ధర్మాన ప్రసాదరావు.. వైసీపీకి గుడ్ బై చెప్పడం దాదాపు ఖరారైంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా నాయకు లతో వైసీపీ అధినేత జగన్ సమావేశం పెట్టినా.. ఆయన రాలేదు. ఆయన కుమారుడిని కూడా పంపించ లేదు. ఈ క్రమంలోనే ధర్మాన వ్యవహారంపై జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. గుర్రాన్ని నీటి వరకు మాత్రమే తీసుకువెళ్లగలమని.. నీళ్లు తాగించలేమని అన్నారు. అంటే.. ధర్మానకు శ్రీకాకుళం జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా.. ఆయన తీసుకునేందుకు …
Read More »రేపే లాస్ట్ డేట్.. చంద్రబాబు నిర్ణయంపై టెన్షన్.. టెన్షన్.. !
కూటమి పార్టీల నాయకులు టెన్షన్లో మునిగిపోయారు. రాజ్యసభ సీట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ సీట్లను ఆశిస్తున్నవారు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి పోటీ ఉంటే ఎన్నికలు పెడతారు. లేకపోతే.. ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి మరో ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సోమవారంతో నామినేషన్ల గడువు …
Read More »జగన్ను నమ్మిన వారు – జగన్ నమ్మినవారు.. !
వైసీపీలో చిత్రమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. జగన్ను నమ్మిన వారు.. కొందరైతే, జగనే స్వయం గా నమ్మిన నాయకులు మరికొందరు. ఈ రెండు వర్గాలతోనూ.. పార్టీకి కానీ, అధినేతకు కానీ ఒరిగింది ఏమైనా ఉందా? అంటే చెప్పడం కష్టంగానే ఉందనాలి. ఎందుకంటే.. రాజకీయంగా కొందరిని జగన్ ప్రొత్సహించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నాయకులు ఉన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, మైనారిటీ నాయకులు పార్టీని బాగానే చూస్తున్నారు. కానీ, వీరితో …
Read More »కాకినాడ చిచ్చు: కూటమి vs వైసీపీ సవాళ్ల పర్వం
కాకినాడలో పదిహేనేళ్ల కిందట వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనమిక్ జోన్(ఎస్ ఈజెడ్) వ్యవహారం.. ఇప్పుడు రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. ఎస్ ఈ జెడ్ పరిధిలో వైసీపీ నాయకులు భూములు అక్రమంగా తీసుకున్నారని.. కూటమి లో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. సదరు భూములను వెనక్కి తీసుకోవాలని గత రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మారింది. …
Read More »ఉత్తరాంధ్ర నుంచే జగన్ పర్యటన..షెడ్యూల్ ప్రిపరేషన్!
వైసీపీ అధినేత జగన్ వచ్చే నెల జనవరి నుంచి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు వస్తానని చెప్పిన విసయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. జగన్ బయటకు వస్తున్నది లేదు. కేవలం బెంగళూరు-కడప-తాడేపల్లి అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. మరోవైపు పార్టీ నుంచి పోయే నాయకులుపోతున్నారు. వచ్చే వారు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలోనూ వైసీపీకి సానుభూతి లేకుండాపోయింది. ఈ పరిణామాలతో జగన్ ఇక, …
Read More »‘ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..’ ఏడాది పూర్తి!!
తెలంగాణలో వరుసగా రెండు సార్లు పాలన సాగించిన బీఆర్ ఎస్ పార్టీని గద్దెదించి.. అనేక చర్చలు.. అనేక సంప్రదింపుల అనంతరం.. కొమ్ములు తిరిగిన, కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులను సైతం పక్కన పెట్టి పార్టీ అధిష్టానం.. కట్టబెట్టిన ముఖ్యమంత్రి పీఠంపై “ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను” అని ప్రమా ణం చేసి కూర్చున్న తెలంగాణ సీఎంకు ఏడాది పూర్తయింది. 2023, డిసెంబరు 7వ తేదీన హైదరాబాద్లో అంబరాన్నంటేలా జరిగిన …
Read More »దేశంలోనే ఏపీ బెస్ట్.. ఇదిగో సాక్ష్యం
దేశం మొత్తంలో మరోసారి ఏపీ బ్రాండ్ చర్చనీయాంశంగా మారింది. తెలుగు గ్రామాల పనితీరుకు మిగతా రాష్ట్రాలు కూడా ప్రేరణ పొందుతున్నాయి. ఎంతైనా ఏపీ బెస్ట్ అనేలా కామెంట్స్ వస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు 2022-23 సంవత్సరంలో చేసిన అద్భుత పనితీరుకు గుర్తింపు పొందుతూ జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులు గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆరోగ్య, తాగునీటి, పర్యావరణ పరిరక్షణ కేటగిరీల్లో …
Read More »టీడీపీలోకి వాసిరెడ్డి పద్మ!
వైసీపీకి కొన్నాళ్ల కిందట రాజీనామా చేసిన ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తెలుగు దేశం పార్టీలోకి అరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. విజయవాడకు వచ్చిన ఆమె.. ఎంపీ చిన్నీ కార్యాలయంలో సుమారు గంట సేపు మంతనాలు జరిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే సూచనల …
Read More »చంద్రబాబు భయ పడుతున్నారు: షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు భయపడుతున్నారంటూ.. ఆమె చేసిన కామెంట్లు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీలు వేశారని, ఇది మంచి పరిణా మమేనని చెప్పారు. ముఖ్యంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయడం, కాకినాడ పోర్టు కేంద్రంగాజరిగిన రేషన్ బియ్యం అక్రమాలను నిగ్గుతేల్చడం వరకు బాగానే …
Read More »పెట్టుబడులు పెట్టాల్సింది కాంట్రాక్టర్ల మీద కాదు, టీచర్స్ మీద : పవన్
కడప మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యాపకులు, విద్యార్థుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల మీద కాకుండా అధ్యాపకుల మీద పెట్టబుడులు పెట్టాలని, అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ గా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ అన్నారు. తాను …
Read More »`వెల్డన్ లోకేష్`– నారా భువనేశ్వరి పుత్రోత్సాహం!
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పుత్రోత్సాహంతో సంతోషం వ్యక్తం చేశారు. `వెల్డన్ లోకేష్` అంటూ తన కుమారుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి కారణం.. తన తండ్రి, సీఎం చంద్రబాబు భోజనం చేసిన ప్లేటును స్వయంగా నారా లోకేష్ తీయడమే! ఏపీలో జరిగిన విద్యార్థులు-తల్లిదండ్రుల సమావేశాలను పురస్కరించుకుని చంద్రబాబు, లోకేష్లు బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి …
Read More »సుగాలీ ప్రీతి కేసుపై స్పందించిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో మహిళలపై విష ప్రచారం చేస్తున్న వారిపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం మోపారు. సోషల్ మీడియా అబ్యూజ్ ను అంతమొందించేందుకు ప్రత్యేకంగా ఒక చట్టం తెచ్చేలా పవన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణ కోసం కీలక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates