రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. ప్రముఖ నటుడు, సైంటిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ రస్తోగి స్టేజ్ పైకి వెళ్తున్నప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ కరచాలనం కోసం చెయ్యి చాపారు. కానీ రస్తోగి మాత్రం అటు చూడకుండా నమస్కారం చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ కావడంతో, తృణమూల్ కాంగ్రెస్ నేత …
Read More »గ్రీన్ కార్డు గొప్పలు వద్దు: సుప్రీంకోర్టు కొరడా ఇదిగో!
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా మారింది. ఒక్కసారి గ్రీన్ కార్డు సాధిస్తే.. ఇక, తిరుగులేదు. గ్రీన్ కార్డు దక్కించుకున్న ఇక, తాము అమెరికా పౌరులమని.. తమకు అన్ని చట్టాలు సమానంగానే వర్తిస్తాయని భావిస్తారు. ఇది సాధారణంగా అందరిలోనూ ఉండే భావన. అయితే.. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన.. …
Read More »‘అప్పుడు కేజీఎఫ్… ఇప్పుడు జొన్నగిరి’
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో ఉన్న జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జొన్నగిరి ప్రాంతానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉందని తెలిపారు. ఘనమైన వారసత్వ సంస్కృతి, సంప్రదాయాలను చరిత్రను పరిరక్షిస్తున్నామన్నారు. అశోక చక్రవర్తి …
Read More »రోజా అరెస్టు తప్పదా? ఏపీలో హాట్ టాపిక్!
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా? ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే స్పందిస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా మంత్రి రాం ప్రసాద్రెడ్డి స్పందిస్తూ.. రోజా సహా.. వైసీపీ హయాంలో శాప్ చైర్మన్గా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విజిలెన్స్ విచారణ కూడా పూర్తయిందని.. త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు. …
Read More »సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఈ రోజు సిట్ అధికారులు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ లాకప్ డెత్ వాస్తవమేనని సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించి కోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనం రేపుతోంది. సాయికృష్ణ …
Read More »పేరు చెబితే లక్ష… సర్కారు బంపర్ ఆఫర్!
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ భారత్ లోగో(గాంధీ కళ్లజోడు, చేతి కర్రతో ఉన్నది) సూచించిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇచ్చారు. ఆ తర్వాత.. మన భారత కరెన్సీకి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సంకల్పించిన కేంద్రం.. దీనిని సూచించిన వారికి కూడా ప్రత్యేక కానుకగా 2 లక్షల …
Read More »జగన్ నాన్చారు.. చంద్రబాబు తేల్చారు: ఉద్యోగులకు పండగ!
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని తేల్చేసిన ఓ కీలక విషయంపై సంచలన నిర్ణయం తీసుకుని ఉద్యోగులకు పండగ వాతావరణం తీసుకువచ్చారు. తాజాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న సుమారు 8 లక్షల మందికిపైగా ఉద్యోగులకు పదవీ విరమణ వయసును ఒకేసారి 2 ఏళ్లపాటు …
Read More »చంద్రబాబు పవన్ పై మాట పడనివ్వరు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన సంగతి తెలిసిందే. ఈ విషయం మంగళవారం నాటి ఏపీ కేబినెట్ లో ప్రస్తావన రాగా… పవన్ కు మంత్రులంతా అండగా నిలవాలని టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ విషయంలో మంత్రులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కూడా చంద్రబాబు సూచించారు. ఫలానా అంశంతో …
Read More »ఆ ఇద్దరూ కలిసి సాధించారు!
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి అనుకున్న ఫలితాన్ని సాధించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు మార్గం సుగమం అయ్యింది. ఇదంతా జరగడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టింది. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఫేజ్ 2 పనుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిపాదిస్తే.. రాజకీయ రచ్చ తర్వాత కేంద్రం కూడా …
Read More »గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది గద్దర్ అని స్పష్టమవుతుంది. మరో వ్యక్తి బహుజన ఉద్యమకారుడు అగస్టిన్ అని పవన్ తెలిపారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత ఫొటోపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ ఫొటో తనకు తెలంగాణ ఉద్యమం, సామాజిక తెలంగాణ ఆలోచనల చుట్టూ సాగిన ఎన్నో చర్చలను గుర్తు …
Read More »సిట్ అదుపులో CI నాగరాజు
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించగా… తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టయ్యారు. ఈ కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం …
Read More »వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి కీలక సమయాన ముద్రగడ కుమార్తె, జనసేన మహిళా నేత బర్లపూడి క్రాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు. జగన్ కోసం తన తండ్రి తన పేరును సైతం మార్చుకుంటే… జగన్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates