ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అసభ్య పదజాలాన్ని ప్రయోగించిన కేసులో అరెస్టు అయిన రావణ్ కు న్యాయ సహాయం చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్… తాజాగా ఓ ఇంటర్పవ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రశ్న రావణ్ తో తనకు అంతగా సంబంధాలేమీ లేవని …
Read More »పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టింది. ఏళ్ల క్రితం అయిన గాయాలకు సంబంధించి పవన్ చాలా కాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో రెండు భుజాలకు గాయాలు కాగా… వాటికి సంబంధించిన చికిత్సను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటిని మరింత కాలం వాయిదా వేయడం …
Read More »పల్లి పల్లి మంత్రి లోకేష్
పల్లి పల్లి లోకేశ్… ఇదేం పేరండి బాబూ అని జుట్టు పీక్కుంటున్నారా? అంత అవసరం ఏమీ లేదు. ఇదేమీ రాజకీయ ప్రత్యర్థులో, లేదంటే లోకేశ్ అంటే ఇష్టం లేని వారో పెట్టిన పేరు కాదు. లోకేశ్ స్పీడును చూసి మంత్రముగ్ధులైన విదేశీ పారిశ్రామికవేత్తలు ఆయనకు పెట్టిన పేరు ఇది. పల్లి పల్లి లోకేశ్ అంటే… త్వరగా త్వరగా లోకేశ్ అని అర్థం. ఏ విషయంలో అయినా ఇలా చెబుతుంటే అలా నిర్ణయాలు తీసుకుంటున్న లోకేశ్ తీరు …
Read More »అక్క రాజ్యం చూపిస్తానంటున్న కవిత
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. “ఇప్పటి వరకు మీరు అన్న.. అన్న అంటూ అన్నరాజ్యం చూశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. అక్కరాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా.“ అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో.. ఎవరిని ఎంతగా గౌరవించాలో అంతా చేస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రం స్వరూపాన్నే మార్చేస్తామని చెప్పారు. …
Read More »‘భద్రాచలం రాముడి మీద ఆనా… ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117!’
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. అంతేకాదు, 117 సీట్లలో గెలిచి తీరుతామని ఆయన చెప్పారు. భద్రాద్రి రామయ్యపై ఆన.. వచ్చే ఎన్నికల్లో మేం 117 స్థానాల్లో గెలిచి తీరుతాం. అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జగన్నాథపురంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా చివరి విడత నిధులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం సీఎం …
Read More »రేవంత్ ఫ్లెక్సిలో జగన్ ఫొటో!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య ఏముందన్న విషయం ఇప్పటికీ ఏ ఒక్కరికీ తెలియదు. దాదాపుగా అన్ని పార్టీల నేతలతో ఈ ఇద్దరు నేతలు దాదాపుగా కలుపుగోలుగానే ఉంటారు. వారి రాజకీయ ప్రత్యర్థులతోనూ సత్సంబంధాలకే ఈ ఇద్దరూ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత అన్న మాటే వినిపిందచు. ఈ ఇద్దరు పరస్పరం గొడవ పడరు. అలాగని ఒకరికొకరు విమర్శించుకోరు కూదా. ఇక పరస్పర అభినందనలూ వీరి మధ్య …
Read More »‘రావణ్’ రంగంలోకి పొన్నవోలును దించిన జగన్
రాజకీయ నేతలు…ప్రత్యేకించి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతరత్రా ప్రముఖులపై తనదైన శైలి దూషణ భాషతో పేట్రేగిపోయిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ కటకటాల్లోకి వెళ్లిపోయారు. ఏదో చిన్నపాటి సెక్షన్ల ఆధారంగా నమోదు అయిన కేసుల్లో రావణ్ కు బెయిల్ దొరికినా… హిందూ మతంపై ఆయన చేసిన ఆరోపణలతో ఏకంగా ఉపా చట్టం కింద కేసులు నమోదు కావడంతో రావణ్ పరిస్థితి ప్రమాదంలో పడిపోయింది. మొన్నటిదాకా రావణ్ ను పెద్దగా …
Read More »ఈ దెబ్బకు గిరిజన ఓటు బ్యాంకు పవన్ సొంతం
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు.. నగరాలు, పట్టణాల్లో ఎంత ఇమేజ్ ఉందో.. గిరిజన ప్రాంతాల్లోనూ అంతే ఇమేజ్ ఉంది. సినిమా పరంగా పక్కన పెడితే.. పాలన పరంగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన వేసిన అడుగులు గిరిజనులకు చేరువ అయ్యాయి. పాడేరు, అరకు, మన్యం వంటి కీలక గిరిజన ప్రాంతాల్లో పవన్ కల్యాణ్కు ఇటీవల కాలంలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా యూత్ పెద్ద ఎత్తున జనసేనకు కనెక్ట్ అవుతున్నారు. ఇది …
Read More »టీడీపీని చూసైనా నేర్చుకోవాలి కదా!
జనసేన నాయకులకు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్కడం లేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని.. ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టాలని పవన్ కల్యాణ్.. గత రెండు నెలల కాలంలో మూడు సార్లు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు కూడా ఇదే సూచన చేశారు. కానీ, ఒకరిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. పోనీ.. …
Read More »కేటీఆర్ పాదయాత్ర పోస్ట్ పోన్… ?
తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఏడాది నుంచే ఆ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై కేటీఆర్ .. పార్టీలోనూ.. తన కుటుంబంలోనూ చర్చించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజకీయంగా పాదయాత్ర ఏమేరకు తమకు దోహదపడుతుందన్న విషయంపైనా ఆయన ఆరా తీశారు. అధికారంలోకి వచ్చేందుకు ఇది ఎంతవరకు …
Read More »దమ్ముందా? కడియం శ్రీహరికి కొండా సురేఖ సవాల్…!
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన కడియం శ్రీహరి తన ఇలాకాలో వేలు పెడుతున్నారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి …
Read More »వీడియో: మనవడి కోసం పూరీలు చేసిన సీఎం
ఏదో చిన్న ఉద్యోగమో.. పనో చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే మనకే వంట గదిలోకి వెళ్లేందుకు సమయం ఉండదు. సమయం ఉన్నా.. వెళ్లాలని కూడా ఉండదు. మరి నిత్యం ఎంతో బిజీగా ఉంటూ.. ఇటు రాష్ట్ర పరిపాలన, అటు పార్టీ పరంగా ఎదురయ్యే సవాళ్లు.. వంటి కార్యక్రమాలతో క్షణం కూడా తీరిక ఉండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన మనవడి కోసం.. ఏకంగా పూరీలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates