Political News

‘రాధాకృష్ణకు పోలీసు భద్రత ఎల్లప్పుడూ ఉండదు’

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ వ్యాసాలు రాస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఆదివారం నాటి కొత్త పలుకులో వైసీపీ నేతలకు చెందిన ఆడవారిని ప్రస్తావిస్తూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఈ ఆందోళనలకు దిగింది. ఈ …

Read More »

బీజేపీ ఎమ్మెల్యే నోట రాజీమానా మాట

ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో కేటమి సాగుతోంది. కూటమిలోని 3 పార్టీల మధ్య కూడా పెద్దగా పొరపొచ్చాలేమి లేవనే చెప్పాలి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలను జనసేన, బీజేపీలు స్వాగతిస్తున్నాయి. టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి …

Read More »

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం జ‌న గ‌ణ‌న ప్రారంభ‌మైన నేప‌థ్యంలో దీనికి సంబంధించి కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని.. త‌ద్వారా.. విభ‌జ‌న సాధ్యం కాద‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఏడాది మ‌ధ్య‌లో లేదా.. చివ‌ర‌లో జిల్లాల స‌రిహ‌ద్దుల‌ను మార్చ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్ప‌టికే త‌న‌కు ఎంతో రిప్ర‌జెంటేష‌న్లు ఇచ్చార‌న్న రేవంత్ రెడ్డి.. ప‌రిశీల‌న కూడా పూర్త‌యింద‌ని, …

Read More »

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు అంత‌ర్గ‌త అవ‌య‌వాలు దెబ్బ‌తిన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌పై కేసు న‌మోదు చేయ‌డంతోపాటు త‌నకు న్యాయం చేసేలా.. ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కోరుతూ ఆయ‌న తాజాగా పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ను విచారించిన హైకోర్టు.. పోలీసులు స‌హా ప్ర‌భుత్వం నుంచి వివ‌ర‌ణ కోరింది. ఈ క్ర‌మంలో అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు చేయాల‌ని …

Read More »

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం.. ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఒప్పందం కూడా చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సైతం.. ఈ ఒప్పందాన్ని ప‌లు సంద‌ర్భాల్లో కొనియాడారు. ఏపీలోని ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌కు గూగుల్ డేటా కేంద్రం రానుంది. దీనికి సంబంధించి …

Read More »

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఓకే అంటున్నా.,.. …

Read More »

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా వారిని పాలించే పాలకులు మాత్రం పచ్చి బూతులతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ‘కల్చర్’ తెలీని పశువులు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తెల్లోళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న పలువురు అమెరికా అధ్యక్షులు వ్యవహరించారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో తాను ఎంతలా హెచ్చరించినా.. …

Read More »

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?… ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని కూడా త‌గ్గించేలా తెర‌వెనుక వ్యూహాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌కు రంగం రెడీ అవుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయంగా.. వ్యాపారం ప‌రంగా కూడా.. ద్వారంపూడికి ఎర్త్ పెట్టేలా పైస్థాయిలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జరుగుతున్నాయ‌ని .. రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌ల‌మైన వాదన వినిపిస్తోంది. దీనికి రెండు కార‌ణాలుఉన్నాయి. వైసీపీ నాయ‌కుడిగా.. …

Read More »

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు అవ‌కాశం ఇచ్చారు. అయితే..కూట‌మి ప్ర‌భావంతోపాటు..స్థానికంగా పెరిగిన వ్య‌తిరేక‌త కూడా తోడై.. పేర్ని వార‌సుడు ప‌రాజ‌యం పాల‌య్యారు. కానీ, చిత్రం ఏంటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీ ఓడిన చోట ఆ పార్టీ ఛాయ‌లు.. ఆ పార్టీ నాయ‌కులు వెనుక‌బ‌డ్డారు. ఎక్క‌డా గ‌ళం వినిపించే నాయ‌కులు కూడా …

Read More »

భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడూ?

ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ మరోస్థాయికి చేరుకుంటుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏపీలోని విశాఖకు.. మిగిలిన ప్రపంచానికి దూరం మరింత దగ్గర అవుతుందని చెప్పాలి. ఇప్పటికే ఎయిర్ పోర్టు పనులు 97 శాతం పూర్తయ్యాయి. తాజా అంచనాల ప్రకారం ఈ జులైలో కానీ లేదంటే ఆగస్టులో …

Read More »

ర‌ఘురామ ఉంటున్న ఇల్లు ఎవ‌రిదో తెలిస్తే షాకే!

ఒక‌ప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీలోనే ఉండి, ఆ పార్టీ త‌ర‌ఫున ఎంపీగా కూడా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు త‌ర్వాత ఆ పార్టీకి బ‌ద్ధ శ‌త్రువుగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఏడాదికే మారిన ఆయ‌న‌.. త‌ర్వాతి నాలుగేళ్లు ఆ పార్టీ మీద అలుపెర‌గ‌ని పోరాటం చేశారు. బ‌దులుగా ఆయ‌న మీద ఏదో కేసు పెట్టి హింసించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. క‌ట్ చేస్తే ఇప్పుడు …

Read More »

`అదే మీడియా` నిల‌బెట్టిన విష‌యం మ‌రిచారా జ‌గ‌న్‌?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలోని ఓ వ‌ర్గం మీడియాపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేయ‌డంతోపాటు.. వాటిని గేలి కూడా చేస్తుంటారు. ఆయ‌న అధికారంలో ఉన్న‌ప్పుడు.. ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే విష‌యంలోనూ.. కార్య‌క్రమాల‌కు పిలిచే విష‌యంలోనూ ఇలానే చేశార‌న్న‌వాద‌న ఉంది. అంతేకాదు.. ఒక్క‌సారి 2019, మేలో జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం.. ఆయ‌న చేసిన ప్ర‌సంగం వింటే కొన్ని ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌క‌ట‌న‌లు.. పిలుపులు గోచ‌రిస్తాయి. రెండు ప‌త్రిక‌లు.. మూడు చానెళ్ల‌ను త‌న …

Read More »