వైసీపీ నేత, ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసు స్టేషన్కు వెళ్తున్నానని చెప్పిన ఆయన రాత్రి 8 గంటల వరకు ఆచూకీ లేకుండా పోవడంతో పెను దుమారంగా మారింది. దీనిపై ఆయన సన్నిహితురాలు మాధురి పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. వారే దువ్వాడ శ్రీనును అపహరించి ఉంటారని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో దువ్వాడ మద్దతుదారులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు …
Read More »కొడాలి నానీపై చర్యలు వద్దు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తమ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయడం కానీ.. ఇతర చర్యలు తీసుకోవడం కానీ, చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తాజా కేసులో పొలిటికల్ అప్పియరెన్స్ ఉన్నట్టు కనిపిస్తోందన్న న్యాయవాది వాదనలతో ఏకీ భవించిన కోర్టు పోలీసుల చర్యలను తప్పుబట్టింది. ఇలాంటి కేసులపై ఉన్న శ్రద్ధ.. సాధారణ …
Read More »తెలంగాణ బీజేపీపై హై కమాండ్ సీరియస్
తెలంగాణ బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే.. పైకి అలా అనుకున్నా.. క్షేత్రస్థాయిలో కీలక నాయకుల మధ్య మాత్రం అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్న వరంగల్ సభలోనే విభేదాలు బయట పడ్డాయి. వేదికపైనే ఉన్నప్పటికీ.. కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలుగా భావిస్తున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు పన్నెత్తు పలకరింపు …
Read More »ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్… పౌరసత్వంపై కీలక తీర్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్ షిప్ పరిమితుల ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాలో పుట్టిన పిల్లలకు రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కును కొనసాగిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న వారి పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇవ్వకూడదని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వుపై పలు కోర్టుల్లో సవాళ్లు దాఖలయ్యాయి. చివరకు ఈ వ్యవహారం …
Read More »వైసీపీని వెంటాడుతున్న అమరావతి.. సీరియస్.. !
అమరావతి రాజధాని వ్యవహారాన్ని వైసీపీ అధినేత జగన్ లైట్ తీసుకుంటున్నారు. ప్రజలు తనవెంటే ఉంటారని.. తాను ఏం చెప్పినా ఓకే అంటారని ఆయన భావిస్తున్నారు. ఈ ఏడాది ఆయన మూడు రాజధా నులను పక్కన పెట్టి మావిగన్ అనే మాట తెరమీదికి తెచ్చారు. దీనిపై అనేక మంది మేధావులు విస్మయం వ్యక్తం చేశారు. కానీ, సాధారణ ప్రజలు మాత్రం తనతోనే ఉన్నారని జగన్ చెప్పుకొచ్చారు. నిజానికి అమరావతి విషయంలో పక్కా …
Read More »తిరుచ్చిలో పోటీపై లారెన్స్ క్లారిటీ
తమిళనాట పార్టీ పెట్టిన మూడేళ్లలోపే అనూహ్యంగా అధికారంలోకి వచ్చేశారు తమిళ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్. మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక పెరంబూర్ స్థానాన్ని నిలుపుకుని, తిరుచ్చి నియోజకవర్గం నుంచి రాజీనామా చేశారు. ఇక్కడ ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఐతే ఇక్కడ టీవీకే తరఫున ఎవరు …
Read More »పవన్ అంటే పని ఫస్ట్… ఆరోగ్యం నెక్స్ట్…!
జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తరచుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హఠాత్తుగా ఆయనకు ఒక శస్త్రచికిత్స జరగడం.. కొన్ని రోజుల పాటు కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. దాని గురించి తర్వాత పవనే స్వయంగా వెల్లడించాడు. అభిమానులు చూపించిన అతి ప్రేమ వల్ల బాడీలో అక్కడక్కడా చీలికలు వచ్చాయని, వాటికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఐతే తాజాగా పవన్ ఉన్నట్లుండి భార్య అనా …
Read More »ఐపీఎస్ సునీల్కు షాకిచ్చిన సతీమణి!
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్.. మంగళవారం(జూన్ 30) రిటైర్మెంట్ కానున్నారు. గతంలో ఆయన సీఐడీ చీఫ్గా పనిచేశారు. ఆ సమయంలో రఘు రామను లక్ష్యంగా చేసుకున్నారన్న వాదన ఉంది. వైసీపీ నేతలకు సహకరించి ఆయనను వేధించారని కేసు కూడా నమోదైంది. ఇదిలావుంటే, కూటమి సర్కారు వచ్చిన త ర్వాత.. ఆయనను సస్పెండ్ చేశారు. గతంలో అగ్నిమాపక శాఖ …
Read More »పవన్ ఒకరే జనసేనను నడపలేరు
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ నాయకులను ముందుండాలని కూడా సూచిస్తున్నారు. కానీ, ఆయన చెబుతున్నట్టుగా.. లేదా ఆయన ఊహిస్తున్నట్టుగా పార్టీలో ఆ తరహా.. దూకుడు కనిపించడం లేదు. కేవలం పవన్ వస్తే కార్యక్రమాలకు హాజరు కావడం.. లేకపోతే లేదు.. అన్నట్టుగానే నాయకులు వ్యవహరిస్తున్నారన్నది పార్టీలోనే జరుగుతున్న చర్చ. గత ఏడాది …
Read More »వాయిస్ మెసేజ్తోనూ FIR… భళా బాబు గారు
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని తీసుకువస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. సేవల్లో మరింత పారదర్శకత కోసమే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, రెవెన్యూ సేవలపై ఆయన సమీక్షించారు. చాలా మంది స్టేషన్లకు రావాలంటే ఇప్పటికీ జంకుతున్న పరిస్థితి ఉందని సీఎం తెలిపారు. ఈ పరిస్థితి పోవాలన్నారు. ఫ్రెండ్లీ …
Read More »రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ ఆ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఎక్కడికక్కడ వెలిశాయి. వైసీపీ కార్యాలయాలు వెలసిన ప్రదేశాలు ప్రభుత్వ స్థలాలా?… లేదంటే ప్రైవేట్ స్థలాలా? అన్న విషయాన్ని నాటి పాలకులు అస్సలు పట్టించుకోలేదనే చెప్పాలి. తాజాగా ఈ తరహా అక్రమాలపై విజయనగరం రాజ వంశస్తులు, కేంద్ర మాజీ మంత్రి, గోవా గవర్నర్ పూసపాటి …
Read More »పవన్ కు మరో శస్త్ర చికిత్స
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షల్లో రొటేటర్ కఫ్ తో పాటు రెండు భుజాల కండరాల్లో తీవ్ర చీలికలు ఉన్నట్లు తేలింది. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే పవన్ మాత్రం వెంటనే ఆపరేషన్ చేయించుకునే ఆలోచనలో లేరు. ఇప్పటికే నిర్ణయించిన పాలనాపరమైన కార్యక్రమాలు, అధికారిక బాధ్యతలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates