బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టిడిపిలో ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది. దేశంలో జమిలి ఎన్నికలకు అవకాశం ఉంటుందని.. నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా సాకారం అవుతుందన్న ఆశలు, అంచనాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపైనే టీడీపీ నాయకులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో టికెట్లు దక్కని వారు, టికెట్లు త్యాగం చేసిన వారు ఇప్పుడు నియోజకవర్గ పునర్విభజనపైనే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో …
Read More »‘పోలికలు’ సరే.. రంగా వారసురాలిగా సక్సెస్ అయ్యేనా ..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమున్న రాజకీయ నేత, దివంగత వంగవీటి మోహన్ రంగా ఫ్యామిలీ నుంచి మహిళా నాయకురాలుగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ తాజాగా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు ఆమె వెనక ఎవరున్నారు అనే విషయాలు పక్కన పెడితే.. రంగా కుటుంబం నుంచి ఇప్పటివరకు ఇద్దరు నాయకులు ప్రజల్లోకి వచ్చారు. రంగా మరణానంతరం ఆయన సతీమణి వంగవీటి రత్నకుమారి కాంగ్రెస్ …
Read More »జంపింగులకు మరో 4 వారాల గడువు: సుప్రీం
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విషయంలో తనకు సమయం కావాలంటూ.. స్పీకర్ ప్రసాదరావు.. కొన్ని రోజుల కిందట .. సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై మరోసారి విచారణ జరిగింది. అయితే.. ఎందుకింత సాగదీస్తున్నారన్న ప్రశ్న సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. దీనికి …
Read More »ఆ దేశ మాజీ ప్రధానికి ఉరిశిక్ష ఖరారు
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఐసీటీ కోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఈ శిక్ష విధించారు. ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం తీసుకుంటోంది. షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయబడింది. హసీనాను దోషిగా ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తేల్చింది. హసీనా నేరం చేసిందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. హసీనా మానవత్వాన్ని మరిచింది, …
Read More »తెలంగాణ పోలీసులకు ఏపీ డీసీఎం అభినందన
సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో …
Read More »వైవీ సుబ్బారెడ్డి అరెస్టయితే.. వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. !
వైసిపి పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికీ పలు కేసుల్లో చిక్కుకుని అనేకమంది నాయకులు జైల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా మరికొన్ని కేసులు పార్టీ కీలక నాయకులకు చుట్టుకుంటున్నాయి. వీటిలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కేసు. ఈ వ్యవహారం ఇప్పుడు అప్పటి టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి మెడకు చుట్టుకుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇటీవల …
Read More »బీహార్ ఎఫెక్ట్: వణుకున్న పార్టీలు!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కీలకమైన రెండు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో రాజకీయ ప్రకంపనులు కొనసాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం దక్కించుకుంది. సర్వేలకు సైతం అందని విధంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీలు గెలుపు గుర్రం ఎక్కాయి. అయితే అసలు ఏం జరిగింది? నిజంగానే ప్రజలు ఎన్డీఏకి ఓటేశారా? లేదా? అనే రాజకీయ విమర్శలను పక్కనపెడితే ఈ ప్రభావం వచ్చే ఆరు …
Read More »‘చంద్రబాబు రేవంత్ రెడ్డి గురు శిష్యులని మాకు తెలుసు’
నిన్న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం, నవ్వుతూ మాట్లాడుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సీఎంలు కలవడం ఇది తొలిసారి కాదు. పెట్టుబడిదారుల సదస్సు విజయవంతం అయిన జోష్ లో చంద్రబాబు …
Read More »రాహుల్ రాజకీయం.. పుట్టిముంచుతోందా?
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది, తాజాగా వచ్చిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ వ్యవహారం చేర్చనీయాంశంగా మారింది. గతంలో 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ఆయన …
Read More »20 మాసాలైంది.. జగన్ ఏం తెలుసుకున్నట్టు ..!
వైసిపి అధికారం కోల్పోయి దాదాపు 20 మాసాలు అయింది. ఇది చాలా సుదీర్ఘ సమయం. ఒకటి రెండు మాసాలు అంటే ఆ బాధలోంచి బయటపడలేదు అనుకునే అవకాశం ఉంటుంది. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేశారు. నవరత్నాలు ఇచ్చారు. అయినా ఎందుకు ఓడిపోయాం అనే ఆవేదన నుంచి రెండు మూడు మాసాలు లేదా ఒక ఆరు నెలల వరకు ఆ ఆవేదనలో ఉన్నారంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ, …
Read More »కాంగ్రెస్ కకా వికలం.. ఇండీ కూటమికీ ముప్పు?!
దేశంలో అతిపెద్ద పురాతన పార్టీగా కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఒకరకంగా చెప్పాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా ఆ పార్టీ పరిస్థితి మారింది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కేవలం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం దక్కించుకుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం కంటే స్థానికంగా ఉన్న నాయకుల ప్రభావంతోనే పార్టీ విజయం దక్కించుకున్న …
Read More »నవీన్ యాదవ్కు మంత్రి పదవి.. తీవ్ర కసరత్తు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దక్కించుకుని విజయం సాధించిన నవీన్ యాదవ్కు మంత్ర వర్గంలో చోటు లభించనుందా? ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీనాయకులు. ఇది అతిశయోక్తి కాదని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం జూబ్లీ విజయంతో కాంగ్రెస్ జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పరోక్షంగా మరిన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates