Political News

‘తెలంగాణ విడిపోయాక తిరుపతిలో ఇబ్బందులు’

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం సందర్భంగా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభలో ప్రస్తావించారు. అంతేకాదు, …

Read More »

అసెంబ్లీలో: జగన్ ను ఫాలో అయిన కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే …

Read More »

రేవంత్ గ్రాఫ్.. 2025లో కీల‌క ఘ‌ట్టాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది కీల‌క ఘ‌ట్టాల‌తో త‌న గ్రాఫ్‌ను పెంచుకున్నారు. ముఖ్యంగా నాలుగు అంశాల్లో ఆయ‌న వెరువకుండా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇది ఆయ‌న‌కు విజ‌యాల‌ను దూసుకువ‌చ్చింది. బ‌ల‌మైన ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల్లో గ్రాఫ్ పెంచేలా కూడా చేసింది. 1) హైడ్రా: మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌డం సంక‌ల్పంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి హైడ్రాను దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కోర్టుల నుంచి …

Read More »

140 ఏళ్ల కాంగ్రెస్‌: దేశంలో సంద‌డి ఏది?

జాతీయ కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్యోద్య‌మం నుంచి నేటి వ‌ర‌కు కూడా అనేక ఉత్థాన ప‌త‌నాలు ఎదుర్కొన్న పార్టీ ఇది. అతి పురాత‌న పార్టీనే అయినా.. ఒక‌ప్పుడు న‌వ‌న‌వోన్మేషంగా ముందుకు సాగింది. అయితే.. 2014 త‌ర్వాత‌.. దిగంతాల నుంచి దిగులు దిగులుగా.. దిగ‌జారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. త‌మ‌కు ఇవ‌న్నీ కొత్త‌కాద‌ని .. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఎప్ప‌టికైనా మ‌రోసారి పుంజుకుంటామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారం మాదేనని చెబుతున్నారు. …

Read More »

`అయోధ్య`లో చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఈ ఏడాదిలో తొలిసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ఖ్యాత అయోధ్య రామ‌జ‌న్మ‌భూమిని సంద‌ర్శించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ నుంచి ల‌క్నో చేరుకున్న ఆయ‌న‌.. అయోధ్యకు వెళ్లి బాల రామ‌య్య ఆల‌యంలో శ్రీరాముడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు అధ్య‌క్షుడు, ఆల‌య ప్ర‌ధాన పూజారులు, అధికారులు చంద్రబాబుకు ఘ‌న స్వాగ‌తం పలికారు. అనంత‌రం.. గ‌ర్భాల‌యంలోకి వెళ్లిన చంద్ర‌బాబు బాల‌రామ‌య్య‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. చంద్ర‌బాబుకు …

Read More »

ఇక అసెంబ్లీలో… కేసీఆర్ vs రేవంత్!

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. అసెంబ్లీకి హాజ‌రు కానున్నారా? సుదీర్ఘ‌కాలం త‌ర్వాత‌.. ఆయ‌న స‌భ‌లో త‌న గ‌ళం వినిపించ‌ను న్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా ఆదివారం సాయంత్రం ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్ నుంచి హైద‌రాబాద్‌లోని నివాసానికి చేరుకోవ‌డంతో ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి బ‌ల‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం.. అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించాల‌ని ఆయ‌న కోరుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ …

Read More »

కూట‌మికి భ‌రోసా: 2025 విశేషాలు ఇవే.. !

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే కూటమిలోని మూడు పార్టీలు బలోపేతం దిశ‌గా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. పార్టీ పరంగా పెట్టుకుంటున్న కార్యక్రమాలు భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కీలక అంశాల విష‌యంలో మాత్రం మూడు పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మూడు పార్టీలది ఒకే మాట అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూటమి బలోపేతానికి ప్రధానంగా పని చేస్తోంది. …

Read More »

ప్రధాని మోదీ నోట.. నరసాపురం మాట

ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఏపీలోని హస్తకళలను గుర్తు చేశారు. నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌ ను ఆయన ప్రస్తావించారు. ఇక్కడి ఈ హస్తకళకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. నరసాపురంలో లేస్‌ క్రాఫ్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2000లో నరసాపురం లేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు …

Read More »

మూడు కాదు.. రెండే.. జిల్లాల విభ‌జ‌న‌ పై బాబు నిర్ణ‌యం!

ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తాజాగా రెండు జిల్లాలకే పరిమితం కావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రజల అభిప్రాయాలు, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. ప్రజల ఇష్టమే ప్రభుత్వ ఇష్టమని స్పష్టం చేశారు. ప్రజలపై బలవంతంగా రుద్దే ఏ నిర్ణయం సరైంది కాదని చంద్రబాబు …

Read More »

2025.. షర్మిల పొలిటికల్ గ్రాఫ్ ఇదేనా?

ఏపీ రాజకీయాల్లో పార్టీ చీఫ్‌గా పురాతన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ఏడాది 2025లో ఆమె రాజకీయంగా పుంజుకున్నారా? పార్టీపై పట్టు, నేతలపై అవగాహన సాధించారా? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు, సంవత్సరాల క్యాలెండర్ తిరుగుతుంటే నాయకుల పనితీరుపై అంచనాలు కూడా పెరగాలి. అదే సమయంలో వారి …

Read More »

ఆర్ఎస్ఎస్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు

కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీయగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన ప్రశంసలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ …

Read More »

వారు గీత దాటితే కటకటాలే

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మేకను నరికి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోకు అభిషేకం చేశారు. మేక తలకాయ పట్టుకుని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్‌ అయ్యారు. రాజకీయ ముసుగులో జగన్‌ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆమె మీడియా …

Read More »