Political News

ఎబిలిటీ, క్రెడిబులిటీ రెండూ లేవు!

నాలుగేళ్ల కిందట ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాటలన్నీ జనం నమ్మారు. తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. కానీ, నాలుగేళ్లు తిరిగేసరికి జనం జగన్‌ను నమ్మడం మానేశారు. జగన్ మాటలకు చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని.. చెప్పిన పని చేయరని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోరని అర్థం చేసుకున్నారు. అందుకే… 2019లో అమరావతి ప్రజలు జగన్‌ను నమ్మినా ఇప్పుడు వైజాగ్ ప్రజలు మాత్రం జగన్‌ను నమ్మడం లేదు. వైజాగ్‌లోనే ఉంటా, ఇక్కడి నుంచే …

Read More »

చొక్కా విప్పేసి.. ఏపీ మంత్రి హ‌ల్చ‌ల్‌.. స‌వాళ్లు.. ఏం జ‌రిగింది?

ఏపీ మంత్రి, విద్యావేత్త‌, కేంద్ర మాజీ అధికారి ఆదిమూల‌పు సురేష్ హ‌ల్చ‌ల్ చేశారు. న‌డిరోడ్డుపై చొక్కా విప్పేసి.. టీడీపీ నేత‌ల‌కు స‌వాళ్లు రువ్వారు. దీంతో ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెంలో పర్యటించనున్న నేపథ్యంలో ఇక్కడ‌ హై టెన్షన్ కొనసాగుతోంది. స్థానిక‌ ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూ లపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద రోడ్డుపైకి వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. …

Read More »

వివేకా రెండో భార్య ష‌మీమ్‌ స్టేట్‌మెంటు..

సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇక‌, హ‌త్య‌క‌న్నా ఎక్కువ‌గా ఇప్పుడు తెర‌మీదికి వ‌స్తున్న ట్విస్టుల‌పై ట్విస్టులు మ‌రింత‌గా కేసును ఉత్కంఠ‌గా మార్చాయి. వివేకా కుమార్తె సీబీఐ ద‌ర్యాప్తును కోర‌డం.. త‌ర్వాత ప‌రిణామాల్లో ఏకంగా క‌డ‌ప ఎంపీ చుట్టూ ఉచ్చు బిగిస్తుండ‌డం కేసు తీవ్ర‌త‌ను పెంచేసేంది. ఇంతలో తెర‌మీదికి వ‌చ్చిన వివేకా రెండో భార్య‌,ముస్లిం వ‌ర్గానికి చెందిన …

Read More »

ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడు పెత్తనం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కీలక దశకు చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలోకి యాత్ర ప్రవేశించడంతో వెయ్యి కిలోమీటర్ల మైలు దాటినట్లయ్యింది. ప్రతీ వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న లోకేష్.. వెయ్యి కిలోమీటర్లకు కూడా ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆదోని టౌన్ వార్డ్ 21 ని దత్తత తీసుకోవాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 21వ వార్‌ను ప్రగతి పథంలో నడిపించే …

Read More »

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు.. కమాండోకు కుట్లు

ఆ పార్టీ నేతలు,శ్రేణుల తీరు కూడా ఆరోపణలను బలపరిచేదిగా ఉంటుంది. తాజాగా ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో వైసీపీ రెచ్చిపోయి అరాచకం సృష్టించింది. స్వయంగా మంత్రి అయిన ఎమ్మెల్యే రంగంలోకి దిగి బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నించారు. ప్లకార్డుల ప్రదర్శన టీడీపీ అధినేత చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటనను అడ్డుకునేందుకు ప్లకార్డులు, నల్లబెలూన్లతో వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. వారికి మంత్రి ఆదిమూలపు సురేష్ నాయకత్వం వహించడమే కాకుండా చొక్కా విప్పి మరీ సవాలు చేశారు. …

Read More »

బీజేపీలో చేరండి..మంచి ఫ్యూచ‌ర్‌..: జేడి కు వెంక‌య్య స‌ల‌హా?

మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, బీజేపీ నాయ‌కులు వెంక‌య్య‌నాయుడును సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ వీవీ ల‌క్ష్మీ నారాయ‌ణ క‌లిశారు. శుక్ర‌వారం ఉద‌యం..విశాఖ బీచ్ రోడ్‌లో మార్నింగ్ వాక్ కోసం.. వ‌చ్చిన వెంక‌య్య‌తో ల‌క్ష్మీనారాయ‌ణ అక్క‌డే భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రూ.. రాగి జావ తాగారు. కొద్ది దూరం క‌లిసి న‌డిచారు. ఈ సంద‌ర్భంగా ఏపీ రాజ‌కీయాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ క‌ర‌ణ వంటి అంశాలు వారి మ‌ధ్య చ‌ర్చ‌కు …

Read More »

అమ‌రావ‌తిలో మ‌రో ర‌గ‌డ‌.. రంగంలోకి రైతులు.. ఏం జ‌రిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం ఎలానూ చేయ‌డం లేదు. అంతేకాదు.. క‌నీసం అమ‌రావ‌తి ఊసు కూడా ఎత్త‌డం లేదు. రాజధాని లేద‌న్న విమ‌ర్శ‌ల‌ను కూడా అధికార పార్టీ పాల‌కులు లైట్ తీసుకున్నారు. కానీ, రైతులు మాత్రం త‌మ ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూనేఉన్నారు. ప్ర‌స్తుతం అమ‌రావ‌తి వివాదం ఇటు హైకోర్టు, అటు సుప్రీంకోర్టులో ఉంది. ఇంత‌లోనే రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల ప్ర‌జ‌ల‌కు.. ఇక్క‌డ జ‌గ‌న‌న్న ఇళ్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం దూకుడు …

Read More »

అవినాష్ అరెస్టుకు లైన్ క్లియ‌ర్‌.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ.. తొలుత సాక్షిగాను.. త‌ర్వాత నిందితుడిగాను సీబీఐ అధికారులు గుర్తించిన క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసుకునే విష‌యంలో అడ్డుకోవ‌ద్ద‌ని.. తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి అరెస్టును ఈ నెల 25 వ‌ర‌కు నిలిపి ఉంచుతూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై సుప్రీకోర్టు స్టే విధించింది. అంతేకాదు.. సీబీఐ త‌న విచార‌ణ‌ను స్వేచ్ఛ‌గా నిర్వ‌హించుకునే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని …

Read More »

సునీత పిటిష‌న్‌ లో జ‌గ‌న్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఈ 25 వ‌ర‌కు అరెస్టు చేయొద్దంటూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ.. వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌లో ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం, …

Read More »

కాంగ్రెస్ నేతల్లో మార్పురాదా ?

కాంగ్రెస్ నేతల్లో ఎప్పటికి మార్పురాదని అర్దమైపోయింది. పార్టీ ఎలాపోయినా పర్వాలేదు తమకు వ్యక్తిగత ప్రతిష్టే ముఖ్యమని నేతలు తేల్చి చెప్పేస్తున్నారు. తమ ప్రతిష్టను కాపాడుకోవటానికి అవసరమైతే పార్టీ పరువును బజారున పడేయటానికి కూడా ఏమాత్రం వెనకాడటంలేదు. ఈ విషయం తాజాగా మరోసారి బయటపడింది. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఇందులో భాగంగా అనేక అంశాలపై రెగ్యులర్ గా ఆందోళనలు చేయాలని చెప్పింది. ఇలాంటి ఆందోళనల్లో …

Read More »

గన్నవరం టికెట్ ఇస్తే రూ.150కోట్లు ఖర్చుకు రెఢీగా ఉన్నారట

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీడీపీ సీనియర్ నేత.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయన ఏం చేసినా.. మరేం మాట్లాడినా సంచలనం అన్నట్లుగా ఉంటుంది. తాజాగా ఆయన గన్నవరం అసెంబ్లీ స్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వద్దకు ఒక వ్యక్తి వచ్చారని.. గన్నవరం సీటును తనకు ఇస్తే.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సదరు వ్యక్తి చెప్పారన్నారు.అయితే.. …

Read More »

ఆ విష‌యంలో.. ప‌వ‌న్‌కు అడ్డుప‌డుతోంది బీజేపీనేనా?

ఏపీలో పొత్తుల విషయంపై ప‌వ‌న్ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల్చ‌కుండా ముందుకు సాగుతాన‌ని, ఎట్టి ప‌రిస్థితి వైసీపీ ముక్త ఏపీ ల‌క్ష్యంగా ప‌నిచేస్తాన‌ని కూడా ప‌వ‌న్ ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్ .. పొత్తుల దిశ‌గా అడుగులు వేస్తున్నార‌నే టాక్ జోరుగా వినిపించింది. ఇప్ప‌టికే ప‌వ‌న్.. బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నిక‌లు ముగిసిన నాలుగు మాసాల‌కే ఆయ‌న పొత్తు …

Read More »