ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని ఓ దరిద్రంతో పోల్చిన పవన్… కుల భావన అనేది ఓ దరిద్రమని, దానిని వీడితే తప్పించి రాష్ట్రం అభివృద్ది బాటలో నడవదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను పకడ్బందీగా అమలు చేయాలని తాను భావిస్తానని, అదికార యంత్రాంగానికీ …
Read More »హోర్ముజ్ మళ్లీ మూత… ప్రపంచం దిగ్భ్రాంతి!
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. అదే క్షణంలో అమలు కూడా చేసింది. దీంతో ఉరుములు లేని పిడుగులాంటి ఈ వార్తతో ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సుదీర్ఘ విరామం తర్వాత.. నాలుగు రోజుల కిందటే ఈ జలరవాణా మార్గాన్ని .. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా తెరిచింది. అనంతరం.. అమెరికా-ఇరాన్ …
Read More »బెయిలుపై బయటకు రాగానే మొదలు
వైసీపీ నేతల వ్యవహార తీరు అంతకంతకూ వివాదాస్పదంగా మారుతోందని చెప్పాలి. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరు ఇప్పుడు నిజంగానే పైన చెప్పినట్టే ఉందని చెప్పక తప్పదు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో భూకబ్జాకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు అయిన బొల్లా… బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం స్పందించని బొల్లా… ఇప్పుడు బెయిల్ పై బయటకు …
Read More »పీకే… సినిమాల వరకు ఓకే: కవిత
జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు పవన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆల్రెడీ తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కూడా మరోసారి పవన్ పై వారు తమ వ్యాఖ్యలకు …
Read More »బండి భగీరథ్ కు బెయిల్
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు మే 16న అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా రిమాండ్ లో ఉన్న భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేేయడంతో అతడికి ఊరట లభించినట్లయింది. వారం రోజుల పాటు భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. …
Read More »వైసీపీ స్ట్రాటజీ: కాపులతో కలివిడా.. విడివిడా?
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని వాడుకుని రాజకీయాలు చేయాలా? అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేక పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. అన్ని పార్టీల్లోనూ ఉన్నట్టుగానే.. వైసీపీలోనూ కొందరు తటస్థ నాయకులు ఉన్నారు. వారు.. జగన్ చెప్పారని గుడ్డిగా ఫాలో అయ్యే టైపు కాదు. ఇలాంటి వారు.. ఇప్పుడు ఈ …
Read More »అమెరికా-ఇరాన్… మిగిల్చిందేంటి?
ఈ ఏడాది ఫిబ్రవరి 28. ప్రపంచం కళ్లు తెరుస్తున్న సమయం. ఊహాతీతంగా.. అన్ని మీడియాల్లోనూ.. అ ప్పటికే.. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. ఆయన కుటుంబం లక్ష్యంగా కీలక ప్రాంతాల్లో యుద్ధం చేశారని.. వారు మృతి చెందారని బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. ఇలా.. ప్రారంభమైన.. అమెరికా-ఇరాన్ యుద్ధం.. దాదాపు 42 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగింది. ఎలా మొదలై.. ఎక్కడికి? వాస్తవానికి …
Read More »ఇక కొడాలి నాని వంతు
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పోలీసులు నానీకి నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. అయితే.. ఈ కేసు వైసీపీ హయాంలోనే నమోదు కావడం గమనార్హం. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసు విచారణ ముందుకు సాగలేదు. తాజాగా నానీ విచారణకు అనుమతించాలని కృష్నాజిల్లా కలెక్టర్ కోరడంతో ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏంటీ …
Read More »నిషేధం చిన్న చర్యే: టెలిగ్రామ్ యాప్కు కోర్టు షాక్!
తమపై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని.. ఉద్దేశ పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిందని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే ఈ కేసు విచారణకు వచ్చింది. దీనిపై వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. ప్రస్తుత పరిస్థితిలో నిషేధం అనేది చిన్న చర్యేనని వ్యాఖ్యానించింది. నీట్ ప్రశ్న పత్రాలు లీకైతే.. ఎవరు బాద్యత వహిస్తారని ప్రశ్నించింది. తాత్కాలిక నిషేధం వెనుక.. ఎలాంటి ఉద్దేశ …
Read More »‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సాయికృష్ణ తల్లి, మేనమామ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు న్యాయం చేస్తానని సీఎం చంద్రబాబు హామీనిచ్చారని, తనకు భరోసా కల్పించారని సాయికృష్ణ తల్లి తెలిపారు. తనకు అది చాలని ఆమె అన్నారు. తాను సీఎం చంద్రబాబును కలవాలని అనుకున్నానని, తన బిడ్డ కేసులో న్యాయం చేశారని తెలిపారు. …
Read More »ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం ఏపీలో ఆ ఒక్క పార్టీకి మాత్రం పట్టకపోవడం ఆశ్చరంగానే ఉంది. ఇటువంటి ఘటనలు జరిగినపుడు సహజంగా పార్టీలు అప్రమత్తం అవుతాయి. మైలేజీ కోసం కూడా చూస్తాయి. పరామ్శలు, డిమాండ్లు చేస్తాయి. కానీ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు ఇంత హాట్టాపిక్గా మారినా కాంగ్రెస్పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు …
Read More »సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ సాయికృష్ణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. నాగరాజుపై కేసు కూడా నమోదైంది. ఈ రోజు ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే, సాయికృష్ణ కుటుంబ సభ్యులను నిన్న పరామర్శించిన ఏపీ మాజీ సీఎం జగన్…ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates