Political News

కాంగ్రెస్ `సెంటిమెంటు`పై… బీజేపీ ఫైట్‌!

2025లో జాతీయ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంటుగా ఉన్న అనేక అంశాల‌పై .. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు దాడి చేస్తున్నార‌న్న వాద‌న స్ప‌ష్టంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల పునాదులు ఉన్న‌ప్ప‌టికీ.. దీనికి తోడు.. అంతే బ‌ల‌మైన గాంధీ-నెహ్రూల వార‌సత్వ సెంటిమెంటు కూడా.. క‌లిసి వ‌స్తోంది. కానీ, చిత్రంగా ఈ సెంటిమెంటుపైనే బీజేపీ ఈ ఏడాది మొత్తం దాడి చేసింది. ఇంటా బ‌య‌టా కూడా.. కాంగ్రెస్ పార్టీని …

Read More »

తెలంగాణ అసెంబ్లీలో ‘బాంబుల’ గోల

మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లో పలు పిల్లర్లు కుంగిన వైనం తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందు చెలరేగిన రాజకీయ దుమారం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రభావం చూపింది. పిల్లర్లు కుంగడానికి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తే కారణమంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన కమిషన్ నివేదిక కూడా …

Read More »

కేసీఆర్ వద్దకు రేవంత్, నిలబడని కేటీఆర్!

రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ప్రత్యర్థులను సైతం గౌరవించాల్సిన పరిస్థితులుంటాయి. పవన్ కల్యాణ్ చెప్పినట్లు ఎక్కడ నెగ్గాలో కాదో…ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినోడే అసలైన రాజకీయ నాయకుడు. తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆ కోవలోకే వస్తానని నిరూపించుకొనీ ప్రశంసలు అందుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినా సరే కనీస …

Read More »

కేబినెట్ సమావేశంలో మంత్రి కన్నీరు, బాబు ఓదార్పు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పు అంశం ఏపీ క్యాబినెట్ సమావేశంలో భావోద్వేగానికి దారితీసింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పాటవుతున్న మదనపల్లె జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. రాయచోటి అభివృద్ధి, ప్రజల భావోద్వేగాలను పరిగణన లోకి తీసుకోవాలని ఆయన క్యాబినెట్‌లో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాం ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం …

Read More »

‘తెలంగాణ విడిపోయాక తిరుపతిలో ఇబ్బందులు’

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం సందర్భంగా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభలో ప్రస్తావించారు. అంతేకాదు, …

Read More »

అసెంబ్లీలో: జగన్ ను ఫాలో అయిన కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచి ఒక లెక్క…ఇకపై ఒక లెక్క అని కేసీఆర్ చెప్పడంతో నేటి నుంచి జరగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే దాదాపు రెండేళ్ల తర్వాత కేసీఆర్ శాసన సభలో అడుగుపెట్టారు. అయితే, సమావేశాలు మొదలైన 10 నిమిషాలకే …

Read More »

రేవంత్ గ్రాఫ్.. 2025లో కీల‌క ఘ‌ట్టాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా.. బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది కీల‌క ఘ‌ట్టాల‌తో త‌న గ్రాఫ్‌ను పెంచుకున్నారు. ముఖ్యంగా నాలుగు అంశాల్లో ఆయ‌న వెరువకుండా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇది ఆయ‌న‌కు విజ‌యాల‌ను దూసుకువ‌చ్చింది. బ‌ల‌మైన ముఖ్య‌మంత్రిగా ప్ర‌జ‌ల్లో గ్రాఫ్ పెంచేలా కూడా చేసింది. 1) హైడ్రా: మూసీ ప‌రివాహ‌క ప్రాంతాన్ని అభివృద్ధి చేయ‌డం సంక‌ల్పంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి హైడ్రాను దూకుడుగా ముందుకు తీసుకువెళ్లారు. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కోర్టుల నుంచి …

Read More »

140 ఏళ్ల కాంగ్రెస్‌: దేశంలో సంద‌డి ఏది?

జాతీయ కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్యోద్య‌మం నుంచి నేటి వ‌ర‌కు కూడా అనేక ఉత్థాన ప‌త‌నాలు ఎదుర్కొన్న పార్టీ ఇది. అతి పురాత‌న పార్టీనే అయినా.. ఒక‌ప్పుడు న‌వ‌న‌వోన్మేషంగా ముందుకు సాగింది. అయితే.. 2014 త‌ర్వాత‌.. దిగంతాల నుంచి దిగులు దిగులుగా.. దిగ‌జారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. త‌మ‌కు ఇవ‌న్నీ కొత్త‌కాద‌ని .. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఎప్ప‌టికైనా మ‌రోసారి పుంజుకుంటామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారం మాదేనని చెబుతున్నారు. …

Read More »

`అయోధ్య`లో చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఈ ఏడాదిలో తొలిసారి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌ఖ్యాత అయోధ్య రామ‌జ‌న్మ‌భూమిని సంద‌ర్శించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ నుంచి ల‌క్నో చేరుకున్న ఆయ‌న‌.. అయోధ్యకు వెళ్లి బాల రామ‌య్య ఆల‌యంలో శ్రీరాముడికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా రామ‌జ‌న్మ‌భూమి ట్ర‌స్టు అధ్య‌క్షుడు, ఆల‌య ప్ర‌ధాన పూజారులు, అధికారులు చంద్రబాబుకు ఘ‌న స్వాగ‌తం పలికారు. అనంత‌రం.. గ‌ర్భాల‌యంలోకి వెళ్లిన చంద్ర‌బాబు బాల‌రామ‌య్య‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. చంద్ర‌బాబుకు …

Read More »

ఇక అసెంబ్లీలో… కేసీఆర్ vs రేవంత్!

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. అసెంబ్లీకి హాజ‌రు కానున్నారా? సుదీర్ఘ‌కాలం త‌ర్వాత‌.. ఆయ‌న స‌భ‌లో త‌న గ‌ళం వినిపించ‌ను న్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. తాజాగా ఆదివారం సాయంత్రం ఆయ‌న ఎర్ర‌వ‌ల్లిలోని ఫామ్ హౌస్ నుంచి హైద‌రాబాద్‌లోని నివాసానికి చేరుకోవ‌డంతో ఈ ఊహాగానాల‌కు బ‌లం చేకూరుతోంది. ఇటీవ‌ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి బ‌ల‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం.. అసెంబ్లీకి వ‌చ్చి చ‌ర్చించాల‌ని ఆయ‌న కోరుతున్న నేప‌థ్యంలో కేసీఆర్ …

Read More »

కూట‌మికి భ‌రోసా: 2025 విశేషాలు ఇవే.. !

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే కూటమిలోని మూడు పార్టీలు బలోపేతం దిశ‌గా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. పార్టీ పరంగా పెట్టుకుంటున్న కార్యక్రమాలు భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కీలక అంశాల విష‌యంలో మాత్రం మూడు పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మూడు పార్టీలది ఒకే మాట అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూటమి బలోపేతానికి ప్రధానంగా పని చేస్తోంది. …

Read More »

ప్రధాని మోదీ నోట.. నరసాపురం మాట

ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఏపీలోని హస్తకళలను గుర్తు చేశారు. నరసాపురం లేస్‌ క్రాఫ్ట్‌ ను ఆయన ప్రస్తావించారు. ఇక్కడి ఈ హస్తకళకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. నరసాపురంలో లేస్‌ క్రాఫ్ట్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2000లో నరసాపురం లేస్‌ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు …

Read More »