పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. మమతా బెనర్జీ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతకు ప్రజలు భారీ షాకిచ్చారు. తొలిసారి ఇక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. అయితే.. తాను ఓడిపోలేదని.. ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేసేది లేదని మమత భీష్మించారు. రాజకీయంగా ఈ వ్యవహారం దుమారానికి దారితీసింది. అయితే.. …
Read More »సువేందు అధికారి ఆనే నేను..
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం.చేశారు. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కాంగ్రెస్ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సువేందు అధికారి .. తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగి, అనంతరం బీజేపీలో చేరి ఇప్పుడు …
Read More »పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా పోస్టులు, తీర్చిదిద్దుతున్న కథనాలు చూస్తే.. ఆయన మీద వీళ్లకు ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యం కలగక మానదు. ఆ పోస్టులు, వార్తలు చూస్తే పవన్ రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని.. ఆయన ఎన్నికల్లో అద్భుత విజయం సాధించాలని.. ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయితే చూసి తరించాలని వాళ్లందరూ ఎంతో …
Read More »విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ మార్పులు పెను ప్రభావానికి దారి తీయడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ దఫా ఎలాగైనా ఎన్డీఏ కూటమిని గద్దె దించే దిశగా ఇండియా కూటమి రథసారథి కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు పరిణామాలు ఆదిలోనే హంసపాదులా పరిణమిస్తాయన్న వాదనలు బలపడుతున్నాయి. తమిళనాడు పరిణామాలు కాంగ్రెస్ …
Read More »కమ్యూనిస్టుల మద్దతు… విజయ్ కు ముప్పేనా?
తమిళనాట రాజకీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగజం (టీవీకే) అతి పెద్ద పార్టీగా అవతరించినా… ప్రభుత్వ ఏర్పాటుకు కాస్తంత దూరంలో ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు మొత్తంగా 118 సీట్లు అవసరం కాగా… టీవీకేకు 108 సీట్లు మాత్రమే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీవీకే జరిపిన చర్చల్లో 5 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్, రెండేసి సీట్లున్న …
Read More »పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి తనను జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రమే రక్షించగలరని నమ్మింది. తనను రక్షించాలంటూ పవన్ కల్యాణ్ ను వేడుకుంటూ పవన్ కల్యాణ్ కు ఓ వీడియో సందేశం పంపింది. ఈ వీడియోను చూసిన వెంటనే స్పందించిన పవన్… ఆ మహిళను ప్రమాదం నుంచి క్షేమంగా …
Read More »పశ్చిమ బెంగాల్ బీజేపీ తొలి సీఎం ఇతనే
పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ తాజాగా బీజేపీ దెబ్బకు కుదేలయ్యారు. దీదీ ఇలాకలో పాగా వేసేందుకు పదేళ్ళుగా బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టకేలకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే బెంగాల్ కు బిజెపి నుంచి …
Read More »ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ డిఎంకె ఓటమిలో పరోక్ష పాత్ర పోషించిందని విమర్శలు కూడా వచ్చాయి. ఆ విమర్శలను కూడా పట్టించుకోకుండా టీవీఫకే అధినేత విజయ్ అడిగిన వెంటనే డీఎంకేతో రాహుల్ గాంధీ తెగదెంపులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామని డీఎంకే అధినేత స్టాలిన్ …
Read More »‘సీఎం’ విజయ్ కు లైన్ క్లియర్!
తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు పట్టం కట్టినప్పటికీ మెజారిటీ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో విజయ్ నిలిచిపోయారు. టీవీకేకు ముందు మద్దతిస్తానని ప్రకటించిన సిపిఐ, సిపిఎం ఆ తర్వాత డిఎంకెతో పొత్తులో ఉన్నాం కాబట్టి బయటకు రాలేమని వెనక్కి తగ్గాయి. పూర్తిస్థాయి మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని గవర్నర్ రాజేంద్రన్ తేల్చి …
Read More »ఎవరీ అర్లేకర్… ఎందుకింత రచ్చ!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, రచ్చకు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈయన తమిళనాడుకు ఇంచార్జ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. కేరళకు మాత్రం పూర్తిస్థాయి గవర్నర్గా ఉన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్. ఎన్. రవి తమిళనాడు గవర్నర్గా వ్యవహరించారు. అయితే.. ఆయన వ్యవహరించిన తీరు, చూపించిన దూకుడు వంటివి స్టాలిన్ ప్రభుత్వానికే కాదు.. దేశానికి కూడా తీవ్ర …
Read More »కొరవడిన రాజ్యాంగం: విజయ్ విషయంలో ఏం జరుగుతోంది?
దేశంలో ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామని పదే పదే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో చోటు చేసుకున్న హంగ్ వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. కానీ, వాస్తవానికి ఈ సమయంలోనే గవర్నర్ తన విచక్షణతోపాటు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. …
Read More »ఫస్ట్ టైమ్ ఎంపీ: తండ్రికి తగ్గ వారసుడు.. !
పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది యువ నాయకులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ భవిష్యత్తు, తమ రాజకీయాలు, తమ తండ్రుల వారసత్వం పైనే ఆధారపడి ఉంటాయని భావిస్తున్న కొంతమంది యువ నాయకులు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే వైపే రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముందు వరుసలో నిలుస్తున్నారని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates