టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి చేసిన కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వంశీ మాదిరే వైసీపీ జమానాలో నోరు పారేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మరికొందరు నేతల అరెస్టులు తప్పవని చెబుతున్న టీడీపీ నేతలు… అందుకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనంత ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ సీనియర్ నేత, మచిలీపట్నం …
Read More »“వంశీ బయటకు వచ్చేది ఎప్పుడు?”: వైసీపీ
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడలోని సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి.. బెదిరించి.. ఆయనతో కేసు వెనక్కి తీసుకునేలా వత్తిడి చేశారన్న అభియోగాలతో పోలీసులు వంశీని అరెస్టు చేశారు. అయితే.. ఏదో ఒకరకంగా.. బెయిల్పై బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ.. …
Read More »పదవిలో ఉంటే కాషాయ వస్త్రాలు కట్టకూడదట!
ఎర్రన్నలు… అదేనండి మన వామపక్ష పార్టీలకు చెందిన నేతలు ఎప్పుడేం మాట్లాడతారో కూడా అర్థం కాదు. అసలే జనాల్లో పట్టు కోల్పోయిన ఎర్ర దండు నేడో, రేపో దుకాణాలు పూర్తిగా బంద్ చేసుకోక తప్పని పరిస్థితులు కనపడుతున్నాయన్న వాదనలు తరచూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దుకునే పనిని పక్కనపెట్టేసిన లెప్ట్ పార్టీ నేతలు.. అధికారంలో ఉన్న నేతలు.. అది కూడా పోటీ చేసిన అన్ని స్థానాలను గెలిచిన.. 100 శాతం …
Read More »కేసు వాపస్ తీసుకుంటే 40 లక్షలు అన్నారు, ఇప్పుడేమో….
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ హయాంలో జరిగిన దాడి ఘటనలో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయినా… అరెస్ట్ ముప్పు నుంచి రక్షణ పొందుతూ వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయినా కూడా ఈ కేసు తనకు …
Read More »ఆ రెండు కారణాలే అనిల్ ను బలి చేశాయా…?
వైసీపీలో అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసబెట్టి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ ను మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడి నుంచి బదిలీ చేశారు. నెల్లూరు జిల్లాను దాటించి… ఏకంగా పల్నాడు జిల్లాకు బదిలీ అయిపోయిన అనిల్… నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే టీడీపీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ …
Read More »చెలరేగిన `యనమల`… వైసీపీకి ఏం షాక్ ఇచ్చారులే!
టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఇటీవల కాలంలో పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. ఎందుకంటే.. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా..యనమలకు మంత్రి పదవి ఖాయం. అయితే.. ఈ సారి కూటమి సర్కారులో మాత్రమే యనమలకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో యనమల మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. పార్టీ కోసం పనిచేయరా? అంటూ..కొందరు సటైర్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం యనమల …
Read More »“డబుల్ ఇంజిన్ కాదు… ట్రిపుల్ ఇంజిన్ సర్కారు”
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత… బీజేపీ నేతలు ఎక్కడకెళ్లినా… డబుల్ ఇంజిన్ సర్కారు అంటూ పదే పదే ఆ కొత్త పదబంధాన్ని ప్రయోగించారు. డబుల్ ఇంజిన్ అంటే… కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే… రాష్ట్రాల్లోనూ అదే పార్టీ అధికారంలోకి రావడమన్న మాట. ఇలా డబుల్ ఇంజిన్ పాలన వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధుల కొరత ఉండదని, అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండవని …
Read More »బాబు ముందు అధికారులను బుక్ చేసిన బాలిక
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర పేరిట ఇటీవలే ప్రారంభించిన కార్యక్రమంలో చంద్రబాబు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన చంద్రబాబు… పట్టణంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రతను పరికించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర …
Read More »ప్రపంచ స్థాయికి అమరావతి… చంద్రబాబు నయా ప్లాన్!
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని నిర్ణయించారు. అమరావతి విశిష్టత, అభివృద్ధి వంటివి ప్రపంచవ్యాప్తంగా వీరి ద్వారా ప్రచారం చేయించనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. బ్రాండ్ అంబాసిడర్లను ఏర్పాటు చేయడం ద్వారా.. అమరావతిని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. తద్వారా.. రాజధానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంతోపాటు.. విద్యాసంస్థలను, విదేశీ …
Read More »జగన్ కు ఈ బీజేపీ సీనియర్ ఇచ్చి పడేశారుగా!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోరు తెరిస్తే సూపర్ సిక్స్ హామీల అమలు ఎక్కడ అంటూ ఆయన కూటమి సర్కారును నిలదీస్తున్నారు. అయితే కూటమి నేతలు కూడా అంతే స్థాయిలో జగన్ కు బదులిస్తున్నారు. జగన్ చేసిన విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆదిలోనే చెప్పిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు…ఆర్థిక …
Read More »బందిపోట్లు, స్మగ్లర్ల సినిమాలేంటి?: మంత్రి సత్యకుమార్
సినిమాలు, వాటి ఇతివృత్తాలపై బీజేపీ సీనియర్ నేత, ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమాలేంటి అని ప్రశ్నించిన మంత్రి…ఆ సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నారంటూ ఒంటికాలిపై లేచారు. తమకు జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్ధి కోసం పాటు పడిన వారి జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సినిమాలు తీస్తే… సమాజాభివృద్ధికి దోహదం చేసినట్టు అవుతుందని …
Read More »ఆంధ్రా తరహా ‘విధ్వంసం’ ఢిల్లీలోనూ జరిగిందా…?
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన పాలనలో విధ్వంసం చోటుచేసుకుందని, రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. ఏపీలో మరోమారు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు ఆయా శాఖలను పరిశీలిస్తూ సాగుతుండగా.. జగన్ సాగించిన దురాగతాలు వరుసబెట్టి బయటకు వస్తున్నాయన్నది టీడీపీ మాట. ఆయా శాఖల్లో తన సొంత మనుషులను …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates