Political News

బీఆర్ఎస్ చేసింది.. కాంగ్రెస్‌ చేయ‌క‌పోతే రోడ్డెక్కుతాం: ఒవైసీ

తెలంగాణ అసెంబ్లీలో విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు వ్య‌వ‌హారం కాక రేపింది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో విద్యార్థుల‌కు చెల్లించాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంటును ప్ర‌స్తుత కాంగ్రెస్ పార్టీ చెల్లించ‌డం లేద‌ని ఎంఐఎం స‌భ్యుడు అక్బ‌రుద్దీన్ ఒవైసీ నిల‌దీశారు. విద్యార్థుల‌పై రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ అప్ప‌టి ప్ర‌భుత్వం బ‌కాయిలు పెట్టింద‌ని తెలిపారు. వేల‌ కోట్ల రూపాయ‌ల బ‌కాయిలు ఉన్నాయ‌ని చెప్పారు. అయితే.. త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం …

Read More »

లోక్ స‌భ‌లో జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు

ఒకే దేశం-ఒకే ఎన్నిక‌ల బిల్లు లోక్‌స‌భ ముందుకు వ‌చ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌.. మంగ‌ళ‌వారం జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 129వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఈ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ పెడుతున్న‌ట్టు తెలిపారు. దేశంలో ఒకే సారి లోక్‌స‌భ‌, రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ద్వారా ఖ‌జానాపై భారం త‌గ్గుతుంద‌ని.. అదేవిధంగా పాల‌నా వ్య‌వ‌స్థ‌ల …

Read More »

కూట‌మి మంత్రుల ప‌నితీరుపై నివేదిక రెడీ.. !

కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రుల ప‌నితీరుపై సీఎం చంద్ర‌బాబు నివేదిక రెడీ చేసుకున్నార‌ని స‌మాచారం. స‌చివాల‌యంలో ఏ శాఖ ఉన్న‌తాధికారిని క‌లిసినా.. నివేదిక రెడీ అయింద‌నే చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. 100 రోజుల్లోనే మంత్రుల‌కు సంబంధించిన నివేదిక‌ను విడుద‌ల చేస్తామ‌ని.. మంత్రుల ప‌నితీరుపై మ‌ధ‌నం చేస్తామ‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. 100 రోజుల స‌మ‌యంపై మంత్రులు ఒకింత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలాయ‌ని …

Read More »

ప్రజా సమస్యలపై చర్చ ఏది?

తెలంగాణ అసెంబ్లీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం చర్చల మధ్య తీవ్ర అభ్యంతరాలతో ముగిసింది. సభకు సంబంధించిన రోజులను నిర్ణయించాల్సిన ఈ సమావేశం, విపక్షాల తీవ్ర వ్యతిరేకతతో నిరర్థకంగా ముగిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సమావేశం మధ్యలోనే వాకౌట్ చేయడం వివాదానికి దారితీసింది. సభను తక్కువ రోజులకే పరిమితం చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే విషయంపై స్పష్టత …

Read More »

టీడీపీ ఈవెంట్ లో జోగి రమేష్..లోకేష్ ఫైర్?

వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని ఆ పార్టీ మంత్రులు, నేతలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలైతే ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అటువంటి జోగి రమేష్ తాజాగా టీడీపీ నేత, మంత్రి పార్థసారధితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న వైనం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. నూజివీడులో …

Read More »

సాయిరెడ్డి ‘ఫోన్ క‌హానీ’.. ఇంత కుట్ర ఉందా?

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి చుట్టూ మ‌రో కేసు ముసురుకుంది. ఆయ‌న కొన్నాళ్ల కిందట త‌న ఫోన్ పోయిందంటూ.. పెద్ద ఎత్తున యాగీ చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. త‌న ఫోన్ పోయింద‌ని ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. దీనిపై ఫిర్యాదు చేసిన‌ట్టు కూడా చెప్పారు. అయితే.. ఇప్పుడు అస‌లు ఈ ఫోన్ క‌హానీ వెనుక ఉన్నకుట్ర తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లు ఫోన్ …

Read More »

బాబు విన్న‌పం.. మోడీ యూట‌ర్న్ తీసుకుంటారా?

