బీహార్ రాజకీయాల్లో “నితీష్ కుమార్” అంటేనే ఒక రికార్డు. ముఖ్యమంత్రి కుర్చీ మారదు, కూటములు మాత్రమే మారుతుంటాయి అనే పేరున్న ఆయన, ఇప్పుడు మరో చరిత్ర సృష్టించబోతున్నారు. అక్షరాలా 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, ఈరోజు (బుధవారం) ఆయన తన పదవికి రాజీనామా చేసి, మళ్లీ రేపు (గురువారం) కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇది భారత రాజకీయ …
Read More »ఏపీలో 46,85,838 మంది రైతులకు రూ.3135 కోట్లు..
అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద నేడు రైతుల ఖాతాల్లో నిధులు ప్రభుత్వం జమచేసింది. 46,85,838 రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.3135 కోట్లు సొమ్మును జమ చేసింది. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ.2 వేలు, రాష్ట్ర వాటా రూ.5 వేలు చొప్పున మొత్తం 7 వేలు అందించింది. రెండు విడతల్లో కలిపి పిఎం కిసాన్- అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం రూ.6309.44 కోట్ల …
Read More »ఏజెన్సీలో కాల్పుల మోత.. మరో భారీ ఎన్ కౌంటర్?
ఏజెన్సీలో ఇవాళ ఉదయం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మారేడుమల్లి పరిధిలోని బీఎం వలసలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్ కౌంటర్ మృతుల్లో అగ్ర నేతలు ఉన్నట్లు సమాచారం. ఎన్ కౌంటర్ ను ఇంటిలిజెన్స్ ఏడిజి మహేష్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని తెలిపారు. నిన్న 19 మంది తప్పించుకున్నారని …
Read More »జగన్ పరివారంలో నిరాశ… పీక్స్కు వెళుతుందా?
వైసీపీ అధినేత జగన్ పరివారంలో నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయా? పార్టీ భవిష్యత్తుపై ఆశలు ఉడికిపోతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా ఔననే సమాధానమే వినిపిస్తోంది. పార్టీ అధినేత బయటకు రాకపోవడం.. పార్టీని బలమైన దిశగా నడిపించక పోవడం వంటివి నేతల మధ్య చర్చకు వచ్చాయి. ఇక, పార్టీ పరంగాకూడా సరైన అడుగులు వేయలేక పోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలో గతంలో మాదిరిగా జగన్ కు ఆదరణ ఉండడం లేదన్న …
Read More »‘పరకామణి’పై మరింత పటిష్ఠంగా.. టీటీడీ నిర్ణయం
వైసీపీ హయాంలో 2021-22 మధ్య కాలంలో తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల హుండీ పరకామణిలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో పరకామణి సొమ్మును లెక్కించే సమయంలో విదేశీ 70 డాలర్లను అక్కడే పనిచేస్తున్న రవికుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ కట్ డ్రాయర్లో పెట్టుకుని దోచుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని పసిగట్టిన ఏవీఎస్వో సతీశ్ కుమార్ పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం.. ఏం జరిగిందో ఏమో.. ఈ …
Read More »ఆయనను బీఆర్ఎస్ నుండి తరిమేసి తప్పు చేశారు: కవిత
బీఆర్ఎస్ పార్టీపైనా .. ఆ పార్టీ నేతలపైనా విమర్శలు చేస్తున్న తెలంగాణ జాగృతి నాయకురాలు, మాజీ ఎంపీ కవిత తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి.. ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ ఎస్ పార్టీ నుంచి తరిమేసి పెద్ద తప్పు చేశారని కవిత అన్నారు. ఆయనను అలా పంపించేసినందుకే.. బీఆర్ ఎస్ …
Read More »ఓటమికి నేనే బాధ్యుడిని.. మౌన దీక్ష చేస్తా: పీకే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వస్తామనిప్రకటించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఆశించిన విధంగా ఫలితాలను రాబట్టుకోలేక పోయారు. కనీసం 234 మంది అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క చోట కూడా.. ఆయన డిపాజిట్ దక్కించుకోలేక పోయారు. అయితే.. ఓట్లు మాత్రం 3.3 శాతం వచ్చాయి. ఇవి ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, ఆర్జేడీల కూటమిని చావు దెబ్బ కొట్టాయన్న చర్చ ఉంది. అయితే.. పీకే ప్రారంభించిన జన్ …
Read More »రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల కలకల
ఏపీ రాజధాని అమరావతి సమీపంలో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్లో మావోయిస్టుల కలకలం రేగింది. కేంద్ర బలగాలు సోదాలు చేపట్టి ఛత్తీస్గఢ్కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది …
Read More »మెరుపు దాడుల మాస్టర్ మైండ్.. హిడ్మా!
ఏపీలోని మారేడుమిల్లిలో ఈ ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మృతి చెందారు. మెరుపు దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా మృతి చెందడం సంచలనం రేకెత్తించింది. ఆయనది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని పునర్తి గ్రామం. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో హిడ్మాకు పట్టు ఉంది. హిడ్మా దళానికి అత్యంత శక్తివంతమైన దళంగా పేరుంది. భారీ ఆపరేషన్లలో హిడ్మాదే మాస్టర్ …
Read More »అమరావతికి చట్ట భద్రత!
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తున్నారు. నిర్మాణాలు కూడా వడివడిగా సాగుతున్నాయి. గత వైసీపీ హయాంలో ఐదేళ్లు పడకేసిన నిర్మాణాలతో అమరావతి అటవీ ప్రాంతాన్ని తలపించింది. దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక 40 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేసి.. అటవీ ప్రాంతంగా ఉన్న అమరావతిలో తిరిగి బాగు చేత కార్యక్రమాలు చేపట్టింది. ఆ వెంటనే కేంద్రం ద్వారా ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి నిధులు తీసుకువచ్చి ప్రస్తుతం పనులు వేగంగా …
Read More »హసీనాకు మరణ శిక్ష… మోడీకి ఇబ్బందేనా?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఢాకాలో ఉన్న అంతర్జాతీయ నేర వివాదాల పరిష్కార కోర్టు (ఐసీటీ) తాజాగా మరణ శిక్ష విధించింది. 2023-24 మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న రిజర్వేషన్ల ఉద్యమం.. తీవ్ర రూపం దాల్చినప్పుడు .. ప్రధానిగా హసీనా వ్యవహరించిన తీరుతో నిరుద్యోగులు, విద్యార్థులు రగిలిపోయారు. ఇది దేశంలో పెను ఉత్పాతానికి దారి తీసింది. ఫలితంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. వీటిని …
Read More »టీడీపీ ఎమ్మెల్యే డిజిటల్ అరెస్టు: బ్యాంకు మేనేజర్ మోసం
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, మైదుకూరు శాసన సభ్యుడు పుట్టా సుధాకర్ యాదవ్..(ఈయన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు)ను కొన్నాళ్ల కిందట సైబర్ నేరగాళ్లు.. డిజిటల్ అరెస్టు చేసినవిషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన తీవ్రస్థాయిలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఏకంగా 1.7 కోట్ల రూపాయల సొత్తును సైబర్ నేరస్తులు దోచుకున్నారు. అయితే.. దీనిపై సైబర్ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates