కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తావించారు. నిజానికి బడ్జెట్లో ఎప్పుడూ.. ప్రాజెక్టులు, అభివృద్ధికి పెద్ద పీట వేసిన మోడీ.. ఈ దఫా వికసిత భారత్ లక్ష్యంగా రూపొందించినట్టు నాలుగు యాంగిల్స్ను బట్టి అర్ధమవుతోంది. బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నా.. సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది ఈ నాలుగు కోణాలే. …
Read More »తెలంగాణలో ‘తిరుగుబాటు’ కలకలం
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న ఓ కీలక భేటీ ఈ కలకలానికి కారణమైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాలుపంచుకున్నారని తొలుత వార్తలు వినిపించినా… ఆ తర్వాత ఈ భేటీలో పాల్గొన్నది 8 మంది ఎమ్మెల్యేలేనని తేలింది. వీరంతా కూడా రేవంత్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేసేందుకే భేటీ …
Read More »కేంద్ర బడ్జెట్.. బాబు హ్యాపీ!
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సమ్మిల వృద్ధికి, వికసిత్ భారత్ సాకారానికి ఈ బడ్జెట్ ప్రతిరూపంగా నిలుస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవచిస్తున్న వికసిత భారత్ ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపించిందని చెప్పారు. మధ్యతరగతి జీవులకు పన్ను ఊరట కల్పించడం.. కీలక అంశంగా ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులు ఎదురు …
Read More »జ.. గన్ పేలుతుందా.. !
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడు మాసాలు పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు తమ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న సంతృప్తి, అసంతృప్తి లెక్కలు వేసుకున్నారు. దీనిలో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పేరుతో విభజించారు. ఇలానే వైసీపీ కూడా విపక్షంగా ఏడు మాసాలు పూర్తి చేసుకుంది. దీంతో ఈ ఏడు మాసాల కాలంలో వైసీపీకి ఎన్ని మార్కులు పడ్డాయి? అనేది ప్రశ్న. వాస్తవానికి ఈ ఏడు మాసాల కాలంలో విపక్షానికి పెద్దగా పనిలేకుండా …
Read More »ఆదాయపన్ను ఎంత? ఎవరికి మినహాయింపు?
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో వేతన జీవులు ఆశించిన దానికంటే ఎక్కువగానే మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఉన్న ‘పాత పన్ను’ విధానంలో 5 -7 లక్షల వరకు మినహాయింపు ఉంది. దీనిలోనే అన్ని స్టాండర్డ్ డిడక్షన్లు.. ఉన్నాయి. కానీ, ఉద్యోగులు మాత్రం పన్ను పరిమితిని పెంచాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే 2021లో కొత్త ఆదాయ పన్ను విధానాన్ని తీసుకువచ్చారు. …
Read More »అప్పుల బాటలోనే కేంద్రం.. ఈ ఏడాది 11 లక్షల కోట్లు!
రాష్ట్రాలే కాదు.. కేంద్ర ప్రబుత్వం కూడా అప్పులు చేయక తప్పడం లేదన్న విషయం స్పష్టమైంది. తాజాగా ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ, వ్యయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం బడ్జెట్.. సమగ్ర స్వరూపాన్ని చూస్తే.. అప్పులు చేయకతప్పదన్న సంకేతాలు వచ్చాయి. అసలు ఈ విషయాన్ని మంత్రే చెప్పుకొచ్చారు. 2025-26 వార్షిక బడ్జెట్లో చెప్పిన లెక్కలు చూస్తే.. ద్రవ్య లోటు.. …
Read More »కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిందేంటి…?
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ లో కీలక రంగాలకు భారీ కేటాయింపులే జరిగాయి. అయితే తెలుగు నేల విభజన నాటి నుంచి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పయనం సాగిస్తున్న ఏపీకి ఈ బడ్జెట్ లో అయినా ఆశించిన మేర కేటాయింపులు దక్కాయా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. బడ్జెట్ లో …
Read More »నెలకు లక్ష జీతమా.. అయితే పన్ను కట్టక్కర్లేద్దు
అంతా అనుకున్నట్లుగా మధ్య తరగతికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. శనివారం 2025-26 వార్షిక బడ్జెట్ ను నిర్మల ప్రశేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు భారీ కేటాయింపులు చేసిన ఆర్థిక మంత్రి… మధ్య తరగతికి భారీ ఊరట ఇచ్చేలా సంచలన ప్రకటన చేశారు. ఏ వర్గం వారికైనా రూ.4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని …
Read More »రేవంత్ కు షాకా?…ప్రీ ప్లానేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం బలహీనంగా ఉండటం… ఎన్నికలు జరిగే మూడు స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించడం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే తెలంగాణలో అలా కాదు,. అధికారంలో ఉన్నది ఒకే పార్టీ అయినా కూడా ఆ పార్టీలో సీటును ఆశిస్తున్న వారి సంఖ్య వందల్లో ఉంది. అంతేకాకుండా …
Read More »బాబుకు ఢిల్లీ లో తెలుగు వారే టార్గెట్
మాటల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్కడున్నా వారిని తనవైపు తిప్పుకోగల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం చంద్రబాబు. ఆయన ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడగలరు. ఇక, పాలన, ఐటీ రంగాల గురించి అయితే మరీ ఎక్కువ. మైకు పట్టుకుంటే వదిలి పెట్టరన్న నానుడి ని కూడా చంద్రబాబు సొంతం చేసుకున్నారు. అందుకే ఆయన స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో ఏపీలో …
Read More »ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్
రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ చోటే లేదు. దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో సువిశాల విస్తీర్ణంలో వందలాది గదులతో రాజ ప్రసాదాన్ని తలపించేలా నిర్మితమైన ఈ భవన్ ను ఒక్కసారి అయినా దర్శించి తీరాలని కోరుకోని భారతీయుడు ఉండరు. అలాంటి రాష్ట్రపతి భవన్ లో ఇప్పుడు ఓ పెళ్లి వేడుక జరగనుంది. ఈ …
Read More »వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!
మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులకు ఎక్కారు. ఇప్పటిదాకా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల… తాజాగా శనివారం 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డులకు ఎక్కారు.వాస్తవానికి గతేడాదే నిర్మల ఈ రికార్డును చేరుకున్నారు గానీ.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates