ఆవిడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీలక మహిళా నాయకురాలు. పైగా ఫైర్ బ్రాండ్. భారీ ఎత్తున కాదు లే కానీ.. ఓ రేంజ్లో ఆమె చేసే కామెంట్లు రాజకీయంగా చర్చకు వస్తుంటాయి. ఆమే.. ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు.. సుంకర పద్మశ్రీ. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం నుంచి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మహిళల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు. పైగా, రాజధాని అమరావతిని …
Read More »వేడెక్కిన స్టేషన్ఘన్పూర్ రాజకీయం..
తెలంగాణలో మరో 10 మాసాల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ ఎస్ అన్ని అస్త్ర శస్త్రాలతో రెడీ అవుతోంది. ముచ్చటగా మూడోసారి కూడా విజయం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలనేది కేసీఆర్ వ్యూహం. అయితే.. ఆయనఅనుకుంటున్నట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే.. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా బీఆర్ ఎస్ పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే.. ఈ సీటును ఇద్దరు …
Read More »ఏం జరిగింది : ప్రముఖులతో ప్రత్యేక విందుకు సీఎం జగన్ డుమ్మా
ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం వేళలో ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తలు హాజరు కావాల్సి ఉంది. సాధారణంగా ఇలాంటి పెద్ద సదస్సుల సందర్భంగా ఏర్పాటు చేసే విందునకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ప్రత్యేక విందునకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడుచర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం …
Read More »వైసీపీకి 157 పక్కా.. మిగిలిన 18 లోనే పోటీ..
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. వచ్చే ఎన్నికలకు సంబంధించి తనదైన శైలిలో సర్వే రిపోర్టు ను ఆవిష్కరించారు.(జాబితా కాదులేండి). వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీంతో నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజాబాట పడుతున్నారు. గడపగడ పకు కార్యక్రమంలో తిరుగుతున్నారు. అయితే.. ఎవరూ కూడా తమకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ, …
Read More »పెట్టుబడుల సదస్సులో ‘పట్టెడన్నం’ కోసం కొట్టుకున్నారా?
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య మంత్రి జగన్ ఈ సదస్సును ప్రారంభించారు. ఇక, ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి కూడా ప్రముఖ వ్యాపార వేత్తలు వచ్చారు. అయితే.. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా భావించినప్పటికీ.. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా సమ్మిట్ కు వచ్చిన వారికి ఇచ్చేందుకు కిట్లు …
Read More »60 మంది వైసీపీ నేతలు జంపేనా?!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు. అంతేకాదు.. ఎప్పు డు ఎవరు ఏపార్టీలోకి జంప్ చేస్తారో చెప్పలేని పరిస్థితి నేటి ప్రజాస్వామ్యానిది. అవసరం-అవకాశం అనే రెం డు పట్టాలపైనే నాయకులు ప్రయాణాలు చేస్తున్నారు. ఇక, తాజా విషయానికి వస్తే.. వైసీపీలో ఉన్న 150 (జగన్ మినహా) మంది ఎమ్మెల్యేల్లో 60 మంది నేతలు తమకు టచ్లో ఉన్నారని.. టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు …
Read More »ఏపీ ఖజానాకు ఎసరుపెట్టిన ఆఫీసర్ వెనుక ఉన్న మంత్రి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన భారీ కుంభకోణం ఇప్పుడు ప్రభుత్వంలో, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ వాణిజ్య పన్నుల శాఖ అఫీషియల్ వైబ్సైట్కు సమాంతరంగా ప్రభుత్వ వైబ్సైటే అని అనుకునేలా మరో వెబ్సైట్ రూపొందించి కోట్ల కొద్దీ డబ్బును కాజేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. విశాఖపట్నంలో జీఎస్టీ జాయింట్ కమిషనర్ (ట్రైబ్యునల్) శ్రీనివాసరావుపై దీనికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. డిపార్ట్మెంట్లో అంతర్గతంగా జరిగిన విచారణలో మొత్తం వ్యవహారం బయటపడిందని …
Read More »ధనిక రాష్ట్రం కూడా ఇంత అప్పుల్లో కూరుకుపోయిందా ?
రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ధనిక రాష్ట్రమైంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు ఘనంగా చాటుకున్నారు. దేశం మొత్తం మీద అత్యంత ధనిక రాష్ట్రం తమదే అని ఎన్నో వేదికలమీద ప్రకటించారు. అలాంటి ధనిక రాష్ట్రం ఇపుడు అప్పులు చేయందే గడిచేట్లుగా కనబడటంలేదు. ఇప్పటికే ఈ ఉపోద్ఘాతమంతా తెలంగాణా గురించే అని తెలిసిపోయుంటుంది. అత్యంత ధనిక రాష్ట్రమని కేసీయార్ చెప్పుకున్న కాలం నుంచి అప్పులు చేయందే ఉద్యోగులకు జీతాలు …
Read More »ఈ ‘తొందర’ కూడా ప్రమాదమే జగన్ సర్!
ఏపీ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ తొందర చూస్తే.. ఇది మరింత ఇబ్బందిగా మారడం ఖాయమని అంటున్నారు వైసీపీ నాయకులు. న్యాయవ్యవస్థ పరిశీలనలో ఉన్న విషయంపై జగన్ చాలా తొందరపడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు ఇంత తొందర అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానులను ఏర్పాటు చేసేసి, ఈ నెలలో వచ్చే నూతన తెలుగు సంవత్సరాది నుంచి వాటిని లైన్లో పెట్టేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో …
Read More »రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్…
తెలంగాణలో రెండు భవన్ల మధ్య వివాదం బాగా ముదిరిపోయింది. అందుకనే రాజ్ భవన్ మీద ప్రగతి భవన్ సుప్రీంకోర్టులో కేసువేసింది. రాజ్ భవన్ అంటే గవర్నర్ నివాసమని, ప్రగతి భవన్ అంటే కేసీయార్ నివాసమని అందరికీ తెలిసిందే. వ్యక్తుల హోదాలో కాకుండా గవర్నర్-సీఎం మధ్య వివాదాలు బాగా ముదిరిపోయాయి. దీంతో మధ్యలో ఉన్నతాదికారులు నలిగిపోతున్నారు. ఇపుడు పెండింగ్ బిల్లులను గవర్నర్ క్లియర్ చేయటం లేదని చెప్పి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి …
Read More »విశాఖే పాలనా రాజధాని.. కేంద్ర మంత్రి సమక్షంలోనే జగన్ ప్రకటన
విశాఖపట్నమే పాలనా రాజధాని అని సీఎం జగన్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు.. తా ను త్వరలోనే విశాఖకు వచ్చేస్తున్నట్టు చెప్పారు. తన మకాం.. పాలన అంతా కూడా .. విశాఖ నుంచే జరు గుతుందని తేల్చి చెప్పారు. విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని …
Read More »బీజేపీపై కవిత గేమ్ ప్లాన్
దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి ప్లీజ్…. ఈ కొటేషన్ కొంత ఎబ్బెట్టుగా ఉన్నా కల్వకుంట్ల వారమ్మాయి కవిత పరోక్షంగా బీజేపీకి చేస్తున్న సవాలు ఇదే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుపై ‘మర్యాదగా ఉండదు’.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ దిశగానే సంకేతాలిస్తున్నాయి.. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆమె అరెస్టుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత ఇక కవిత, కేజ్రీవాల్ …
Read More »