జ‌మిలి ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకుంటోంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి దూకుడుగా ఉన్న కేంద్ర స‌ర్కారుకు.. కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న కీల‌క పార్టీ టీడీపీ నుంచి కొంత వ్య‌తిరేక‌త‌.. అదేస‌మ‌యంలో విన్న‌పాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం.. జ‌మిలి ఎన్నిక‌ల‌ను 2029లో నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు. త‌ద్వారా.. కూట‌మి స‌ర్కారుకు ద‌క్కిన ఐదేళ్ల కాలాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ, కేంద్రం …

Read More »

పిఠాపురంలో కోడి పందేలు.. వర్మ కు పరీక్షే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం.. టికెట్ త్యాగం చేసిన ఎన్‌వీఎస్ ఎస్ వ‌ర్మ‌కు సొంత నియోజ‌క‌వర్గం పిఠాపురంలో మ‌రోసారి బ్రేకులు ప‌డ్డాయి. ఆయ‌న అనుచ‌రులకు తీవ్ర ప‌రాభ‌వం జ‌రిగిన‌ట్టు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. వ‌చ్చే నెల సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని పిఠాపురం ప‌రిస‌ర ప్రాంతాల్లో కోడి పందేలు వేయ‌డం ఆన‌వాయితీ. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. వ‌ర్మ అనుచ‌రులు పెద్ద ఎత్తున బ‌రులు గీసి పందేలు వేశారు. కానీ, …

Read More »

అసెంబ్లీకి రాకపోయినా వైసీపీ నేతలకు జీతాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు అంటూ మండిపడ్డారు. ప్రజలతో సంబంధం లేకుండా, తమ నేత జగన్ ఆదేశాల ప్రకారమే వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గ ప్రజల నుంచి ఓట్లు అడిగి, ఇప్పుడు వారిని పట్టించుకోకుండా అసెంబ్లీలో గళమెత్తకపోవడం గర్వకారణం కాదని బుద్ధా వెంకన్న అన్నారు. …

Read More »

వన్ నేషన్, వన్ ఎలక్షన్ పై కేంద్రం యూటర్న్

వన్ నేషన్, వన్ ఎలక్షన్ విషయంలో చాలా రోజులుగా అనేక రకాల అభిప్రాయాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జమిలి పద్ధతికి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనుకున్న టైమ్ లో మరో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం అనూహ్యంగా వెనక్కి తగ్గింది. డిసెంబర్ 16న లోక్‌సభలో వీటిని ప్రవేశపెడతారని కేబినెట్ స్థాయిలో నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో బిజినెస్ లిస్టులో ఈ …

Read More »

వారిని కూడా ఆప‌లేకపోతే ఎలా!

ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ నుంచి వెళ్లిపోతున్న‌వారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ అడ్డుకోలేదు. వారికి ఎక్క‌డా.. బ్రేకులు వేయ‌లేదు. క‌నీసం చ‌ర్చించ‌నూ లేదు. దీంతో చాలా మంది నాయ‌కులు పార్టీకి జ‌ల్ల కొట్టి జంప్ చేసేశారు. వీరిలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు సొంత జిల్లాలోనే పెద్ద కుంప‌టి రాజుకుంటోంది. వైసీపీ నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకునేందుకు …

Read More »

మ‌కాం మార్చేసిన చెవిరెడ్డి .. !

వైసీపీ ఫైర్‌బ్రాండ్ నాయ‌కుడు.. చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న మ‌కాం మార్చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయం.. ఒంగోలు కేంద్రంగానే సాగుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న బాలినేని శ్రీనివాస‌రావు కార‌ణంగా.. కొంత దూకుడు త‌గ్గించిన చెవిరెడ్డి.. బాలినేని జ‌న‌సేన‌లోకి జంప్ చేయడంతో త‌న దూకుడు పెంచారు. వైసీపీ నేత‌ల‌ను త‌న దారిలోకి తెచ్చుకున్నారు. అయితే.. ఇలా చెవిరెడ్డి మ‌కాం మార్చేయ‌డంతో చంద్ర‌గిరిలో వైసీపీ ప‌ట్టు త‌ప్పుతోంది. …

Read More »