ఏపీలో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తుల్లో ఇక విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ అన్న మాటే వినిపించని రీతిలో వరుస ప్రకటనలు వెలువడ్డాయి. అంతేకాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి.ఈ పరిణామాలు ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి బిగ్ బూస్ట్ లభించిందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో లభించిన …
Read More »నాడు ఈ గవర్నెన్స్… నేడు వాట్సాప్ గవర్నెన్స్
1995…ఉమ్మడి ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. టీడీపీలో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాల నేపథ్యంలో నాడు యువ నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అప్పటిదాకా సీఎంగా వ్యవహరించిన వారంతా ఫక్తు రాజకీయ నాయకులే. పెద్దగా టెక్నాలజీపై అవగాహన లేని వారే. అయితే చంద్రబాబు ఏపీ ప్రజలకు సరికొత్త పాలనను అందించారు. అప్పటిదాకా కరెంటు బిల్లు కట్టేందుకు వచ్చిన వారితో విద్యుత్ శాఖ కార్యాలయాల …
Read More »బాలయ్య ఇలాకాలో టీడీపీ జెండా రెపరెపలు పక్కా
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అయితే మొన్నటి …
Read More »అవును, అవే వైసీపీని ముంచాయి- కేతిరెడ్డి
గత ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో తెలిసిందే. వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికలకు ముందే సంకేతాలు కనిపించాయి కానీ.. మరీ ఆ స్థాయిలో చిత్తవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దీంతో కొన్ని నెలల పాటు ఈవీఎం మాయాజాలం అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. కార్యకర్తలను కూడా అదే రకంగా నమ్మించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. …
Read More »9552300009 నెంబర్తో ప్రభుత్వ సేవలు
ఏపీలో వాట్పాస్ గవర్నెన్స్ ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కొత్త తరహా సేవలను ప్రారంభించారు. ఈ సేవల కోసం ప్రభుత్వం తరఫున అధికారిక వాట్సాప్ నెంబరును లోకేశ్ విడుదల చేశారు.ఆ నెంబరు 9552300009 గా లోకేశ్ ప్రకటించారు. ఈ నెంబర్ కు సందేశం పంపడం ద్వారా మనకు కావాల్సిన సేవలను ఎంచుకుని పొందవచ్చని …
Read More »వర్మ వద్ద డబ్బుల్లేవట!… మరేటి సేత్తారు?
ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన కూటమి సర్కారు కొట్టిన దెబ్బ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బాగా గట్టిగానే తగిలింది. అప్పటిదాకా తనను ఎవరూ ఏమి చేయలేరన్నట్లుగా టేకిట్ ఈజీగా సాగిన వర్మ… సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కూడిన పోస్టుల వ్యవహారంలో ఏపీ పోలీసులు కొరడా ఝుళిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి తాను తీసుకున్న రూ.1.15 కోట్ల నిధులను తిరిగి …
Read More »నిన్నటిదాకా ‘ఒకే’ మార్గం… ఇప్పుడు ‘మూడు’ దారులు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాలు చేశారు. ఈ సమావేశానికి ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. వీరిలో బీద మస్తాన్ రావు(టీడీపీ), వల్లభనేని బాలశౌరి(జనసేన), పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి(వైసీపీ) ఉన్నారు. ఏపీ తరఫున ఈ సమావేశానికి హాజరైన ఈ ముగ్గురిని చూసినంతనే ఏపీ జనం వారి మార్గాలపై ఆసక్తికర పయనాల …
Read More »ఇదే జరిగితే.. వైసీపీ విశ్వసనీయత మాటేంటి?: పొలిటికల్ డిబేట్
రాష్ట్రంలో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని.. పెద్ద ఎత్తున యాగీ చేస్తున్న విషయం రెండు రోజులుగా చర్చనీయాంశం అయింది. అయితే.. తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని.. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని …
Read More »అన్న క్యాంటీన్ లో కొత్త నిబంధన!… సూపర్ బాసూ!
అన్న క్యాంటీన్… ఈ పేరు వింటేనే ఆకలి మీద ఉన్న కడుపు నిండిపోతుంది. రూ,.5 బిళ్ల పట్టుకుని అక్కడికి వెళితే…ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం అందుతుంది. అంటే…ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు కేవలం రూ.15 తో మూడు పూటలా కడుపు నింపుకోవచ్చు. ఏపీలోని దాదాపుగా అన్ని ప్రధాన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. అక్కడ రుచి, శుచితో కూడిన వంటలను జనం ఇష్టంగా …
Read More »ఈసారి అబ్బయ్యతో కలిసి… వైల్డ్ లుక్కులో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ రేపటితో ముగియనుంది. కూతురి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం సతీసమేతంగా లండన్ వెళ్లిన జగన్… ఆ కార్యక్రమం తర్వాత ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. 15 రోజులకు పైగానే లండన్ లో పర్యటిస్తున్న జగన్.. ఆదిలో తన వేర్ అబౌట్స్ తెలియకుండానే జాగ్రత్త పడ్డారు. అయితే ఆ తర్వాత ఆయనకు చెందిన న్యూ లుక్ ఫొటోలు రోజుకు ఒకటి చొప్పున …
Read More »ఎవరీ తులసిబాబు?… ఇతడి స్టామినా ఏంటో తెలుసా?
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసిబాబు అనే పేరు పదే పదే వినిపిస్తోంది. ఇతడేమీ పెద్ద రాజకీయవేత్త కాదు. అలాగని బిజినెస్ మ్యాన్ కూడా కాదు. మరి సోషల్ వర్కరా? అంటే… కానే కాదు. మరెవరు? ఇతడి పేరు ఇంతగా ఎందుకు వినిపిస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన తులసిబాబు… సోమవారం పోలీసుల కస్టడీలోకి వెళ్లియారు. బుధవారం వరకు అతడిని పోలీసులు 3 రోజులు వరుసగా విచారించి తిరిగి జైలుకు తరలించారు. …
Read More »జగన్ తో కానిది… బాబుతో సాకారం
రాయలసీమ ముఖద్వారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం… ఇవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానం. జగన్ మాటలను నమ్మిన సీమ జనం 2019 ఎన్నికల్లో తమ ఓట్లన్నీ వైసీపీకే గుద్దేశారు. ఫలితంగా జగన్ సీఎం అయ్యారు. ఐదేళ్ల పాటు దిలాసాగా కాలం వెళ్లదీశారు. కర్నూలుకు హైకోర్టు ఏదీ అంటే.. అదిగో, ఇదిగో అంటూ చెప్పారే తప్పించి… …
Read More »