌ర్మిల‌కు కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేయ‌డంతో కొన్నాళ్లుగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు త‌గ్గించారు. అంతేకా దు.. త‌ర‌చుగా ఏపీలో ప‌ర్య‌టించి స‌మ‌స్య‌లు …

Read More »

ఏడేళ్ల తర్వాత‌… కోర్టు మెట్లెక్క‌నున్న జ‌గ‌న్‌?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మిన‌హాయింపు పొందుతూ వచ్చారు. ప్రస్తుతం అక్రమ …

Read More »

ఏపీలో కొత్త జిల్లాలు: అడిగినా.. అడగ‌కున్నా తంటానే!

ఏపీలో జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌, మండ‌లాల స‌రిహ‌ద్దుల నిర్ణ‌యం అంశం ఎటూ తేల‌డం లేదు. గ‌త 2024 ఎన్నిక‌ల‌కు ముందు.. తాము అధికారంలోకి రాగానే.. ప్ర‌జ‌ల అభీష్టం మేర‌కుకొత్త జిల్లాలు, జిల్లా కేంద్రాలు, మండ‌లాల స‌రిహ‌ద్దుల‌ను మారుస్తామ‌ని.. అవ‌స‌ర‌మైతే.. కొత్త జిల్లాల‌ను కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. ఈనేప‌థ్యంలో దీనిపై త‌ర్వాత చూద్దామ‌ని గ‌త ఏడాది గ‌డిపేశారు. నిజానికి ఇది మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు …

Read More »

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, హైకోర్టు ఏం చెప్పింది?

దాదాపు 10 మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌న‌ర్‌ షిప్(పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది రాజకీయ దుమారానికి దారితీసింది. వైసీపీ హయాంలో మొత్తం 17 కాలేజీలు తీసుకురాగా.. వీటిలో ఐదు కాలేజీలు కొంతవరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరో రెండు కాలేజీలు నిర్వహణలో ఉన్నాయి. ఈ నేపద్యంలో మిగిలిన పది కాలేజీలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8,500 …

Read More »

కాంగ్రెస్ ఆక‌స్మిక నిర్ణ‌యం.. జూబ్లీహిల్స్ కోసమేనా?!

రాజ‌కీయ పార్టీలు తీసుకునే నిర్ణ‌యాల వెనుక చాలా నిగూఢ‌మైన అర్ధం ఉంటుంది. అందునా.. అధికారంలో ఉన్న పార్టీలు తీసుకునే నిర్ణ‌యాల‌కు మ‌రింత అర్ధం-ప‌ర‌మార్థం రెండూ ఉంటాయి. తాజాగా తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ తీసుకున్న ఆక‌స్మిక నిర్ణ‌యం కూడా.. ఈ త‌ర‌హాలోదేన‌న్న వాద‌న వినిపిస్తోంది. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని పార్టీ అధిష్టానం నిర్ణ‌యించింద‌ని తెలిసింది. పార్టీ వ‌ర్గాలు కూడా ఇదే ప్ర‌చారం …

Read More »

సీఎం లంచాలు తీసుకున్నారు విచారించండి: డీజీపీకి ఈడీ లేఖ

త‌మిళ‌నాడులో మ‌రో నాలుగు నెల‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను విచారించాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ (ఈడీ) తాజాగా త‌మిళ‌నాడు డీజీపీకి లేఖ రాసింది. ఈ లేఖ‌కు 232 పేజీల నివేదిక‌ను కూడా జ‌త చేసింది. సీఎంతో పాటు మంత్రి నెహ్రూ, ఆయ‌న సెక్ర‌ట‌రీలు, సోద‌రుడిని కూడా విచారించాల‌ని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో తీవ్ర రాజ‌కీయ అల‌జ‌డి రేగింది. ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ‌ను ఇబ్బంది పెట్టేందుకే …

Read More »

బాబు ఫిదా: ఔను.. అంద‌రూ ముందుకొచ్చారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి ఫిదా అయ్యారు. అది కూడా ఆయ‌న ఇటీవ‌ల కాలంలో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రెండు విష‌యాల‌పై సంతోషం వ్యక్తం చేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతేకాదు, అంద‌రూ చంద్ర‌బాబుతో స‌హా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. విష‌యం ఏంటంటే, తాజాగా మొంథా తుఫాను ప్ర‌భావంతో 22 జిల్లాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు దోబూచులాడిన ఈ మొంథా మంగళ‌వారం అర్థ‌రాత్రి …

Read More »

మొంథా తుఫాన్… ఏపీకి ఎన్ని వేల కోట్ల నష్టమో తెలుసా?

అటు ప్ర‌భుత్వాన్ని, ఇటు ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన మొంథా.. తీవ్ర తుఫాను మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి 11 -12 గంట‌ల 30 నిమిషాల మ‌ధ్య మ‌చిలీప‌ట్నం-క‌ళింగ ప‌ట్నం మ‌ధ్య కాకినాడ‌కు దక్షిణంగా న‌ర‌సాపురం ప‌రిధిలో తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్ర‌భావం మ‌రో రెండు రోజులు కొన‌సాగుతుంద‌న్నారు. మ‌రోవైపు.. తీరం దాటిన త‌ర్వాత కూడా మొంథా తీవ్ర తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల‌పై …

Read More »

చంద్ర‌బాబు 12 గంట‌ల వ‌ర‌కు, కానీ లోకేష్ మాత్రం…

మొంథా తుఫాను.. ప‌లు ప్ర‌భావిత జిల్లాల ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. కానీ, ఇదే స‌మయంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి, మంత్రి నారా లోకేష్‌ల‌కు కూడా నిద్ర‌లేకుండా చేస్తోంద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. గ‌త రెండు రోజులుగా సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉద‌యం 10 నుంచి రాత్రి 11-12 గంట‌ల వ‌ర‌కు గ‌డిపారు. మంగ‌ళ‌వారం రాత్రి అయితే.. ఆయ‌న అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌.. కూడా ఆర్టీజీఎస్‌లోనే ఉన్నారు. …

Read More »