Political News

చంద్రబాబుపై బండ్ల గణేష్ అభిమానం వెలకట్టలేనిది

చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని తన నివాసానికి ఆహ్వానించి ప్రత్యేక వేడుక నిర్వహించిన బండ్ల గణేశ్, తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. షాద్‌నగర్ నుంచి తిరుమల వరకు ‘మహా పాదయాత్ర’ చేపట్టనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడుపై తనకు ఉన్న అభిమానాన్ని, భక్తిని చాటుకునే భాగంగానే ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో స్కిల్ …

Read More »

శుభ సంక‌ల్పం: రెండు రాష్ట్రాల మ‌ధ్య కొత్త స్నేహం!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల నేప‌థ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు దాదాపు ఒకే మాట చెప్పుకొని రావ‌డం.. క‌ల‌సి కూర్చుని చ‌ర్చించుకుంటే.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవచ్చన్న దిశ‌గా ఆలోచ‌న చేయ‌డం.. ప్ర‌స్తుతం నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శుభ‌సంక‌ల్ప‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య గ‌త ఆరు మాసాలుగా నీళ్లు నిప్పులుగా మారాయి. పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల నుంచి నాగార్జున సాగ‌ర్‌వ‌ర‌కు.. అనేక ప్రాజెక్టుల విష‌యంలో తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ గారూ… మీరే దిక్కు!

ఆదీవాసీ స‌మాజానికి ఐకాన్‌గా క‌నిపిస్తున్న ఏకైక నాయ‌కుడు, జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆదివాసీలు(గిరిజ‌నులు) నివ‌సిస్తున్న గ్రామాలు, తండాలకు ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ల్పించ‌డంతో పాటు విద్యుత్ వెలుగులు కూడా తీసుకువ‌స్తున్నారు. ఆయా ప‌నుల‌ను ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. అంతేకాదు.. పండుగ‌లు, శుభ‌కార్యాల‌ను దృష్టిలో పెట్టుకుని వారికి పండ్లు, చెప్పులు.. ఇత‌ర‌త్రా వ‌స్తువుల‌ను కూడా పంపిణీ చేస్తున్నారు. దీంతో ఆదివాసీ జ‌నాల‌కు ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పెద్ద‌దిక్కుగా మారిపోయారు. …

Read More »

నేను సంబరాల రాంబాబునైతే…మరి పవన్?

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సంబరాల రాంబాబు అంటూ టీడీపీ, జనసేన నేతలు రాంబాబుపై విమర్శలు గుప్పించారు. ఇక, సోషల్ మీడియాలో అయితే రాంబాబును నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇంకాస్త ముందుకెళితే పవన్ కల్యాణ్ నటించిన బ్రో చిత్రంలో అంబటి పాత్రను పృథ్వీ పోషించారని …

Read More »

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన పాలన. అదే పని చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి డ్రైనేజీ, చెత్త సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు చెప్పిన ఇబ్బందులను విని, వెంటనే పరిష్కారం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. పిఠాపురంలో కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, శుభ్రం కాని డ్రైనేజీ ప్రజల …

Read More »

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ తరహా వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకరు ఒకటంటే మరొకరు నాలుగంటారు. కానీ దీనికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ మాత్రం తన పనితీరుతోనే విమర్శలకు సమాధానం చెబుతూ విమర్శకుల నోటికి తాళం వేస్తున్నారు. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక వీక్ పత్రిక ముఖ చిత్ర కథనంలో మెరిసిన విషయం …

Read More »

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, ఘర్షణలు లేకుండా తెలుగు వారు ప్రశాంతంగా జీవించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమస్యలను కలిసి కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఈ …

Read More »

అమెరికా 500 శాతం పన్ను… భారత్ ఏమంటోంది?

అమెరికా తీసుకోబోతున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ఇండియాను టెన్షన్ పెడుతోంది. రష్యా దగ్గర నుంచి తక్కువ ధరకే ఆయిల్ కొంటున్న దేశాలపై కక్ష్యతో 500 శాతం పన్నులు వేసే బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. దీనిపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందిస్తూ తాము పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా కూడా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుండి …

Read More »

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు బయలుదేరారని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొందరు రాయలసీమ ఎత్తిపోతల పేరుతో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాకు గొడవలు కాదు.. తెలుగు జాతి ప్రయోజనాలే కావాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తి అయితే తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. …

Read More »

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2 కోట్లను విడుదల చేసింది. రాజధాని ప్రాంతం ఒకప్పుడు బౌద్ధులకు ఆరామంగా ఉండేది. అనేక బౌద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి. ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి …

Read More »

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తరచుగా జగన్ మళ్లీ వస్తే అనే మాట ప్రస్తావిస్తున్నారు. మళ్లీ రానివ్వొద్దంటూ చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారు. ఇక వైసీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేస్తున్నారు. కూటమిని ఎలా ముందుకు …

Read More »

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు. ఆ పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడంలోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. తన పాలనలో చేసిన తప్పుడు పనులను ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని చంద్ర‌బాబు విమర్శించారు. తూర్పుగోదావరి …

Read More »