Political News

తెలంగాణాకు అసలు అర్హతుందా ?

కొద్దిరోజులుగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేటీయార్ , తెలంగాణా ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కేసీయార్, కేటీయార్ ఇద్దరు చాలాసార్లు మాట్లాడారు. స్టీల్ ఫ్యాక్టరి అమ్మకానికి కేంద్రం ఇచ్చిన బిడ్డింగులో తెలంగాణా ప్రభుత్వం కూడా పాల్గొంటుందని గంభీరంగా ప్రకటించారు. సింగరేణి కాలరీస్ తరపున తెలంగాణా ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనబోతున్నట్లు కేటీయార్ ప్రకటించారు. ప్రకటించటమే …

Read More »

‘ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటుహక్కు పెట్టుకోండి’

ఆంధ్రోళ్లు అంటూ అదే పనిగా విరుచుకుపడే మంత్రి హరీశ్ రావు అవసరానికి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడతారన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన ఉద్యమం నాటి నుంచి కూడా హరీశ్ మాటలు ఎప్పుడూ కూడా ఆంధ్రోళ్ల మనసుల్ని గాయపరిచేలా మాట్లాడారే తప్పించి.. ఎప్పుడూ కూడా చాలామంది ఉద్యమకారుల మాదిరి సంయమనంతో మాట్లాడింది లేదు. అలాంటి హరీశ్ ఇప్పుడు కొత్త మాటను పట్టుకున్నారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన వారంతా ఏపీలో ఉన్న …

Read More »

వివేకా హ‌త్య కేసు.. కొత్త ట్విస్టు భ‌లే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ త‌మ్ముడు, జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. ఆ హ‌త్య‌కు సంబంధించి నింద‌ను చంద్ర‌బాబు స‌ర్కారు మీద వేసి జ‌గ‌న్ అండ్ కో బాగానే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందింది. నిజానికి వివేకాది గుండెపోటు అని సాక్షి మీడియాలో ముందుగా ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులే. కానీ త‌ర్వాత హ‌త్య విష‌యం బ‌య‌టికి రాగానే చంద్ర‌బాబు …

Read More »

కేసీయార్ కు ఏపీలో షాక్ తప్పదా ?

తెలంగాణ లో అధికారంలో ఉండికూడా పార్టీ గుర్తుతో బీఆర్ఎస్ నానా అవస్థలు పడుతోంది. అలాంటిది రాబోయే ఎన్నికల్లో పార్టీగుర్తు లేకపోతే ఇంకెన్ని సమస్యలు ఎదురవుతుందో ? ఇంతకీ విషయం ఏమిటంటే ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా కేసీయార్ కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర రిజిస్టర్ చేయించారు. రిజిస్టర్ పార్టీకి రికగ్నిషన్ దక్కాలంటే కమీషన్ లెక్కల ప్రకారం ఫిట్టవాలి. …

Read More »

కోర్టుకు వెళ్లాలంటే ట్రాఫిక్ ఇష్యూ

కోర్టుకు వెళ్లే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్సలు ఇష్టపడరు. కోర్టుకు హాజరయ్యేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో.. అన్నింటిని వాడుకునేందుకు ఏ మాత్రం మొహమాటపడరు. తాను చెప్పే కారణాలకు సామాన్యుడు సైతం ప్రశ్నిస్తాడన్న విషయాన్ని ఆయన అస్సలు పట్టించుకోరు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో తనపై దాడి చేసిన కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు …

Read More »

తెలంగాణ : ఇది మహా సమరం

తెలంగాణా ఎన్నికల్లో ఈసారి మంటలు మండటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీయార్ వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకావాన్ని వదులుకోవటానికి ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఒకటే రచ్చ చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇవే మాటలు చెబుతున్నారు కానీ …

Read More »

దొర‌ల గ‌డీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టుంది: జూప‌ల్లి

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీఆర్ ఎస్ నేత‌గా ఉన్న జూప‌ల్లి కృష్ణారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆయ‌న పై పార్టీ అధిష్టానం వేటు వేసిన విష‌యం తెలిసిందే. దొర‌ల గ‌డీ నుంచి తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్టు ఉంద‌ని అన్నారు. అయితే.. అదేస‌మ‌యంలో తాను సంధించే ప్ర‌శ్న‌ల‌కు సీఎం కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌ని.. ఆ త‌ర్వాతే త‌న‌ను స‌స్పెండ్ చేయాల‌ని ఆయ‌న అల్టిమేటం జారీ చేశారు. “న‌న్ను స‌స్పెండ్ …

Read More »

రేవంత్ రెడ్డికి ప్రమోషన్

ఆల్రెడీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో అత్యున్నత పదవిలోనే ఉన్నాడు కదా.. కొత్తగా రేవంత్ రెడ్డికి ఏం ప్రమోషన్ వచ్చింది అని ఆశ్చర్యం కలుగుతోందా? ఐతే ఈ ప్రమోషన్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణానికి సంబంధించింది కాదు. ఆయన వ్యక్తిగత జీవితంతో ముడిపడ్డది. చూడ్డానికి ఇంకా పెద్ద వయసేమీ కానట్లు కనిపించే రేవంత్.. అప్పుడు తాత అయిపోయాడు. కొన్నేళ్ల కిందటే పెళ్లి చేసుకున్న రేవంత్ ముద్దుల కూతురు నైమిష.. తాజాగా …

Read More »

కేసీఆర్ ఐడియా జగన్ కి ఇబ్బందే

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టబోతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనుగోలు చేయాలని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఫ్యాక్టరీని కొనుగోలు చేయటంలో తెలంగాణా ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కేంద్రానికి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఇఓఐ) తెలియజేయబోతోందట. అలాగే వైజాగ్ వెళ్ళి ఫ్యాక్టరీ కొనుగోలుకు అవసరమైన ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చి …

Read More »

6 నెలల ముందే వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్న జగన్?

ఎన్నికలకు ఆరు నెలలకు ముందే అభ్యర్థులను ప్రకటించడానికి వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారట. అభ్యర్థుల పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారైందని.. ప్రకటించడానికి ముహూర్తం కూడా ఫిక్సయిందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి నియోజకవర్గాలపై పట్టు సాధించాలన్నది జగన్ వ్యూహంగా చెప్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రెండు విడతలలో విడుదల చేస్తారని తెలుస్తోంది. మొదటి విడతలో 80 నుంచి 90 మంది అభ్యర్థులను …

Read More »

జగన్ పరువు తీసిన బీజేపీ ఎంపీ

ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అనే ఒక అధ్యక్షుడు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ అనే ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా వారెవ్వరూ ఎప్పుడూ ఏపీలోని అధికార పక్షాన్ని బలంగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినా అది తూతూమంత్రమే. ఏపీలో అరాచకాన్ని కానీ, అభివృద్ది శూన్యతను కానీ ప్రశ్నించిన సందర్భాలు, ప్రజలకు తెలియచెప్పిన సందర్భాలు చాలా తక్కువ. వైసీపీ, జగన్ కేంద్రంలోని బీజేపీ …

Read More »

సెల్ఫీలు కోట్లాడుతున్నాయ్‌.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ

టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఏదో ఒక వివాదం తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. వైసీపీ స‌ర్కారుకు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట మూ డు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ను చంద్ర‌బాబు ప్రారంభించారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల జోన‌ల్ స‌మావేశాల‌ను ఆయన చేప‌ట్టారు. త‌ద్వారా.. పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు..నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో తాను ప‌ర్య‌టిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ హ‌యాంలో చేప‌ట్టిన కీల‌క‌ప‌థ‌కాలు… …

Read More »