Political News

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్..నువ్వే టైం, డేట్ ఫిక్స్ చెయ్. పులివెందులకు రమ్మంటావా.. తాడేపల్లికి రమ్మంటావో చెప్పు. డీఎస్సీ మీద చర్చించడానికి నేను రెడీ.. నువ్వు సిద్ధమా చెప్పమంటూ లోకేష్ చేసిన సవాల్ తో ఒంగోలు దద్దరిలింది. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో పర్యటలో కార్యకర్తల …

Read More »

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే నేను మాత్రం స్పెషల్ అని పోజులివ్వడం మనమంతా చూస్తుందే. గత వైసీపీ పాలనలో అయితే ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఐదేళ్ల పదవీ కాలంలో ముఖ్యమంత్రితో ఒక్కసారి కూడా కలిసే అవకాశం లేకుండా పోయిందని సగం మంది …

Read More »

రాఖీ రాజీ చేసేనా? సీఎం ఇంటికి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు అపాయింట్‌మెంట్‌ కోరిన సురేఖ.. తాజాగా ఆయన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన సురేఖ.. సీఎంకు రాఖీ కట్టేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ముఖ్యమంత్రి–మంత్రి …

Read More »

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాల‌ని కోరుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. అందులో ఆయ‌న అనేక విషయాల‌ను ప్ర‌స్తావించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అనేది అత్యంత కీల‌క విష‌య‌మ‌ని పేర్కొన్నారు. దీనిపై అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయాల‌న్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రాల …

Read More »

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో వ్య‌క్తిపూజ‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అప్ప‌ట్లో దేశ‌వ్యా ప్తంగా ఇందిర‌మ్మ పేరు మార్మోగింది. ఇదే.. ఆమె దూకుడుకు కార‌ణ‌మైంది. ఫ‌లితంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకువ‌చ్చాయి. ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ, బీహార్‌లో ఆర్జేడీ, జేడీయూ, క‌ర్ణాట‌క జేడీఎస్ వంటివి రావ‌డానికి కార‌ణం.. నాడు కాంగ్రెస్ పార్టీ అవ‌లంభించిన వ్య‌క్తిపూజే కార‌ణ‌మ‌న్న‌ది చ‌రిత్ర …

Read More »

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే చెప్పాలి. అయితే.. ఈ ప్రాజెక్టుల తొలిద‌శ‌ను పూర్తి చేయ‌డంతోపాటు.. ఈ ఏడాది ఒక ప్రాజెక్టును.. వ‌చ్చే ఏడాది మ‌రోప్రాజెక్టును ప్రారంభించేందుకు చంద్ర‌బాబు పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. ఇది ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుంద‌న్న అంచ‌నాలు వేస్తున్నారు. 1) వెలిగొండ తొలిద‌శ‌. 2) పోల‌వ‌రం తొలిద‌శ‌. ఈ …

Read More »

రాఖీ కట్టమంటే విదేశాలకు పారిపోయాడు

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతి రూపం రాఖీ. అలాంటి పవిత్రమైన రాఖీ పండుగ కూడా నేడు రాజకీయ చట్రంలో చిక్కుకుంది. మూడేళ్లుగా తన సోదరుడికి రాఖీ కట్టలేక పోయానంటూ తెలంగాణా రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతున్న సమయంలో ఈసారైనా కేటీఆర్ కు రాఖీ కడతారా అని ఓ మీడియా …

Read More »

కొండా దంప‌తులు బీజేపీలో ఉండ‌గ‌ల‌రా…?

కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇప్పటివరకు రాజకీయంగా అడుగు పెట్టని ఒకే ఒక్క ప్రధాన పార్టీ బీజేపీ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న తీవ్రమైన అంతర్గత విభేదాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వారి కుమార్తె సుస్మితా ప‌టేల్ చేసిన వ్యాఖ్యలు, పార్టీ క్రమశిక్షణా కమిటీ చర్యల హెచ్చరికలతో తమ వద్ద ‘ప్లాన్-బీ’ ఉందనే పరోక్ష సంకేతాలను వారు పంపుతున్నారు. ఒకవేళ అధిష్టానం కేబినెట్ నుంచి తప్పిస్తే ఆత్మగౌరవం పేరిట …

Read More »

అనిల్ యాదవ్ సైలెంటుగా సైడ్ అయిపోతున్నారా?

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని, అసలు తన రాజకీయ ప్రస్థానమే ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. జగన్‌మోహన్‌ రెడ్డికి వీర విధేయుడిగా పేరున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌.. గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున దూకుడుగా మాట్లాడే నేతగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థుల విమర్శలకు ఘాటైన కౌంటర్లతో పార్టీ తరఫున బలమైన వాయిస్‌ …

Read More »

యాదాద్రి బోర్డు మెంబర్ గా చిరంజీవి భార్య, తీసేయాలంటున్న కవిత

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్‌ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆలయ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి ఆలయ పాలకమండలిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి సభ్యత్వం ఇవ్వడం సరికాదని …

Read More »

ఏపీ లిక్కర్ స్కాం… ఈడీ తరువాత ఐటీ!

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ 3500 కోట్ల రూపాయలు స్కాం జరిగినట్లుగా ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఈ వ్యవహారంపై సిట్, ఈడీ అధికారులు విచారణ జరపడం ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బట్టబయలైంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో తాజాగా ఐటీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. డిస్టిలరీల నుంచి కిక్‌ …

Read More »

జోగికి ఇది రాజకీయ సమాధిగా మారుతుందా?

మాజీ మంత్రి జోగి రమేష్ కు సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలేలా వుంది. కొడుకు రాజీవ్ వివాహం విషయంలో ఏర్పడ్డ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. అదే ఆయనకు రాజకీయ సమాధిగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొన్న ఆయన ఇంటిగుట్టు బయట పడకుండా మేనేజ్ చేసుకోలేక పోయారని సన్నిహితులు సైతం చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా జోగి …

Read More »