జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొద్దుపొద్దున్నే కార్యరంగంలోకి దిగిపోయారు. సోమవారం తన పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రికే రాజమహేంద్రవరం చేరుకున్న పవన్… సోమవారం ఉదయం 7 గంటలు దాటకముందే రంగంలోకి దిగిపోయారు. రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్ల పరిశీలన కోసం ఆయన సోమవారం నగరంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన కోసం ఆదివారం రాత్రికే నగరం చేరుకున్న ఆయనకు స్థానిక నేతలు, అధికారులు ఘన …
Read More »ఫ్యూచర్ సిటీపై రచ్చరచ్చ!
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న ఫ్యూచర్ సిటీ అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో రచ్చ చోటుచేసుకుంది. ఈ రచ్చకు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కారణం కాగా… ఆయనకు సమాధానం ఇచ్చే దిశగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు తమదైన శైలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెరసి ఫ్యూచర్ సిటీ వ్యవహారంపై శనివారం తెలంగాణలో రచ్చ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ సర్కారు …
Read More »`ఫాల్తా`.. మమత బోల్తా.. డిపాజిట్ పోయి.. విలవిల!
పశ్చిమ బెంగాల్ లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీకి మరోసారి ఇక్కడి ప్రజలు భారీ షాకిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 80 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక, తాజాగా ఫాల్తా నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో ఈ పార్టీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. అంతేకాదు.. అత్యంత దారుణంగా 7 వేల ఓట్లు మాత్రమే పొందారు. అదే సమయంలో …
Read More »షర్మిల సమయం కోసం వెయిటింగా..?
వైసీపీ అధినేత జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ చర్చకు, రచ్చకు కూడా దారితీశాయి. ఫ్యాక్షన్ రాజకీయాలు.. గన్ కల్చర్ గురించి.. మాట్లాడిన జగన్.. ఇవి టీడీపీకి సొంతమని వ్యాఖ్యానించారు. అదేసమయంలో తమ తాత, తండ్రులు చనిపోయినా.. తాను శాంతి కోసం పాకులాడుతున్నానని చెప్పారు. అందుకే.. నాడు తమ తాతను చంపినోళ్లు కూడా.. ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. గత నాలుగు రోజులుగా …
Read More »దేశంలో బాబు `కీ`లక రోల్ ..!
దేశంలో ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెలియని వారు లేరు. విజన్ ఉన్న ముఖ్యమంత్రిగానే కాకుండా.. 75 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా 25 ఏళ్ల నవయుకుడిలా ఛెంగు ఛెంగున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దాదాపు రెండు నుంచి 3 గంటలపాటు నిలబడే కార్యక్రమాల్లో ప్రసంగాలు కూడా దంచి కొడుతున్నారు. దీంతో చంద్రబాబు స్టామినా గురించి.. తరచుగా జాతీయ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. ఇక, ఎన్డీయే పాలిత రాష్ట్రాల …
Read More »ఆ దేశ జాతీయ జంతువు ఆవే… ఎక్కడో తెలుసా..?
భారతదేశంలో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే మన పొరుగు దేశమైన నేపాల్లో గోవుకు ఇప్పటికే జాతీయ జంతు హోదా ఉన్న విషయం చాలా మందికి తెలియదు. 2015 సెప్టెంబర్ 20న నేపాల్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ సమయంలో అప్పటి అధ్యక్షుడు రామ్ బరన్ యాదవ్ గోవును దేశ అధికారిక జాతీయ జంతువుగా ప్రకటించారు. కొత్త రాజ్యాంగంలో గోవుకు ప్రత్యేక గుర్తింపు …
Read More »వివాదంలో పొంగులేటి… ఏం జరిగింది?
తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనవాసరెడ్డి మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కాకముందు ఎలాంటి వివాదాలను దరిచేరనీయకుండా సాగిన పొంగులేటి… మంత్రి అయ్యాక వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా సహచర మంత్రి వాకిటి శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు కారణంగా పొంగులేటి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన మీడియా ప్రతినిధుల ఎదుట… సాక్షాత్తు రాష్ట్ర పాలనా కేంద్రమైన సచివాలయం కేంద్రంగా చోటుచేసుకోవడం గమనార్హం. అసలు ఈ …
Read More »`కాక్రోచ్` దెబ్బకు పెద్ద పార్టీలు విలవిల… నిజమేనా?
కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వెబ్సైట్ సహా.. సోషల్ మీడియా హ్యాండిళ్లలో జరుగుతున్న ఉద్యమం(పార్టీ) పెను ప్రకంపనలు పుట్టిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించినా.. ఇది వాస్తవమేనని చెప్పాలి. ఇన్ స్టాలో కాక్రోచ్ జనతాపార్టీని ఫాలోఅవుతున్న వారి సంఖ్య 2 కోట్ల 35 లక్షలకు చేరింది. ఇక, వెబ్ సైట్ వీక్షలు కూడా లక్షల్లోనే పెరిగారు. ఇక, ఎక్స్ ఖాతాను మూసివేసినా.. తిరిగి ప్రారంభించిన.. కాక్రోచ్ రిటర్న్ …
Read More »కళావతిని వదులుకుంటే వైసీపీకే నష్టం?
వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు.. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే.. విశ్వసరాయి కళావతి.. నమ్మకానికి పెట్టింది పేరు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీకి మద్దతు పలికిన తొలి మహిళా నాయకురాలిగా ఆమె గురించి పార్టీలో చెబుతారు. వరుసగా రెండుసార్లు ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. పార్టీ పరంగా ఆమెకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. నిజానికి పార్టీలోనే కాకుండా.. నియోజకవర్గంలో కూడా విశ్వసరాయికి మంచి పేరుంది. ఎంత ఎదిగినా.. …
Read More »గల్లా రాజ్యసభ ఆశలు.. నెరవేరేనా ..!
రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ ఎంపీ.. గల్లా జయదేవ్ పేరు టీడీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలనుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్న ఆయన.. తిరిగి నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గల్లా.. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానాన్ని వదులుకున్నారు. వాస్తవానికి వైసీపీ గాలి జోరుగా వీచిన సమయంలో కూడా.. ఆయన విజయం దక్కించుకున్నారు. మాజీ మంత్రి …
Read More »అదిరేలా గోదావరి పుష్కరం… ఏకంగా వెయ్యి కోట్లు!
వచ్చే ఏడాది జూలైలో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పుష్కరాలను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికిగాను.. ఏకంగా 1000 కోట్ల రూపాయలను కేటాయించాలని తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి మంత్రులు ఆమోదం తెలిపారు. అంతేకాదు.. ఏర్పాట్లు కూడా తక్షణమే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో తక్షణం 300 కోట్ల …
Read More »పోలవరం ఆ ఇద్దరితో పూర్తి కాదు
ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన రాజకీయ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిందేనని జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు చంద్రబాబు గానీ, జగన్ గానీ పూర్తి చేయలేరని కూడా మరింత సంచలన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates