Political News

క‌విత అరెస్టు చేసిన పోలీసులు, అసలేం జరిగింది?

తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ క‌విత‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు.. ఉన్న ప‌లువురు మ‌ద్ద‌తు దారులు, జాగృతి సంస్థ కార్య‌క‌ర్త‌ల‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో హైద‌రాబాద్‌లో కొంత ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. అయితే.. త‌న‌ను అక్ర‌మంగా అన్యాయంగా అరెస్టు చేస్తున్నార‌ని.. కార్మికుల ప‌క్షాన పోరాటం చేస్తుంటే.. ప్ర‌భుత్వం త‌న గొంతు నొక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ని క‌విత ఆరోపించారు. అయినా.. త‌ను ప్ర‌జ‌ల ప‌క్షానే …

Read More »

నదుల అనుసంధానంపై తెలంగాణ విమర్శలకు చంద్రబాబు కౌంటర్

న‌దుల అనుసంధానంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. న‌దుల అనుసంధానం ఆగేది లేద‌న్నారు. వాస్త‌వానికి కొన్నాళ్ల కింద‌ట బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును చంద్ర‌బాబు త‌ల‌పోశారు. అయితే.. దీనికి తెలంగాణ నుంచిపెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌లో మార్పులు చేసుకున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని కూడా తెలంగాణ ప్ర‌భుత్వం త‌ప్పుబ‌ట్టింది. “చంద్ర‌బాబు వేరే రూపంలో బ‌న‌క‌చ‌ర్ల చేప‌డుతున్నారు” …

Read More »

ఆయ‌నో తిరుగులేని శ‌క్తి: చంద్ర‌బాబుకు భారీ కితాబు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు భారీ కితాబు ల‌భించింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. త‌ర‌చుగా అనేక విష‌యాల‌ను పంచుకునే ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా నుంచి ఆయ‌న అనూహ్య ప్ర‌శంస‌లు ల‌భించాయి. చంద్ర‌బాబును ఆయ‌న తిరుగులేని శ‌క్తిగా అభివ‌ర్ణించారు. డెవ‌ల‌ప్‌మెంటును క‌ల‌లు కంటుంటార‌ని మ‌హీంద్రా తెలిపారు. ఈవిష‌యంలో చంద్ర‌బాబుకు అచంచ‌ల‌మైన అంకిత‌భావం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు నుంచి ఎవ‌రైనా నేర్చుకోవాల్సింది ఇదేన‌ని చెప్పారు. ఎప్ప‌టిక‌ప్పుడు తాను అప్‌డేట్ అవుతూ.. ప్ర‌తి …

Read More »

ఇందిర‌మ్మ‌ జ‌యంతి… మ‌హిళ‌ల‌కు రేవంత్ కానుక ఇదే!

నేడు(న‌వంబ‌రు 19) దేశ మాజీ ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ జ‌యంతి. 1917, న‌వంబ‌రులో ఆమె జ‌న్మించారు. దేశానికి ప్ర‌ధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేద‌లను త‌న‌వైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా.. ఇందిర‌మ్మ ప్రజా ప్రాభ‌వం కోల్పోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. దీనికి `ఇందిరా మ‌హిళా శ‌క్తి` అనే పేరు పెట్టింది. ఈ ప‌థ‌కం కింద‌.. …

Read More »

లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్‌ నివేదిక ఆధారంగా చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.54.87 కోట్లను నల్లధనంగా మార్చినట్లు సిట్‌ తేల్చింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు ఆస్తులు జప్తు కానున్నాయి. అధికార అండతో మోసపూరిత భూ లావాదేవీలు జరిగినట్లు సిట్‌ నిర్ధారించింది. అవినీతి నిరోధక, నేర చట్టాల ప్రకారం జప్తును అనుమతించాలంటూ సిట్‌ సిఫార్సు …

Read More »

`ఆప‌రేష‌న్ త‌మిళ‌నాడు`.. మోడీ స్టార్ట్ చేసేశారా?

