మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు ఎంతటి సంచలనంగా మారిందన్నది తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏపీలో రాజకీయ ప్రకంపనల్ని సృష్టిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు అరెస్టు అయిన వారిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారంటే.. ఆదివారం పులివెందులలో అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వైసీపీ ఎంపీ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డినే. ఆదివారం సాయంత్రం వేళలో సీబీఐ నుంచి తాఖీదులు అందుకున్న …
Read More »అవినాష్ ఎఫెక్ట్: లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకున్న జగన్
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలవడం.. ఇప్పటికే ఆయన తండ్రి భాస్కరరెడ్డిని (సీఎం జగన్ భార్య భారతి సొంత మేనమామ) అరెస్టు చేసి జైల్లో పెట్టిన నేపథ్యంలో సీఎం జగన్ దంపతులు తమ విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎప్పుడు .. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన వైసీపీ నేతల్లో నెలకొంది. ఇలాంటి సమయంలో తాము అందుబాటులో ఉండాలని జగన్ దంపతులు …
Read More »ఎన్నికల బరిలో సునీతా రెడ్డి ?
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగవంతమైంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుతో కేసు ఒక కొలిక్కివచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. ఆయన కుమారుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అన్నది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను బట్టి ఉంటుంది. వివేకా కేసులో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగానే ఇప్పుడు మరో ఆంశం తెరపైకి వచ్చింది.. కడపలో సునీత పోటీ అవినాష్ రెడ్డి చేసిన ద్రోహానికి వచ్చే ఎన్నికల్లో …
Read More »ప్లేబ్యాక్ మార్చాల్సిందే… బాబు గారూ..!
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఏదో ఒక పేరుతో ఆయన ప్రజల మధ్య ఉండేలా కార్యక్రమాలు నిర్ణయించుకున్నారు. అదేసమయంలో పార్టీ నేతలకు కూడా ఆయన హితోపదేశం చేస్తున్నారు. అయితే.. ఏ కార్యక్రమం నిర్వహించినా.. చంద్రబాబు వైఖరి, ఆయన శైలి మాత్రం మారడం లేదనేది పరిశీలకుల మాట. నిజానికి ఎక్కడికక్కడ ప్రజలు కోరుకునేది వారి సమస్యల పరిష్కారం. ఇదే పెద్ద ఎత్తున చర్చకు కూడా వస్తుంది. అయితే, చంద్రబాబు …
Read More »మార్కాపురం ఫ్యాన్స్ అంతర్గత పోరు
ఫాన్ పార్టీలో ఇప్పుడు టీడీపీ భయం కంటే అంతర్గత పోరు ఎక్కువైంది. ప్రతీ నియోజకవర్గంలోనూ రెండు మూడు ముఠాలు పనిచేస్తూ.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం పాచికలు వేస్తూ.. సిట్టింగులపై ఆరోపణలు సంధిస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డికి సొంత పార్టీ నేతలతోనే తలనొప్పి మొదలైంది.పార్టీలో ప్రత్యర్థులు ఆయనపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆయన …
Read More »నేను అమాయకుడిని.. ప్రీ బెయిల్ ఇవ్వండి: అవినాష్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఐదోసారి విచారణకు సీబీఐ పిలిచేసరికి.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి హడలిపోయినట్టుగా ఉన్నారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే.. ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సంచల న విషయాలు వెల్లడించారు. తాను అమాయకుడినని.. బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అంతేకాదు.. చంద్రబాబు-సీబీఐ అదికారి కుమ్మక్కయ్యారని అవినాష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ నాలుగు …
Read More »ప్రధాని అభ్యర్ధిగా నితీష్ పోస్టర్లు కలకలం
రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పోస్టర్లు వెలిశాయి. పార్టీ ఆఫీసు పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని మరికొన్ని చోట్ల ప్రధానమంత్రి అభ్యర్ధిగా నితీష్ అని పెద్ద పోస్టర్లు వెలిశాయి. దాంతో బీహార్లో ఒక్కసారిగా సంచలనం మొదలైపోయింది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని ఓడించటమే ధ్యేయంగా చాలామంది అనేక ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్టుగా నితీష్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు …
Read More »భాస్కర్ రెడ్డి కస్టడీ పిటిషన్ లో సీబీఐ చెప్పిందేంటి?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్నున్యాయమూర్తి ఎదుట హాజరు పర్చిన వేళ.. సీబీఐ తమ దర్యాప్తులో తేలిన అంశాలు ఇవేనంటూ కోర్టు ముందు పెట్టింది. సీబీఐ అధికారుల కస్టడీ పిటిషన్ లో కీలక అంశాల్ని పేర్కొన్నారు. తమకు భాస్కర్ రెడ్డిని పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ …
Read More »తెలంగాణ ను తిట్టిన ఏపీ మంత్రులకు పవన్ వార్నింగ్
ఏపీలోని వైసీపీ మంత్రులు, నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు.. మంత్రులు, నాయకులు నోరు జారి మాట్లాడితే.. దానిని అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్పై ఉంటుందని పార్టీ పెద్దలపైనా ఉంటుంద ని అన్నారు. నాయకులు-నాయకులు తిట్టుకునే సమయంలో ప్రజలను రోడ్డుమీదకు లాగడం సరికాదన్నారు. ఒక సమాజాన్ని, ప్రజలను విమర్శించడం సరికాదని పవన్ సూచించారు. ఇటీవల ఏపీ, తెలంగాణ …
Read More »గన్నవరం వచ్చిన స్పెషల్ ఫ్లైట్ లో ఎవరున్నారు?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు కావటం తెలిసిందే. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ అరెస్టు గురించి ఏ మాత్రం సమాచారం లేకుండా గుట్టుగా సాగినట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ అరెస్టు అనంతరం కొన్ని గంటల వ్యవధిలో గన్నవరం ఎయిర్ పోర్టుకు మైసూర్ నుంచి వచ్చిన ఒక …
Read More »నిన్న సాక్షి.. నేడు నిందితుడు.. ఎంపీ అవినాష్కు బిగిస్తున్న ఉచ్చు!
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో నిన్నటి వరకు సీబీఐ అధికారులు సాక్షిగా పేర్కొన్న కడప ఎంపీ.. అవినాష్ రెడ్డిని తాజాగా సహ నిందితుడిగా పేర్కొంటూ.. కోర్టుకు సమర్పించే చార్జిషీట్లో సంచలన మా ర్పులు చేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీలో టెన్షన్ పూరిత వాతావరణం పెరిగిపోయింది. ఇదిలావుంటే.. ఈ మార్పులు చేసిన రోజే అంటే.. సోమవారమే.. ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం మరింతగా ఉత్కంఠను పెంచేసింది. ఇప్పటికే నాలుగు సార్లు …
Read More »కేజ్రీ అరెస్టు తప్పదా ?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తప్పదనే ప్రచారం రాజకీయ సర్కిళ్ళల్లో పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నరేంద్రమోడీకి కంట్లో నలుసులాగ, పంటికింద రాయిలాగ తయారయ్యారు కేజ్రీవాల్. దేశంలోని చాలా రాష్ట్రాలు నరేంద్రమోడీ ఏలుబడిలోకి వస్తున్నా ఢిల్లీలో పాగా వేయటం మాత్రం సాధ్యంకావటంలేదు. ఎంతగా పోరాడినా, ఏ పద్దతిలో పోరాటాలు చేస్తున్నా కేజ్రీవాల్ ను ఓడించటం నరేంద్రమోడీ వల్ల కావటంలేదు. ఇక్కడ బీజేపీ అని కాకుండా మోడీ పేరును …
Read More »