Political News

వైసీపీ వినుకొండలో బయటకు వెళ్లేదెవరు…?

ఏపీలో మొన్నటిదాకా అధికార పార్టీగా కొనసాగి… ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఓ వైపు ఓటమి నుంచి పార్టీ అధిష్ఠానం తేరుకోకముందే… కీలక నేతలు వరుసబెట్టి బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీని అంటిపెట్టుకుని సాగుతున్న నేతలను ద్వితీయ శ్రేణి నేతలు మెడబట్టి గెంటేసే యత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నేతలంతా బయటకు క్యూ కడుతున్న వేళ… పార్టీని అంటిపెట్టుకుని ఉన్న …

Read More »

అసెంబ్లీలో పవన్ బలం వీళ్లే!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది. జనసేన అసెంబ్లీలో తనదైన శైలి 100 శాతం బలంతో అడుగుపెట్టిన తర్వాత సిసలైన అసెంబ్లీ సమావేశాలు ఇవే. ఎందుకంటే.. 2024 ఎన్నికల తర్వాత పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా… విపక్షం అయిన వైసీపీ లేకుండానే సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరైన సభ్యులంతా కూటమిలోని మూడు పార్టీలకు చెందినవారే కావడంతో పెద్దగా రచ్చ లేకుండానే ప్రశాంతంగా సభా సమావేశాలు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. రేవంత్‌కు లిట్మ‌స్ టెస్ట్‌?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్‌రెడ్డి పాల‌న ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఈ నేప‌థ్యంలో ఒక‌ద‌ఫా పార్ల‌మెంటు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత‌.. ఇప్పుడు కీల‌క‌మైన మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటికి మ‌రో మూడు రోజుల్లోనే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి స‌ర్కారుకు లిట్మ‌స్ టెస్ట్ ప్రారంభ‌మైం దని.. రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. …

Read More »

లోకేశ్ ఆటవిడుపు.. టీమిండియా జెర్సీతో న్యూలుక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా సాగుతున్న లోకేశ్… చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయి కేంద్రంగా జరిగిన దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ టీమిండియా జెర్సీ …

Read More »

గ్రూప్-2 తేనెతుట్టెను కదిపిందెవరు?

ఈ రోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష విషయంలో పెద్ద వివాదమే ముసురుకుంది. ఈ పరీక్షను రద్దు చేయాలంటే వేల మంది అభ్యర్థులు రోడ్డు మీదికి వచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాడబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మీద ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో గ్రూప్-2 ఆశావహులు మండిపడుతున్నారు. ఈ పరీక్షను రద్దు …

Read More »

అమ‌రావ‌తికి మ‌రో మ‌ణిహారం… ఓఆర్ ఆర్‌కు కేంద్రం ఓకే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌రో మ‌ణిహారం ల‌భించింది. నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యం లో కీల‌క‌మైన బాహ్య‌వ‌ల‌య ర‌హ‌దారి(ఔట‌ర్ రింగ్ రోడ్డు)ని మ‌రింత విస్త‌రించేందుకు ప్ర‌తిపాదించిన ఫైలుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి శ‌నివారం అర్ధ‌రాత్రి దాటాక కేంద్రం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో రాజ‌ధాని నిర్మాణంలో కీల‌క‌మైన ఓ ఆర్ ఆర్ నిర్మాణ ప‌నులు శ‌ర వేగంగా జ‌ర‌గ‌నున్నాయి. ఏంటీ ర‌హ‌దారి.. రాజ‌ధాని ప్రాంతాన్ని.. …

Read More »

నిజంగానే.. జగన్ భయపడ్దారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా ధైర్యవంతుడిగా చెబుతూ ఉంటారు. పార్టీ శ్రేణులు అయితే ఏకంగా పులివెందుల పులి అని, సింగిల్ గా వచ్చే సింహమని కీర్తిస్తూ ఉంటారు. తండ్రి చనిపోయిన తరుణంలో కేసులు మీద పడ్డా… వెన్నుచూపని ధీరుడిలా.. అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి… కేసులకు కూడా భయపడకుండా సాగిన నేతగా …

Read More »

పవన్ సహనానికి ఫిదా కావాల్సిందే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న విషయాలకే ఓ రేంజిలో రియాక్ట్ అయిపోతూ ఉంటారని… ఆయనలో సహనం పాళ్లు చాలా తక్కువనే విమర్శలు చాలా కాలం నుంచి ఉన్నవే. ఈ మాటలు నిజమేనన్నట్లుగా పవన్ చలా సందర్భాల్లో చిన్న విషయాలకు కూడా తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ఆయా అంశాలపై ఊగిపోయారు. జన సైనికులను ఉర్రూతలూగించారు. అయితే పవన్ లో నిగూఢంగా సహనం దాగుందని…ఆ సహనం …

Read More »

ఓర్నీ: ఉనికిలో లేని శాఖకు మంత్రి.. పంజాబ్ సిత్రం తెలిస్తే అవాక్కే!

ఇలా కూడా జరుగుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి చేసే ఉదంతం ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక మంత్రిగారు ఉనికిలో లేని ఒక శాఖకు ఎంపికయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శాఖ అన్నది లేకున్నా.. అందులో గడిచిన 20 నెలలుగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ తప్పిదాన్ని తాజాగా గుర్తించి నాలుకర్చుకున్న అధికారులు దాన్ని సవరించే పనిలో పడ్డారు. విన్నంతనే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..2022 …

Read More »

వైసీపీలో `గ్యాప్` తీరుస్తున్నారు… నేత‌లు బ‌య‌ట‌కు!

ఎట్ట‌కేల‌కు వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. వైసీపీ 11 స్థానాల‌కు జారిపోయిన త‌ర్వాత‌.. ఇప్పుడిప్పుడే విధాన ప‌ర‌మైన అంశాల‌తో వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం ప్రారంభించారు. తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి.. కూటమి ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధించారు. జ‌గ‌న్ బ‌య‌ట‌కు రాకూడ‌దా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు .. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌స్తే.. కూట‌మి స‌ర్కారు త‌ప్పులు బ‌య‌ట ప‌డ‌తాయ‌ని …

Read More »

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య `స‌యోధ్య` సాధ్యంకాదా?

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల జ‌గ‌డాల‌తోపాటు విద్యుత్ స‌మ‌స్య‌లు కూడా పెరుగుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎండ‌లు ముద‌ర‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు అంశాలు కూడా.. రెండు రాష్ట్రాల‌కూ కీల‌కంగా మారుతున్నాయి. ఖ‌రీఫ్ సాగు రెండు రాష్ట్రాల్లోనూ ముమ్మ‌రం అవుతోంది. కృష్ణా, గోదావ‌రి ఆయ‌క‌ట్టు ప్రాంతంలో రైతులు సాగుకు సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో అయితే.. నాట్లు కూడా ప‌డుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌లాల ప్రాధాన్యం పెరిగింది. మ‌రోవైపు .. ఎండాకాలం ప్రారంభానికి …

Read More »

మోదీ టీంలోకి ‘శక్తి’మంతుడు!

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగుతున్నారు. మోదీ బృందంలో ఉన్నవారంతా కూడా వారి వారి విభాగాల్లో లబ్ధ ప్రతిష్టులే. జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్న అజిత్ దోవల్ అయితేనేం… ప్రిన్సిపల్ సెక్రటరీ టూ పీఎంగా కొనసాగుతున్న ప్రమోద్ కుమార్ మిశ్రా అయితేనేం… కేబినెట్ లో అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, జై శంకర్, కిరణ్ రిజిజు.. ఇలా ఎవరిని తీసుకున్నా.. …

Read More »