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా బీజేపీ నేత‌ల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఎన్నిక‌ల‌కు మూడు నాలుగు మాసాల ముందుకాదు.. ఏకంగా ఆరేడు మాసాల ముందే ప్లాన్ వేసుకుంటారు. ఎన్నిక‌ల కోడ్ రావ‌డానికి ముందే రాజ‌కీయ వ్యూహాల‌ను అమ‌లు చేసేస్తారు. ఇది బీజేపీ విజ‌యానికి బ‌ల‌మైన ద‌న్నుగా మారుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ ద‌క్కించుకున్న రాష్ట్రాల ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఖ‌చ్చితంగా ఈ త‌ర‌హా వ్యూహం స్ప‌ష్టంగా …

Read More »

రూపాయి బిళ్ళతో మోదీ గడియారం.. దాని చరిత్ర తెలుసా?

ప్రధాని నరేంద్ర మోదీ ధరించే జాకెట్లు, కుర్తాలు ఎప్పుడూ స్పెషలే. ఆయన స్టైల్ స్టేట్‌మెంట్‌ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మోదీ చేతికి ఉన్న వాచ్ ఒకటి గట్టిగానే వైరల్ అవుతోంది. ఎందుకంటే అది ఏదో విదేశీ బ్రాండ్ రోలెక్స్ వాచ్ కాదు. పక్కా మన దేశంలో తయారైన వాచ్. దాని ధర సుమారు 55 వేల నుంచి 60 వేల రూపాయలు …

Read More »

10వ సారి సీఎం కుర్చీ.. కానీ ఆ ‘పవర్’ ఎవరి చేతిలో?

బీహార్ రాజకీయాల్లో “నితీష్ కుమార్” అంటేనే ఒక రికార్డు. ముఖ్యమంత్రి కుర్చీ మారదు, కూటములు మాత్రమే మారుతుంటాయి అనే పేరున్న ఆయన, ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతున్నారు. అక్షరాలా 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, ఈరోజు (బుధవారం) ఆయన తన పదవికి రాజీనామా చేసి, మళ్లీ రేపు (గురువారం) కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది భారత రాజకీయ …

Read More »

ఏపీలో 46,85,838 మంది రైతులకు రూ.3135 కోట్లు..

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద నేడు రైతుల ఖాతాల్లో నిధులు ప్రభుత్వం జమచేసింది. 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేసింది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు అందించింది. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల …

Read More »

ఏజెన్సీలో కాల్పుల మోత.. మరో భారీ ఎన్ కౌంటర్?

ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమల్లి పరిధిలోని బీఎం వలసలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ మృతుల్లో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ ను ఇంటిలిజెన్స్ ఏడిజి మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు. నిన్న 19 మంది తప్పించుకున్నారని …

Read More »

జ‌గ‌న్ ప‌రివారంలో నిరాశ‌… పీక్స్‌కు వెళుతుందా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రివారంలో నిరాశ, నిస్పృహ‌లు చోటు చేసుకున్నాయా?  పార్టీ భ‌విష్య‌త్తుపై ఆశ‌లు ఉడికిపోతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. పార్టీ అధినేత బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం.. పార్టీని బ‌ల‌మైన దిశ‌గా న‌డిపించక పోవ‌డం వంటివి నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇక‌, పార్టీ ప‌రంగాకూడా స‌రైన అడుగులు వేయ‌లేక పోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో గ‌తంలో మాదిరిగా జ‌గ‌న్ కు ఆద‌ర‌ణ ఉండ‌డం లేద‌న్న …

Read More »

‘ప‌ర‌కామ‌ణి’పై మ‌రింత ప‌టిష్ఠంగా.. టీటీడీ నిర్ణ‌యం

వైసీపీ హ‌యాంలో 2021-22 మ‌ధ్య కాలంలో తిరుమ‌ల శ్రీవారికి భ‌క్తులు స‌మ‌ర్పించే కానుక‌ల హుండీ ప‌రకామ‌ణిలో చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో ప‌ర‌కామ‌ణి సొమ్మును లెక్కించే స‌మ‌యంలో విదేశీ 70 డాల‌ర్ల‌ను అక్క‌డే ప‌నిచేస్తున్న ర‌వికుమార్ అనే సీనియ‌ర్ అసిస్టెంట్ క‌ట్ డ్రాయ‌ర్‌లో పెట్టుకుని దోచుకున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఏవీఎస్‌వో స‌తీశ్ కుమార్ ప‌ట్టుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం.. ఏం జ‌రిగిందో ఏమో.. ఈ …

Read More »