తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ రావు శనివారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన ఆయన తన ఇంటికి వెళ్లకుండా.. నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ కేసుపై విచారణ చేస్తున్న ప్రత్యేక …
Read More »‘వక్ఫ్’కు వైసీపీ వ్యతిరేకం… అంతలోనే ఎంత మార్పు?
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి ఏపీలోని విపక్షం వైసీపీ వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం పార్లమెంటులో అధికార ఎన్డీఏ ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకమంటూ ఆ పార్టీ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదిస్తున్న వక్ఫ్ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని మిథున్ విస్పష్ట ప్రకటన చేశారు. ఈ …
Read More »వైసీపీ వదులుకుంది.. టీడీపీ పట్టుకుంటోంది ..!
రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ముస్లింలను అక్కున చేర్చుకున్న విషయం తెలిసిందే. మైనారిటీ ముస్లింలకు.. పింఛన్లు ఇవ్వడంతోపాటు పాస్టర్లకు రూ.5000 చొప్పున నెలనెలా భత్యాలు కూడా ఇచ్చింది. ఇక, వారు మక్కా యాత్రలకు వెళ్తే.. అక్కడ కూడా ఏర్పాట్లు చేసింది. రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చింది. అయితే.. మైనారిటీలకు ఇంత చేసినా.. గత ఎన్నికల్లో తమను ఓడించారన్న ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. …
Read More »కొలికపూడి వైసీపీ బాట పడితే.. ఏం జరుగుతుంది ..!
టీడీపీ నాయకుడు, ఎస్సీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. ఆయన పార్టీనే టార్గెట్ చేస్తూ.. అల్టిమేటం జారీ చేయడం.. పార్టీకి సవాళ్లు విసరడం వంటివి దుమారం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్న స్వయంప్రకటిత మేధావి.. కొలికపూడి.. అధిష్టానానికి 24 గంటల సమయం ఇవ్వడం.. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న రమేష్ను తప్పించాలని పట్టుబట్టడం వంటివి రాజకీయ వర్గాల్లోచర్చకు దారితీసింది. అయితే.. ఈ వ్యవహారం వెనుక …
Read More »టీడీపీ రికార్డును ఎవరూ చెరపలేరు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ సృష్టించిన రికార్డును ఎవరూ చెరపలేరని.. ఎవరూ తిరగరాయలేరని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. టీడీపీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం.. పార్టీ నాయకులు, అభిమానుల మధ్య 43 కేజీల కేక్ను కట్ చేసి.. అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »పోలీసు కస్టడీకి వంశీ.. కేసు ఏంటంటే!
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గన్నవరం స్థానిక కోర్టు.. ఒక్కరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో విజయవాడకు వచ్చిన గన్నవరం పోలీసులు.. ఇక్కడి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని అదుపులోకి తీసుకుని.. కంకిపాడు పోలీసు స్టేషన్కు తరలించారు. తొలుత ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. …
Read More »అమరావతిలో బాబు సొంతిల్లు… ఐదెకరాల్లో నిర్మాణం
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే. రాష్ట్ర విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా ఏపీ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించగా…రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండరాదన్న భావనతో…రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు. తొలి ఐదేళ్లతో పాటు రెండో ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉండి ఉంటే… అమరావతి ఎలా ఉండేదన్నది ఇప్పటికీ ఊహకు …
Read More »43ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు, సంక్షోభాలు: నారా లోకేష్
“43 ఏళ్ల ప్రయాణంలో టీడీపీ అనేక విజయాలు అందుకుంది.. అదేసమయంలో అనేక సంక్షోభాలను కూడా చవిచూసింది. అయినా.. కార్యకర్తలు ఎప్పుడూ పార్టీని, పార్టీ అధినేతను వెన్నంటిఉన్నారు. వారే పార్టీకి కొండంత బలం. నాయకులు, కార్యకర్తలు బలంగా ఉన్నంత వరకు.. టీడీపీ ఎప్పటికీ ఉంటుంది” అని టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అన్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన …
Read More »వైసీపీలో.. చాలా మందే ఉన్నారట.. !
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయనపై ఇప్పటికి మూడు కేసులు నమో దయ్యాయి. ప్రస్తుతం విజయవాడ జైల్లోనే ఉన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా ఆయన జైల్లోనే ఉండనున్నారు. అంతేకా దు.. ప్రస్తుతం ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ కూడా రద్దయింది. మరోవైపు.. భూకబ్జా కేసులోనూ ఆయనపై మరో పిటిషన్ దాఖలైంది. దీంతో పోలీసు కస్టడీకి వంశీని అప్పగించారు. దీంతో …
Read More »ఆ ‘సంచలనం’ పుట్టి నేటికి 43 ఏళ్లు
తెలుగు దేశం పార్టీ… భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచీ. కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికిన తేజోమయం. బడుగులకు చట్టసభల్లోకి ప్రవేశం కల్పించిన చైతన్య దీప్తి. సంక్షేమం అంటే ఇదీ అంటూ యావత్తు దేశానికే దారి చూపిన మార్గదర్శి. రాజకీయం అంటే పెత్తనం కాదు…సేవ చేసే గుణం అని చాటిచెప్పిన గురుమూర్తి…ఇలా చెప్పుకుంటూ పోతే… …
Read More »కొలికపూడికి ఫైనల్ వార్నింగ్.. బాబు సీరియస్!
టీడీపీ ఎమ్మెల్యే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన స్వయం ప్రకటిత మేధావి కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికి ఏడాది కాలంలో(ఇంకా పూర్తికాలేదు) ఆయన అనేక సందర్భాల్లో వివాదాస్పదంగా వ్యవహరించారు. అయినప్పటికీ.. కొత్త కదా.. త్వరలోనే లైన్లోకి వస్తాడులే అంటూ.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పదే పదే ఆయనకు క్లాస్ ఇచ్చారు. పార్టీ నాయకులతోనూ క్లాస్ ఇప్పించారు. అయినా.. కొలికపూడిలో మార్పు రావడం లేదు. పైగా.. సొంత …
Read More »బాబు, లోకేశ్ గిబ్లీ ట్రెండ్స్ అదిరిపోయాయబ్బా!
సోషల్ మీడియాలో ఇప్పుడంతా గిబ్బీ ట్రెండ్స్ నడుస్తోంది కదా. జపాన్ కు చెందిన యానిమేషన్ స్టూడియో ఒరవడిని అందిపుచ్చుకుని… ఆ స్టూడియో చిత్రాల మాదిరిగానే యానిమేషన్ చిత్రాలను పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ గా మారిపోయింది. దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ గిబ్లీ ట్రెండ్స్ న ఫాలో అవుతూ గిబ్లీఫైడ్ ప్రపంచంలో ఎంట్రీ ఇస్తూ తమదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చిత్రాలు …
Read More »